Telangana: త్వరలో ‘నార్కోటిక్స్’ ఠాణాలు..!
రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ సర్కారు మరింత పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేసింది.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కేంద్రాలుగా ఏర్పాటు
ఎఫ్ఐఆర్ల నమోదు, దర్యాప్తు అక్కణ్నుంచే
నెలాఖరు నుంచి కార్యకలాపాల ప్రారంభానికి సన్నాహాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల రవాణాపై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ సర్కారు మరింత పకడ్బందీ కార్యాచరణ సిద్ధం చేసింది. త్వరలో తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(టీన్యాబ్) పోలీస్స్టేషన్లను అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు పోలీస్స్టేషన్ల ఏర్పాటుతోపాటు వాటి నుంచే కార్యకలాపాలు నిర్వహించేందుకు టీన్యాబ్ ఉన్నతాధికారులు కసరత్తు వేగవంతం చేశారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, వరంగల్ కేంద్రాలుగా ఠాణాలు పనిచేయబోతున్నాయి. ఈ ఠాణాల్లో మాదకద్రవ్యాల విక్రయాలకు సంబంధించిన కేసులను నమోదు చేయబోతున్నారు. ఎఫ్ఐఆర్ల నమోదు నుంచి మొదలుకుని, అభియోగపత్రాల దాఖలు వరకు ఆయా ఠాణాల అధికారులే పర్యవేక్షించనున్నారు.
దర్యాప్తులో ఎదురవుతున్న ఇబ్బందులతో..
ప్రస్తుతం మాదకద్రవ్యాల కేసుల్లో నిందితులను అదుపులోకి తీసుకున్న పక్షంలో వారిని ఆయా ప్రాంతాల్లోని శాంతిభద్రతల ఠాణాలకు అప్పగిస్తున్నారు. ఈ కారణంగా కేసుల దర్యాప్తు ముందుకు సాగడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శాంతిభద్రతల ఠాణాల్లో రోజువారీ కార్యకలాపాల కారణంగా తదుపరి దర్యాప్తును సమర్థంగా, వేగవంతంగా సాగించేందుకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై మాదకద్రవ్యాలకు సంబంధించిన కీలక కేసుల్ని నార్కోటిక్స్ ఠాణాల ద్వారానే పర్యవేక్షించనున్నారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ నార్కోటిక్స్ ఠాణాలను ప్రస్తుతానికి హైదరాబాద్ నాంపల్లిలోని పాత కలెక్టరేట్ కార్యాలయం భవన సముదాయంలో ప్రారంభించనున్నారు. ఈ నెలాఖరు నుంచే వీటి కేంద్రంగా కేసుల నమోదుకు సన్నాహాలు చేస్తున్నారు.
క్షేత్రస్థాయి కార్యకలాపాలకు పరిధి విధింపు
నాలుగు పోలీస్స్టేషన్లతోపాటు ప్రాంతీయ నార్కోటిక్స్ కంట్రోల్ సెల్ల కార్యకలాపాలకు పరిధి విధించారు. హైదరాబాద్ నార్కోటిక్స్ పోలీస్స్టేషన్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కార్యకలాపాలు సాగించనుంది. సైబరాబాద్ ఠాణా సైబరాబాద్ కమిషనరేట్తోపాటు సంగారెడ్డి జిల్లా, రాచకొండ ఠాణా రాచకొండ కమిషనరేట్లతోపాటు నల్గొండ, సూర్యాపేట జిల్లాలు, వరంగల్ ఠాణా వరంగల్, ఖమ్మం కమిషనరేట్లతోపాటు ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్, కొత్తగూడెం జిల్లాల పరిధిలోని కేసుల్ని పర్యవేక్షించనుంది.
రైళ్లలో మాదకద్రవ్యాల రవాణాను అడ్డుకునే లక్ష్యంతో వరంగల్, మహబూబ్నగర్, సంగారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం రైల్వే ప్రాంతీయ మాదకద్రవ్యాల నియంత్రణ కేంద్రాలు (రైల్వేస్ రీజినల్ నార్కోటిక్స్ కంట్రోల్ సెంటర్లు) అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో కేంద్రంలో నార్కొటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ఏర్పాటు కానుంది. వాటి పరిధిలో పలు జిల్లాల కేసులను పర్యవేక్షించేలా పరిధులు నిర్ణయించారు.
ఒక్కో స్టేషన్లో డీఎస్పీ, ఇద్దరు ఇన్స్పెక్టర్లు, నలుగురు ఎస్సైలు
ప్రస్తుతమున్న వనరులతో ఠాణాల్లో కార్యకలాపాలు సాగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. డీఎస్పీ స్టేషన్ హౌస్ ఆఫీసర్(ఎస్హెచ్వో)గా ఉండనున్న వీటిని బి లేదా సి గ్రేడ్ ఠాణాలుగా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇప్పటికే ఒక్కో ఠాణాకు డీఎస్పీతోపాటు ఇద్దరు ఇన్స్పెక్టర్లు, నలుగురు ఎస్సైలను నియమించారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్లోని టీన్యాబ్ ప్రధాన కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవలే సమీక్ష నిర్వహించిన నేపథ్యంలో ఠాణాలకు బి లేదా సి గ్రేడ్ హోదా కల్పించాలని టీన్యాబ్ ఉన్నతాధికారులు విన్నవించారు. ఇందుకు ముఖ్యమంత్రి సుముఖత వ్యక్తంచేయడంతో ఒక్కో ఠాణాకు 50-70 మంది కానిస్టేబుళ్ల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈ క్రమంలోనే నార్కోటిక్స్ ఠాణాల్లో కానిస్టేబుళ్లను నియమించేందుకు కసరత్తు ముమ్మరంగా సాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు