డ్రైవర్ రహిత కార్లు ఇప్పుడే కాదు
కృత్రిమమేధతో నడిచే... డ్రైవర్ లేని స్వయం చోదిత వాహనాలు వచ్చేస్తున్నాయనే ప్రచారం ఇటీవల బాగా జరుగుతోంది. నిర్లక్ష్యపు డ్రైవర్లు, మద్యం తాగి వాహనాలు నడిపేవారి నుంచి విముక్తి లభిస్తుందన్న అంచనాలు జోరుగా వ్యక్తమవుతున్నాయి.
పూర్తిస్థాయిలో సాకారానికి ఇంకా అనేక సవాళ్లు
‘ఈనాడు’తో ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీ ఏఐ ప్రొఫెసర్ కె.సుబ్బారావు
కృత్రిమమేధతో నడిచే... డ్రైవర్ లేని స్వయం చోదిత వాహనాలు వచ్చేస్తున్నాయనే ప్రచారం ఇటీవల బాగా జరుగుతోంది. నిర్లక్ష్యపు డ్రైవర్లు, మద్యం తాగి వాహనాలు నడిపేవారి నుంచి విముక్తి లభిస్తుందన్న అంచనాలు జోరుగా వ్యక్తమవుతున్నాయి. దిగ్గజ కంపెనీల హామీలే ఇందుకు కారణం. అయితే ఇది సులువేమీ కాదంటున్నారు... కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)లో అంతర్జాతీయ నిపుణులు ఆచార్య కె.సుబ్బారావు. అమెరికాలోని ఆరిజోనా స్టేట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఆయన ‘ఈనాడు’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో స్వయం చోదక వాహనాలు, కృత్రిమమేధపై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
కృత్రిమ మేధను ఉపయోగించి రోడ్డు ప్రమాదాలను సగానికి తగ్గించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకొంది. ఏఐ నిపుణుడిగా దీనిపై మీ విశ్లేషణేంటి?
ఏకాగ్రతలో లోపాల వల్ల కలిగే రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ‘ప్రిడిక్టివ్ ఏఐ నమూనాలు’ కచ్చితంగా ఉపయోగపడతాయి. అనేక ఆధునిక వాహనాల్లో ఇప్పటికే పాక్షికంగా డ్రైవర్కు తోడ్పాటు అందించే వ్యవస్థలు ఉన్నాయి. ఇలాంటివి బ్లైండ్ స్పాట్ వంటివాటిని గుర్తించేలా చోదకులను అప్రమత్తం చేస్తాయి. హమ్సేఫర్ వంటి యాప్లు అమెరికా తదితర దేశాల్లో వినియోగంలో ఉన్నాయి. ప్రధానంగా ఆటోమోటివ్ బీమా కంపెనీలు వీటిని ఉపయోగిస్తున్నాయి. డ్రైవర్ను పర్యవేక్షించడం, తదనుగుణంగా అప్రమత్తం చేయడం చాలా ప్రయోజనకరమే. అయితే చోదకుడి వ్యవహారశైలిని ఎప్పటికప్పుడు నిశితంగా పర్యవేక్షించడం, దాని ఆధారంగా డ్రైవర్లకు రేటింగ్ ఇవ్వడం వల్ల వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ)కు సంబంధించిన అనేక సమస్యలు తలెత్తుతాయి.
రోడ్డుపై భద్రత కోసం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న ఇతర ఏఐ పరిజ్ఞానాలేంటి?
డ్రైవింగ్ తోడ్పాటు వ్యవస్థలను ఆరు విభాగాలుగా చూస్తాం. ఇందులో ‘సున్నా’ అంటే ఎలాంటి ఆటోమేషన్ లేదన్నమాట! లెవల్ 5 అంటే స్వయంచోదక వాహనం. అయితే ప్రజల దృష్టి ఎక్కువగా లెవల్ 4, 5 ఆటోమేషన్పై ఉంటోంది. టెస్లా వంటి కంపెనీలు ఇచ్చిన భారీ హామీలే ఇందుకు కారణం. కానీ ఇవేవీ పూర్తిగా ఆచరణలోకి రాలేదు. కొన్నేళ్లుగా లెవల్ 1-3 స్థాయిలో చాలా పురోగతి చోటుచేసుకుంది. ఏఐ సాయంతో డ్రైవర్లకు తోడ్పాటు అందించడం, నిర్దిష్ట సమయాల్లో అప్రమత్తం చేయడం వంటివి వీటి కింద జరుగుతున్నాయి. ప్రమాదం, వాహనం టైర్లు జారిపోయే (స్కిడ్) ముప్పులను గుర్తించినప్పుడు అవి స్వయం ప్రతిపత్తి మోడ్ (అటానమస్)లోకి వెళుతున్నాయి.
విద్యుత్ వాహనాలే (ఈవీ) భవిష్యత్ రవాణా సాధనాలు. వీటిలో భద్రతను పెంచడానికి ఏఐ తోడ్పడుతుందా?
నిజానికి డ్రైవర్ భద్రత, డ్రైవింగ్ తోడ్పాటు వంటి అంశాలకు వాహన ఇంజిన్తో చాలా వరకూ సంబంధం ఉండదు. ఇంధన సమర్థత, పర్యావరణానికి మేలు దృష్ట్యానే ఈవీలను తెస్తున్నారు. డ్రైవింగ్ తోడ్పాటు సాంకేతికతలను చాలావరకూ ఈవీలను దృష్టిలో పెట్టుకొని తయారు చేయడం యాదృచ్ఛికమే. ఈవీలు అందుబాటులోకి వచ్చిన అనేక దేశాల్లో వాహన ధర అంశంపై వినియోగదారులకు పట్టింపు లేకపోవడమే ఇందుకు కారణం. సైద్ధాంతికంగా చూస్తే ఏఐ సాంకేతికతలన్నింటినీ ప్రామాణిక ఇంజిన్లకూ అమర్చవచ్చు.
డ్రైవర్ రహిత వాహనాల ఉత్పత్తి, వినియోగానికి అమెరికా నియంత్రణ సంస్థలు అనుమతించాయి. కృత్రిమ మేధలో ఇటీవల అనేక ఆధునిక పోకడలు వచ్చినా.. డ్రైవర్రహిత వాహనాలు తమ సామర్థ్యాన్ని రుజువు చేసుకోలేదు. నిజమైన స్వయంచోదక వాహనాలు రోడ్లపైకి ఎప్పుడు వచ్చే వీలుంది?
టెస్లా, గూగుల్ వేమో వంటి కంపెనీలు ఎంతగా ఊరిస్తున్నప్పటికీ లెవల్-4, 5 స్థాయి స్వయం చోదక వాహనాలు రావడానికి చాలా సమయం పడుతుంది. ఎన్నో ఏళ్లుగా రూపకల్పనలో ఉన్నప్పటికీ గూగుల్ వేమో అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లోనే స్వయం చోదక ట్యాక్సీలను తెచ్చింది. ఇక్కడ సమస్యేంటంటే.. ప్రామాణికీకరించిన అమెరికా వంటి దేశాల్లోని రోడ్లపైనే ఆకస్మికంగా అనేక ఘటనలు జరగొచ్చు. రోడ్డు క్రమశిక్షణ పెద్దగా పాటించని భారత్ వంటి చోట్ల పరిస్థితి ఇక చెప్పనక్కర్లేదు. అమెరికా లాంటి దేశాల్లోనే ఏఐ వ్యవస్థలకు సురక్షితమైన శిక్షణ ఇవ్వడం కష్టం. ఒకవేళ స్వయం చోదక వాహనాలు వచ్చినా అవి మొదట.. పాదచారులు, ఇతర అవరోధాలు ఎక్కువగా ఉండే నగరంలోని రోడ్లపై కాకుండా సిటీ వెలుపల హైవేలపై సాగే సుదీర్ఘ ప్రయాణాల కోసం అందుబాటులోకి రావొచ్చు.
స్వయంచోదక వాహనాలు రోడ్లపై ఉన్న లేన్ మార్కర్లను గమనంలోకి తీసుకోవడం ద్వారా అదే లేన్లో ప్రయాణిస్తాయని చెబుతున్నారు. భారత్లో ఈ మార్కర్లే కాదు.. కొన్నిసార్లు రోడ్లు కూడా ఉండవు కదా..!
లేన్ మార్కింగ్లు పెద్ద సమస్యేమీ కాదు. ‘డార్పా’ సంస్థ.. స్వయంచోదక వాహనాల కోసం అమెరికాలోని నెవాడా ఎడారిలో పోటీ నిర్వహించింది. అక్కడ ప్రామాణిక మార్కింగ్లతో కూడిన రోడ్లేమీ లేవు. ఏఐ తోడ్పాటు ఉన్న వాహనాలు తమ ముందు, పక్కన, వెనుక ఉన్న వాహనాలు ఎంత దూరంలో ఉన్నాయన్నది పరిశీలిస్తూనే ఉంటాయి. సమస్యేమిటంటే.. రోడ్లపైన జరిగే అనూహ్య ఘటనలే. స్వేచ్ఛగా సంచరించే పశువులు, ట్రాఫిక్ను పట్టించుకోకుండా ఇష్టారీతిన రోడ్డును దాటే పాదచారులతో పెద్ద సవాళ్లు పొంచి ఉంటాయి.
భారతీయ వాహనాల్లోని ఏఐ వ్యవస్థలపై మీ విశ్లేషణేంటి?
లెవల్-1, 2 డ్రైవర్ తోడ్పాటు సామర్థ్యాలు క్రమంగా భారతీయ వాహనాల్లోకీ వస్తాయి. ఇది డబ్బుతో ముడిపడిన వ్యవహారం. అయినా వినియోగదారులు కోరుకుంటే తయారీదారులు ఆ సౌకర్యాలను కల్పిస్తారు.
రోడ్డు ప్రమాదం జరగబోతోందని డ్రైవర్ను హెచ్చరించడానికి వాహనాల డిజైన్లో ఎలాంటి అంశాలను జోడించాలి?
రోడ్డు స్థితిగతులను, ఇతర వాహనాలకు, పాదచారులకు, అవరోధాలకు మన వాహనం ఎంత సమీపంగా ఉంది వంటి అంశాలను పర్యవేక్షించే ఏఐ సాధనాలు వస్తున్నాయి. అలాగే వాహన స్థితికి సంబంధించిన అంశాల (స్కిడ్డింగ్ వంటివి)పై నిరంతరం కన్నేసి ఉంచే పరిజ్ఞానాలను జోడిస్తున్నారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