Chinna Jeeyar Swamy: కేసీఆర్తో విభేదాల్లేవు
ముఖ్యమంత్రి కేసీఆర్తో తమకు ఎలాంటి విభేదాలు లేవని చినజీయర్స్వామి తెలిపారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల ప్రారంభం నుంచి ఆయన పూర్తి సహకారం ఉందని, అవసరమైన అన్ని వసతులూ కల్పించారని చెప్పారు.
ఆయన మద్దతు ఎప్పుడూ ఉంది
నేడు 108 దేవతామూర్తుల కల్యాణోత్సవం
సీఎంనూ ఆహ్వానించాం
ప్రతిపక్షం, స్వపక్షం అనే భేదం మాకు ఉండదు
చినజీయర్స్వామి వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్తో తమకు ఎలాంటి విభేదాలు లేవని చినజీయర్స్వామి తెలిపారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల ప్రారంభం నుంచి ఆయన పూర్తి సహకారం ఉందని, అవసరమైన అన్ని వసతులూ కల్పించారని చెప్పారు. శనివారం 108 దివ్యదేశాలలోని దేవతామూర్తుల కల్యాణోత్సవం సందర్భంగా శుక్రవారం చినజీయర్స్వామి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘మొదటిరోజు సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చినప్పుడే ఇక్కడ ఉండే సేవకుల్లో తాను మొదటి సేవకుణ్ని అని చెప్పారు. తర్వాత ఆయనకున్న కార్యక్రమాలు, ఆరోగ్యం దృష్ట్యా రావడానికి అవకాశం దొరక్కపోయి ఉండవచ్చు. అంతమాత్రానికే విభేదాలు అనే మాట సృష్టించడం సరికాదు. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. లేనివాటిని సృష్టించి మంచి వాతావరణానికి ఇబ్బంది తేవొద్దు. ఆయన నుంచి మాకు ఎప్పుడూ మద్దతు ఉంది. రాజకీయ రంగు పులమడం సరికాదు. ఒకవేళ విభేదాలు వచ్చి ఉంటే ఉత్సవాలప్పుడే విద్యుత్తు ఆగిపోయేది.. భగీరథ నీళ్లు ఆగిపోయేవి.. పోలీసు బందోబస్తు వెనక్కి వెళ్లిపోయేది కదా! అలా ఏమీ జరగలేదు కదా!’’ అని చెప్పారు. ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు 108 దివ్యదేశాలల్లోని దేవతామూర్తుల కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్ల చినజీయర్స్వామి చెప్పారు. రామానుజుల భారీ విగ్రహానికి చేరుకునే సోపాన మార్గంపై 14 మెట్లను వినియోగించుకుని క్రతువు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇలా 108 సన్నిధిలలో ఒకేసారి కల్యాణోత్సవం జరగడం చరిత్రలో ఎక్కడా లేదన్నారు. కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని, సీఎంనూ ఆహ్వానించామన్నారు.
ప్రతిపక్షం, స్వపక్షమనే భేదం లేదు
ప్రతిపక్షాలు, స్వపక్షాలు అనేది ప్రభుత్వానికి ఉంటుందే తప్ప తమకు కాదని చినజీయర్స్వామి తెలిపారు. అధికారంలో ఉన్న వారినే ఆహ్వానించారని, ప్రతిపక్ష నాయకులను పిలవలేదన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. తాము అందర్నీ పిలిచామని, కొందరు తమ ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా రాకపోయి ఉండవచ్చన్నారు. తమ ఆహ్వానం ఎప్పటికీ ఉంటుందని, ఎవరైనా సమతామూర్తి కేంద్రానికి రావొచ్చన్నారు. తాము చాలామంది ముస్లిం నాయకులను ఆహ్వానించామని, అందుకే ఆహ్వాన పత్రికలు తెలుగు, హిందీ, ఇంగ్లిష్తోపాటు అరబిక్, స్పానిష్లోనూ ముద్రించి అందించామని చెప్పారు. వైదిక శాస్త్రాల ప్రకారం దేవుడి పూజలో పాల్గొనేందుకు ఎలాంటి ఆహ్వానం అవసరం లేదని, అలాంటప్పుడు పిలవడం, పిలవకపోవడమనే ప్రశ్న ఉండదన్నారు.
20 నుంచి సువర్ణమూర్తి సందర్శన
ప్రస్తుతం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకే సమతామూర్తి కేంద్రం సందర్శనకు అవకాశం కల్పించగా.. 20వ తేదీ నుంచి ఈ వేళలు మరింత సడలించనున్నట్లు చినజీయర్స్వామి చెప్పారు. సువర్ణమూర్తినీ దర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయిలోనే సమతామూర్తి కేంద్రం నిత్య దర్శనానికి వీలు కల్పిస్తామన్నారు. నిర్వహణ కోసం ప్రవేశ రుసుములు నిర్ణయించామే తప్ప టికెట్గా పరిగణించరాదని చెప్పారు. తాత్కాలిక వ్యవస్థలో భాగంగా పెద్దలకు రూ. 150, పిల్లలకు రూ. 75 తీసుకుంటున్నారని, త్వరలో అందరికీ అందుబాటులో ఉండేలా ఛార్జీలు నిర్ణయిస్తామన్నారు. ఇంకా ఎన్ఎఫ్సీ, ఏఆర్ సాంకేతికతలు, డైనమిక్ ఫౌంటెయిన్, 3డీ మ్యాపింగ్ వ్యవస్థలు అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. మహాయజ్ఞం తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, ప్రస్తుతం ఏపీ సహా చాలా రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేశారని గుర్తుచేశారు.
అందుకే కేసీఆర్ పేరు వేయలేదు
‘‘ప్రధాని చేతుల మీదుగా రామానుజుల విగ్రహం ప్రారంభించాలని 2016లోనే నిర్ణయించాం. ఈ విషయాన్ని కేసీఆర్కూ తెలియజేశాం. ప్రధాని వంటి వ్యక్తులు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా తిరిగి వెళ్లేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన చెప్పారు. వారు ఏం చేయాలో చెబితే.. అదే విధంగా చేద్దామన్నారు. సమతామూర్తి ఆవిష్కరణ కార్యక్రమంపై ప్రధాని కార్యాలయానికి సమాచారం ఇచ్చినప్పుడు ఎవరెవరు పాల్గొంటున్నారో.. వారి పేర్లే ఆవిష్కరణ ఫలకంపై ఉండటం నియమమని చెప్పారు. 5న సీఎం కేసీఆర్కు జలుబు ఉందని, ఆరోగ్యం సరిగా లేదని వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం లేదని చివరిరోజు సమాచారమిచ్చారు. దానికి తగ్గట్టుగా మేం నిర్ణయం తీసుకుని ఆయన పేరు ఆవిష్కరణ ఫలకంలో రాయించలేదు.’’ అని చినజీయర్స్వామి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు