ఏ ఫీల్డర్ ఎక్కడున్నాడో.. తెలుసుకోవడం ఇక సులువు!
క్రికెట్ మైదానంలో ఫీల్డర్లు ఎక్కడెక్కడున్నారో టీవీ తెరపై చుక్కల(డాట్స్) రూపంలో చూపిస్తుంటారు కదా..! దీనికి సంబంధించి సరికొత్త సాంకేతికతను హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ట్రిపుల్ ఐటీ) అభివృద్ధి చేసింది.
సరికొత్త సాంకేతికతను అభివృద్ధి చేసిన ట్రిపుల్ ఐటీ
మానవ ప్రమేయం లేకుండా గుర్తించే వీలు
స్టార్ స్పోర్ట్స్తో కలిసి రూపకల్పన
ఈనాడు, హైదరాబాద్: క్రికెట్ మైదానంలో ఫీల్డర్లు ఎక్కడెక్కడున్నారో టీవీ తెరపై చుక్కల(డాట్స్) రూపంలో చూపిస్తుంటారు కదా..! దీనికి సంబంధించి సరికొత్త సాంకేతికతను హైదరాబాద్లోని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ట్రిపుల్ ఐటీ) అభివృద్ధి చేసింది. ఇటీవల యూఏఈ వేదికగా జరిగిన ఆసియా కప్లో స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం దీన్ని విజయవంతంగా ప్రయోగించింది. టీ20 ప్రపంచకప్లోనూ దీన్ని వాడబోతున్నారు.
ఫీల్డర్ల స్థానాలను గుర్తించే సాంకేతికతను టీవీ ఛానెళ్లు వాడుతుంటాయి. దీని కోసం మూడు కెమెరాలు వినియోగిస్తారు. అయితే ఆటగాళ్లు కదిలితే కెమెరాల ట్రాకింగ్ వ్యవస్థ ఆగిపోతుంది. ఏ ఫీల్డర్ ఎక్కడున్నాడో తెలుసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ట్రిపుల్ ఐటీ కంప్యూటర్ విజన్ సహాయ ఆచార్యుడు ప్రొఫెసర్ వినీత్ గాంధీ నేతృత్వంలో విద్యార్థులు శ్వేతాంజల్ దత్, జీత్ వోరా, కనిష్క్ జైన్ కలిసి మైదానంలోని ఫీల్డర్లను గుర్తించే మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్(ప్లేయర్ ట్రాకింగ్ సాంకేతికత)ను అభివృద్ధి చేశారు. దీంతో మానవ ప్రమేయం లేకుండా పూర్తి ఆటోమేటిక్గా ఆటగాళ్ల కదలికలను గుర్తించొచ్చు. ఇందుకు ఒకే కెమెరా సరిపోతుంది. బ్యాటర్లు, అంపైర్లను కాకుండా కేవలం ఫీల్డర్లనే చూపించడం దీని ప్రత్యేకత. వాళ్ల పేర్లతో ఎప్పటికప్పుడు ట్రాకింగ్ చేస్తుంది. ఒక ఫీల్డర్ ఎంత వేగంతో, ఎక్కడికి కదులుతున్నాడు? తదితర విషయాలనూ తెలుసుకోవచ్చు. ‘‘మేము అభివృద్ధి చేసిన సాంకేతికతను 2019లో స్టార్ స్పోర్ట్స్తో కలిసి ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్లో ఆటగాళ్ల కదలికలపై వినియోగించాం. సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ కింద ట్రిపుల్ఐటీలో తాజా సాంకేతికతను అభివృద్ధి చేశాం’’ అని వర్సిటీ ప్రొడక్ట్ ల్యాబ్స్ అధిపతి ప్రకాశ్ ఎల్ల వివరించారు. ‘‘రెండేళ్ల కిందట ప్రాజెక్టును స్టార్ స్పోర్ట్స్, ఏఈ.లైవ్ కంపెనీతో ప్రారంభించాం. గతేడాది తమిళనాడు ప్రీమియర్ లీగ్లో పరిశీలించాం. తొలిసారి ఆసియా కప్లో భారత్-హాంకాంగ్ మ్యాచ్లో వినియోగించాం’’ అని వినీత్ గాంధీ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు. -
అన్నదాతకు అందలం
రాష్ట్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రాధాన్య పథకాలు, అవసరాల దృష్ట్యా ఆ శాఖకు భారీగా కేటాయింపులు పెంచింది.