Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసులో 36 మంది
దిల్లీ మద్యం కేసులో భాగస్వామ్యం/అనుమానం ఉన్న 36 మంది పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అమిత్ అరోడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. ఈ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఆయనను ఈడీ మంగళవారం రాత్రి అరెస్టు చేసింది.
ఆ జాబితాలో కల్వకుంట్ల కవిత, శరత్రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్, సృజన్రెడ్డిల పేర్లు
సౌత్గ్రూప్ ద్వారా ఆప్ లీడర్లకు రూ.100 కోట్ల ముడుపులు
ఈ స్కామ్లోని వారి చేతుల్లో 170 ఫోన్ల ధ్వంసం
కోర్టుకు సమర్పించిన అమిత్ అరోడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న ఈడీ
ఈనాడు - దిల్లీ
దిల్లీ మద్యం కేసులో భాగస్వామ్యం/అనుమానం ఉన్న 36 మంది పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అమిత్ అరోడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. ఈ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఆయనను ఈడీ మంగళవారం రాత్రి అరెస్టు చేసింది. బుధవారం ఇక్కడి కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా రిమాండ్ రిపోర్టు సమర్పించింది. వీరిలో తెలుగురాష్ట్రాలకు చెందిన కల్వకుంట్ల కవిత, శరత్రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్, సృజన్రెడ్డిలు ఉన్నారు.
ఈ కేసులో భాగస్వామ్యం/అనుమానం ఉన్న 36 మంది గత ఏడాది కాలంలో 170 ఫోన్లను ధ్వంసం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. వీరిలో తెలుగురాష్ట్రాలకు చెందిన అయిదుగురు 33 ఫోన్లను ధ్వంసం/మార్పు చేసినట్లు తెలిపింది. కల్వకుంట్ల కవిత 10, శరత్రెడ్డి 9, గోరంట్ల బుచ్చిబాబు 6, బోయినపల్లి అభిషేక్ 5, సృజన్రెడ్డి 3 ఫోన్లను ధ్వంసం/మార్పు చేసినట్లు పేర్కొంది. వారు ఏయే నంబర్ల ఫోన్లు వాడారు? వాటి ఐఎంఈఐ నంబర్లు ఏంటి? ఏయే తేదీల్లో వాటిని ధ్వంసం/మార్చారన్న వివరాలను ఈడీ కోర్టుకు ఇచ్చిన నివేదికలో సవివరంగా పేర్కొంది. ‘‘వేల కోట్ల రూపాయలతో ముడిపడిన ఈ కేసుకు సంబంధించి విలువైన సాక్ష్యాధారాలు, ముడుపులకు సంబంధించిన వివరాలున్న డిజిటల్ డేటాను ధ్వంసం చేశారు.
ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారం అటు మొబైల్ ఫోన్లలో కానీ, ల్యాప్టాప్ల్లో కానీ నిక్షిప్తమై ఉంది. అయితే కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే కేసును దర్యాప్తు సంస్థలకు అప్పగించడంతో ఈ మొత్తం వ్యవహారంలో భాగస్వాములైన/అనుమానితులుగా ఉన్న 36 మంది 170 ఫోన్లను ధ్వంసం చేశారు. ఈడీ అందులో 17 ఫోన్లను రికవరీ చేసింది. అన్నీ దొరికి ఉంటే ఈ కుంభకోణంలో చేతులుమారిన ముడుపులు మరిన్ని వెలుగులోకి వచ్చేవి. దొరికిన ఫోన్లలోనూ డేటాను డిలీట్ చేయడమో, ఫార్మాట్ చేయడమో జరిగింది. ఇన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోనూ ఈడీ ఎన్నో పరికరాలను విశ్లేషించి నేరనిరూపణకు సంబంధించిన సమాచారాన్ని వెలికితీసింది. అనుమానితుల్లో చాలామంది కుంభకోణం జరిగిన సమయంలో వాడిన ఫోన్లను మాత్రమే 2022 మే-ఆగస్టుల మధ్య మార్చారు. ఈ ఫోన్లలో మద్యం విధానం ఖరారు నుంచి అమలువరకు సమాచారం ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే అందులోని సమాచారాన్ని తీసుకోలేని విధంగా ధ్వంసం చేశారు. ఇందులో ప్రధాన అనుమానితులు, మద్యం వ్యాపారులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, దిల్లీ ఎక్సైజ్ మంత్రి ఉన్నారు. మరికొందరు పలుసార్లు తమ ఫోన్లను మార్చారు. అమిత్ అరోడా 11 ఫోన్లను వాడటం/మార్చడం/ధ్వంసం చేయడాన్ని బట్టి సాక్ష్యాల చెరిపివేతకు ప్రయత్నించినట్లు కనిపించింది’’ అని ఈడీ పేర్కొంది. ఈ కేసులో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియా 2021 అక్టోబరు 14 నుంచి 2022 సెప్టెంబరు మధ్యకాలంలో మొత్తం నాలుగు ఫోన్ నంబర్లను ఉయోగించినట్లు, 14 ఫోన్లు ధ్వంసం/మార్పు చేసినట్లు కాల్ డేటా రికార్డ్ ప్రకారం ఈడీ గుర్తించింది. వీరితోపాటు కైలాస్ గహ్లోత్, సన్నీ మార్వా, కుల్విందర్ మార్వా, విజయ్నాయర్, బృందాపాల్సింగ్, అమన్ధల్, సమీర్ మహేంద్రు, నితిన్ కపూర్, గీతిక మహేంద్రు, విభూతి శర్మ, వినోద్ చౌహాన్, అమిత్ అరోడా, సాహిల్ అరోడా, దీప్ మల్హోత్రా, రాజీందర్ చద్దా, అపర్ణ సూద్, దీపా చద్దా, రిషి బాలి, దినేష్ అరోడా, దీపేందర్ షెహ్రావత్, అరుణ్ పిళ్లై, అర్జున్పాండే, వైడంట్ చద్దా, బైభవ్కుమార్ (దిల్లీ సీఎం పీఏ), కర్మజిత్ లాంబా, ఉమేష్ పరాశర్, హరిందర్పాల్సింగ్, హర్జిత్ సింగ్, గౌతం ఎం, రోహిత్ చందరణ్ ఉన్నట్లు ఈడీ ఇందులో పేర్కొంది.
అక్రమార్జనకు ఆయుధం..దిల్లీ మద్యం విధానం: ఈడీ
దిల్లీ: ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి అక్రమార్జనకు పాల్పడేందుకు దిల్లీ మద్యం విధానాన్ని కొందరు నేతలు ఒక ఆయుధంలా వాడుకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. వేల కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించిన ఆధారాలు దొరకకుండా చూడడానికి నిందితులు తమ ఫోన్లను ధ్వంసం చేశారని బుధవారం స్థానిక న్యాయస్థానానికి తెలిపింది. ‘‘ఉద్దేశపూర్వక లొసుగులతో విధానాన్ని రూపొందించారు. అక్రమ కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేశారు. విధానాన్ని లోతుగా పరిశీలిస్తే విధానకర్తల దురుద్దేశాలేమిటనేది తెలుస్తుంది. నిజాయితీతో కూడిన వ్యాపార విధానాన్ని ప్రోత్సహించడమే ఈ విధానం ఉద్దేశమని గొప్పగా చెబుతున్నా నిజానికి దొడ్డిదారి సిండికేట్లను ఇది ప్రోత్సహించింది. ఆప్ నేతల నేరపూరిత కుట్రవల్ల అనైతిక కార్యకలాపాలకు ప్రోత్సాహం లభించింది. ఆప్ నేతల ప్రయోజనాల కోసం దిల్లీ ప్రభుత్వం రూ.581 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. లైసెన్సు ఫీజులు సహా అన్నింటి రూపేణా రూ.2,873 కోట్ల రెవెన్యూను ప్రభుత్వం నష్టపోయింది’’ అని ఈడీ పేర్కొంది. వ్యాపారవేత్త అమిత్ అరోడా రిమాండును కోరుతూ ఈ విషయాలు తెలిపింది. దరిమిలా డిసెంబరు 7 వరకు అరోడాను ఈడీ కస్టడీకి అప్పగిస్తున్నట్లు న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఐఎంఈఐని మూడుసార్లు మార్చిన దిల్లీ రవాణా మంత్రి కైలాస్ గహ్లోత్ తన మొబైల్ ఫోన్ ద్వారా చేసిన కాల్స్ వివరాలను ఈడీ సమర్పించింది.
సౌత్గ్రూప్ నుంచి ముడుపుల పంపిణీ ఇలా...
మద్యం కేసులో ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చిన సౌత్ గ్రూప్..శరత్రెడ్డి, కె.కవిత, వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిల నియంత్రణలో ఉన్నట్లు ఈడీ ఈ నివేదికలో పేర్కొంది. ఈ కుంభకోణంలో పీఎంఎల్ఏ కింద దర్యాప్తు చేపట్టినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. ‘‘హోల్ సేలర్స్కు ఇచ్చిన 12% ప్రాఫిట్ మార్జిన్లో అర్ధభాగాన్ని ఆప్ లీడర్లకు ముడుపుగా అప్పగించడానికి కేటాయించారు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు ప్రకారం విజయ్ నాయర్ ఆప్ నాయకుల తరఫున కనీసం రూ.100 కోట్ల ముడుపులను సౌత్గ్రూప్ నుంచి అమిత్ అరోడాతోపాటు వివిధ వ్యక్తుల ద్వారా అందుకున్నారు. ఆ విషయాన్ని ప్రస్తుతం అరెస్ట్ అయిన అమిత్ అరోడా తన స్టేట్మెంట్ల ద్వారా వెల్లడించారు’’ అని ఈడీ ఈ నివేదికలో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిరిండియా ఎక్స్ప్రెస్ ఆఫర్
-
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
-
ఎన్నికల ప్రక్రియ పవిత్రంగా ఉండాలి: సుప్రీంకోర్టు
-
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు