Higher pension: ఈపీఎఫ్వో సర్వర్పై తీవ్ర ఒత్తిడి
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులు అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్పై ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు యత్నించగా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి.
అధిక పింఛను అప్లికేషన్ తెరుచుకున్నా సాంకేతిక సమస్యలు
సందేహాల నివృత్తికి ఈపీఎఫ్ కార్యాలయాలకు తాకిడి
ఈనాడు, హైదరాబాద్: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులు అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్పై ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు యత్నించగా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆన్లైన్ దరఖాస్తు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సర్వర్పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దరఖాస్తు తెరిచేందుకు ప్రయత్నించిన వారికి పేరు సరిగా లేదని, ఈపీఎఫ్ ఖాతా వివరాలు కనిపించడం లేదంటూ ఎర్రర్ మెసేజ్ వస్తోంది. ఈపీఎఫ్వో మెంబర్ పోర్టల్ హోంపేజీ తెరుచుకునేందుకూ సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకు గడువు మే 3 వరకు ఇచ్చినప్పటికీ ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని చాలామంది భావిస్తున్నారు. చివరివరకు వేచి ఉంటే సర్వర్ సమస్యలతో అధిక పింఛను అవకాశం చేజారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇబ్బందులపై ఈపీఎఫ్వో వర్గాలను సంప్రదించగా సర్వర్పై తీవ్ర ఒత్తిడి నెలకొందని, నిర్వహణ బాధ్యతను కేంద్ర ఈపీఎఫ్ కార్యాలయం చూస్తోందని వెల్లడించాయి.
సందేహాల నివృత్తి కోసం కార్యాలయాలకు...
ఉమ్మడి ఆన్లైన్ దరఖాస్తు అందుబాటులోకి వచ్చిన విషయం తెలియడంతో వేతన జీవులు, పింఛనుదారులు సోమవారం పెద్దసంఖ్యలో హైదరాబాద్లోని బర్కత్పుర కార్యాలయానికి వచ్చారు. అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్పై సందేహాలు నివృత్తి చేయాలని, మరింత సమాచారం కావాలని కోరారు. కార్యాలయ సిబ్బంది అందుబాటులోని సమాచారాన్ని వివరించి అందరినీ పంపించేశారు. ఈపీఎఫ్ చందాదారులు, పింఛనుదారులకు సంబంధించి సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతినెలా 27న ఈపీఎఫ్వో ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. సోమవారం హైదరాబాద్ రీజియన్ పరిధిలో నాలుగు చోట్ల నిర్వహించగా ఆ కార్యక్రమాలకు హాజరైన వారిలో అధిక పింఛను ఆప్షన్ సందేహాల నివృత్తి కోసం వచ్చిన వారు దాదాపు 80శాతం మంది ఉన్నారని తెలిసింది.
2014 సెప్టెంబరు 1కు ముందు పదవీ విరమణ చేసిన వారికీ సమస్యలు
2014 సెప్టెంబరు 1కన్నా ముందు పదవీ విరమణ చేసి, ఈపీఎస్ చట్టం పేరా 11(3) కింద ఉమ్మడి ఆప్షన్ ఇచ్చినప్పటికీ, ఆ ఆప్షన్ను ఈపీఎఫ్వో గతంలో తిరస్కరించింది. వీరికి సుప్రీం తీర్పు ప్రకారం ఆప్షన్ ఇచ్చి, అధిక పింఛను పొందేందుకు తాజాగా అవకాశం దక్కింది. వీరికి మెంబర్ పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తు నెల రోజుల క్రితమే అందుబాట్లోకి వచ్చింది. దరఖాస్తు గడువు మార్చి 3 తేదీతో ముగియనుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ ఆన్లైన్ దరఖాస్తు తెరుచుకోవడం లేదు. గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో దరఖాస్తు చేసేందుకు వీలుగా సాంకేతిక సమస్యలుతొలగించాలని వారు విజ్ఞప్తిచేస్తున్నారు.
కొన్ని సందేహాలకు ఇవీ సమాధానాలు
అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్ విషయమై ఈనెల 24న ఎంప్లాయర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ)లు సంయుక్తంగా కేంద్ర పీఎఫ్ కమిషనర్, పింఛను ప్రాంతీయ కమిషనర్తో వర్చువల్ సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రాంతీయ కమిషనర్ (పింఛను) కొన్ని సందేహాలను నివృత్తి చేశారని పేర్కొంటూ కర్ణాటక ఎంప్లాయర్స్ ఫెడరేషన్ (కేఈఏ) తమ సభ్యులకు తెలిపింది. ఈ సమావేశంలో కమిషన్ నివృత్తి చేసిన వివరాలు వెల్లడిస్తూ సర్క్యులర్ జారీ చేసింది.
* ఉమ్మడి ఆప్షన్ను ఆన్లైన్లో నమోదు చేయాలి. ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చినా, యజమాని పంపించలేదని.. ఇతరత్రా కారణాలతో ఫిర్యాదులు చేయకుండా ఉండేందుకు ఆన్లైన్ దరఖాస్తు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
* దరఖాస్తు చేసేందుకు గడువుతేదీని ఆన్లైన్లో పేర్కొంటుంది. దీనిపై ఈపీఎఫ్వో ప్రత్యేక ఆదేశాలు ఏమీ జారీ చేయదు.
* ఉద్యోగులు వేర్వేరు సంస్థల్లో పనిచేసినపుడు ప్రతినెలా పొందిన వేతనం ఆధారంగా పింఛను లెక్కించేందుకు పూర్తివివరాలు అవసరం. ఈ నేపథ్యంలో ఉద్యోగి గతంలో పనిచేసిన యజమాని నుంచి అక్కడ పనిచేసిన సర్వీసుకు సంబంధించి నెలవారీగా పొందిన వేతనం, ఈపీఎఫ్, ఈపీఎస్కు చెల్లించిన చందా వివరాలు, యజమాని నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఉమ్మడి ఆప్షన్లో పూర్తివివరాలు నమోదు చేస్తే అర్హులైన వారికి ఈపీఎఫ్వో అధిక పింఛను, ఈపీఎస్లో అదనంగా చెల్లించాల్సిన జమ వివరాలను లెక్కించేందుకు వీలవుతుంది.
* వేర్వేరు సంస్థల్లో పనిచేసినప్పుడు పింఛనునిధికి అదనంగా జమచేయాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ప్రస్తుత యజమానికి పీఎఫ్ విభాగం సూచిస్తుంది. అదనపు డిపాజిట్ విషయమై ప్రస్తుత యజమాని, ఉద్యోగి సంయుక్తంగా నిర్ణయం తీసుకుని చెల్లింపులు చేయాలి.
* పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చేటప్పుడు అధిక పింఛను ఆప్షన్, అదనపు డిపాజిట్ తదితర వివరాలు, ఆర్థికభారం, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలన్నీ మదింపు చేసుకుని నిర్ణయం తీసుకోవాలి.
* ఆన్లైన్ డిక్లరేషన్ ఆధార్తో అనుసంధానమవుతుంది. ఆధార్తో అనుసంధానం కాని ఖాతాలకు ఆన్లైన్ డిక్లరేషన్ను పోర్టల్ అనుమతించదు. అధిక పింఛనుతో కలిగే లాభాల గురించి యజమానులు ఉద్యోగులు, కార్మికులకు అవగాహన కల్పించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి