సంక్షిప్త వార్తలు(8)
రాష్ట్రంలో మరికొన్ని రోజులపాటు శీతల వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది.
రాష్ట్రంలో మరికొన్ని రోజులు చలి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మరికొన్ని రోజులపాటు శీతల వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో 15 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ప్రస్తుతం దక్షిణ, ఆగ్నేయ దిశల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని తెలిపింది. బుధవారం తెల్లవారుజామున రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లాల్లోని చాలా చోట్ల 11.5 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లా రాచూరులో కనిష్ఠంగా 10.6 డిగ్రీల సెల్సియస్, తాళ్లపల్లిలో 10.6, ఎలిమినేడులో 10.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ నగర పరిధిలోని ఎల్బీనగర్లో 14.7 డిగ్రీలు ఉంది. గురువారం మధ్యాహ్నం భద్రాద్రి జిల్లా యానంభైలులో గరిష్ఠ ఉష్ణోగ్రత 36.9 డిగ్రీలుగా నమోదయింది.
రాష్ట్రంలో పర్యాటకానికి పెద్దపీట: మంత్రి శ్రీనివాస్గౌడ్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఆధ్యాత్మిక, వైద్య, వన్యప్రాణి పర్యాటకానికి పెద్దపీట వేస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా తెలంగాణ పర్యాటక, బుద్ధవనం ప్రాజెక్టు అధికారులను ఆయన సన్మానించారు. రాష్ట్రంలో ప్రపంచస్థాయి పర్యాటక ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని, బౌద్ధానికి పూర్వవైభవం తీసుకువచ్చేలా బుద్ధవనం ప్రాజెక్టును నిర్మించామన్నారు. పర్యాటక ప్రాంతాల్లో అత్యుత్తమ మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు మంత్రి వివరించారు.
ప్రతి జిల్లాలో మెడికల్ బోర్డు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల నేపథ్యంలో అవసరమైన వారికి కీలక వైద్యపరీక్షల నిమిత్తం జిల్లాల్లోనే ప్రత్యేక మెడికల్ బోర్డులను ఏర్పాటు చేస్తూ వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఎం.ఎ.రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్తో సంప్రదించి ప్రతి జిల్లాలోనూ రెండు మూడు రోజులపాటు మెడికల్బోర్డులు అందుబాటులో ఉంచాలని వైద్య విద్య డైరెక్టర్, తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్లను గురువారం ఆదేశించారు.
ప్రసార మాధ్యమాల్లో లింగ చైతన్యంపై సదస్సు
ఫిబ్రవరి 3న.. వేదిక టి-హబ్
ఈనాడు, హైదరాబాద్: ప్రసార మాధ్యమాల్లో లింగ చైతన్యంపై ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (ఐఏఏ) భారత విభాగం హైదరాబాద్లో సదస్సు నిర్వహించనుంది. ఫిబ్రవరి 3న టి-హబ్లో జరగనున్న ఈ సదస్సుకు తెలంగాణ గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. నాలెడ్జ్ పార్ట్నర్గా యునిసెఫ్ వ్యవహరించనుంది. 30 సెకన్ల వ్యాపార ప్రకటన నుంచి 3 గంటల నిడివి గల సినిమాల్లోనూ ‘మహిళలను చిత్రీకరిస్తున్న తీరు’ ఈ సదస్సులో ప్రధాన చర్చనీయాంశం. ఈ విషయంలో సంప్రదాయానికి భిన్నంగా వ్యవహరించాల్సిన అవసరాన్ని పరిశ్రమలోని ప్రముఖ వ్యక్తులు వివరిస్తారు. ఐఏఏ చొరవతో నిర్వహిస్తున్న ‘వాయిస్ ఆఫ్ ఛేంజ్’ అనే కార్యక్రమంలో భాగంగా ఈ అవగాహన సదస్సును నిర్వహించనున్నారు.
రూ.38,070 కోట్లతో విద్యుత్తు వ్యవస్థను బలోపేతం చేశాం: సీఎండీ ప్రభాకర్రావు
ఖైరతాబాద్, న్యూస్టుడే: రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా, పంపిణీల నెట్వర్క్ను రూ.38,070 కోట్ల వ్యయంతో బలోపేతం చేశామని ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు పేర్కొన్నారు. అంతరాయంలేని విద్యుత్తు సరఫరా కోసం గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ 400 కేవీ రింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసినట్లు వివరించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యుత్తు సౌధలో జాతీయ పతాకాన్ని ఆయన ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో కోతలు లేకుండా అన్ని వర్గాల వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ ఇస్తున్నామని తెలిపారు.
నిర్ణీత వ్యవధిలో పోస్టుల భర్తీ చేసేలా పనిచేయాలి
టీఎస్పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్దన్రెడ్డి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలను నిర్ణీత కాలవ్యవధిలో భర్తీచేసేందుకు కమిషన్ సిబ్బంది ఓ లక్ష్యంతో పనిచేయాలని టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్రెడ్డి సూచించారు. తక్కువ సంఖ్యలో సిబ్బంది ఉన్నప్పటికీ కష్టపడి పనిచేస్తున్నారని, ఇదే స్ఫూర్తిని కొనసాగించాలన్నారు. గురువారం ఆయన కమిషన్ కార్యాలయంలో జాతీయపతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు.
నేటి నుంచి హోమియోపతి
ఎండీ యాజమాన్య కోటా సీట్ల భర్తీ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు హోమియో వైద్య కళాశాలల్లో యాజమాన్య కోటాలో హోమియో ఎండీ సీట్లను భర్తీ చేయడానికి కాళోజీ వర్సిటీ గురువారం ప్రకటన విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 27న ఉదయం 9 గంటల నుంచి వచ్చే నెల 3న సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
డయాఫ్రం వాల్ గ్యాప్-1లో పరీక్షలు ప్రారంభం
పోలవరం, దేవీపట్నం, న్యూస్టుడే: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గురువారం డయాఫ్రం వాల్ గ్యాప్-1లో నాణ్యత పరీక్షలు ప్రారంభమయ్యాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం అంగళూరు సమీపంలో డయాఫ్రం వాల్ను జాతీయ జల విద్యుత్తు బోర్డు డైరెక్టర్ ఎస్ఎల్ కపిల్, నిపుణుల బృందంతో కలిసి గురువారం పరిశీలించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) బృందంసహా కపిల్.. నిపుణులకు పలు సూచనలు చేశారు. హరియాణా నుంచి తీసుకొచ్చిన పరికరాలతో గ్యాప్-1లో పరీక్షలకు శ్రీకారం చుట్టారు.
విధుల్లోకి తీసుకోవాలని మాజీ హోంగార్డుల వినతి
ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య కారణాలతో విధులకు గైర్హాజరైనందుకు ఉద్యోగాల నుంచి తొలగించిన తమను తిరిగి తీసుకోవాలని మాజీ హోంగార్డులు గురువారం విన్నవించారు. వినతిపత్రాన్ని హోంమంత్రి మహమూద్అలీ, రాజ్యసభ సభ్యుడు కేశవరావులకు అందజేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం