అవిశ్వాసాల అలజడి
రాష్ట్రంలోని పలు పురపాలికల్లో అవిశ్వాస తీర్మానాల అలజడి మొదలైంది. కొత్త పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కౌన్సిలర్లు సమాలోచనలు ప్రారంభించారు.
పురపాలికల్లో అసంతృప్తుల చర్యలు వేగవంతం
క్యాంపులకు కౌన్సిలర్ల శ్రీకారం
నిలువరిస్తున్న ఎమ్మెల్యేలు
నేటితో ముగియనున్న మూడేళ్ల కాలపరిమితి
సవరణ చట్టం ఆమోదం పొందకపోవడంతో సమస్యలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు పురపాలికల్లో అవిశ్వాస తీర్మానాల అలజడి మొదలైంది. కొత్త పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కౌన్సిలర్లు సమాలోచనలు ప్రారంభించారు. తమ డిమాండ్లు సాధించుకోవడంపై వారు దృష్టిపెట్టారు. రాష్ట్ర పురపాలక చట్టం ప్రకారం మూడేళ్ల తర్వాతే అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది. 2020 జనవరి 27న కొలువుదీరిన పాలక వర్గాల మూడేళ్ల కాలపరిమితి శుక్రవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టే ప్రక్రియపై కొందరు ఆరా తీస్తున్నారు. నోటీసు ఎలా ఇవ్వాలి? ఎలా ముందుకెళ్లాలనే అంశాలపై పురపాలక అధికారులతో చర్చిస్తున్నారు. అలాగే మూడేళ్ల క్రితం ఛైర్పర్సన్ పదవులపై ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ పలుచోట్ల అధికారపార్టీ ఎమ్మెల్యేలను, ముఖ్యనేతలను సంప్రదిస్తున్నారు. జగిత్యాలలో విభేదాల నేపథ్యంలో ఛైర్పర్సన్ రాజీనామా చేయగా, జనగామలో భారాస కౌన్సిలర్లు 11 మంది ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. ఆర్మూర్లో కౌన్సిలర్ల అసంతృప్తి సద్దుమణిగేలా చేశారు. హుజూరాబాద్ సహా పలు చోట్ల నేతల మధ్య అంతరం కొనసాగుతోంది. ఒకపక్క అవిశ్వాసంపై చర్చలు జరుగుతుండగా..మరో వైపు అధికారంలో ఉన్న పార్టీ నేతలు ఇతర పార్టీల కౌన్సిలర్లపై దృష్టి సారించడంతో ఆయా పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఛైర్పర్సన్ ఆశావహులు సొంత పార్టీ కౌన్సిలర్లతో పాటు ఇతర పార్టీలవారినీ సంప్రదిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే క్యాంపుల నిర్వహణకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జనగామ పురపాలికకు చెందిన 11 మంది కౌన్సిలర్లు క్యాంపులో ఉండగా, కాంగ్రెస్ కౌన్సిలర్లు ఎనిమిది మంది క్యాంపునకు చేరినట్లు తెలిసింది.
నాలుగేళ్ల చట్టం ఆమోదం పొందకపోవడంతో చిక్కులు
రాష్ట్ర పురపాలక చట్టం ప్రకారం మూడేళ్ల తర్వాతే అవిశ్వాస తీర్మానాలను ప్రవేశపెట్టేందుకు అవకాశం ఉంది. 2023 ఎన్నికల సంవత్సరం కావడం, అవిశ్వాసాల గొడవలు లేకుండా ఉండేలా ప్రభుత్వం గత శాసనసభ సమావేశాల్లోనే పురపాలక చట్ట సవరణ బిల్లును ఆమోదించింది. నాలుగేళ్ల తర్వాతే అవిశ్వాసం పెట్టేలా చట్ట సవరణ చేస్తూ ఉభయ సభలు బిల్లును ఆమోదించి గవర్నర్కు పంపాయి. పురపాలక బిల్లు సహా ఏడు బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర పడకపోవడంతో చట్టం అమల్లోకి రాలేదు. అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీసు ఇస్తే చట్ట ప్రకారం తాము నడచుకోవాల్సిందే తప్ప ప్రత్యామ్నాయం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఆర్డీఓకు మాత్రమే అవిశ్వాసం నోటీసు ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.
హామీ అమలుకు పట్టు
2020 జనవరిలో కొన్ని పురపాలక సంఘాల్లో ఛైర్పర్సన్ స్థానాల కోసం పలువురు పోటీపడ్డారు. ఆ సందర్భంగా అంతర్గత సమస్యలకు తావులేకుండా చూసేందుకు మూడేళ్ల తర్వాత ఛైర్పర్సన్గా అవకాశం కల్పిస్తామని హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలను అమలు చేయాలని ఆశావహులైన కౌన్సిలర్లు పట్టుబడుతున్నట్లు సమాచారం. మిగిలిన రెండేళ్ల కాలానికైనా తమకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.
వాటాల్లో వివాదం
ఎన్నికై మూడేళ్లయినా ఆశించిన మేర ఆర్థికంగా ప్రయోజనం కలగలేదని పలు చోట్ల కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారు. ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో కొంతమందికి లబ్ధి చేకూరినా మిగిలిన చోట్ల ఈ పరిస్థితి ఉంది. పనులు జరుగుతున్నా, పట్టణ ప్రగతి నిధులు అందుబాటులోకి వస్తున్నా ఆర్థిక ప్రయోజనాలు కొందరికి మాత్రమే ఉంటున్నాయని వారు పేర్కొంటున్నారు.ఈ నేపథ్యంలో పలు డిమాండ్లను ఛైర్పర్సన్ల ముందుంచుతున్నారు. ప్రధానంగా అభివృద్ధి పనుల కాంట్రాక్టుల్లో వాటాల అంశంపై దృష్టిసారిస్తున్నారు. కాంట్రాక్టర్లనుంచి వచ్చే కమీషన్ల మొత్తాన్ని పెంచాలనే ప్రతిపాదనలపై ఇప్పటికే పలుచోట్ల ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించడం గమనార్హం. పూర్వపు వరంగల్ జిల్లాలోని ఒక పట్టణ స్థానిక సంస్థలో పాలకవర్గం కాంట్రాక్టర్లు ఇస్తున్న కమీషన్ మొత్తాన్ని 6 శాతం నుంచి 9 శాతానికి పెంచుకుంది. వాస్తవంగా వాటా మొత్తాన్ని 11 శాతానికి పెంచాలని కౌన్సిలర్లు డిమాండ్ చేయగా కాంట్రాక్టర్లు ససేమిరా అన్నట్లు తెలిసింది. బిల్లుల విడుదలలో జాప్యం, ఇతర సమస్యల నేపథ్యంలో అంత ఇచ్చుకోలేమని.. అవసరమనుకుంటే పనులను మానుకుంటామని కాంట్రాక్టర్లు తేల్చిచెప్పడంతో 9 శాతానికి అంగీకరించినట్లు తెలిసింది.
బుజ్జగింపులకు శ్రీకారం
తాజా పరిణామాల నేపథ్యంలో అసంతృప్తులను బుజ్జగించే చర్యలకు అధికారపార్టీ ఎమ్మెల్యేలు శ్రీకారం చుట్టారు. పురపాలికల్లో ఏం జరుగుతోందనే దానిపై ప్రత్యేక దృష్టి సారించారు. తమకు తెలియకుండా కౌన్సిలర్లు ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసుకుంటుంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి వేరుకుంపట్లు పెట్టకూడదని, ఆవేదన ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని స్పష్టం చేస్తున్నారు. అసంతృప్తులతో అంతర్గతంగా చర్చిస్తున్నారు. ఎలాంటి ఆవేశపూరిత చర్యలకు వెళ్లకూడదని.. పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుందామని సర్దిచెబుతున్నారు. ఎమ్మెల్యేలనే కొందరు కౌన్సిలర్లు కలసి ఆవేదన వ్యక్తం చేస్తుండటంతో న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల