అవిశ్వాసాల అలజడి
రాష్ట్రంలోని పలు పురపాలికల్లో అవిశ్వాస తీర్మానాల అలజడి మొదలైంది. కొత్త పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కౌన్సిలర్లు సమాలోచనలు ప్రారంభించారు.
పురపాలికల్లో అసంతృప్తుల చర్యలు వేగవంతం
క్యాంపులకు కౌన్సిలర్ల శ్రీకారం
నిలువరిస్తున్న ఎమ్మెల్యేలు
నేటితో ముగియనున్న మూడేళ్ల కాలపరిమితి
సవరణ చట్టం ఆమోదం పొందకపోవడంతో సమస్యలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు పురపాలికల్లో అవిశ్వాస తీర్మానాల అలజడి మొదలైంది. కొత్త పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కౌన్సిలర్లు సమాలోచనలు ప్రారంభించారు. తమ డిమాండ్లు సాధించుకోవడంపై వారు దృష్టిపెట్టారు. రాష్ట్ర పురపాలక చట్టం ప్రకారం మూడేళ్ల తర్వాతే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది. 2020 జనవరి 27న కొలువుదీరిన పాలక వర్గాల మూడేళ్ల కాలపరిమితి శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టే ప్రక్రియపై కొందరు ఆరా తీస్తున్నారు. నోటీసు ఎలా ఇవ్వాలి? ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై పురపాలక అధికారులతో చర్చిస్తున్నారు. అలాగే మూడేళ్ల క్రితం ఛైర్పర్సన్ పదవులపై ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ పలుచోట్ల అధికారపార్టీ ఎమ్మెల్యేలను, ముఖ్యనేతలను సంప్రదిస్తున్నారు. జగిత్యాలలో విభేదాల నేపథ్యంలో ఛైర్పర్సన్ రాజీనామా చేయగా, జనగామలో భారాస కౌన్సిలర్లు 11 మంది ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. ఆర్మూర్లో కౌన్సిలర్ల అసంతృప్తి సద్దుమణిగేలా చేశారు. హుజూరాబాద్ సహా పలు చోట్ల నేతల మధ్య అంతరం కొనసాగుతోంది. ఒకపక్క అవిశ్వాసంపై చర్చలు జరుగుతుండగా..మరో వైపు అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఇతర పార్టీల కౌన్సిలర్లపై దృష్టి సారించడంతో ఆయా పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఛైర్పర్సన్ ఆశావహులు సొంత పార్టీ కౌన్సిలర్లతో పాటు ఇతర పార్టీలవారినీ సంప్రదిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే క్యాంపుల నిర్వహణకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జనగామ పురపాలికకు చెందిన 11 మంది కౌన్సిలర్లు క్యాంపులో ఉండగా, కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎనిమిది మంది క్యాంపునకు చేరినట్లు తెలిసింది.
నాలుగేళ్ల చట్టం ఆమోదం పొందకపోవడంతో చిక్కులు
రాష్ట్ర పురపాలక చట్టం ప్రకారం మూడేళ్ల తర్వాతే అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది. 2023 ఎన్నికల సంవత్సరం కావడం, అవిశ్వాసాల గొడవలు లేకుండా ఉండేలా ప్రభుత్వం గత శాసనసభ సమావేశాల్లోనే పురపాలక చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. నాలుగేళ్ల తర్వాతే అవిశ్వాసం పెట్టేలా చట్ట సవరణ చేస్తూ ఉభయ సభలు బిల్లును ఆమోదించి గవర్నర్కు పంపాయి. పురపాలక బిల్లు సహా ఏడు బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర పడకపోవడంతో చట్టం అమల్లోకి రాలేదు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీసు ఇస్తే చట్ట ప్రకారం తాము నడచుకోవాల్సిందే తప్ప ప్రత్యామ్నాయం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఆర్డీఓకు మాత్రమే అవిశ్వాసం నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
హామీ అమలుకు పట్టు
2020 జనవరిలో కొన్ని పురపాలక సంఘాల్లో ఛైర్పర్సన్ స్థానాల కోసం పలువురు పోటీపడ్డారు. ఆ సందర్భంగా అంతర్గత సమస్యలకు తావులేకుండా చూసేందుకు మూడేళ్ల తర్వాత ఛైర్పర్సన్గా అవకాశం కల్పిస్తామని హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలను అమలు చేయాలని ఆశావహులైన కౌన్సిలర్లు పట్టుబడుతున్నట్లు సమాచారం. మిగిలిన రెండేళ్ల కాలానికైనా తమకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.
వాటాల్లో వివాదం
ఎన్నికై మూడేళ్లయినా ఆశించిన మేర ఆర్థికంగా ప్రయోజనం కలగలేదని పలు చోట్ల కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారు. ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో కొంతమందికి లబ్ధి చేకూరినా మిగిలిన చోట్ల ఈ పరిస్థితి ఉంది. పనులు జరుగుతున్నా, పట్టణ ప్రగతి నిధులు అందుబాటులోకి వస్తున్నా ఆర్థిక ప్రయోజనాలు కొందరికి మాత్రమే ఉంటున్నాయని వారు పేర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో పలు డిమాండ్లను ఛైర్పర్సన్ల ముందుంచుతున్నారు. ప్రధానంగా అభివృద్ధి పనుల కాంట్రాక్టుల్లో వాటాల అంశంపై దృష్టిసారిస్తున్నారు. కాంట్రాక్టర్లనుంచి వచ్చే కమీషన్ల మొత్తాన్ని పెంచాలనే ప్రతిపాదనలపై ఇప్పటికే పలుచోట్ల ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించడం గమనార్హం. పూర్వపు వరంగల్ జిల్లాలోని ఒక పట్టణ స్థానిక సంస్థలో పాలకవర్గం కాంట్రాక్టర్లు ఇస్తున్న కమీషన్ మొత్తాన్ని 6 శాతం నుంచి 9 శాతానికి పెంచుకుంది. వాస్తవంగా వాటా మొత్తాన్ని 11 శాతానికి పెంచాలని కౌన్సిలర్లు డిమాండ్ చేయగా కాంట్రాక్టర్లు ససేమిరా అన్నట్లు తెలిసింది. బిల్లుల విడుదలలో జాప్యం, ఇతర సమస్యల నేపథ్యంలో అంత ఇచ్చుకోలేమని.. అవసరమనుకుంటే పనులను మానుకుంటామని కాంట్రాక్టర్లు తేల్చిచెప్పడంతో 9 శాతానికి అంగీకరించినట్లు తెలిసింది.
బుజ్జగింపులకు శ్రీకారం
తాజా పరిణామాల నేపథ్యంలో అసంతృప్తులను బుజ్జగించే చర్యలకు అధికారపార్టీ ఎమ్మెల్యేలు శ్రీకారం చుట్టారు. పురపాలికల్లో ఏం జరుగుతోందనే దానిపై ప్రత్యేక దృష్టి సారించారు. తమకు తెలియకుండా కౌన్సిలర్లు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి వేరుకుంపట్లు పెట్టకూడదని, ఆవేదన ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేస్తున్నారు. అసంతృప్తులతో అంతర్గతంగా చర్చిస్తున్నారు. ఎలాంటి ఆవేశపూరిత చర్యలకు వెళ్లకూడదని.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని సర్దిచెబుతున్నారు. ఎమ్మెల్యేలనే కొందరు కౌన్సిలర్లు కలసి ఆవేదన వ్యక్తం చేస్తుండటంతో న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
బంగారం పేరుతో రూ.6.12 కోట్ల మోసం.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అరెస్టు
-
social look: వర్ష చీరకట్టు.. ప్రియాంక క్యూటు.. రష్మి హాటు..
-
ప్రజలు బెంజ్ కారు అడగట్లేదు కదా!.. ఎన్నికలపై విశాల్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
అందుకే భారాస కష్టాల్లో పడింది: గుత్తా సుఖేందర్రెడ్డి
-
జగన్పై రాయిదాడి కేసు.. దుర్గారావు ఎక్కడ?
-
22న ఏపీ పదోతరగతి ఫలితాలు