Chinna Jeeyar Swamy: కేసీఆర్తో విభేదాల్లేవు
ముఖ్యమంత్రి కేసీఆర్తో తమకు ఎలాంటి విభేదాలు లేవని చినజీయర్స్వామి తెలిపారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల ప్రారంభం నుంచి ఆయన పూర్తి సహకారం ఉందని, అవసరమైన అన్ని వసతులూ కల్పించారని చెప్పారు.
ఆయన మద్దతు ఎప్పుడూ ఉంది
నేడు 108 దేవతామూర్తుల కల్యాణోత్సవం
సీఎంనూ ఆహ్వానించాం
ప్రతిపక్షం, స్వపక్షం అనే భేదం మాకు ఉండదు
చినజీయర్స్వామి వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్తో తమకు ఎలాంటి విభేదాలు లేవని చినజీయర్స్వామి తెలిపారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల ప్రారంభం నుంచి ఆయన పూర్తి సహకారం ఉందని, అవసరమైన అన్ని వసతులూ కల్పించారని చెప్పారు. శనివారం 108 దివ్యదేశాలలోని దేవతామూర్తుల కల్యాణోత్సవం సందర్భంగా శుక్రవారం చినజీయర్స్వామి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘మొదటిరోజు సీఎం కేసీఆర్ ఇక్కడికి వచ్చినప్పుడే ఇక్కడ ఉండే సేవకుల్లో తాను మొదటి సేవకుణ్ని అని చెప్పారు. తర్వాత ఆయనకున్న కార్యక్రమాలు, ఆరోగ్యం దృష్ట్యా రావడానికి అవకాశం దొరక్కపోయి ఉండవచ్చు. అంతమాత్రానికే విభేదాలు అనే మాట సృష్టించడం సరికాదు. ఇది పూర్తిగా తప్పుడు ప్రచారం. లేనివాటిని సృష్టించి మంచి వాతావరణానికి ఇబ్బంది తేవొద్దు. ఆయన నుంచి మాకు ఎప్పుడూ మద్దతు ఉంది. రాజకీయ రంగు పులమడం సరికాదు. ఒకవేళ విభేదాలు వచ్చి ఉంటే ఉత్సవాలప్పుడే విద్యుత్తు ఆగిపోయేది.. భగీరథ నీళ్లు ఆగిపోయేవి.. పోలీసు బందోబస్తు వెనక్కి వెళ్లిపోయేది కదా! అలా ఏమీ జరగలేదు కదా!’’ అని చెప్పారు. ఈ నెల 19న సాయంత్రం 5 గంటలకు 108 దివ్యదేశాలల్లోని దేవతామూర్తుల కల్యాణోత్సవం నిర్వహిస్తున్నట్ల చినజీయర్స్వామి చెప్పారు. రామానుజుల భారీ విగ్రహానికి చేరుకునే సోపాన మార్గంపై 14 మెట్లను వినియోగించుకుని క్రతువు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇలా 108 సన్నిధిలలో ఒకేసారి కల్యాణోత్సవం జరగడం చరిత్రలో ఎక్కడా లేదన్నారు. కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని, సీఎంనూ ఆహ్వానించామన్నారు.
ప్రతిపక్షం, స్వపక్షమనే భేదం లేదు
ప్రతిపక్షాలు, స్వపక్షాలు అనేది ప్రభుత్వానికి ఉంటుందే తప్ప తమకు కాదని చినజీయర్స్వామి తెలిపారు. అధికారంలో ఉన్న వారినే ఆహ్వానించారని, ప్రతిపక్ష నాయకులను పిలవలేదన్న ప్రచారాన్ని తోసిపుచ్చారు. తాము అందర్నీ పిలిచామని, కొందరు తమ ముందస్తు కార్యక్రమాల దృష్ట్యా రాకపోయి ఉండవచ్చన్నారు. తమ ఆహ్వానం ఎప్పటికీ ఉంటుందని, ఎవరైనా సమతామూర్తి కేంద్రానికి రావొచ్చన్నారు. తాము చాలామంది ముస్లిం నాయకులను ఆహ్వానించామని, అందుకే ఆహ్వాన పత్రికలు తెలుగు, హిందీ, ఇంగ్లిష్తోపాటు అరబిక్, స్పానిష్లోనూ ముద్రించి అందించామని చెప్పారు. వైదిక శాస్త్రాల ప్రకారం దేవుడి పూజలో పాల్గొనేందుకు ఎలాంటి ఆహ్వానం అవసరం లేదని, అలాంటప్పుడు పిలవడం, పిలవకపోవడమనే ప్రశ్న ఉండదన్నారు.
20 నుంచి సువర్ణమూర్తి సందర్శన
ప్రస్తుతం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 గంటల వరకే సమతామూర్తి కేంద్రం సందర్శనకు అవకాశం కల్పించగా.. 20వ తేదీ నుంచి ఈ వేళలు మరింత సడలించనున్నట్లు చినజీయర్స్వామి చెప్పారు. సువర్ణమూర్తినీ దర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పూర్తిస్థాయిలోనే సమతామూర్తి కేంద్రం నిత్య దర్శనానికి వీలు కల్పిస్తామన్నారు. నిర్వహణ కోసం ప్రవేశ రుసుములు నిర్ణయించామే తప్ప టికెట్గా పరిగణించరాదని చెప్పారు. తాత్కాలిక వ్యవస్థలో భాగంగా పెద్దలకు రూ. 150, పిల్లలకు రూ. 75 తీసుకుంటున్నారని, త్వరలో అందరికీ అందుబాటులో ఉండేలా ఛార్జీలు నిర్ణయిస్తామన్నారు. ఇంకా ఎన్ఎఫ్సీ, ఏఆర్ సాంకేతికతలు, డైనమిక్ ఫౌంటెయిన్, 3డీ మ్యాపింగ్ వ్యవస్థలు అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. మహాయజ్ఞం తర్వాత కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, ప్రస్తుతం ఏపీ సహా చాలా రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేశారని గుర్తుచేశారు.
అందుకే కేసీఆర్ పేరు వేయలేదు
‘‘ప్రధాని చేతుల మీదుగా రామానుజుల విగ్రహం ప్రారంభించాలని 2016లోనే నిర్ణయించాం. ఈ విషయాన్ని కేసీఆర్కూ తెలియజేశాం. ప్రధాని వంటి వ్యక్తులు రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా సంతోషంగా తిరిగి వెళ్లేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన చెప్పారు. వారు ఏం చేయాలో చెబితే.. అదే విధంగా చేద్దామన్నారు. సమతామూర్తి ఆవిష్కరణ కార్యక్రమంపై ప్రధాని కార్యాలయానికి సమాచారం ఇచ్చినప్పుడు ఎవరెవరు పాల్గొంటున్నారో.. వారి పేర్లే ఆవిష్కరణ ఫలకంపై ఉండటం నియమమని చెప్పారు. 5న సీఎం కేసీఆర్కు జలుబు ఉందని, ఆరోగ్యం సరిగా లేదని వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం లేదని చివరిరోజు సమాచారమిచ్చారు. దానికి తగ్గట్టుగా మేం నిర్ణయం తీసుకుని ఆయన పేరు ఆవిష్కరణ ఫలకంలో రాయించలేదు.’’ అని చినజీయర్స్వామి చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి