Hotel food: తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు... కల్తీ మసాలాలు.. మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు.. అపరిశుభ్రమైన వంటశాలలు.. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్క్రీం పార్లర్లు, కాఫీ షాప్లలో పరిస్థితి ఇది.
పాడైపోయిన పదార్థాలు.. కాలం చెల్లిన మసాలాలు
వంటగదులు అపరిశుభ్రం.. మళ్లీ మళ్లీ నూనెల వినియోగం
రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, మండీలు, బేకరీల్లో పరిస్థితి
ఆహార భద్రత అధికారుల తనిఖీల్లో నివ్వెరపోయే అంశాలు వెలుగులోకి..
ఈ పాచిపోయిన బిర్యానీ తింటే అంతే..
- జహీరాబాద్ సమీపంలోని ఒక దాబాలో నూనెను ఎన్నిసార్లు వినియోగించారో గుర్తించలేని పరిస్థితి. మళ్లీ, మళ్లీ వాడిన నూనెతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నారు. పనిచేయని ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన వాటినీ వినియోగిస్తున్నారు. వంటగదులు అపరిశుభ్రంగా ఉన్నాయి.
- జూబ్లీహిల్స్లోని ఓ బార్ అండ్ కిచెన్లో వినియోగిస్తున్న పదార్థాల్లో గడువు ముగిసినవే ఎక్కువగా ఉన్నాయి.
ఈనాడు, హైదరాబాద్: పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు... కల్తీ మసాలాలు.. మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు.. అపరిశుభ్రమైన వంటశాలలు.. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్క్రీం పార్లర్లు, కాఫీ షాప్లలో పరిస్థితి ఇది. సాధారణ హోటళ్లలోనే కాదు ప్రముఖ రెస్టారెంట్లలోనూ ఇదే దుస్థితి ఉంది. ఘుమఘుమలాడే వాసనలు, ఆకర్షణీయ రంగులు, వేడి వేడిగా వడ్డన ఆకట్టుకుంటున్నా తింటే అనారోగ్యం తథ్యం. వైద్య ఆరోగ్యశాఖ అధీనంలోని రాష్ట్ర ఆహార భద్రత విభాగం గత 20 రోజులుగా 67 చోట్ల తనిఖీలు చేపట్టగా.. సగానికి పైగా చోట్ల నిబంధనల ఉల్లంఘనలు, ఆహార కల్తీ ఉన్నట్లు తేలింది. నివ్వెరపోయే అంశాలు వెలుగుచూశాయి. బాగా పేరొందిన, అత్యంత ప్రముఖ, ఆదివారం నాడు రద్దీతో కళకళలాడే కొన్ని రెస్టారెంట్లు, కాఫీ షాపులు, బేకరీల్లోనూ శుచీశుభ్రత లేని వంటశాలలు..
ఓ రెస్టారెంట్లో కుళ్లిన ఉల్లి
చెడిపోయిన పదార్థాలు... బూజుపట్టిన కూరగాయలు.. ఫ్రిజ్లలో వండి నిల్వఉంచిన పదార్థాలను అధికారులు గుర్తించారు. పలుచోట్ల నకిలీ బ్రాండ్ల వాటర్ బాటిళ్లు, కోల్డ్ చైన్ లేకుండా నిల్వ ఉంచిన పదార్థాలు, కాలం చెల్లిన మసాలాలు, చీజ్, సిరప్, శాండ్విచ్ బ్రెడ్లు, కల్తీ పదార్థాలు వెలుగుచూశాయి. ఓ ప్రముఖ సూపర్ మార్కెట్లో నిర్వహించిన తనిఖీల్లో చాక్లెట్లు గడువు తీరిపోయి.. లీకవుతున్నట్లు గుర్తించారు.
జీహెచ్ఎంసీ పరిధిలో గతేడాది 14,889 నమూనాలు సేకరించగా.. వీటిలో 3,803 నమూనాలు సేకరించిన హోటళ్లకు నాణ్యత మెరుగుపర్చుకోవాలని సూచించారు. 2,534 శాంపిళ్లు నాణ్యతగా లేవని గుర్తించారు. 311 శాంపిళ్లలో భారీగా కల్తీ ఉన్నట్లు నిర్ధారించారు.
వెజ్ బిర్యానీలోకి పాడైపోయిన క్యారెట్
తాజాగా తనిఖీల్లో గుర్తించిన అంశాల్లో కొన్ని..
- తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రాంతానికి సంబంధించిన రుచులు ప్రత్యేకం అన్న ప్రచారంతో లక్డీకాపుల్లో నిర్వహిస్తున్న రెస్టారెంట్లో పురుగులు పట్టిన మైదా, చింతపండు సహా ఇతర పదార్థాలను, గడువు తీరిన పాల ప్యాకెట్లను వినియోగిస్తున్నారు.
- హయత్నగర్లోని ఒక మండీలో వంటగది మురికిమయంగా ఉంది. మురుగునీరు, మూతలేని డస్ట్ బిన్లు, బొద్దింకలు, ఈగల మధ్య ఆహారం తయారు చేస్తున్నారు. సింథటిక్ రంగుల్ని వాడుతున్నారు.
- ఓ వెజ్ రెస్టారెంట్లో ఫంగస్ సోకిన క్యారెట్లు ఉన్నాయి. వండిన వెజ్ బిర్యానీని ఫ్రిజ్లో నిల్వ ఉంచారు. వంట గదిలో మురుగునీరు నిల్వ ఉంది. ఉపయోగిస్తున్న ఆహార పదార్థాలకు లేబుళ్లు లేవు.
- హైదరాబాద్ బార్కస్లోని ఒక ఇండో అరబిక్ రెస్టారెంట్లో కాలం చెల్లిన పదార్థాలు వినియోగిస్తున్నారు. లేబుళ్లు లేని వాటర్ బాటిళ్లు విక్రయిస్తున్నారు.
- బంజారాహిల్స్లోని ఓ పెద్ద మాల్లోని పేరొందిన ఫుడ్స్టాళ్లలోని ఆహారంలో నాణ్యతలేదని తేలింది.
- ప్రఖ్యాత బిస్కట్ల బేకరీలో కాలం తీరిన బిస్కెట్లు, రస్క్లు, క్యాండీలు, చాక్లెట్ కేక్లు విక్రయిస్తున్నారు.
- ఒక ప్రముఖ ఐస్క్రీం అవుట్లెట్లో కాలం చెల్లిన స్ట్రాబెర్రీ పేస్ట్, నిల్వ నిబంధనలు పాటించని పైనాపిల్ టిట్బిట్ క్యాన్లు, తయారీ, ఎక్స్పైరీ తేదీలు లేని కేక్లు, పేస్ట్రీలు వాడుతున్నారు.
నాణ్యతా మృగ్యం
పలు హోటళ్లలో వంటల తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాల్లో నాణ్యత లేకపోగా చాలావరకు కాలం చెల్లినవి, పాడైపోయినవి ఉంటున్నాయని ఆహార భద్రత తనిఖీ అధికారి ఒకరు తెలిపారు. గడువు తీరినవి, ఎలాంటి బ్రాండ్ లేని పాల ప్యాకెట్లను తక్కువ ధరకు కొని వాడుతున్నారని పేర్కొన్నారు. వండిన ఆహార పదార్థాలను ఫ్రిజ్లలో నిల్వ ఉంచుతున్నారని, ఆర్డర్లు వచ్చినప్పుడు వేడి చేసి, మసాలాలు కలిపి ఇస్తున్నారని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
తాజా వార్తలు (Latest News)
-
5 కోట్లు దాటిన రిటర్నులు.. ఒక్క రోజే 28 లక్షలు
-
విస్తారా కీలక నిర్ణయం.. ఆ విమానాల్లో 20 నిమిషాలు ఫ్రీ వైఫై..!
-
‘మహారాజ’ ఆ ట్విస్ట్కు ‘దిమ్మతిరిగి మబ్బులు మెరిసిపోతాయి’..
-
కమల రాక.. తగ్గిన ట్రంప్ ఆధిక్యం!
-
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అడ్మిషన్ పేరుతో.. రూ.3.25 కోట్ల మోసం
-
2న ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ సబ్స్క్రిప్షన్.. వారికి ఒకరోజు ముందుగానే