నన్ను నేనే క్షమించుకుంటా!
అమెరికా అధ్యక్షునిగా గద్దె దిగక తప్పదని గ్రహించిన ట్రంప్ దీపం ఉండగానే ఇల్లు సర్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు...
‘స్వీయ క్షమాభిక్ష’పై ట్రంప్ యోచన
నూతన ప్రభుత్వం విచారణ జరపకుండా ఎత్తుగడ
బైడెన్ ప్రమాణానికి హాజరుకాబోనని ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షునిగా గద్దె దిగక తప్పదని గ్రహించిన ట్రంప్ దీపం ఉండగానే ఇల్లు సర్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్షునికి ఉండే విశేష అధికారాలను స్వీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. తన తప్పిదాలపై నూతన ప్రభుత్వం దర్యాప్తు చేయకుండా ఎత్తువేస్తున్నారు. ‘‘స్వీయ క్షమాభిక్ష’’ ద్వారా తప్పులను ప్రక్షాళన చేసుకొని విముక్తి కావాలని ట్రంప్ భావిస్తున్నట్టు అమెరికా మీడియా పేర్కొంది. పదవి నుంచి దిగిపోయేముందు అమెరికా అధ్యక్షులు తప్పుచేసిన తమ స్నేహితులు, పార్టీ నాయకులను కాపాడుకోవడానికి క్షమాభిక్ష పెడుతుంటారు. ప్రస్తుత పరిపాలనతో ఏదోఒక రూపంలో ప్రమేయం ఉన్న తన కుమార్తె ఇవాంక, అల్లుడు జరేడ్ కుష్నర్, కుమారులు ఎరిక్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియానిలకు క్షమాభిక్ష ఇవ్వాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అధ్యక్షుని హోదాలో తాను చేసిన తప్పిదాలపైనా విచారణ జరపకుండా తనకుతానుగా క్షమించుకోవాలని కూడా భావిస్తున్నారు.
అసలు సాధ్యమేనా?
అధ్యక్షుడే తనకు తానుగా క్షమాభిక్ష ఇచ్చుకోవాలని అనుకోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నాటి నుంచే ‘స్వీయ క్షమాభిక్ష’పై ట్రంప్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే వచ్చే పరిణామాలపై న్యాయనిపుణులతో చర్చలు జరిపారు. 2018 జూన్లోనే దీనిపై ట్రంప్ ట్వీట్ చేశారు. ‘‘నేను చాలా మంది న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపాను. స్వీయ క్షమాభిక్ష ఇచ్చుకునేందుకు నాకు అధికారాలు ఉన్నాయి.’’ అని దాంట్లో పేర్కొన్నారు. అయితే రాజ్యాంగం ప్రకారం ఇది సాధ్యం కాదని పలువురు అంటున్నారు.
ఓ మార్గం లేకపోలేదు...
ట్రంప్ను క్షమించడానికి ఓ మార్గం లేకపోలేదని మరికొందరు చెబుతున్నారు. గతంలో న్యాయశాఖ పంపించిన ఓ మెమోను ఆధారంగా చూపుతున్నారు. దాని ప్రకారం ‘‘ట్రంప్ అధ్యక్షునిగా దిగిపోయి ఉపాధ్యక్షునికి బాధ్యతలు అప్పగించాలి. అప్పుడు అధ్యక్షుని హోదాలో ట్రంప్నకు క్షమాభిక్ష ప్రసాదించవచ్చు’’ అని అంటున్నారు. అయితే ఈ మెమోకు చట్టబద్ధత లేకపోవడంతో దీన్ని అమలు చేయడం కష్టమే.
అధికారాన్ని అప్పగిస్తా.. కానీ..: ట్రంప్
జో బైడెన్కు అధికారాన్ని బదలాయిస్తానని ట్రంప్ ప్రకటించారు. క్యాపిటల్ భవనంపై తన అనుచరుల దాడిని ఖండించారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశాన్ని ఇచ్చారు. ‘‘అందరు అమెరికన్ల మాదిరిగానే నేనూ ఆ అల్లర్లపై ఆందోళన చెందాను. నేషనల్ గార్డులు, ఫెడరల్ అధికారులను పిలిపించి భవనానికి భద్రత కల్పించాను. కొత్త ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ధ్రువీకరించింది. జనవరి 20న అది బాధ్యతలు చేపడుతుంది. అందుకే ఇప్పుడు నా దృష్టంతా సవ్యంగా, ఎలాంటి గొడవలు, అవాంతరాలు లేకుండా అధికారాన్ని బదిలీ చేయడంపైనే ఉంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోనని తెలిపారు.
ఉపాధ్యక్షుడు అధికారాలు ఉపయోగించుకోవాలి
ట్రంప్ను పదవి నుంచి తప్పించేందుకు 25వ రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకోవాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ను డెమొక్రాటిక్ పార్టీ కోరింది. ‘‘అధ్యక్షుడు ప్రమాదకరమైన, దేశ ద్రోహపూరితమైన చర్యలకు పాల్పడినందున ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఉంద’’ని స్పీకర్ నాన్సీ పెలోసీ, సెనేట్లో డెమొక్రాటిక్ పార్టీ నాయకుడు చుక్ షూమెర్ పేర్కొన్నారు. ట్రంప్ను తొలగిస్తూ ఉపాధ్యక్షుడు, మంత్రివర్గమూ నిర్ణయం తీసుకోకపోతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చట్టసభలే ఆ పని చేస్తాయని తెలిపారు.
క్షమాభిక్ష పొందిన అధ్యక్షులు ఉన్నారా?
గతంలో అధ్యక్షునిగా పనిచేసిన రిచర్డ్ నిక్సన్ ఒక్కరే తాను చేసిన తప్పిదాలకు క్షమాభిక్ష పొందారు. వాటర్గేట్ కుంభకోణం కారణంగా ఆయన పదవి నుంచి దిగడంతో ఉపాధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్ అధ్యక్షుడయ్యారు. నిక్సన్ చేసిన తప్పులన్నింటినీ క్షమించారు. అనంతరం వచ్చిన అధ్యక్ష ఎన్నికల్లో ఫోర్డ్ పోటీ చేయగా, ఓటర్లు ఆయనను తిరస్కరించారు.
ఏమిటీ 25వ సవరణ?
* అమెరికా అధ్యక్షుడి పదవి, నిర్వహణ, రాజీనామా, మరణం... వారసుడి ఎంపిక తదితరాలకు సంబంధించిందే ఈ 25వ రాజ్యాంగ సవరణ.
* అమెరికా అధ్యక్షుడు చనిపోయినా, రాజీనామా చేసినా, పదవిని నిర్వర్తించే పరిస్థితిలో లేకున్నా... ఉపాధ్యక్షుడు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు.
* ఈ సవరణలోని నాలుగో భాగం ఇందులో కీలకమైంది. దీన్నే ఇప్పుడు ప్రయోగించాలని డెమొక్రాట్లు కోరుతున్నారు. ఈ నాలుగో భాగం ప్రకారం- పదవిలో ఉన్న అధ్యక్షుడు తన అసమర్థతను స్వయంగా ప్రకటించుకోలేని పరిస్థితుల్లో... ఉపాధ్యక్షుడు, కేబినెట్ కలసి ఈ నిర్ణయం తీసుకుంటారు. వెంటనే ఉపాధ్యక్షుడు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టవచ్చు. ఈ అధికారాన్ని ఇంతవరకు ఎవరూ ఉపయోగించలేదు.
అయిదుకు చేరిన మృతుల సంఖ్య
క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి సంఘటనలో మృతుల సంఖ్య అయిదుకు చేరింది. అల్లర్లలో గాయపడ్డ ఓ పోలీసు అధికారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ దాడిలో మొత్తం 50మందికిపైగా పోలీసులు గాయపడ్డారు.
పోలీసు చీఫ్ రాజీనామా ప్రకటన
చట్టసభల భవనంపై జరిగిన దాడికి బాధ్యత వహిస్తూ ఈ నెలలోనే రాజీనామా చేస్తానని క్యాపిటల్ పోలీసు చీఫ్ స్టీవెన్ సండ్ ప్రకటించారు. పోలీసు చీఫ్ రాజీనామా చేయాలని స్పీకర్ నాన్సీ పెలోసీతో పాటు, పలువురు డిమాండు చేశారు. సిక్ లీవులను వినియోగించుకున్న అనంతరం తప్పుకొంటానని సండ్ తెలిపారు. పోలీసులు జాత్యహంకార ధోరణితో వ్యవహరించారని, శ్వేత జాతీయులైన ట్రంప్ అభిమానులు గంటల తరబడి క్యాపిటల్ భవనంలో తిరిగినా ఊరుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు దుర్ఘటనకు బాధ్యత తీసుకుంటూ విద్యాశాఖ మంత్రి బెస్టీ దేవోస్, రవాణా మంత్రి ఎలైన్ ఛావోలు తమ పదవులకు రాజీనామా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష వాయిదా
పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా తెలంగాణ జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 31న ఆన్లైన్లో నిర్వహించాల్సిన కంప్యూట్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను వాయిదా వేసినట్లు జెన్కో సీఎండీ తెలిపారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజున వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
పర్యాటకులను వేధించొద్దు
తనిఖీల సందర్భంగా పర్యాటకులను వేధించొద్దంటూ అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా లేఖ రాసింది. -
న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలేదు
జ్యుడిషియల్ కస్టడీ సమయంలో తనకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కోర్టు జారీచేసిన ఆదేశాలను తిహాడ్ జైలు అధికారులు పాటించడంలేదని భారాస ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. -
హనుమకొండలో కేటీఆర్పై కేసు నమోదు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాసరావు తదితరులు హనుమకొండ పోలీసులకు గురువారం ఫిర్యాదు చేశారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
ప్రత్యేక రైళ్ల పొడిగింపు
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఐదు జతల ప్రత్యేక రైళ్లను మరికొద్దిరోజులు పొడిగిస్తున్నట్లు ద.మ.రైల్వే గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. -
పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించండి
బూటకపు పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరించాలని సీపీఐ మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ పేరుతో గురువారం మీడియాకు ఓ లేఖ విడుదల చేశారు. -
సంక్షిప్త వార్తలు
ఫోన్ ట్యాపింగ్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని కోరుతూ టీపీసీసీ అధికార ప్రతినిధి బండి సుధాకర్గౌడ్, నాయకుడు తుమ్మేటి సమ్మిరెడ్డి గురువారం డీజీపీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్