జనం నెత్తిన కాలుష్యం!
: ప్రమాదకర రసాయనాలను కర్మాగారాల్లోనే శుద్ధి చేయాల్సిన కొన్ని కంపెనీలు వాటిని బయటకు వదిలేస్తున్నాయి. శుద్ధి ఖర్చు తగ్గించుకునేందుకు వ్యర్థాల్ని వందల కిలోమీటర్ల దూరం ట్యాంకర్లలో తరలించి.. నీటి వనరుల చెంత, బహిరంగ
రసాయన వ్యర్థాల అక్రమ డంపింగ్
ఒత్తిళ్ల కారణంగా పీసీబీ నామమాత్రపు చర్యలు
ఈనాడు, హైదరాబాద్: ప్రమాదకర రసాయనాలను కర్మాగారాల్లోనే శుద్ధి చేయాల్సిన కొన్ని కంపెనీలు వాటిని బయటకు వదిలేస్తున్నాయి. శుద్ధి ఖర్చు తగ్గించుకునేందుకు వ్యర్థాల్ని వందల కిలోమీటర్ల దూరం ట్యాంకర్లలో తరలించి.. నీటి వనరుల చెంత, బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తున్నాయి. దీంతో ప్రజారోగ్యానికి, పంటలకు, పర్యావరణానికి తీవ్రనష్టం జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని పరిశ్రమలు ఈ అక్రమాలకు పాల్పడుతున్నాయి. నిఘా పెట్టాల్సిన కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) నామమాత్రపు చర్యలకే పరిమితమైంది.
చేయాల్సింది ఇదీ..
కర్మాగారాల ఆవరణలోనే వ్యర్థాల నిర్వహణకు జీరో లిక్విడ్ డిశ్ఛార్జి (జడ్ఎల్డీ) ఏర్పాట్లు ఉండాలి. అవి లేని కంపెనీలు దగ్గరలో కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సీఈపీటీ)కు తరలించాలి. ఉదయం ఆరు నుంచి సాయంత్రంలోపే ఇది జరగాలి. ఏ నిబంధన పాటించకున్నా, సూర్యాస్తమయం అయ్యాక ట్యాంకర్ బయట కనిపించినా కంపెనీని మూసివేయడానికి పీసీబీకి అధికారం ఉంది. కానీ ఒత్తిళ్ల కారణంగా ఇవేవీ అమలు కావడంలేదు.
జాతీయ రహదారిపైనే వ్యర్థాలు
విజయవాడ వైపు పంతంగి టోల్గేట్ దాటాక, మల్కాపూర్, అంకిరెడ్డిగూడెం, ధర్మగూడెంలో జాతీయరహదారి పక్కనే వ్యర్థాల్ని పారబోస్తున్నారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట వరకు మూసీ నదిలోనూ ఇలాగే డంప్ చేస్తున్నారు.
పోలీసుల సహకారం కోరతాం
గడ్డపోతారం స్పార్ కంపెనీ వ్యర్థాల ట్యాంకరును సూర్యాపేట సమీపంలో పట్టుకున్నాం. వాటిని పారబోయలేదు కనుక మూసివేత ఆదేశాలివ్వకుండా బ్యాంకు గ్యారంటీని జప్తు చేశాం. కొత్తూరులో బెంగాల్ కోల్డ్స్టోరేజి, సంగారెడ్డి జిల్లాలో శ్రీశ్రీ సాల్వెంట్స్, రంగారెడ్డిలో మన్నె ఇంజినీర్స్ కంపెనీలకు మూసివేత ఉత్తర్వులిచ్చాం. జాతీయ రహదారిపై నిఘాను మరింత పెంచి సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరతాం.
- రఘు, చీఫ్ ఇంజినీర్, పీసీబీ
ఇవిగో ఉదంతాలు
సూర్యాపేటలోని మూసీ కాలువలో పది రోజుల కిందట ఓ ట్యాంకర్ రసాయన వ్యర్థాలు డంప్ చేస్తుంటే పోలీసులు పట్టుకుని అయిదుగురిని అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడ నుంచి వ్యర్థాల్ని తెచ్చినట్లు తేలింది. దాదాపు 175 కి.మీ. దూరం ట్యాంకర్ జాతీయ రహదారిపై ప్రయాణించినా పీసీబీ దృష్టికి రాకపోవడం గమనార్హం. వ్యర్థాల్ని ఏ పరిశ్రమ నుంచి తెచ్చారో తెలిశాక చర్యలుంటాయని నల్గొండ జిల్లా పీసీబీ రీజనల్ అధికారి సురేష్బాబు చెప్పారు.
* గడ్డపోతారంలో మరో కంపెనీ నుంచి వెళ్లిన రసాయన వ్యర్థాల ట్యాంకర్ను సూర్యాపేట సమీపంలో పట్టుకున్నారు. ఈ ట్యాంకర్లోని వ్యర్థాల నమూనా.. సంబంధిత కంపెనీలో నమూనాతో సరిపోలినా పీసీబీ ‘మూసివేత ఉత్తర్వులు’ ఇవ్వలేదు.
* యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని ధోతిగూడెంలో ఉన్న పరిశ్రమల కాలుష్యం వల్ల.. వంద ఎకరాల్లో వ్యవసాయం కుంటుపడింది. 30 మంది బాధిత రైతులకు ఆయా కంపెనీలు ఏటా ఎకరాకు రూ.6 వేల చొప్పున పరిహారం ఇస్తున్నాయి. ధోతిగూడెంలో ఎనిమిది నెలల్లో మూడు రసాయన వ్యర్థాల ట్యాంకర్లను పట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్