Ragging: ర్యాగింగ్ రోగం
వైద్య కళాశాలల్లో ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుతోంది. ‘‘నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావ్? తప్పనిసరిగా సర్ అనే పిలవాలి.
వైద్య కళాశాలల్లో శ్రుతిమించుతున్న సీనియర్ల ఆగడాలు
ఆహారం, మద్యం తెమ్మని ఒత్తిళ్లు
గుంజీలు తీయిస్తూ.. గోడకుర్చీ వేయిస్తూ శారీరక హింస
బెంబేలెత్తుతున్న కొత్త విద్యార్థులు
ఈనాడు - హైదరాబాద్
వైద్య కళాశాలల్లో ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుతోంది. ‘‘నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావ్? తప్పనిసరిగా సర్ అనే పిలవాలి. క్యాంటీన్కెళ్లి బిర్యానీ పట్టుకురా.. బయటికెళ్లి మద్యం సీసాలు తీసుకురా.. ఇలాంటి డ్రెస్లు వేసుకోవద్దు.. మేం ఆపమనే వరకూ గుంజీలు తీయి.. ఎవరికైనా ఫిర్యాదు చేశారో.. అంతే! మున్ముందు మాతోనే మీకు పని! జాగ్రత్త!’’... ఇదీ వైద్య కళాశాలల్లో సీనియర్ వైద్య విద్యార్థుల జులుం. కొత్తగా కళాశాలల్లోకి అడుగుపెట్టిన విద్యార్థుల పట్ల కొందరు సీనియర్లు సరదా పరిచయాల పేరిట వికృతచేష్టలకు పాల్పడుతున్నారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలు అన్ని వైద్య కళాశాలల్లో ఉన్నా ర్యాగింగ్ యథేచ్ఛగా కొనసాగుతోందంటే పరిస్థితి ఎంత తీవ్రరూపం దాల్చిందో అర్థమవుతోంది. ర్యాగింగ్ బెడదను తప్పించేందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పలు ఆదేశాలు జారీచేస్తున్నా సీనియర్ విద్యార్థులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ వికృతచేష్టలు రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
బరితెగింపు వ్యాఖ్యలు.. చేష్టలు
రెండు వారాల కిందట తరగతులు ప్రారంభం కావడంతో వైద్యకళాశాలల్లోకి అడుగుపెట్టిన మొదటి సంవత్సరం విద్యార్థులకు సీనియర్ల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కొందరు విద్యార్థులు వసతిగృహాల్లో చేరిపోగా.. మరికొందరు బయటి నుంచి కళాశాలలకు హాజరవుతున్నారు. తరగతులు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభమే కాలేదు.. కానీ సీనియర్ల ఆగడాలు మాత్రం మొదలయ్యాయి. ముఖ్యంగా అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని చెలరేగిపోతున్నట్లు తెలుస్తోంది. వారు ధరించిన దుస్తులపైనా వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలానా తరహా దుస్తులే వేసుకురావాలని ఆంక్షలు విధిస్తున్నారని విద్యార్థినులు వాపోతున్నారు. సమాధానం సరిగా చెప్పకపోయినా.. వారి వ్యాఖ్యలను ప్రశ్నించినా.. సీనియర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయిదేళ్ల వైద్యవిద్యలో సీనియర్ల సాయం తప్పనిసరిగా అవసరమవుతుందనీ, క్షేత్రస్థాయి అనుభవ శిక్షణకు వెళ్లినప్పుడు తమ పాత్రే కీలకమవుతుందనీ, ఇప్పుడు ఎదిరిస్తే భవిష్యత్లో ఎలాంటి సహకారమూ ఉండదని కొందరు బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది.ఈ చేష్టలకు భయపడి కొందరు విద్యార్థినులు కళాశాలకు వెళ్లడానికే వణికిపోతున్నారు.
వసతిగృహాల్లో వికృతరూపాలు
వైద్యకళాశాలల వసతిగృహాల్లో ఉంటున్న వైద్యవిద్యార్థులపై సీనియర్ల నుంచి మరిన్ని వికృతరూపాల్లో ర్యాగింగ్ ఎదురవుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. రాత్రుళ్లు తమ గదికి పిలిపించుకొని అసభ్యంగా మాట్లాడటమే కాకుండా గుంజీలు తీయించడం, గోడకుర్చీ వేయించడం, దుస్తులు విప్పాలని బలవంతం చేయడం, రాత్రివేళ తమ కోసం ఆహారం, మద్యం సీసాలు కొనుక్కురమ్మని పురమాయించడం లాంటి చర్యలతో కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతుండడంతో కొత్త విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు ప్రధానాచార్యుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. అవి తూతూమంత్రంగానే ఉంటుండటంతో.. ర్యాగింగ్కు అడ్డూ అదుపూ లేకుండా పోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ర్యాగింగ్ జరుగుతున్నట్లు బయటకు పొక్కితే తమ కళాశాలకు చెడ్డపేరు వస్తుందనే ఆలోచనతో కొందరు ప్రధానాచార్యులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తొలిరోజుల్లోనే దీనికి అడ్డుకట్ట వేయకపోతే.. ఈ విషసంస్కృతి మరింతగా జడలు విప్పే ప్రమాదముంది.
శారీరకంగా వేధిస్తే ఏడాది జైలుశిక్ష
* కాళోజీ వర్సిటీ గతంలో జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం దుస్తులపై వ్యాఖ్యానం, గుంజీలు తీయమనడం, పరుగులు పెట్టించడం, గోడ కుర్చీ వేయించడం, అసభ్యకరంగా, కించపర్చేలా మాట్లాడడం.. తదితర వేధింపులకు పాల్పడటం నేరం.
* వసతిగృహాల్లో రాత్రివేళ తమ గదులకు పిలిపించుకోవడం.. జుట్టు కత్తిరించడం.. మద్యం సీసాలు తెమ్మని పురమాయించడం.. అశ్లీలంగా వ్యవహరించమని ప్రోత్సహించడం.. దుస్తులను విప్పమని బలవంతపెట్టడం అత్యంత తీవ్రమైన అంశాలు.
* ర్యాగింగ్ వికృత క్రీడల్లో భాగస్తులైన విద్యార్థులకు నెల రోజుల పాటు వైద్యకళాశాల నుంచి సస్పెన్షన్ వేటు తప్పదు.
* ఏడిపించడం, హేళన చేయడం, ఇతర ఇబ్బందులకు గురిచేయడం లాంటివాటికి ఆరు నెలల జైలుశిక్ష ఉంటుంది.
* శారీరకంగా వేధించినా, బలప్రయోగం చేసినా ఏడాది జైలుశిక్ష విధించే అవకాశముంది.
* అడ్డుకున్నా, గాయపర్చినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తారు.
* అపహరణ, అత్యాచారం, తీవ్రంగా గాయపర్చడానికి అయిదేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా.
* ర్యాగింగ్ వేధింపులతో మృతి చెందినా, ఆత్మహత్యకు కారణమైనా జీవితకాలం జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.
* ర్యాగింగ్ భూతాన్ని అడ్డుకోవడంలో ప్రధాన బాధ్యత సంబంధిత వైద్యకళాశాలదేే.
* విద్యార్థులపై వికృత చేష్టలను అదుపు చేయడంలో వైద్యకళాశాల విఫలమైందని తేలితే.. సంబంధిత కళాశాల గుర్తింపును కనీసం ఏడాది పాటు రద్దు చేస్తారు.
ఇలా చేయాలి...
* జాతీయ వైద్య కమిషన్ ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి వైద్యకళాశాలలో ర్యాగింగ్ నిరోధక బృందాన్ని ఏర్పాటుచేయాలి.
* బాధితులు ఫిర్యాదు చేయడానికి వీలుగా ఫిర్యాదు పెట్టె, ఫోన్ నంబరు, ఈమెయిల్ అడ్రస్ వంటివి అందుబాటులో ఉంచాలి.
* కొత్త, పాత విద్యార్థుల మధ్య ప్రత్యక్షంగా పరిచయం కలిగే పరిస్థితులను కల్పించొద్దు.
* ర్యాగింగ్కు పాల్పడితే శిక్షకు గురవుతారనే బోర్డులను కళాశాల ఆవరణలో ప్రదర్శించాలి.
* స్థానిక పోలీసు అధికారుల మొబైల్ నంబర్లను ప్రదర్శించాలి.
* ర్యాగింగ్ బారినపడిన విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించేందుకు సైకియాట్రీ సేవలు కల్పించాలి.
* జాతీయ వైద్య కమిషన్ ఉత్తర్వుల ప్రకారం.. ర్యాగింగ్ చేయబోమని విద్యార్థి నుంచి, ఒకవేళ చేస్తే తీసుకునే కఠిన చర్యలకు కట్టుబడి ఉంటామని కళాశాలల యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ముందస్తుగా అఫిడవిట్ స్వీకరించాలి.
* వైద్య కళాశాల, వసతిగృహాలు, భోజనశాలల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి.
ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది
-హరీశ్రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
సీనియర్ విద్యార్థులు జూనియర్లకు ఆదర్శంగా ఉండాలి. అంతేగానీ ర్యాగింగ్ చేస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేయడం మంచి పద్ధతి కాదు. గతేడాది సూర్యాపేటలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు కొందరు విద్యార్థులను సస్పెండ్ చేశాం. ఇటీవల సిద్దిపేటలోనూ కొందరు ర్యాగింగ్కు పాల్పడితే.. వారిని వసతిగృహం నుంచి పంపించాం. వారి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాం. నిజానికి ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులను సస్పెండ్ చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఆ విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకూడదనే మానవతా దృక్పథంతో వసతిగృహం నుంచి తప్పించామని వారి తల్లిదండ్రులకు వివరించాం. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎక్కడ ర్యాగింగ్ జరిగినట్లు తేలినా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడం. సీనియర్లు ర్యాగింగ్ను వదిలిపెట్టి, జూనియర్లకు వైద్యవిద్యలో సహకరించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు