CM KCR: ప్రధానే ప్రభుత్వాన్ని కూల్చేస్తానన్నారు
‘‘తెలంగాణలో ఏ ప్రాంతమైనా మనదే అని మంత్రులు, ఎమ్మెల్యేలతో నేను చెబుతాను. కానీ, ఒక రాష్ట్రం బాగుపడితే కేంద్రం దానికి అడ్డుపడుతుందా? దేశ ప్రధాని చేయాల్సిన పనేనా ఇది.
ఆ స్థాయి వ్యక్తి అనాల్సిన మాటేనా ఇది
తెరాసను అస్థిరపరచాలని చూసిన వారిని జైలులో వేశాం
దేశం బాగుకు తెలంగాణ నుంచే పునాదులు
మహబూబ్నగర్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
ఈనాడు డిజిటల్ - మహబూబ్నగర్
‘‘తెలంగాణలో ఏ ప్రాంతమైనా మనదే అని మంత్రులు, ఎమ్మెల్యేలతో నేను చెబుతాను. కానీ, ఒక రాష్ట్రం బాగుపడితే కేంద్రం దానికి అడ్డుపడుతుందా? దేశ ప్రధాని చేయాల్సిన పనేనా ఇది. ‘కేసీఆర్! నీ ప్రభుత్వాన్ని కూల్చేస్తా’ అని ప్రధాని స్వయంగా అన్నారు. దీన్ని ఏమని అర్థం చేసుకోవాలి. ఆ స్థాయి వ్యక్తి అనాల్సిన మాటలేనా? మీరు ఎలా గెలిచారో.. మేమూ అలానే గెలిచాం. మాకు ప్రజలు ఓట్లు వేయకుండానే గెలిచామా? ఏ కారణంతో కూలగొడతారు? బెంగాల్కు వెళ్లి మమతా బెనర్జీ పార్టీ ఎమ్మెల్యేలు 40 మంది టచ్లో ఉన్నారని చెప్పారు. ఓ ప్రధానమంత్రి అలా చెప్పవచ్చా?’’అని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ శివారులో కొత్తగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని, తెరాస జిల్లా కార్యాలయాన్ని సీఎం ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంవీఎస్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడారు. ‘‘ఈ దేశం కోసమేనా మనం కలలు కన్నది. నాడు మహాత్ముడు, అనేక మంది సమరయోధులు స్వాతంత్య్రం తీసుకొచ్చింది దీని కోసమేనా? ఈ దిక్కుమాలిన రాజకీయాల కోసమేనా? చిల్లర రాజకీయాలు కోసం ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నారు. ప్రజల మధ్య చీలిక తెచ్చి విద్వేషాలు, భావోద్వేగాలు తెస్తున్నారు. ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయిస్తున్నారు. హైదరాబాద్లో దొంగలు పడ్డారు. తెరాస ఎమ్మెల్యేలను చీల్చి, పుల్లలు పెట్టి.. ఇక్కడ అస్థిరపరచాలని చూస్తే దొరకబట్టి జైలులో వేశాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సమానంగా కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేస్తేనే ఈ దేశం అన్ని రకాలుగా బాగుపడుతుందని.. కానీ కేంద్రంలో ఆ పద్ధతి లేదని, సహకారం అంతకన్నా లేదని సీఎం ధ్వజమెత్తారు. తాను చెప్పే విషయాలు దినపత్రికలు, టీవీల్లో వస్తున్నాయని, మేధావులూ చెబుతున్నారని చెప్పారు.
కృష్ణాలో వాటా తేల్చాలంటే సమాధానం లేదు..
‘‘నాడు కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడున్న ప్రధాని నరేంద్ర మోదీ పాలమూరు జిల్లాలో సభలు పెట్టి మేము అభివృద్ధి చేస్తామంటే.. మేము చేస్తామన్నారు. వాళ్లు చెప్పేవన్నీ ‘పైన పటారం లోన లొటారం’ మాదిరిగా ఉంటాయి. పాలమూరు కరవు జిల్లా.. నల్గొండ ఫ్లోరైడ్ జిల్లా.. రంగారెడ్డి ఎండిపోయిన జిల్లా. ఈ 3 జిల్లాలతో సంబంధం ఉన్న కృష్ణానదిలో మా వాటా తేల్చాలని 150 దరఖాస్తులు పెట్టాను. కేంద్రానికి దండం పెట్టినా.. కడుపులో తలపెట్టి అడిగినా.. ఇప్పటివరకు సమాధానమే లేదు. వాటా తేల్చడానికే ఎనిమిదేళ్లయితే నిధులు ఎప్పుడు రావాలి? ప్రాజెక్టులు ఎప్పుడు కట్టాలి? నీళ్లెప్పుడు రావాలి? తెలంగాణ ఏర్పడిన రోజు మన బడ్జెట్ రూ.62 వేల కోట్లు. ఈ రోజు రూ.2.50లక్షల కోట్లు. జీఎస్డీపీ రూ.5.50లక్షల కోట్ల నుంచి రూ. 11.50లక్షల కోట్లకు పెరిగింది.
ఓట్లు అడగనని చెప్పాను..
కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడుతూ అయిదేళ్లలో మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పాను. 24 గంటల కరెంట్ రెండేళ్లలో ఇచ్చి తీరుతామని చెప్పాం. రెండేళ్లలో 24 గంటల కరెంట్ ఇస్తే తాను కూడా గులాబీ కండువా కప్పుకొంటానని నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న జానారెడ్డి సవాల్ చేశారు. కర్షకుల కోసం రైతుబంధు, రైతు బీమా, ఉచిత విద్యుత్తు పథకాలు తీసుకొచ్చాం. నా తెలంగాణ రైతు దేశంలోనే కాలర్ ఎగరేసి.. దర్జాగా.. అప్పులు లేకుండా ఉండాలి. ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. దేశంలో ఎక్కడైనా మన రాష్ట్రంలో ఉన్నట్లు మంచినీళ్ల పథకం ఉందా? ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా తాగడానికి నీళ్లు లేవు. 24 గంటల విద్యుత్తుండదు. దేశ రాజధాని దిల్లీలో కరెంట్ కోతలున్నాయి. మంచి నీళ్లు రావు’’ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి, ఎంపీలు రాములు, శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు అబ్రహం, అంజయ్యయాదవ్, జైపాల్యాదవ్, బాలరాజు, హర్షవర్ధన్రెడ్డి, లక్ష్మారెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్, ఎమ్మెల్సీ వాణీదేవి తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం తీరుతో రాష్ట్రానికి రూ.3 లక్షల కోట్ల నష్టం
తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తున్న విధంగానే కేంద్ర ప్రభుత్వం కూడా పనిచేసి ఉంటే రాష్ట్ర జీఎస్డీపీ రూ.11.50 లక్షల కోట్లు కాదు.. రూ.14.50 లక్షల కోట్లుండేది. అసమర్థ కేంద్ర ప్రభుత్వం వల్ల రాష్ట్రం రూ.3 లక్షల కోట్లు నష్టపోయింది.
సీఎం కేసీఆర్
భారాసకు పోదామా...!
నేను మీతో ఉంటాను. మీరు కూడా నాతో ఉండాలి. ఆశీర్వదించాలి. అందరం కలిసి అద్భుతమైన పనులు చేసుకోవాలి. వలసలు పోయినవారు వాపస్ వస్తున్నారు. రైతాంగం తేటపడుతోంది. మనం ఒక్కరం బాగుపడితే కాదు.. దేశం కూడా బాగుపడాలి. అందుకోసం తెలంగాణ తరఫున జాతీయ రాజకీయాల్లో కూడా చురుకైన పాత్ర పోషిద్దామా? వద్దా? భారాసకు పోదామా? తెలంగాణలా దేశాన్ని బాగు చేయడానికి భగవంతుడు ఇచ్చిన సర్వశక్తులొడ్డి ముందుకు పోదాం. అద్భుతమైన భారతదేశ నిర్మాణానికి ఈ గడ్డ నుంచే పునాదులు వేసి మన పేరు బంగారు అక్షరాలతో లిఖిద్దాం.
ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రజలు ఎవరికి అధికారమిస్తే వారు పనిచేయాలి
ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎవరికి అధికారమిస్తే వారు పనిచేయాలి. ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాలి. మళ్లీ ప్రజా కోర్టులోనే తేల్చుకోవాలి. కానీ పనిచేసేవాళ్లను చేయనియ్యబోమన్న చందంగా కేంద్రం వ్యవహరిస్తోంది. మన చుట్టూ ఏం జరుగుతోందో యువకులు, మేధావులు, పెద్దలు తెలుసుకోవాలి. చైతన్యవంతమైన సమాజం ఉంటేనే అద్భుతమైన ఫలితాలొస్తాయి. ఈ అంశంపై గ్రామాల్లో చర్చ పెట్టాలి.
సీఎం కేసీఆర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా