రెండోరోజూ ఐటీ వేట
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంస్థలపై ఆదాయపన్నుశాఖ (ఐటీ) చేపట్టిన సోదాలు రెండోరోజైన బుధవారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు ఒకదశలో ఉద్రిక్తతకు దారితీశాయి. మంత్రి తనయుడు అస్వస్థతకు గురికావడం, పెద్దఎత్తున అభిమానులు అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి చేయిదాటుతోందన్న ఆందోళన వ్యక్తమైంది.
ముమ్మరంగా కొనసాగిన సోదాలు
మంత్రి మల్లారెడ్డి కుమారుడికి అస్వస్థత
ఆసుపత్రికి వెళ్లేందుకు అధికారులతో మంత్రి వాగ్వాదం
ఇప్పటివరకూ రూ. 8 కోట్ల స్వాధీనం!
మంత్రి మనవరాలిని ఎస్బీఐకి తీసుకెళ్లిన అధికారులు
అక్కడ 12 లాకర్ల గుర్తింపు.. ఎనిమిదింటిని తెరిపించిన వైనం
మా వాళ్లను రాత్రంతా కొట్టారు: మల్లారెడ్డి
ఈనాడు, న్యూస్టుడే యంత్రాంగం - హైదరాబాద్: కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సంస్థలపై ఆదాయపన్నుశాఖ (ఐటీ) చేపట్టిన సోదాలు రెండోరోజైన బుధవారం కూడా కొనసాగాయి. ఈ సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు ఒకదశలో ఉద్రిక్తతకు దారితీశాయి. మంత్రి తనయుడు అస్వస్థతకు గురికావడం, పెద్దఎత్తున అభిమానులు అక్కడకు చేరుకోవడంతో పరిస్థితి చేయిదాటుతోందన్న ఆందోళన వ్యక్తమైంది. మంగళవారం రాత్రి 11.30 గంటల వరకు సోదాలు నిర్వహించిన ఆదాయపన్ను అధికారులు స్వాధీనం చేసుకున్న రికార్డులు, హార్డ్డిస్కులు, నగదు తదితరాలను బోయినపల్లిలోని మల్లారెడ్డి ఇంట్లో ఉన్న ఒక గదిలో పెట్టి తాళం వేశారు. దానికి సీఆర్పీఎఫ్ సిబ్బందిని కాపలాగా పెట్టి మళ్లీ బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో తనిఖీలు మొదలుపెట్టారు. రెండు రోజుల సోదాల్లో మొత్తం రూ. 8 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మహేందర్రెడ్డికి అస్వస్థత
మంత్రి తనయుడు మహేందర్రెడ్డి బుధవారం స్వల్ప అస్వస్థతకు గురవడంతో ఆయనను ఉదయాన్నే సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మంత్రి ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కుమారుడి అస్వస్థత గురించి తెలియగానే మల్లారెడ్డి ఆసుపత్రికి బయలుదేరారు. వెళ్లవద్దంటూ అధికారులు నిలువరించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి.. వారితో వాగ్వివాదానికి దిగారు. బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి సూరారంలోని ఆసుపత్రికి చేరుకున్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎమ్మెల్యే వివేకానంద, పెద్దఎత్తున కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకున్నారు. మల్లారెడ్డితోపాటు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఆసుపత్రిలోకి వెళ్లి మహేందర్రెడ్డిని పరామర్శించారు. మల్లారెడ్డి తోడల్లుడి కుమారుడు ప్రవీణ్రెడ్డి చేతికి గాయంతో మంగళవారం రాత్రి ఇదే ఆసుపత్రిలో చేరారు. విచారణ కోసం ఐటీ అధికారులు ఆయనను దూలపల్లిలోని అశోక అలమైసన్లో ఉన్న ఇంటికి తీసుకెళ్లారు. కుమారుడి వద్ద ఉన్న మల్లారెడ్డికి ఈ విషయం తెలియడంతో మళ్లీ ప్రవీణ్రెడ్డి ఇంటికి వెళ్లి ఆయనను కూడా ఆసుపత్రికి తరలించారు. అప్పుడు కూడా అధికారులతో వాగ్వివాదం జరిగింది. సోదాల సందర్భంగా పోలీసులు తోసివేయడంతోనే ప్రవీణ్రెడ్డి చేతికి గాయమైందని మల్లారెడ్డి ఆరోపించారు. అప్పటికే పెద్దసంఖ్యలో చేరుకున్న మంత్రి అనుచరులు, కార్యకర్తలతో ఆసుపత్రి ఆవరణ నిండిపోయింది. వారందర్నీ పోలీసులు బలవంతంగా బయటకు పంపించారు.
