నన్ను నేనే క్షమించుకుంటా!
అమెరికా అధ్యక్షునిగా గద్దె దిగక తప్పదని గ్రహించిన ట్రంప్ దీపం ఉండగానే ఇల్లు సర్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు...
‘స్వీయ క్షమాభిక్ష’పై ట్రంప్ యోచన
నూతన ప్రభుత్వం విచారణ జరపకుండా ఎత్తుగడ
బైడెన్ ప్రమాణానికి హాజరుకాబోనని ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షునిగా గద్దె దిగక తప్పదని గ్రహించిన ట్రంప్ దీపం ఉండగానే ఇల్లు సర్దుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్షునికి ఉండే విశేష అధికారాలను స్వీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. తన తప్పిదాలపై నూతన ప్రభుత్వం దర్యాప్తు చేయకుండా ఎత్తువేస్తున్నారు. ‘‘స్వీయ క్షమాభిక్ష’’ ద్వారా తప్పులను ప్రక్షాళన చేసుకొని విముక్తి కావాలని ట్రంప్ భావిస్తున్నట్టు అమెరికా మీడియా పేర్కొంది. పదవి నుంచి దిగిపోయేముందు అమెరికా అధ్యక్షులు తప్పుచేసిన తమ స్నేహితులు, పార్టీ నాయకులను కాపాడుకోవడానికి క్షమాభిక్ష పెడుతుంటారు. ప్రస్తుత పరిపాలనతో ఏదోఒక రూపంలో ప్రమేయం ఉన్న తన కుమార్తె ఇవాంక, అల్లుడు జరేడ్ కుష్నర్, కుమారులు ఎరిక్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, వ్యక్తిగత న్యాయవాది రూడీ గియులియానిలకు క్షమాభిక్ష ఇవ్వాలని ట్రంప్ నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అధ్యక్షుని హోదాలో తాను చేసిన తప్పిదాలపైనా విచారణ జరపకుండా తనకుతానుగా క్షమించుకోవాలని కూడా భావిస్తున్నారు.
అసలు సాధ్యమేనా?
అధ్యక్షుడే తనకు తానుగా క్షమాభిక్ష ఇచ్చుకోవాలని అనుకోవడం గతంలో ఎప్పుడూ జరగలేదు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నాటి నుంచే ‘స్వీయ క్షమాభిక్ష’పై ట్రంప్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా చేస్తే వచ్చే పరిణామాలపై న్యాయనిపుణులతో చర్చలు జరిపారు. 2018 జూన్లోనే దీనిపై ట్రంప్ ట్వీట్ చేశారు. ‘‘నేను చాలా మంది న్యాయనిపుణులతో సంప్రదింపులు జరిపాను. స్వీయ క్షమాభిక్ష ఇచ్చుకునేందుకు నాకు అధికారాలు ఉన్నాయి.’’ అని దాంట్లో పేర్కొన్నారు. అయితే రాజ్యాంగం ప్రకారం ఇది సాధ్యం కాదని పలువురు అంటున్నారు.
ఓ మార్గం లేకపోలేదు...
ట్రంప్ను క్షమించడానికి ఓ మార్గం లేకపోలేదని మరికొందరు చెబుతున్నారు. గతంలో న్యాయశాఖ పంపించిన ఓ మెమోను ఆధారంగా చూపుతున్నారు. దాని ప్రకారం ‘‘ట్రంప్ అధ్యక్షునిగా దిగిపోయి ఉపాధ్యక్షునికి బాధ్యతలు అప్పగించాలి. అప్పుడు అధ్యక్షుని హోదాలో ట్రంప్నకు క్షమాభిక్ష ప్రసాదించవచ్చు’’ అని అంటున్నారు. అయితే ఈ మెమోకు చట్టబద్ధత లేకపోవడంతో దీన్ని అమలు చేయడం కష్టమే.
అధికారాన్ని అప్పగిస్తా.. కానీ..: ట్రంప్
జో బైడెన్కు అధికారాన్ని బదలాయిస్తానని ట్రంప్ ప్రకటించారు. క్యాపిటల్ భవనంపై తన అనుచరుల దాడిని ఖండించారు. ఈ మేరకు ఆయన వీడియో సందేశాన్ని ఇచ్చారు. ‘‘అందరు అమెరికన్ల మాదిరిగానే నేనూ ఆ అల్లర్లపై ఆందోళన చెందాను. నేషనల్ గార్డులు, ఫెడరల్ అధికారులను పిలిపించి భవనానికి భద్రత కల్పించాను. కొత్త ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ధ్రువీకరించింది. జనవరి 20న అది బాధ్యతలు చేపడుతుంది. అందుకే ఇప్పుడు నా దృష్టంతా సవ్యంగా, ఎలాంటి గొడవలు, అవాంతరాలు లేకుండా అధికారాన్ని బదిలీ చేయడంపైనే ఉంది’’ అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ప్రమాణ స్వీకారానికి హాజరు కాబోనని తెలిపారు.
ఉపాధ్యక్షుడు అధికారాలు ఉపయోగించుకోవాలి
ట్రంప్ను పదవి నుంచి తప్పించేందుకు 25వ రాజ్యాంగ సవరణ ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించుకోవాలని ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ను డెమొక్రాటిక్ పార్టీ కోరింది. ‘‘అధ్యక్షుడు ప్రమాదకరమైన, దేశ ద్రోహపూరితమైన చర్యలకు పాల్పడినందున ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాల్సిన అవసరం ఉంద’’ని స్పీకర్ నాన్సీ పెలోసీ, సెనేట్లో డెమొక్రాటిక్ పార్టీ నాయకుడు చుక్ షూమెర్ పేర్కొన్నారు. ట్రంప్ను తొలగిస్తూ ఉపాధ్యక్షుడు, మంత్రివర్గమూ నిర్ణయం తీసుకోకపోతే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చట్టసభలే ఆ పని చేస్తాయని తెలిపారు.
క్షమాభిక్ష పొందిన అధ్యక్షులు ఉన్నారా?
గతంలో అధ్యక్షునిగా పనిచేసిన రిచర్డ్ నిక్సన్ ఒక్కరే తాను చేసిన తప్పిదాలకు క్షమాభిక్ష పొందారు. వాటర్గేట్ కుంభకోణం కారణంగా ఆయన పదవి నుంచి దిగడంతో ఉపాధ్యక్షుడు గెరాల్డ్ ఫోర్డ్ అధ్యక్షుడయ్యారు. నిక్సన్ చేసిన తప్పులన్నింటినీ క్షమించారు. అనంతరం వచ్చిన అధ్యక్ష ఎన్నికల్లో ఫోర్డ్ పోటీ చేయగా, ఓటర్లు ఆయనను తిరస్కరించారు.
ఏమిటీ 25వ సవరణ?
* అమెరికా అధ్యక్షుడి పదవి, నిర్వహణ, రాజీనామా, మరణం... వారసుడి ఎంపిక తదితరాలకు సంబంధించిందే ఈ 25వ రాజ్యాంగ సవరణ.
* అమెరికా అధ్యక్షుడు చనిపోయినా, రాజీనామా చేసినా, పదవిని నిర్వర్తించే పరిస్థితిలో లేకున్నా... ఉపాధ్యక్షుడు అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడతారు.
* ఈ సవరణలోని నాలుగో భాగం ఇందులో కీలకమైంది. దీన్నే ఇప్పుడు ప్రయోగించాలని డెమొక్రాట్లు కోరుతున్నారు. ఈ నాలుగో భాగం ప్రకారం- పదవిలో ఉన్న అధ్యక్షుడు తన అసమర్థతను స్వయంగా ప్రకటించుకోలేని పరిస్థితుల్లో... ఉపాధ్యక్షుడు, కేబినెట్ కలసి ఈ నిర్ణయం తీసుకుంటారు. వెంటనే ఉపాధ్యక్షుడు తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టవచ్చు. ఈ అధికారాన్ని ఇంతవరకు ఎవరూ ఉపయోగించలేదు.
అయిదుకు చేరిన మృతుల సంఖ్య
క్యాపిటల్ భవనంపై జరిగిన దాడి సంఘటనలో మృతుల సంఖ్య అయిదుకు చేరింది. అల్లర్లలో గాయపడ్డ ఓ పోలీసు అధికారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ దాడిలో మొత్తం 50మందికిపైగా పోలీసులు గాయపడ్డారు.
పోలీసు చీఫ్ రాజీనామా ప్రకటన
చట్టసభల భవనంపై జరిగిన దాడికి బాధ్యత వహిస్తూ ఈ నెలలోనే రాజీనామా చేస్తానని క్యాపిటల్ పోలీసు చీఫ్ స్టీవెన్ సండ్ ప్రకటించారు. పోలీసు చీఫ్ రాజీనామా చేయాలని స్పీకర్ నాన్సీ పెలోసీతో పాటు, పలువురు డిమాండు చేశారు. సిక్ లీవులను వినియోగించుకున్న అనంతరం తప్పుకొంటానని సండ్ తెలిపారు. పోలీసులు జాత్యహంకార ధోరణితో వ్యవహరించారని, శ్వేత జాతీయులైన ట్రంప్ అభిమానులు గంటల తరబడి క్యాపిటల్ భవనంలో తిరిగినా ఊరుకున్నారన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు దుర్ఘటనకు బాధ్యత తీసుకుంటూ విద్యాశాఖ మంత్రి బెస్టీ దేవోస్, రవాణా మంత్రి ఎలైన్ ఛావోలు తమ పదవులకు రాజీనామా చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం