సంక్షిప్త వార్తలు(8)
రాష్ట్రంలో మరికొన్ని రోజులపాటు శీతల వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.
రాష్ట్రంలో మరికొన్ని రోజులు చలి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మరికొన్ని రోజులపాటు శీతల వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ప్రస్తుతం దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని తెలిపింది. బుధవారం తెల్లవారుజామున రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లోని చాలా చోట్ల 11.5 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా రాచూరులో కనిష్ఠంగా 10.6 డిగ్రీల సెల్సియస్, తాళ్లపల్లిలో 10.6, ఎలిమినేడులో 10.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగర పరిధిలోని ఎల్బీనగర్లో 14.7 డిగ్రీలు ఉంది. గురువారం మధ్యాహ్నం భద్రాద్రి జిల్లా యానంభైలులో గరిష్ఠ ఉష్ణోగ్రత 36.9 డిగ్రీలుగా నమోదయింది.
రాష్ట్రంలో పర్యాటకానికి పెద్దపీట: మంత్రి శ్రీనివాస్గౌడ్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఆధ్యాత్మిక, వైద్య, వన్యప్రాణి పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక, బుద్ధవనం ప్రాజెక్టు అధికారులను ఆయన సన్మానించారు. రాష్ట్రంలో ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, బౌద్ధానికి పూర్వవైభవం తీసుకువచ్చేలా బుద్ధవనం ప్రాజెక్టును నిర్మించామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు.
ప్రతి జిల్లాలో మెడికల్ బోర్డు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల నేపథ్యంలో అవసరమైన వారికి కీలక వైద్యపరీక్షల నిమిత్తం జిల్లాల్లోనే ప్రత్యేక మెడికల్ బోర్డులను ఏర్పాటు చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఎం.ఎ.రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్తో సంప్రదించి ప్రతి జిల్లాలోనూ రెండు మూడు రోజులపాటు మెడికల్బోర్డులు అందుబాటులో ఉంచాలని వైద్య విద్య డైరెక్టర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్లను గురువారం ఆదేశించారు.
ప్రసార మాధ్యమాల్లో లింగ చైతన్యంపై సదస్సు
ఫిబ్రవరి 3న.. వేదిక టి-హబ్
ఈనాడు, హైదరాబాద్: ప్రసార మాధ్యమాల్లో లింగ చైతన్యంపై ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) భారత విభాగం హైదరాబాద్లో సదస్సు నిర్వహించనుంది. ఫిబ్రవరి 3న టి-హబ్లో జరగనున్న ఈ సదస్సుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. నాలెడ్జ్ పార్ట్నర్గా యునిసెఫ్ వ్యవహరించనుంది. 30 సెకన్ల వ్యాపార ప్రకటన నుంచి 3 గంటల నిడివి గల సినిమాల్లోనూ ‘మహిళలను చిత్రీకరిస్తున్న తీరు’ ఈ సదస్సులో ప్రధాన చర్చనీయాంశం. ఈ విషయంలో సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులు వివరిస్తారు. ఐఏఏ చొరవతో నిర్వహిస్తున్న ‘వాయిస్ ఆఫ్ ఛేంజ్’ అనే కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన సదస్సును నిర్వహించనున్నారు.
రూ.38,070 కోట్లతో విద్యుత్తు వ్యవస్థను బలోపేతం చేశాం: సీఎండీ ప్రభాకర్రావు
ఖైరతాబాద్, న్యూస్టుడే: రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా, పంపిణీల నెట్వర్క్ను రూ.38,070 కోట్ల వ్యయంతో బలోపేతం చేశామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు పేర్కొన్నారు. అంతరాయంలేని విద్యుత్తు సరఫరా కోసం గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 400 కేవీ రింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యుత్తు సౌధలో జాతీయ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోతలు లేకుండా అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు.
నిర్ణీత వ్యవధిలో పోస్టుల భర్తీ చేసేలా పనిచేయాలి
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను నిర్ణీత కాలవ్యవధిలో భర్తీచేసేందుకు కమిషన్ సిబ్బంది ఓ లక్ష్యంతో పనిచేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్రెడ్డి సూచించారు. తక్కువ సంఖ్యలో సిబ్బంది ఉన్నప్పటికీ కష్టపడి పనిచేస్తున్నారని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. గురువారం ఆయన కమిషన్ కార్యాలయంలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
నేటి నుంచి హోమియోపతి
ఎండీ యాజమాన్య కోటా సీట్ల భర్తీ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు హోమియో వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటాలో హోమియో ఎండీ సీట్లను భర్తీ చేయడానికి కాళోజీ వర్సిటీ గురువారం ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 27న ఉదయం 9 గంటల నుంచి వచ్చే నెల 3న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
డయాఫ్రం వాల్ గ్యాప్-1లో పరీక్షలు ప్రారంభం
పోలవరం, దేవీపట్నం, న్యూస్టుడే: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గురువారం డయాఫ్రం వాల్ గ్యాప్-1లో నాణ్యత పరీక్షలు ప్రారంభమయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం అంగళూరు సమీపంలో డయాఫ్రం వాల్ను జాతీయ జల విద్యుత్తు బోర్డు డైరెక్టర్ ఎస్ఎల్ కపిల్, నిపుణుల బృందంతో కలిసి గురువారం పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) బృందంసహా కపిల్.. నిపుణులకు పలు సూచనలు చేశారు. హరియాణా నుంచి తీసుకొచ్చిన పరికరాలతో గ్యాప్-1లో పరీక్షలకు శ్రీకారం చుట్టారు.
విధుల్లోకి తీసుకోవాలని మాజీ హోంగార్డుల వినతి
ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాలతో విధులకు గైర్హాజరైనందుకు ఉద్యోగాల నుంచి తొలగించిన తమను తిరిగి తీసుకోవాలని మాజీ హోంగార్డులు గురువారం విన్నవించారు. వినతిపత్రాన్ని హోంమంత్రి మహమూద్అలీ, రాజ్యసభ సభ్యుడు కేశవరావులకు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్