ఇది భాజపా కక్షపూరిత చర్య: మల్లారెడ్డి
అనంతరం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలతో కలిసి మల్లారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తోందని, తమపై కక్ష కట్టి రెండు రోజులుగా 50 చోట్ల, 200 మంది అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారని, మహేందర్రెడ్డి, ప్రవీణ్రెడ్డిలను రాత్రంతా తీవ్రంగా కొట్టారని ఆరోపించారు. తెరాసను రాజకీయంగా ఎదుర్కోలేక కేంద్రం.. తప్పుడు మార్గాల్లో తమను ఇబ్బందిపెడుతోందని మండిపడ్డారు. తాను నిబంధనల ప్రకారమే ఆసుపత్రులు, వైద్య ఇంజినీరింగ్ కళాశాలలు నడుపుతున్నానని.. ఎటువంటి అక్రమ వసూళ్లకు పాల్పడటం లేదని, నిజాయతీగా సంపాదిస్తున్నానని అన్నారు. తాము అధికారులకు సహకరిస్తామని.. కానీ పోలీసులతో దాడులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ‘నేను ఎన్నో ఏళ్లపాటు కష్టపడితేనే ఈ స్థాయికి వచ్చాను. నేను హవాలా చేయలేదు. పాల వ్యాపారంతో మొదలుపెట్టి.. విద్యాసంస్థలను స్థాపించాను. భాజపా దాడులకు భయపడేది లేదు’ అని మల్లారెడ్డి అన్నారు.
నిలకడగా మహేందర్రెడ్డి ఆరోగ్యం
మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి, ఆసుపత్రి వైద్యులు మహేందర్రెడ్డిని పరిశీలించారు. ఈసీజీలో స్వల్ప మార్పులు కనిపించాయని, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. వరుసగా ఈసీజీ తీస్తామని, ఏవైనా మార్పులు కనిపిస్తే ఇంకా చికిత్స చేయాల్సి ఉంటుందన్నారు. మరోవైపు కార్యకర్తల సందడి పెరగడంతో పోలీసులు అదనపు బలగాలను రప్పించి అందరినీ అక్కడి నుంచి పంపించారు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఐటీ అధికారులు.. మళ్లీ ప్రవీణ్రెడ్డిని ఆసుపత్రి నుంచి ఆయన ఇంటికి తీసుకెళ్లారు.
స్థలాలు, వ్యాపార పత్రాల పరిశీలన
మంత్రితోపాటు ఆయన సోదరుడు గోపాల్రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్రెడ్డి నివాసాలతోపాటు న్యూబోయిన్పల్లి సీతారాంపురంలోని సీఎంఆర్ మోడల్ హైస్కూల్లో ఐటీ అధికారులు బుధవారం సోదాలు చేశారు. తొలుత పాఠశాల సిబ్బంది నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం సమీపంలోని మల్లారెడ్డి వ్యాపార భాగస్వామి నర్సింహయాదవ్ ఇంట్లోనూ తనిఖీలు చేశారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మంత్రి నివాసంలో పనిమనిషి రమ(40)కు మూర్ఛ వచ్చి ఇంట్లోనే కుప్పకూలింది. దీంతో అధికారులు ఆమెను మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. మంత్రికి సంబంధించి పలు స్థలాల క్రయ, విక్రయాల పత్రాలు, విద్యా, వ్యాపారాలకు సంబంధించిన పత్రాలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తుండడంతో ఎక్కువ సమయం పడుతున్నట్లు తెలుస్తోంది.
మనవరాలిని బ్యాంకుకు.. కోడలిని ఇంటికి..
మంత్రి అల్లుడు రాజశేఖర్రెడ్డి కుమార్తె శ్రేయారెడ్డిని ఐటీ అధికారులు బుధవారం కోఠిలోని స్టేట్ బ్యాంకుకు తీసుకువెళ్లారు. అక్కడ మొత్తం 12 లాకర్లను గుర్తించి.. ఎనిమిదింటిని తెరిచి చూశారు. కొంపల్లిలో నివసిస్తున్న మంత్రి రెండో కోడలు ప్రీతిరెడ్డిని అధికారులు మల్లారెడ్డి నివాసానికి తీసుకువచ్చారు.
దిల్లీ నుంచి ఉన్నతాధికారి రాక
రెండు రోజులుగా జరుగుతున్న సోదాలను పర్యవేక్షించడానికి దిల్లీ నుంచి డైరెక్టర్ జనరల్ స్థాయి అధికారి ఒకరు బుధవారం హైదరాబాద్ చేరుకున్నట్లు తెలుస్తోంది. మరికొన్ని రోజులపాటు ఈ సోదాలు జరిగే అవకాశం ఉండటంతో సిబ్బందికి సూచనలు చేసేందుకే ఆయన వచ్చినట్లు సమాచారం. దీన్నిబట్టి ఈ సోదాలను ఆదాయపన్నుశాఖ ఎంత తీవ్రంగా పరిగణిస్తోందో అర్థం చేసుకోవచ్చు.
క్రాంతి బ్యాంకులో, ఛైర్మన్ ఇంట్లో..
బాలానగర్లోని క్రాంతి సహకార బ్యాంకు సంస్థల ఛైర్మన్ బి.రాజేశ్వరరావు గుప్తా నివాసంతోపాటు ఇదే ప్రాంతంలోని బ్యాంకులోనూ బుధవారం కూడా ఐటీ సోదాలు జరిగాయి. బ్యాంకు కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా లోపల గదుల్లో రికార్డులు పరిశీలించినట్లు సమాచారం. మంత్రి మల్లారెడ్డికి చెందిన పలు వ్యాపార సంస్థల్లో ఈయన భాగస్వామిగా ఉండడంతో బ్యాంకు లావాదేవీలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..
-
‘అలాంటి వ్యక్తి హోం మంత్రి.. నిజంగా విచిత్రమే’: షాపై శరద్ పవార్ ఘాటు వ్యాఖ్యలు
-
పారిస్ టూర్.. సంతోషకరమైన క్షణమిది: చిరంజీవి పోస్ట్
-
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు