ధాన్యరాశి తెలంగాణ
వానాకాలంలో ధాన్యం ఉత్పత్తి కోటి టన్నులు దాటింది. రాష్ట్ర ప్రభుత్వంతో పోటాపోటీగా ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు.
కోటిటన్నుల పైగా వడ్ల ఉత్పత్తి
పోటాపోటీగా కొనుగోళ్లు
64.30 లక్షల టన్నులు సేకరించిన ప్రభుత్వం
40 లక్షల టన్నులు కొన్న వ్యాపారులు
ఈనాడు, హైదరాబాద్: వానాకాలంలో ధాన్యం ఉత్పత్తి కోటి టన్నులు దాటింది. రాష్ట్ర ప్రభుత్వంతో పోటాపోటీగా ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేశారు. అంతర్జాతీయంగా బియ్యానికి భారీగా డిమాండు ఉండటంతో వ్యాపారులు ముందడుగు వేశారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో దిగుబడి తగ్గడంతో అక్కడి వారు కూడా తెలంగాణలో కొనుగోళ్లు చేపట్టారు. వ్యాపారుల పోటీ పెరగడంతో ప్రభుత్వం తక్కువ మొత్తంలోనే సేకరించింది. ప్రస్తుత వానాకాల ధాన్యం కొనుగోళ్ల క్రతువు ముగిసింది. ప్రభుత్వం 64.30 లక్షల టన్నుల వడ్లు సేకరిస్తే వ్యాపారులు సుమారు 40 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేసినట్లు అంచనా. వానాకాలంలో సుమారు 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గడిచిన ఏడాదితో పోలిస్తే మూడు లక్షల ఎకరాలు అదనం. ఈ నేపథ్యంలో 1.52 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలు అంచనా వేశాయి. ఆ మేరకు దిగుబడి రానప్పటికీ కోటి టన్నులకుపైగా వచ్చినట్లు అధికార, అనధికారిక లెక్కలు చెబుతున్నాయి. తొలిదశలో వరి నాట్లు వేసిన రైతులకు మంచి దిగుబడి వచ్చింది. జులైలో నాట్లు వేసిన వారికి దిగుబడి కొంత తగ్గినప్పటికీ ఆగస్టులో నాట్లు వేసిన రైతులకు పంట ఎక్కువగానే వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. 90 లక్షల నుంచి 1.12 కోట్ల టన్నుల వరకు కొనుగోలు చేయాల్సి వస్తుందని పౌరసరఫరాల శాఖ అంచనా వేయగా.. 64.30 లక్షల టన్నులు మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేసింది.
బియ్యానికి భారీగా డిమాండు...
దేశంలోని పలు రాష్ట్రాల్లో దిగుబడి తక్కువగా రావటంతో బియ్యానికి డిమాండు పెరిగింది. నూకలు, బియ్యం ఎగుమతులపై గతంలో విధించిన ఆంక్షలను కేంద్రం సడలించటంతోనూ వ్యాపారులు భారీగా కొనుగోళ్లు చేసినట్లు సమాచారం. అంతర్జాతీయంగా కూడా డిమాండు పెరిగింది. కరోనా కారణంగా చైనా, థాయ్లాండ్లో వరి సాగు, దిగుబడిపై ప్రభావం పడినట్లు వ్యాపారులు చెబుతున్నారు. బియ్యం డిమాండు నేపథ్యంలో తొలిసారి రైతులకు కొంత మేర మంచి ధర లభించింది. సీజను ఆరంభంలో కొందరు వ్యాపారులు మునుపటి మాదిరిగానే తక్కువ ధరకు కొనుగోలు చేశారు. ఆ తరవాత ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు రావటంతో స్థానికంగా ఉన్నవారు కూడా రైతులకు అధిక ధర చెల్లించారు. గడిచిన రెండు సీజన్లకు సంబంధించి కస్టం మిల్లింగ్ కోసం ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని కొందరు మిల్లర్లు పెద్ద మొత్తంలో పక్కదారి పట్టించారు. మరోపక్క రాష్ట్రంలో బియ్యం అక్రమాలపై కేంద్రం దృష్టి సారించిందన్న ప్రచారం నేపథ్యంలో ప్రభుత్వానికి బియ్యం ఇచ్చేందుకు అక్రమాలకు పాల్పడిన మిల్లర్లు ఆ మేరకు వడ్లు కొనుగోలు చేసినట్లు వ్యాపారవర్గాలు సైతం అంగీకరిస్తున్నాయి. తెలంగాణ వ్యాపారులు 25 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేస్తే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక వారు 15 లక్షల టన్నుల వరకు సేకరించినట్లు అంచనా. వ్యాపారుల్లో పోటీ పెరగటంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయాలు తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. గడిచిన వానాకాలంతో పోలిస్తే సర్కారు తక్కువగానే కొనుగోలు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు