Ragging: ర్యాగింగ్ రోగం
వైద్య కళాశాలల్లో ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుతోంది. ‘‘నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావ్? తప్పనిసరిగా సర్ అనే పిలవాలి.
వైద్య కళాశాలల్లో శ్రుతిమించుతున్న సీనియర్ల ఆగడాలు
ఆహారం, మద్యం తెమ్మని ఒత్తిళ్లు
గుంజీలు తీయిస్తూ.. గోడకుర్చీ వేయిస్తూ శారీరక హింస
బెంబేలెత్తుతున్న కొత్త విద్యార్థులు
ఈనాడు - హైదరాబాద్
వైద్య కళాశాలల్లో ర్యాగింగ్ భూతం మళ్లీ జడలు విప్పుతోంది. ‘‘నీ పేరేంటి? ఎక్కడి నుంచి వచ్చావ్? తప్పనిసరిగా సర్ అనే పిలవాలి. క్యాంటీన్కెళ్లి బిర్యానీ పట్టుకురా.. బయటికెళ్లి మద్యం సీసాలు తీసుకురా.. ఇలాంటి డ్రెస్లు వేసుకోవద్దు.. మేం ఆపమనే వరకూ గుంజీలు తీయి.. ఎవరికైనా ఫిర్యాదు చేశారో.. అంతే! మున్ముందు మాతోనే మీకు పని! జాగ్రత్త!’’... ఇదీ వైద్య కళాశాలల్లో సీనియర్ వైద్య విద్యార్థుల జులుం. కొత్తగా కళాశాలల్లోకి అడుగుపెట్టిన విద్యార్థుల పట్ల కొందరు సీనియర్లు సరదా పరిచయాల పేరిట వికృతచేష్టలకు పాల్పడుతున్నారు. యాంటీ ర్యాగింగ్ కమిటీలు అన్ని వైద్య కళాశాలల్లో ఉన్నా ర్యాగింగ్ యథేచ్ఛగా కొనసాగుతోందంటే పరిస్థితి ఎంత తీవ్రరూపం దాల్చిందో అర్థమవుతోంది. ర్యాగింగ్ బెడదను తప్పించేందుకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం పలు ఆదేశాలు జారీచేస్తున్నా సీనియర్ విద్యార్థులు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. ఈ వికృతచేష్టలు రాష్ట్రంలోని కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
బరితెగింపు వ్యాఖ్యలు.. చేష్టలు
రెండు వారాల కిందట తరగతులు ప్రారంభం కావడంతో వైద్యకళాశాలల్లోకి అడుగుపెట్టిన మొదటి సంవత్సరం విద్యార్థులకు సీనియర్ల నుంచి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కొందరు విద్యార్థులు వసతిగృహాల్లో చేరిపోగా.. మరికొందరు బయటి నుంచి కళాశాలలకు హాజరవుతున్నారు. తరగతులు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభమే కాలేదు.. కానీ సీనియర్ల ఆగడాలు మాత్రం మొదలయ్యాయి. ముఖ్యంగా అమ్మాయిలను లక్ష్యంగా చేసుకొని చెలరేగిపోతున్నట్లు తెలుస్తోంది. వారు ధరించిన దుస్తులపైనా వ్యాఖ్యలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలానా తరహా దుస్తులే వేసుకురావాలని ఆంక్షలు విధిస్తున్నారని విద్యార్థినులు వాపోతున్నారు. సమాధానం సరిగా చెప్పకపోయినా.. వారి వ్యాఖ్యలను ప్రశ్నించినా.. సీనియర్లు బెదిరింపులకు పాల్పడుతున్నారు. అయిదేళ్ల వైద్యవిద్యలో సీనియర్ల సాయం తప్పనిసరిగా అవసరమవుతుందనీ, క్షేత్రస్థాయి అనుభవ శిక్షణకు వెళ్లినప్పుడు తమ పాత్రే కీలకమవుతుందనీ, ఇప్పుడు ఎదిరిస్తే భవిష్యత్లో ఎలాంటి సహకారమూ ఉండదని కొందరు బెదిరింపులకు దిగుతున్నట్లు తెలుస్తోంది.ఈ చేష్టలకు భయపడి కొందరు విద్యార్థినులు కళాశాలకు వెళ్లడానికే వణికిపోతున్నారు.
వసతిగృహాల్లో వికృతరూపాలు
వైద్యకళాశాలల వసతిగృహాల్లో ఉంటున్న వైద్యవిద్యార్థులపై సీనియర్ల నుంచి మరిన్ని వికృతరూపాల్లో ర్యాగింగ్ ఎదురవుతున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. రాత్రుళ్లు తమ గదికి పిలిపించుకొని అసభ్యంగా మాట్లాడటమే కాకుండా గుంజీలు తీయించడం, గోడకుర్చీ వేయించడం, దుస్తులు విప్పాలని బలవంతం చేయడం, రాత్రివేళ తమ కోసం ఆహారం, మద్యం సీసాలు కొనుక్కురమ్మని పురమాయించడం లాంటి చర్యలతో కించపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గత నాలుగైదు రోజులుగా ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతుండడంతో కొత్త విద్యార్థుల తల్లిదండ్రులు కొందరు ప్రధానాచార్యుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. అయితే చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నా.. అవి తూతూమంత్రంగానే ఉంటుండటంతో.. ర్యాగింగ్కు అడ్డూ అదుపూ లేకుండా పోతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ర్యాగింగ్ జరుగుతున్నట్లు బయటకు పొక్కితే తమ కళాశాలకు చెడ్డపేరు వస్తుందనే ఆలోచనతో కొందరు ప్రధానాచార్యులు కూడా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తొలిరోజుల్లోనే దీనికి అడ్డుకట్ట వేయకపోతే.. ఈ విషసంస్కృతి మరింతగా జడలు విప్పే ప్రమాదముంది.
శారీరకంగా వేధిస్తే ఏడాది జైలుశిక్ష
* కాళోజీ వర్సిటీ గతంలో జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం దుస్తులపై వ్యాఖ్యానం, గుంజీలు తీయమనడం, పరుగులు పెట్టించడం, గోడ కుర్చీ వేయించడం, అసభ్యకరంగా, కించపర్చేలా మాట్లాడడం.. తదితర వేధింపులకు పాల్పడటం నేరం.
* వసతిగృహాల్లో రాత్రివేళ తమ గదులకు పిలిపించుకోవడం.. జుట్టు కత్తిరించడం.. మద్యం సీసాలు తెమ్మని పురమాయించడం.. అశ్లీలంగా వ్యవహరించమని ప్రోత్సహించడం.. దుస్తులను విప్పమని బలవంతపెట్టడం అత్యంత తీవ్రమైన అంశాలు.
* ర్యాగింగ్ వికృత క్రీడల్లో భాగస్తులైన విద్యార్థులకు నెల రోజుల పాటు వైద్యకళాశాల నుంచి సస్పెన్షన్ వేటు తప్పదు.
* ఏడిపించడం, హేళన చేయడం, ఇతర ఇబ్బందులకు గురిచేయడం లాంటివాటికి ఆరు నెలల జైలుశిక్ష ఉంటుంది.
* శారీరకంగా వేధించినా, బలప్రయోగం చేసినా ఏడాది జైలుశిక్ష విధించే అవకాశముంది.
* అడ్డుకున్నా, గాయపర్చినా రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా విధిస్తారు.
* అపహరణ, అత్యాచారం, తీవ్రంగా గాయపర్చడానికి అయిదేళ్ల జైలుశిక్షతో పాటు జరిమానా.
* ర్యాగింగ్ వేధింపులతో మృతి చెందినా, ఆత్మహత్యకు కారణమైనా జీవితకాలం జైలుశిక్ష పడే అవకాశం ఉంటుంది.
* ర్యాగింగ్ భూతాన్ని అడ్డుకోవడంలో ప్రధాన బాధ్యత సంబంధిత వైద్యకళాశాలదేే.
* విద్యార్థులపై వికృత చేష్టలను అదుపు చేయడంలో వైద్యకళాశాల విఫలమైందని తేలితే.. సంబంధిత కళాశాల గుర్తింపును కనీసం ఏడాది పాటు రద్దు చేస్తారు.
ఇలా చేయాలి...
* జాతీయ వైద్య కమిషన్ ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి వైద్యకళాశాలలో ర్యాగింగ్ నిరోధక బృందాన్ని ఏర్పాటుచేయాలి.
* బాధితులు ఫిర్యాదు చేయడానికి వీలుగా ఫిర్యాదు పెట్టె, ఫోన్ నంబరు, ఈమెయిల్ అడ్రస్ వంటివి అందుబాటులో ఉంచాలి.
* కొత్త, పాత విద్యార్థుల మధ్య ప్రత్యక్షంగా పరిచయం కలిగే పరిస్థితులను కల్పించొద్దు.
* ర్యాగింగ్కు పాల్పడితే శిక్షకు గురవుతారనే బోర్డులను కళాశాల ఆవరణలో ప్రదర్శించాలి.
* స్థానిక పోలీసు అధికారుల మొబైల్ నంబర్లను ప్రదర్శించాలి.
* ర్యాగింగ్ బారినపడిన విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి, ఆందోళనలను తగ్గించేందుకు సైకియాట్రీ సేవలు కల్పించాలి.
* జాతీయ వైద్య కమిషన్ ఉత్తర్వుల ప్రకారం.. ర్యాగింగ్ చేయబోమని విద్యార్థి నుంచి, ఒకవేళ చేస్తే తీసుకునే కఠిన చర్యలకు కట్టుబడి ఉంటామని కళాశాలల యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ముందస్తుగా అఫిడవిట్ స్వీకరించాలి.
* వైద్య కళాశాల, వసతిగృహాలు, భోజనశాలల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి.
ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది
-హరీశ్రావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి
సీనియర్ విద్యార్థులు జూనియర్లకు ఆదర్శంగా ఉండాలి. అంతేగానీ ర్యాగింగ్ చేస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేయడం మంచి పద్ధతి కాదు. గతేడాది సూర్యాపేటలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు కొందరు విద్యార్థులను సస్పెండ్ చేశాం. ఇటీవల సిద్దిపేటలోనూ కొందరు ర్యాగింగ్కు పాల్పడితే.. వారిని వసతిగృహం నుంచి పంపించాం. వారి తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాం. నిజానికి ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులను సస్పెండ్ చేయాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ ఆ విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకూడదనే మానవతా దృక్పథంతో వసతిగృహం నుంచి తప్పించామని వారి తల్లిదండ్రులకు వివరించాం. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎక్కడ ర్యాగింగ్ జరిగినట్లు తేలినా ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి వెనుకాడం. సీనియర్లు ర్యాగింగ్ను వదిలిపెట్టి, జూనియర్లకు వైద్యవిద్యలో సహకరించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట