ధాన్యరాశి తెలంగాణ
వానాకాలంలో ధాన్యం ఉత్పత్తి కోటి టన్నులు దాటింది. రాష్ట్ర ప్రభుత్వంతో పోటాపోటీగా ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు.
కోటిటన్నుల పైగా వడ్ల ఉత్పత్తి
పోటాపోటీగా కొనుగోళ్లు
64.30 లక్షల టన్నులు సేకరించిన ప్రభుత్వం
40 లక్షల టన్నులు కొన్న వ్యాపారులు
ఈనాడు, హైదరాబాద్: వానాకాలంలో ధాన్యం ఉత్పత్తి కోటి టన్నులు దాటింది. రాష్ట్ర ప్రభుత్వంతో పోటాపోటీగా ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. అంతర్జాతీయంగా బియ్యానికి భారీగా డిమాండు ఉండటంతో వ్యాపారులు ముందడుగు వేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దిగుబడి తగ్గడంతో అక్కడి వారు కూడా తెలంగాణలో కొనుగోళ్లు చేపట్టారు. వ్యాపారుల పోటీ పెరగడంతో ప్రభుత్వం తక్కువ మొత్తంలోనే సేకరించింది. ప్రస్తుత వానాకాల ధాన్యం కొనుగోళ్ల క్రతువు ముగిసింది. ప్రభుత్వం 64.30 లక్షల టన్నుల వడ్లు సేకరిస్తే వ్యాపారులు సుమారు 40 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేసినట్లు అంచనా. వానాకాలంలో సుమారు 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గడిచిన ఏడాదితో పోలిస్తే మూడు లక్షల ఎకరాలు అదనం. ఈ నేపథ్యంలో 1.52 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలు అంచనా వేశాయి. ఆ మేరకు దిగుబడి రానప్పటికీ కోటి టన్నులకుపైగా వచ్చినట్లు అధికార, అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. తొలిదశలో వరి నాట్లు వేసిన రైతులకు మంచి దిగుబడి వచ్చింది. జులైలో నాట్లు వేసిన వారికి దిగుబడి కొంత తగ్గినప్పటికీ ఆగస్టులో నాట్లు వేసిన రైతులకు పంట ఎక్కువగానే వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. 90 లక్షల నుంచి 1.12 కోట్ల టన్నుల వరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేయగా.. 64.30 లక్షల టన్నులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది.
బియ్యానికి భారీగా డిమాండు...
దేశంలోని పలు రాష్ట్రాల్లో దిగుబడి తక్కువగా రావటంతో బియ్యానికి డిమాండు పెరిగింది. నూకలు, బియ్యం ఎగుమతులపై గతంలో విధించిన ఆంక్షలను కేంద్రం సడలించటంతోనూ వ్యాపారులు భారీగా కొనుగోళ్లు చేసినట్లు సమాచారం. అంతర్జాతీయంగా కూడా డిమాండు పెరిగింది. కరోనా కారణంగా చైనా, థాయ్లాండ్లో వరి సాగు, దిగుబడిపై ప్రభావం పడినట్లు వ్యాపారులు చెబుతున్నారు. బియ్యం డిమాండు నేపథ్యంలో తొలిసారి రైతులకు కొంత మేర మంచి ధర లభించింది. సీజను ఆరంభంలో కొందరు వ్యాపారులు మునుపటి మాదిరిగానే తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఆ తరవాత ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు రావటంతో స్థానికంగా ఉన్నవారు కూడా రైతులకు అధిక ధర చెల్లించారు. గడిచిన రెండు సీజన్లకు సంబంధించి కస్టం మిల్లింగ్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని కొందరు మిల్లర్లు పెద్ద మొత్తంలో పక్కదారి పట్టించారు. మరోపక్క రాష్ట్రంలో బియ్యం అక్రమాలపై కేంద్రం దృష్టి సారించిందన్న ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వానికి బియ్యం ఇచ్చేందుకు అక్రమాలకు పాల్పడిన మిల్లర్లు ఆ మేరకు వడ్లు కొనుగోలు చేసినట్లు వ్యాపారవర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. తెలంగాణ వ్యాపారులు 25 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేస్తే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వారు 15 లక్షల టన్నుల వరకు సేకరించినట్లు అంచనా. వ్యాపారుల్లో పోటీ పెరగటంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. గడిచిన వానాకాలంతో పోలిస్తే సర్కారు తక్కువగానే కొనుగోలు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే