రాజ్భవన్.. రాష్ట్ర ప్రభుత్వం.. రాజీ
బడ్జెట్ ఆమోదానికి సంబంధించి గవర్నర్కు, ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదానికి హైకోర్టు వేదికగా తెరపడింది. గవర్నర్కు ఆదేశాలిచ్చే పరిధి ఈ కోర్టుకు లేదని బహిరంగంగా చెబుతూనే ఇరుపక్షాలు చర్చించుకుని ముగింపు పలకాలని హైకోర్టు సూచించింది.
బడ్జెట్ ప్రవేశపెట్టడానికి గవర్నర్ అనుమతి
అసెంబ్లీకి రావాలంటూ ఆమెకు ఆహ్వానం పంపుతాం
అసెంబ్లీలో ప్రభుత్వ ప్రసంగం
మంత్రి వివరణతో పెండింగ్ బిల్లుల పరిష్కారానికి ఆమోదం
హైకోర్టులో పిటిషన్ నేపథ్యంలో ఇరుపక్షాల అంగీకారం
పిటిషన్పై విచారణ మూసివేత
ఈనాడు, హైదరాబాద్: బడ్జెట్ ఆమోదానికి సంబంధించి గవర్నర్కు, ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదానికి హైకోర్టు వేదికగా తెరపడింది. గవర్నర్కు ఆదేశాలిచ్చే పరిధి ఈ కోర్టుకు లేదని బహిరంగంగా చెబుతూనే ఇరుపక్షాలు చర్చించుకుని ముగింపు పలకాలని హైకోర్టు సూచించింది. 2023-24 బడ్జెట్కు గవర్నర్ నుంచి ఆమోదం లభించని నేపథ్యంలో ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ ధర్మాసనం సూచనల మేరకు రాజ్యాంగ సంస్థల తరఫున సీనియర్ న్యాయవాదుల చర్చల్లో మధ్యేమార్గంగా ఇరుపక్షాలు సంధికి అంగీకరించాయి. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే, అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్, అదనపు అడ్వొకేట్ జనరల్ జె.రామచంద్రరావు, గవర్నర్తరఫున సీనియర్ న్యాయవాది అశోక్ ఆనంద్కుమార్లు భోజన విరామ సమయంలో చర్చించారు. వీటి ప్రకారం ఫిబ్రవరి 3న బడ్జెట్ ప్రవేశపెట్టడానికిగాను సంబంధిత మంత్రి గవర్నరును ఆహ్వానించాల్సి ఉంది. ఆ మేరకు గవర్నర్ ఆమోదం తెలియజేయాలి. మంత్రిమండలి సిద్ధం చేసిన ప్రసంగ ప్రతిని గవర్నర్ అసెంబ్లీలో చదవాలి. పెండింగ్లో ఉన్న ఇతర బిల్లులకు ఆమోదం చెప్పాలి. అభ్యంతరాలపై సంబంధిత మంత్రులు, కార్యదర్శులు వివరణ ఇవ్వాలి.
ఫిబ్రవరి 3న 2023-24 బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి గవర్నర్ అనుమతి మంజూరు చేయకపోవడంతో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడానికి అనుమతించాలంటూ సోమవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం ముందు అడ్వొకేట్ జనరల్ అభ్యర్థించారు. దీనికి ధర్మాసనం అనుమతించడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి పిటిషన్ దాఖలు చేశారు. ధర్మాసనం అనుమతించడంతో సాధారణ పరిపాలన శాఖ తరఫు న్యాయవాది సీహెచ్.కళ్యాణ్రావు పిటిషన్ దాఖలు ప్రక్రియను పూర్తి చేశారు. ఈ పిటిషన్పై మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ ఎన్.తుకారాంజీలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.
న్యాయవ్యవస్థను ఎందుకు లాగుతున్నారు?
ఈ పిటిషన్పై తామెలా విచారణ చేపట్టగలమని ధర్మాసనం ప్రశ్నించింది. గవర్నర్ విధుల్లోకి తాము ఎలా జోక్యం చేసుకోవాలంది. ఈ వివాదంలోకి న్యాయవ్యవస్థను ఎందుకు లాగుతున్నారని వ్యాఖ్యానించింది. న్యాయవ్యవస్థ తన పరిధిని అతిక్రమించి మరో వ్యవస్థలోకి ఎలా చొచ్చుకుపోతుందంది. ఈ కోర్టు గవర్నర్కు ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయగలదని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వ తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపిస్తూ న్యాయసమీక్షకు అవకాశం ఉందని, ఇదే విషయాన్ని షంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసులో ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం స్పష్టత ఇచ్చిందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు అందరికీ శిరోధార్యమని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని అధికరణ 200 ప్రకారం ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ ప్రవేశపెట్టడం ప్రభుత్వ బాధ్యత అని, దాన్ని గడువులోగా సమర్పించాల్సి ఉందన్నారు. దీనికి గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. మంత్రిమండలి సలహా మేరకు ఆమోదించాల్సిందేనని, అంతేగానీ వ్యక్తిగత సంతృప్తి అవసరంలేదన్నారు. రాజ్యాంగ నిబంధనలను సంతృప్తిపరచాల్సి ఉందన్నారు. ఫిబ్రవరి 3న బడ్జెట్ ప్రవేశపెట్టడానికి గవర్నర్ ఆమోదం తెలియజేయాల్సి ఉందని, బడ్జెట్ ప్రవేశపెట్టడం, చర్చలు, సవరణలు అన్నీ మార్చి 31లోగా పూర్తి చేయాల్సి ఉందన్నారు. జనవరి 21న బడ్జెట్ అంచనాలను గవర్నర్ కార్యాలయానికి పంపామని, 26న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గవర్నర్ను కలిశారన్నారు. బడ్జెట్ను ప్రవేశపెట్టడానికి గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో జనవరి 27న ఆర్థిక మంత్రి గవర్నర్కు లేఖ రాయగా దీనికి ప్రతిగా గవర్నర్ సచివాలయం నుంచి ప్రభుత్వానికి లేఖ అందిందన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభానికి ముందు గవర్నర్ ప్రసంగం ఉంటుందా? లేదా? ఉంటే డ్రాఫ్ట్ ప్రసంగాన్ని పంపాలని కోరారన్నారు. గవర్నర్ ఆమోదం తెలపకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. షంషేర్సింగ్ కేసులో అధికరణ 174కు సుప్రీంకోర్టు భాష్యం చెప్పిందని, దీని ప్రకారం షెడ్యూలు ప్రకారం గవర్నర్ సభలను నిర్వహించాల్సి ఉందన్నారు. మంత్రిమండలి సలహా మేరకు సభ నిర్వహణను గవర్నర్ ఆమోదించాల్సి ఉందన్నారు. కేవలం క్షమాభిక్ష లాంటి కొన్ని సందర్భాల్లో ఉన్న విచక్షణాధికారం మినహా మంత్రి మండలి సలహా మేరకు గవర్నర్ ఆమోదం చెప్పాల్సి ఉందన్నారు. ఈ దశలో ధర్మాసనం జోక్యం చేసుకుంటూ తమిళనాడులో గవర్నర్ వాకౌట్ చేసినట్లు చూశామనగా న్యాయవాది స్పందిస్తూ రిపబ్లిక్ వేడుకల్లో ఈ సంఘటన చోటుచేసుకుందన్నారు. ఏ వ్యవస్థ అయినా పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని, ఇందులో వ్యక్తిగతం ఏమీ లేదని, రాజ్యాంగ బాధ్యతను నిర్వర్తించాల్సి ఉందన్నారు. గవర్నర్ మంత్రి మండలి విజ్ఞప్తి మేరకు విధులు నిర్వహించాల్సి ఉందని రాజ్యాంగ మౌలిక సూత్రాల్లోనే చెప్పారన్నారు. ఒక పార్టీ సలహా మేరకు విధులు నిర్వహించరాదని పేర్కొన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని దిగజారుస్తుందని, 130 కోట్ల జనాభాలో 80 కోట్ల మంది ప్రభుత్వం అందించే పథకాల మీద ఆధారపడి ఉన్నారన్నారు. గవర్నర్ రాజ్యాంగ విధులను నిర్వర్తించాలని, ఈమేరకు కోర్టు సలహా ఇవ్వాలని కోరారు.
కనీస గౌరవం ఇవ్వడం లేదు: గవర్నర్ తరఫు న్యాయవాది
ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి కనీస గౌరవం ఇవ్వడంలేదని గవర్నర్ తరఫు సీనియర్ న్యాయవాది అశోక్ ఆనంద్కుమార్ తెలిపారు. అంతేకాకుండా ఒక ఎమ్మెల్యే చాలా అనుచితంగా వ్యాఖ్యలు చేశారన్నారు. ప్రభుత్వం రాసిన లేఖపై స్పందించామని, దీనిపై వివరణ కోరితే ఎలాంటి సమాధానం ఇవ్వలేదన్నారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సంప్రదాయబద్ధంగా గవర్నర్ ప్రసంగం ఉంటుందా లేదా అని అడిగితే సమాధానం లేదన్నారు. దీనిపై ప్రభుత్వ సీనియర్ న్యాయవాది జోక్యం చేసుకుంటూ గవర్నర్ అని కాకపోయినా కనీసం మహిళగా పరిగణించి అయినా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయరాదని, దీన్ని ఖండిస్తున్నానని తెలిపారు. అయితే వ్యాఖ్యలు చేసిన వ్యక్తితో ప్రభుత్వానికి సంబంధంలేదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చూడాలని ప్రభుత్వానికి సూచన కూడా చేస్తానని చెప్పారు.
ఇలా సయోధ్య..
వాదనలను విన్న ధర్మాసనం ఇలాంటి వివాదాల్లో కోర్టుకు పరిమిత అధికారాలుంటాయని వ్యాఖ్యానించింది. మాకు అధికార పరిధిలేని ప్రాంతాల్లో జోక్యం చేసుకున్నందుకు మీరే కోర్టును నిందించవచ్చంది. ఇది రెండు రాజ్యాంగ వ్యవస్థల మధ్య వివాదమని, మీరే సొంతంగా చర్చించుకుని రావాలంది. భోజన విరామ సమయంలో ఒక గంట గడువు ఉందని, ఈ సమయంలో చర్చించుకుని ఫలవంతమైన చర్చతో రావాలని సూచించింది. మధ్యాహ్నం విచారణ సందర్భంగా చర్చల వివరాలను ప్రభుత్వ న్యాయవాది వివరించారు. అసెంబ్లీకి రావాలంటూ సంబంధిత మంత్రి గవర్నర్కు ఆహ్వానం పలకడంతోపాటు, ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగ ప్రతిని అందజేస్తారన్నారు. దీన్ని సమావేశాల్లో చదవడానికి గవర్నర్ ఆమోదించారని తెలిపారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలపాల్సి ఉందన్నారు. పెండింగ్ బిల్లులపై ఏవైనా సందేహాలుంటే సంబంధిత శాఖ మంత్రి, అధికారుల వివరణ తీసుకుని బిల్లులను క్లియర్ చేయాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఇరుపక్షాల మధ్య అంగీకారం కుదిరినందున ఈ కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు అవసరంలేదని, పిటిషన్పై విచారణను మూసివేయాలని కోరారు. ఇరుపక్షాల మధ్య కుదిరిన సంధిని నమోదు చేసిన ధర్మాసనం పిటిషన్పై విచారణను మూసివేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల