Delhi Liquor Case: దిల్లీ మద్యం కేసులో 36 మంది
దిల్లీ మద్యం కేసులో భాగస్వామ్యం/అనుమానం ఉన్న 36 మంది పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అమిత్ అరోడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. ఈ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఆయనను ఈడీ మంగళవారం రాత్రి అరెస్టు చేసింది.
ఆ జాబితాలో కల్వకుంట్ల కవిత, శరత్రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్, సృజన్రెడ్డిల పేర్లు
సౌత్గ్రూప్ ద్వారా ఆప్ లీడర్లకు రూ.100 కోట్ల ముడుపులు
ఈ స్కామ్లోని వారి చేతుల్లో 170 ఫోన్ల ధ్వంసం
కోర్టుకు సమర్పించిన అమిత్ అరోడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న ఈడీ
ఈనాడు - దిల్లీ
దిల్లీ మద్యం కేసులో భాగస్వామ్యం/అనుమానం ఉన్న 36 మంది పేర్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అమిత్ అరోడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొంది. ఈ కేసుతో సంబంధముందన్న అనుమానంతో ఆయనను ఈడీ మంగళవారం రాత్రి అరెస్టు చేసింది. బుధవారం ఇక్కడి కోర్టులో హాజరుపరిచిన సందర్భంగా రిమాండ్ రిపోర్టు సమర్పించింది. వీరిలో తెలుగురాష్ట్రాలకు చెందిన కల్వకుంట్ల కవిత, శరత్రెడ్డి, గోరంట్ల బుచ్చిబాబు, బోయినపల్లి అభిషేక్, సృజన్రెడ్డిలు ఉన్నారు.
ఈ కేసులో భాగస్వామ్యం/అనుమానం ఉన్న 36 మంది గత ఏడాది కాలంలో 170 ఫోన్లను ధ్వంసం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. వీరిలో తెలుగురాష్ట్రాలకు చెందిన అయిదుగురు 33 ఫోన్లను ధ్వంసం/మార్పు చేసినట్లు తెలిపింది. కల్వకుంట్ల కవిత 10, శరత్రెడ్డి 9, గోరంట్ల బుచ్చిబాబు 6, బోయినపల్లి అభిషేక్ 5, సృజన్రెడ్డి 3 ఫోన్లను ధ్వంసం/మార్పు చేసినట్లు పేర్కొంది. వారు ఏయే నంబర్ల ఫోన్లు వాడారు? వాటి ఐఎంఈఐ నంబర్లు ఏంటి? ఏయే తేదీల్లో వాటిని ధ్వంసం/మార్చారన్న వివరాలను ఈడీ కోర్టుకు ఇచ్చిన నివేదికలో సవివరంగా పేర్కొంది. ‘‘వేల కోట్ల రూపాయలతో ముడిపడిన ఈ కేసుకు సంబంధించి విలువైన సాక్ష్యాధారాలు, ముడుపులకు సంబంధించిన వివరాలున్న డిజిటల్ డేటాను ధ్వంసం చేశారు.
ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక సమాచారం అటు మొబైల్ ఫోన్లలో కానీ, ల్యాప్టాప్ల్లో కానీ నిక్షిప్తమై ఉంది. అయితే కుంభకోణం వెలుగులోకి వచ్చిన వెంటనే కేసును దర్యాప్తు సంస్థలకు అప్పగించడంతో ఈ మొత్తం వ్యవహారంలో భాగస్వాములైన/అనుమానితులుగా ఉన్న 36 మంది 170 ఫోన్లను ధ్వంసం చేశారు. ఈడీ అందులో 17 ఫోన్లను రికవరీ చేసింది. అన్నీ దొరికి ఉంటే ఈ కుంభకోణంలో చేతులుమారిన ముడుపులు మరిన్ని వెలుగులోకి వచ్చేవి. దొరికిన ఫోన్లలోనూ డేటాను డిలీట్ చేయడమో, ఫార్మాట్ చేయడమో జరిగింది. ఇన్ని ఇబ్బందికర పరిస్థితుల్లోనూ ఈడీ ఎన్నో పరికరాలను విశ్లేషించి నేరనిరూపణకు సంబంధించిన సమాచారాన్ని వెలికితీసింది. అనుమానితుల్లో చాలామంది కుంభకోణం జరిగిన సమయంలో వాడిన ఫోన్లను మాత్రమే 2022 మే-ఆగస్టుల మధ్య మార్చారు. ఈ ఫోన్లలో మద్యం విధానం ఖరారు నుంచి అమలువరకు సమాచారం ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే అందులోని సమాచారాన్ని తీసుకోలేని విధంగా ధ్వంసం చేశారు. ఇందులో ప్రధాన అనుమానితులు, మద్యం వ్యాపారులు, సీనియర్ ప్రభుత్వ అధికారులు, దిల్లీ ఎక్సైజ్ మంత్రి ఉన్నారు. మరికొందరు పలుసార్లు తమ ఫోన్లను మార్చారు. అమిత్ అరోడా 11 ఫోన్లను వాడటం/మార్చడం/ధ్వంసం చేయడాన్ని బట్టి సాక్ష్యాల చెరిపివేతకు ప్రయత్నించినట్లు కనిపించింది’’ అని ఈడీ పేర్కొంది. ఈ కేసులో దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోదియా 2021 అక్టోబరు 14 నుంచి 2022 సెప్టెంబరు మధ్యకాలంలో మొత్తం నాలుగు ఫోన్ నంబర్లను ఉయోగించినట్లు, 14 ఫోన్లు ధ్వంసం/మార్పు చేసినట్లు కాల్ డేటా రికార్డ్ ప్రకారం ఈడీ గుర్తించింది. వీరితోపాటు కైలాస్ గహ్లోత్, సన్నీ మార్వా, కుల్విందర్ మార్వా, విజయ్నాయర్, బృందాపాల్సింగ్, అమన్ధల్, సమీర్ మహేంద్రు, నితిన్ కపూర్, గీతిక మహేంద్రు, విభూతి శర్మ, వినోద్ చౌహాన్, అమిత్ అరోడా, సాహిల్ అరోడా, దీప్ మల్హోత్రా, రాజీందర్ చద్దా, అపర్ణ సూద్, దీపా చద్దా, రిషి బాలి, దినేష్ అరోడా, దీపేందర్ షెహ్రావత్, అరుణ్ పిళ్లై, అర్జున్పాండే, వైడంట్ చద్దా, బైభవ్కుమార్ (దిల్లీ సీఎం పీఏ), కర్మజిత్ లాంబా, ఉమేష్ పరాశర్, హరిందర్పాల్సింగ్, హర్జిత్ సింగ్, గౌతం ఎం, రోహిత్ చందరణ్ ఉన్నట్లు ఈడీ ఇందులో పేర్కొంది.
అక్రమార్జనకు ఆయుధం..దిల్లీ మద్యం విధానం: ఈడీ
దిల్లీ: ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి అక్రమార్జనకు పాల్పడేందుకు దిల్లీ మద్యం విధానాన్ని కొందరు నేతలు ఒక ఆయుధంలా వాడుకున్నారని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆరోపించింది. వేల కోట్ల రూపాయల ముడుపులకు సంబంధించిన ఆధారాలు దొరకకుండా చూడడానికి నిందితులు తమ ఫోన్లను ధ్వంసం చేశారని బుధవారం స్థానిక న్యాయస్థానానికి తెలిపింది. ‘‘ఉద్దేశపూర్వక లొసుగులతో విధానాన్ని రూపొందించారు. అక్రమ కార్యకలాపాలు సాగించేందుకు వీలుగా తగిన ఏర్పాట్లు చేశారు. విధానాన్ని లోతుగా పరిశీలిస్తే విధానకర్తల దురుద్దేశాలేమిటనేది తెలుస్తుంది. నిజాయితీతో కూడిన వ్యాపార విధానాన్ని ప్రోత్సహించడమే ఈ విధానం ఉద్దేశమని గొప్పగా చెబుతున్నా నిజానికి దొడ్డిదారి సిండికేట్లను ఇది ప్రోత్సహించింది. ఆప్ నేతల నేరపూరిత కుట్రవల్ల అనైతిక కార్యకలాపాలకు ప్రోత్సాహం లభించింది. ఆప్ నేతల ప్రయోజనాల కోసం దిల్లీ ప్రభుత్వం రూ.581 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది. లైసెన్సు ఫీజులు సహా అన్నింటి రూపేణా రూ.2,873 కోట్ల రెవెన్యూను ప్రభుత్వం నష్టపోయింది’’ అని ఈడీ పేర్కొంది. వ్యాపారవేత్త అమిత్ అరోడా రిమాండును కోరుతూ ఈ విషయాలు తెలిపింది. దరిమిలా డిసెంబరు 7 వరకు అరోడాను ఈడీ కస్టడీకి అప్పగిస్తున్నట్లు న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఐఎంఈఐని మూడుసార్లు మార్చిన దిల్లీ రవాణా మంత్రి కైలాస్ గహ్లోత్ తన మొబైల్ ఫోన్ ద్వారా చేసిన కాల్స్ వివరాలను ఈడీ సమర్పించింది.
సౌత్గ్రూప్ నుంచి ముడుపుల పంపిణీ ఇలా...
మద్యం కేసులో ఆప్ నేతలకు రూ.100 కోట్ల ముడుపులు ఇచ్చిన సౌత్ గ్రూప్..శరత్రెడ్డి, కె.కవిత, వైకాపా ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిల నియంత్రణలో ఉన్నట్లు ఈడీ ఈ నివేదికలో పేర్కొంది. ఈ కుంభకోణంలో పీఎంఎల్ఏ కింద దర్యాప్తు చేపట్టినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిపింది. ‘‘హోల్ సేలర్స్కు ఇచ్చిన 12% ప్రాఫిట్ మార్జిన్లో అర్ధభాగాన్ని ఆప్ లీడర్లకు ముడుపుగా అప్పగించడానికి కేటాయించారు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తు ప్రకారం విజయ్ నాయర్ ఆప్ నాయకుల తరఫున కనీసం రూ.100 కోట్ల ముడుపులను సౌత్గ్రూప్ నుంచి అమిత్ అరోడాతోపాటు వివిధ వ్యక్తుల ద్వారా అందుకున్నారు. ఆ విషయాన్ని ప్రస్తుతం అరెస్ట్ అయిన అమిత్ అరోడా తన స్టేట్మెంట్ల ద్వారా వెల్లడించారు’’ అని ఈడీ ఈ నివేదికలో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల