సంక్షిప్త వార్తలు(8)
ఉత్తర, తూర్పు భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
రేపు రాష్ట్రంలో ఓ మోస్తరు వర్షాలు
ఈనాడు, హైదరాబాద్: ఉత్తర, తూర్పు భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయి. శుక్రవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం మధ్యాహ్నం పొడివాతావరణం ఉంటుంది. ఉత్తర గాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణంకన్నా 3 నుంచి 4 డిగ్రీలు పడిపోతున్నందున చలి ఎక్కువగా ఉంటోంది. బుధవారం తెల్లవారుజామున రాష్ట్రంలోకెల్లా అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా మంగళపల్లిలో 8.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గ్రేటర్ హైదరాబాద్ నగర శివారు చుట్టుపక్కల ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంటోంది. నగరంలో కాలుష్యం, భవనాల వల్ల చలి కాస్త తక్కువగా ఉంటోంది.
నేటి వరకూ ఎంబీబీఎస్ యాజమాన్య కోటా ప్రవేశాలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటాలో ఎంబీబీఎస్ సీట్లకు వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించాలని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది. బుధవారం రాత్రి 7 గంటల నుంచి గురువారం రాత్రి 7 గంటల వరకూ అభ్యర్థులు ప్రాధాన్యక్రమంలో కళాశాలల వారీగా వెబ్ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చని ఆరోగ్య వర్సిటీ ఒక ప్రకటనలో తెలిపింది.
3న వైద్యుల బదిలీలు
ఈనాడు, హైదరాబాద్: ప్రజారోగ్య సంచాలకుల పరిధిలోని వైద్యుల ప్రత్యేక బదిలీల ప్రక్రియను ఈనెల 3న కోఠిలోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కౌన్సెలింగ్ ద్వారా వీటిని నిర్వహించనున్నారు. ప్రత్యేక అర్హత కలిగిన వైద్యులు ఈనెల 25లోగా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల పరిశీలన అనంతరం బదిలీలను చేపట్టాలని నిర్ణయిస్తూ ప్రజారోగ్య సంచాలకులు జి.శ్రీనివాసరావు అంతర్గత ఉత్తర్వులు జారీచేశారు. అభ్యర్థులందరూ ఒరిజనల్ ధ్రువపత్రాలతో కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు.
బియ్యం గడువు మరో నెల పొడిగింపు
ఈనాడు, హైదరాబాద్: గడిచిన ఏడాది వానాకాలం, యాసంగి వ్యవసాయ సీజన్లకు సంబంధించి బియ్యం ఇవ్వాల్సిన గడువును మరో నెల పొడిగిస్తూ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థకు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. 2021-22 వానాకాల సీజను బియ్యం ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన గడువు నవంబరు 30తో ముగిసింది. మరో నెల పొడిగించాల్సిందిగా నవంబరు 19న రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయడంతో కేంద్రం సానుకూలంగా స్పందించి నెల రోజుల గడువు పొడిగించింది. గత యాసంగికి సంబంధించి పొడిగించిన గడువు కూడా బుధవారంతో ముగియనుండటంతో మరో నెల పొడిగించాలంటూ నవంబరు 17న రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. గడువును డిసెంబరు 31 వరకు పొడిగిస్తూ కేంద్రం వేరువేరుగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఉపకార వేతనాల రద్దు సరికాదు: యూటీఎఫ్
ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా 1-8వ తరగతి చదివే పేద విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలను ఈ విద్యా సంవత్సరం కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడాన్ని టీఎస్యూటీఎఫ్ ఖండించింది. విద్యాహక్కు చట్టం కింద నిర్బంధ ఉచిత విద్య అందిస్తున్నామన్న సాకుతో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉపకరించే కొద్దిపాటి సహాయాన్ని కూడా నిలిపివేయాలని నిర్ణయించడం దారుణమని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆప్తాల్మిక్ అధికారుల నియామకాలకు మార్గదర్శకాలు
ఈనాడు, హైదరాబాద్: ‘కంటి వెలుగు’లో భాగంగా ఆప్తాల్మిక్ అధికారుల నియామకాలను ప్రభుత్వం వేగవంతం చేసింది. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రారంభం కానుండడంతో..యుద్ధప్రాతిపదికన సిబ్బందిని నియమించడంపై దృష్టిపెట్టింది. కంటి వెలుగు విజయవంతం కావడానికి మొత్తం 1,491 బృందాలను ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 1500 మంది ఆప్తాల్మిక్ అధికారులను నియమించాల్సి ఉండడంతో సంబంధిత మార్గదర్శకాలను బుధవారం విడుదల చేసింది. నియామక బాధ్యతలను జిల్లా కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీలకు అప్పగించింది. ఇంటర్వ్యూ విధానంలో నియామకాలు జరుగుతాయి. గురువారం(1వ తేదీ) నాడు జిల్లాల్లో నియామక ప్రకటనలు ఇస్తారు. 5న నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. 7న అర్హుల జాబితా ప్రకటిస్తారు. అభ్యర్థుల నుంచి ఏమైనా అభ్యంతరాలుంటే 8వ తేదీలోపు స్వీకరిస్తారు. తుది అర్హుల జాబితాను ఈనెల 10న వెల్లడిస్తారు. ఒక్కొక్కరికి నెలకు రూ.30వేల వేతనాన్ని చెల్లిస్తారు.
7 వరకూ ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కన్వీనర్ కోటా సీట్లకు దరఖాస్తులు
ఈనాడు, హైదరాబాద్: ఎంఎస్సీ నర్సింగ్, ఎంపీటీ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్యవర్సిటీ బుధవారం ప్రకటన విడుదల చేసింది. ఈనెల 1న ఉదయం 8 గంటల నుంచి 7న సాయంత్రం 6 గంటల వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది అర్హుల జాబితాను విడుదల చేస్తారు.
పుంజుకోని యాసంగి సాగు
5.76 లక్షల ఎకరాల్లోనే పంటలు
వ్యవసాయ శాఖ తాజా నివేదిక
ఈనాడు, హైదరాబాద్: ప్రస్తుత యాసంగి సీజన్ ప్రారంభమై దాదాపు రెండు నెలలు దాటినా రాష్ట్రంలో పంటల సాగు ఇంకా పుంజుకోలేదు. సాధారణంకన్నా 75 వేల ఎకరాలు తక్కువగా సాగైనట్లు వ్యవసాయ శాఖ బుధవారం ప్రభుత్వానికి ఇచ్చిన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ సీజన్లో అన్నిరకాల పంటలు కలిపి 47.85 లక్షల ఎకరాల్లో వేయాలి. బుధవారం నాటికి 6.50 లక్షల ఎకరాల్లో సాగు అవ్వాల్సి ఉండగా.. 5.75 లక్షల ఎకరాలకే పరిమితమైంది. రాష్ట్రంలో అత్యధికంగా 33.53 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 5,028 ఎకరాల్లోనే నాట్లు పడ్డాయి. ప్రధాన పంటలేవీ సాధారణ స్థాయిలో సాగుకాలేదు. పంటల సాగుకు డిసెంబరు నెలాఖరు దాకా సమయం ఉందని, ఆ లోపు సాగు విస్తీర్ణం సాధారణ స్థాయికి చేరుకుంటుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గత వానాకాలం పంటల కోతలు ఇంకా పూర్తికాలేదని, అవి పూర్తయితే యాసంగి సాగు పుంజుకుంటుందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. గత జూన్ నుంచి బుధవారం నాటికి సాధారణ వర్షపాతం 840 మిల్లీమీటర్ల(మి.మీ.)కు గాను 1217 మి.మీ.లు కురిసింది. భూగర్భ జలమట్టాలు పెరిగినందున వరి.. సాధారణంకన్నా అధిక విస్తీర్ణంలో సాగు అయ్యే అవకాశముంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటివరకు మొక్కజొన్న 96,030, సెనగ 2.65 లక్షలు, వేరుసెనగ 1.31 లక్షల ఎకరాల్లో వేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం