CM KCR: ప్రధానే ప్రభుత్వాన్ని కూల్చేస్తానన్నారు
‘‘తెలంగాణలో ఏ ప్రాంతమైనా మనదే అని మంత్రులు, ఎమ్మెల్యేలతో నేను చెబుతాను. కానీ, ఒక రాష్ట్రం బాగుపడితే కేంద్రం దానికి అడ్డుపడుతుందా? దేశ ప్రధాని చేయాల్సిన పనేనా ఇది.
ఆ స్థాయి వ్యక్తి అనాల్సిన మాటేనా ఇది
తెరాసను అస్థిరపరచాలని చూసిన వారిని జైలులో వేశాం
దేశం బాగుకు తెలంగాణ నుంచే పునాదులు
మహబూబ్నగర్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
ఈనాడు డిజిటల్ - మహబూబ్నగర్
‘‘తెలంగాణలో ఏ ప్రాంతమైనా మనదే అని మంత్రులు, ఎమ్మెల్యేలతో నేను చెబుతాను. కానీ, ఒక రాష్ట్రం బాగుపడితే కేంద్రం దానికి అడ్డుపడుతుందా? దేశ ప్రధాని చేయాల్సిన పనేనా ఇది. ‘కేసీఆర్! నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తా’ అని ప్రధాని స్వయంగా అన్నారు. దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి. ఆ స్థాయి వ్యక్తి అనాల్సిన మాటలేనా? మీరు ఎలా గెలిచారో.. మేమూ అలానే గెలిచాం. మాకు ప్రజలు ఓట్లు వేయకుండానే గెలిచామా? ఏ కారణంతో కూలగొడతారు? బెంగాల్కు వెళ్లి మమతా బెనర్జీ పార్టీ ఎమ్మెల్యేలు 40 మంది టచ్లో ఉన్నారని చెప్పారు. ఓ ప్రధానమంత్రి అలా చెప్పవచ్చా?’’అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ శివారులో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని, తెరాస జిల్లా కార్యాలయాన్ని సీఎం ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ‘‘ఈ దేశం కోసమేనా మనం కలలు కన్నది. నాడు మహాత్ముడు, అనేక మంది సమరయోధులు స్వాతంత్య్రం తీసుకొచ్చింది దీని కోసమేనా? ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసమేనా? చిల్లర రాజకీయాలు కోసం ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. ప్రజల మధ్య చీలిక తెచ్చి విద్వేషాలు, భావోద్వేగాలు తెస్తున్నారు. ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయిస్తున్నారు. హైదరాబాద్లో దొంగలు పడ్డారు. తెరాస ఎమ్మెల్యేలను చీల్చి, పుల్లలు పెట్టి.. ఇక్కడ అస్థిరపరచాలని చూస్తే దొరకబట్టి జైలులో వేశాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తేనే ఈ దేశం అన్ని రకాలుగా బాగుపడుతుందని.. కానీ కేంద్రంలో ఆ పద్ధతి లేదని, సహకారం అంతకన్నా లేదని సీఎం ధ్వజమెత్తారు. తాను చెప్పే విషయాలు దినపత్రికలు, టీవీల్లో వస్తున్నాయని, మేధావులూ చెబుతున్నారని చెప్పారు.
కృష్ణాలో వాటా తేల్చాలంటే సమాధానం లేదు..
‘‘నాడు కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడున్న ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు జిల్లాలో సభలు పెట్టి మేము అభివృద్ధి చేస్తామంటే.. మేము చేస్తామన్నారు. వాళ్లు చెప్పేవన్నీ ‘పైన పటారం లోన లొటారం’ మాదిరిగా ఉంటాయి. పాలమూరు కరవు జిల్లా.. నల్గొండ ఫ్లోరైడ్ జిల్లా.. రంగారెడ్డి ఎండిపోయిన జిల్లా. ఈ 3 జిల్లాలతో సంబంధం ఉన్న కృష్ణానదిలో మా వాటా తేల్చాలని 150 దరఖాస్తులు పెట్టాను. కేంద్రానికి దండం పెట్టినా.. కడుపులో తలపెట్టి అడిగినా.. ఇప్పటివరకు సమాధానమే లేదు. వాటా తేల్చడానికే ఎనిమిదేళ్లయితే నిధులు ఎప్పుడు రావాలి? ప్రాజెక్టులు ఎప్పుడు కట్టాలి? నీళ్లెప్పుడు రావాలి? తెలంగాణ ఏర్పడిన రోజు మన బడ్జెట్ రూ.62 వేల కోట్లు. ఈ రోజు రూ.2.50లక్షల కోట్లు. జీఎస్డీపీ రూ.5.50లక్షల కోట్ల నుంచి రూ. 11.50లక్షల కోట్లకు పెరిగింది.
ఓట్లు అడగనని చెప్పాను..
కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడుతూ అయిదేళ్లలో మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పాను. 24 గంటల కరెంట్ రెండేళ్లలో ఇచ్చి తీరుతామని చెప్పాం. రెండేళ్లలో 24 గంటల కరెంట్ ఇస్తే తాను కూడా గులాబీ కండువా కప్పుకొంటానని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డి సవాల్ చేశారు. కర్షకుల కోసం రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్తు పథకాలు తీసుకొచ్చాం. నా తెలంగాణ రైతు దేశంలోనే కాలర్ ఎగరేసి.. దర్జాగా.. అప్పులు లేకుండా ఉండాలి. ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. దేశంలో ఎక్కడైనా మన రాష్ట్రంలో ఉన్నట్లు మంచినీళ్ల పథకం ఉందా? ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా తాగడానికి నీళ్లు లేవు. 24 గంటల విద్యుత్తుండదు. దేశ రాజధాని దిల్లీలో కరెంట్ కోతలున్నాయి. మంచి నీళ్లు రావు’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎంపీలు రాములు, శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు అబ్రహం, అంజయ్యయాదవ్, జైపాల్యాదవ్, బాలరాజు, హర్షవర్ధన్రెడ్డి, లక్ష్మారెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్, ఎమ్మెల్సీ వాణీదేవి తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం తీరుతో రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల నష్టం
తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్న విధంగానే కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేసి ఉంటే రాష్ట్ర జీఎస్డీపీ రూ.11.50 లక్షల కోట్లు కాదు.. రూ.14.50 లక్షల కోట్లుండేది. అసమర్థ కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్రం రూ.3 లక్షల కోట్లు నష్టపోయింది.
సీఎం కేసీఆర్
భారాసకు పోదామా...!
నేను మీతో ఉంటాను. మీరు కూడా నాతో ఉండాలి. ఆశీర్వదించాలి. అందరం కలిసి అద్భుతమైన పనులు చేసుకోవాలి. వలసలు పోయినవారు వాపస్ వస్తున్నారు. రైతాంగం తేటపడుతోంది. మనం ఒక్కరం బాగుపడితే కాదు.. దేశం కూడా బాగుపడాలి. అందుకోసం తెలంగాణ తరఫున జాతీయ రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషిద్దామా? వద్దా? భారాసకు పోదామా? తెలంగాణలా దేశాన్ని బాగు చేయడానికి భగవంతుడు ఇచ్చిన సర్వశక్తులొడ్డి ముందుకు పోదాం. అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి ఈ గడ్డ నుంచే పునాదులు వేసి మన పేరు బంగారు అక్షరాలతో లిఖిద్దాం.
ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రజలు ఎవరికి అధికారమిస్తే వారు పనిచేయాలి
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి అధికారమిస్తే వారు పనిచేయాలి. ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాలి. మళ్లీ ప్రజా కోర్టులోనే తేల్చుకోవాలి. కానీ పనిచేసేవాళ్లను చేయనియ్యబోమన్న చందంగా కేంద్రం వ్యవహరిస్తోంది. మన చుట్టూ ఏం జరుగుతోందో యువకులు, మేధావులు, పెద్దలు తెలుసుకోవాలి. చైతన్యవంతమైన సమాజం ఉంటేనే అద్భుతమైన ఫలితాలొస్తాయి. ఈ అంశంపై గ్రామాల్లో చర్చ పెట్టాలి.
సీఎం కేసీఆర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?