జనం నెత్తిన కాలుష్యం!
: ప్రమాదకర రసాయనాలను కర్మాగారాల్లోనే శుద్ధి చేయాల్సిన కొన్ని కంపెనీలు వాటిని బయటకు వదిలేస్తున్నాయి. శుద్ధి ఖర్చు తగ్గించుకునేందుకు వ్యర్థాల్ని వందల కిలోమీటర్ల దూరం ట్యాంకర్లలో తరలించి.. నీటి వనరుల చెంత, బహిరంగ
రసాయన వ్యర్థాల అక్రమ డంపింగ్
ఒత్తిళ్ల కారణంగా పీసీబీ నామమాత్రపు చర్యలు
ఈనాడు, హైదరాబాద్: ప్రమాదకర రసాయనాలను కర్మాగారాల్లోనే శుద్ధి చేయాల్సిన కొన్ని కంపెనీలు వాటిని బయటకు వదిలేస్తున్నాయి. శుద్ధి ఖర్చు తగ్గించుకునేందుకు వ్యర్థాల్ని వందల కిలోమీటర్ల దూరం ట్యాంకర్లలో తరలించి.. నీటి వనరుల చెంత, బహిరంగ ప్రదేశాల్లో పారబోస్తున్నాయి. దీంతో ప్రజారోగ్యానికి, పంటలకు, పర్యావరణానికి తీవ్రనష్టం జరుగుతోంది. ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, మహబూబ్నగర్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని పరిశ్రమలు ఈ అక్రమాలకు పాల్పడుతున్నాయి. నిఘా పెట్టాల్సిన కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) నామమాత్రపు చర్యలకే పరిమితమైంది.
చేయాల్సింది ఇదీ..
కర్మాగారాల ఆవరణలోనే వ్యర్థాల నిర్వహణకు జీరో లిక్విడ్ డిశ్ఛార్జి (జడ్ఎల్డీ) ఏర్పాట్లు ఉండాలి. అవి లేని కంపెనీలు దగ్గరలో కామన్ ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (సీఈపీటీ)కు తరలించాలి. ఉదయం ఆరు నుంచి సాయంత్రంలోపే ఇది జరగాలి. ఏ నిబంధన పాటించకున్నా, సూర్యాస్తమయం అయ్యాక ట్యాంకర్ బయట కనిపించినా కంపెనీని మూసివేయడానికి పీసీబీకి అధికారం ఉంది. కానీ ఒత్తిళ్ల కారణంగా ఇవేవీ అమలు కావడంలేదు.
జాతీయ రహదారిపైనే వ్యర్థాలు
విజయవాడ వైపు పంతంగి టోల్గేట్ దాటాక, మల్కాపూర్, అంకిరెడ్డిగూడెం, ధర్మగూడెంలో జాతీయరహదారి పక్కనే వ్యర్థాల్ని పారబోస్తున్నారు. హైదరాబాద్ నుంచి సూర్యాపేట వరకు మూసీ నదిలోనూ ఇలాగే డంప్ చేస్తున్నారు.
పోలీసుల సహకారం కోరతాం
గడ్డపోతారం స్పార్ కంపెనీ వ్యర్థాల ట్యాంకరును సూర్యాపేట సమీపంలో పట్టుకున్నాం. వాటిని పారబోయలేదు కనుక మూసివేత ఆదేశాలివ్వకుండా బ్యాంకు గ్యారంటీని జప్తు చేశాం. కొత్తూరులో బెంగాల్ కోల్డ్స్టోరేజి, సంగారెడ్డి జిల్లాలో శ్రీశ్రీ సాల్వెంట్స్, రంగారెడ్డిలో మన్నె ఇంజినీర్స్ కంపెనీలకు మూసివేత ఉత్తర్వులిచ్చాం. జాతీయ రహదారిపై నిఘాను మరింత పెంచి సహకరించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరతాం.
- రఘు, చీఫ్ ఇంజినీర్, పీసీబీ
ఇవిగో ఉదంతాలు
సూర్యాపేటలోని మూసీ కాలువలో పది రోజుల కిందట ఓ ట్యాంకర్ రసాయన వ్యర్థాలు డంప్ చేస్తుంటే పోలీసులు పట్టుకుని అయిదుగురిని అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడ నుంచి వ్యర్థాల్ని తెచ్చినట్లు తేలింది. దాదాపు 175 కి.మీ. దూరం ట్యాంకర్ జాతీయ రహదారిపై ప్రయాణించినా పీసీబీ దృష్టికి రాకపోవడం గమనార్హం. వ్యర్థాల్ని ఏ పరిశ్రమ నుంచి తెచ్చారో తెలిశాక చర్యలుంటాయని నల్గొండ జిల్లా పీసీబీ రీజనల్ అధికారి సురేష్బాబు చెప్పారు.
* గడ్డపోతారంలో మరో కంపెనీ నుంచి వెళ్లిన రసాయన వ్యర్థాల ట్యాంకర్ను సూర్యాపేట సమీపంలో పట్టుకున్నారు. ఈ ట్యాంకర్లోని వ్యర్థాల నమూనా.. సంబంధిత కంపెనీలో నమూనాతో సరిపోలినా పీసీబీ ‘మూసివేత ఉత్తర్వులు’ ఇవ్వలేదు.
* యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలంలోని ధోతిగూడెంలో ఉన్న పరిశ్రమల కాలుష్యం వల్ల.. వంద ఎకరాల్లో వ్యవసాయం కుంటుపడింది. 30 మంది బాధిత రైతులకు ఆయా కంపెనీలు ఏటా ఎకరాకు రూ.6 వేల చొప్పున పరిహారం ఇస్తున్నాయి. ధోతిగూడెంలో ఎనిమిది నెలల్లో మూడు రసాయన వ్యర్థాల ట్యాంకర్లను పట్టుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం