Higher pension: ఈపీఎఫ్వో సర్వర్పై తీవ్ర ఒత్తిడి
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులు అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్పై ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు యత్నించగా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి.
అధిక పింఛను అప్లికేషన్ తెరుచుకున్నా సాంకేతిక సమస్యలు
సందేహాల నివృత్తికి ఈపీఎఫ్ కార్యాలయాలకు తాకిడి
ఈనాడు, హైదరాబాద్: ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారులు అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్పై ఆన్లైన్లో దరఖాస్తు చేసేందుకు యత్నించగా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆదివారం అర్ధరాత్రి నుంచి ఆన్లైన్ దరఖాస్తు అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి సర్వర్పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. దరఖాస్తు తెరిచేందుకు ప్రయత్నించిన వారికి పేరు సరిగా లేదని, ఈపీఎఫ్ ఖాతా వివరాలు కనిపించడం లేదంటూ ఎర్రర్ మెసేజ్ వస్తోంది. ఈపీఎఫ్వో మెంబర్ పోర్టల్ హోంపేజీ తెరుచుకునేందుకూ సర్వర్ సమస్యలు తలెత్తుతున్నాయి. ఆన్లైన్ దరఖాస్తుకు గడువు మే 3 వరకు ఇచ్చినప్పటికీ ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని చాలామంది భావిస్తున్నారు. చివరివరకు వేచి ఉంటే సర్వర్ సమస్యలతో అధిక పింఛను అవకాశం చేజారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఇబ్బందులపై ఈపీఎఫ్వో వర్గాలను సంప్రదించగా సర్వర్పై తీవ్ర ఒత్తిడి నెలకొందని, నిర్వహణ బాధ్యతను కేంద్ర ఈపీఎఫ్ కార్యాలయం చూస్తోందని వెల్లడించాయి.
సందేహాల నివృత్తి కోసం కార్యాలయాలకు...
ఉమ్మడి ఆన్లైన్ దరఖాస్తు అందుబాటులోకి వచ్చిన విషయం తెలియడంతో వేతన జీవులు, పింఛనుదారులు సోమవారం పెద్దసంఖ్యలో హైదరాబాద్లోని బర్కత్పుర కార్యాలయానికి వచ్చారు. అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్పై సందేహాలు నివృత్తి చేయాలని, మరింత సమాచారం కావాలని కోరారు. కార్యాలయ సిబ్బంది అందుబాటులోని సమాచారాన్ని వివరించి అందరినీ పంపించేశారు. ఈపీఎఫ్ చందాదారులు, పింఛనుదారులకు సంబంధించి సమస్యలు, ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రతినెలా 27న ఈపీఎఫ్వో ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తోంది. సోమవారం హైదరాబాద్ రీజియన్ పరిధిలో నాలుగు చోట్ల నిర్వహించగా ఆ కార్యక్రమాలకు హాజరైన వారిలో అధిక పింఛను ఆప్షన్ సందేహాల నివృత్తి కోసం వచ్చిన వారు దాదాపు 80శాతం మంది ఉన్నారని తెలిసింది.
2014 సెప్టెంబరు 1కు ముందు పదవీ విరమణ చేసిన వారికీ సమస్యలు
2014 సెప్టెంబరు 1కన్నా ముందు పదవీ విరమణ చేసి, ఈపీఎస్ చట్టం పేరా 11(3) కింద ఉమ్మడి ఆప్షన్ ఇచ్చినప్పటికీ, ఆ ఆప్షన్ను ఈపీఎఫ్వో గతంలో తిరస్కరించింది. వీరికి సుప్రీం తీర్పు ప్రకారం ఆప్షన్ ఇచ్చి, అధిక పింఛను పొందేందుకు తాజాగా అవకాశం దక్కింది. వీరికి మెంబర్ పోర్టల్లో ఆన్లైన్ దరఖాస్తు నెల రోజుల క్రితమే అందుబాట్లోకి వచ్చింది. దరఖాస్తు గడువు మార్చి 3 తేదీతో ముగియనుంది. అయితే గత కొన్ని రోజులుగా ఈ ఆన్లైన్ దరఖాస్తు తెరుచుకోవడం లేదు. గడువు దగ్గరపడుతున్న నేపథ్యంలో దరఖాస్తు చేసేందుకు వీలుగా సాంకేతిక సమస్యలుతొలగించాలని వారు విజ్ఞప్తిచేస్తున్నారు.
కొన్ని సందేహాలకు ఇవీ సమాధానాలు
అధిక పింఛను కోసం ఉమ్మడి ఆప్షన్ విషయమై ఈనెల 24న ఎంప్లాయర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ)లు సంయుక్తంగా కేంద్ర పీఎఫ్ కమిషనర్, పింఛను ప్రాంతీయ కమిషనర్తో వర్చువల్ సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రాంతీయ కమిషనర్ (పింఛను) కొన్ని సందేహాలను నివృత్తి చేశారని పేర్కొంటూ కర్ణాటక ఎంప్లాయర్స్ ఫెడరేషన్ (కేఈఏ) తమ సభ్యులకు తెలిపింది. ఈ సమావేశంలో కమిషన్ నివృత్తి చేసిన వివరాలు వెల్లడిస్తూ సర్క్యులర్ జారీ చేసింది.
* ఉమ్మడి ఆప్షన్ను ఆన్లైన్లో నమోదు చేయాలి. ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చినా, యజమాని పంపించలేదని.. ఇతరత్రా కారణాలతో ఫిర్యాదులు చేయకుండా ఉండేందుకు ఆన్లైన్ దరఖాస్తు తీసుకువచ్చినట్లు అధికారులు తెలిపారు.
* దరఖాస్తు చేసేందుకు గడువుతేదీని ఆన్లైన్లో పేర్కొంటుంది. దీనిపై ఈపీఎఫ్వో ప్రత్యేక ఆదేశాలు ఏమీ జారీ చేయదు.
* ఉద్యోగులు వేర్వేరు సంస్థల్లో పనిచేసినపుడు ప్రతినెలా పొందిన వేతనం ఆధారంగా పింఛను లెక్కించేందుకు పూర్తివివరాలు అవసరం. ఈ నేపథ్యంలో ఉద్యోగి గతంలో పనిచేసిన యజమాని నుంచి అక్కడ పనిచేసిన సర్వీసుకు సంబంధించి నెలవారీగా పొందిన వేతనం, ఈపీఎఫ్, ఈపీఎస్కు చెల్లించిన చందా వివరాలు, యజమాని నుంచి ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఉమ్మడి ఆప్షన్లో పూర్తివివరాలు నమోదు చేస్తే అర్హులైన వారికి ఈపీఎఫ్వో అధిక పింఛను, ఈపీఎస్లో అదనంగా చెల్లించాల్సిన జమ వివరాలను లెక్కించేందుకు వీలవుతుంది.
* వేర్వేరు సంస్థల్లో పనిచేసినప్పుడు పింఛనునిధికి అదనంగా జమచేయాల్సిన మొత్తాన్ని చెల్లించాల్సిందిగా ప్రస్తుత యజమానికి పీఎఫ్ విభాగం సూచిస్తుంది. అదనపు డిపాజిట్ విషయమై ప్రస్తుత యజమాని, ఉద్యోగి సంయుక్తంగా నిర్ణయం తీసుకుని చెల్లింపులు చేయాలి.
* పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఆప్షన్ ఇచ్చేటప్పుడు అధిక పింఛను ఆప్షన్, అదనపు డిపాజిట్ తదితర వివరాలు, ఆర్థికభారం, వ్యక్తిగత ఆరోగ్య సమస్యలన్నీ మదింపు చేసుకుని నిర్ణయం తీసుకోవాలి.
* ఆన్లైన్ డిక్లరేషన్ ఆధార్తో అనుసంధానమవుతుంది. ఆధార్తో అనుసంధానం కాని ఖాతాలకు ఆన్లైన్ డిక్లరేషన్ను పోర్టల్ అనుమతించదు. అధిక పింఛనుతో కలిగే లాభాల గురించి యజమానులు ఉద్యోగులు, కార్మికులకు అవగాహన కల్పించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మార్చిలోనే వడగాలులు!
దేశంలో మార్చి ఆఖరి వారంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే పరిస్థితులున్నాయి. వడగాలులకూ అవకాశాలున్నాయి. -
న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో భూపాలపల్లి ఫొటోగ్రాఫర్ చిత్రం ప్రదర్శన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ఫొటోగ్రాఫర్, డాక్టర్ అరుణ్కుమార్ నలిమెల అరుదైన ఘనత సాధించారు. -
మౌలిక వసతులతో రెట్టింపు పని
న్యాయమూర్తులు, న్యాయవాదులు తమ విధులను గౌరవప్రదంగా నిర్వహించడానికి న్యాయస్థానాల్లో మౌలిక వసతులు కీలకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. -
వ్యాట్నూ తాగేశారు
మద్యం అమ్మకాల్లో కొన్నేళ్లుగా భారీ స్థాయిలో ‘పన్ను ఎగవేత’ కుంభకోణం జరిగిందని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. -
తాకట్టులోని ఫ్లాట్లకు రిజిస్ట్రేషన్లు..!
స్థిరాస్తి వెంచర్ల పేరిట వేల మంది కొనుగోలుదారులను రూ.వందల కోట్ల మేర మోసగించినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సాహితీ ఇన్ఫ్రాటెక్ నిర్వాహకుల మరో నిర్వాకం వెలుగులోకి వచ్చింది. -
యాదాద్రిని సందర్శించిన భారత నౌకాదళాధిపతి
భారత నౌకాదళాధిపతి అడ్మిరల్ ఆర్.హరికుమార్ తన కుటుంబ సభ్యులతో బుధవారం యాదాద్రిని సందర్శించారు. -
మధుమేహంపై పరిశోధనలకు ఎండోక్రైన్ పాంక్రియాస్ సెంటర్
క్లోమ గ్రంథిలోని ఎండోక్రైన్ పనితీరుపై అధ్యయనం చేయడం.. తద్వారా డయాబెటిస్ చికిత్స పద్ధతులు, పరిష్కారాలను అర్థం చేసుకొని పరిశోధనలు చేసేందుకు ఆసియాలో తొలిసారిగా ఎండోక్రైన్ పాంక్రియాస్ పరిశోధన కేంద్రాన్ని హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ(ఏఐజీ)లో బుధవారం అందుబాటులోకి తెచ్చారు. -
శ్రీవారి సేవలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై.చంద్రచూడ్ దంపతులు బుధవారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. -
ఎన్హెచ్ఎం నిధులు రానట్లే!
జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద కేంద్రం నుంచి రావాల్సిన రూ.348 కోట్ల నిధులపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఆశలు వదులుకుంది. -
పశువుల మేతగా మారుతున్న ఆరుగాలం పంట
ఆరుగాలం శ్రమించి పంట పండించే రైతన్నకు కన్నీరే మిగులుతోంది. ఈ యాసంగి సీజన్లో భూగర్భ జలాలు అడుగంటి, సాగునీటి ప్రాజెక్టుల నుంచి కూడా నీరు అందక పంటలు పొట్టకు వచ్చిన దశలో ఎండిపోతున్నాయి. -
చి‘వరి’కి మిగిలింది చెలమ నీరు..
మండుతున్న ఎండలతో జిల్లాల్లో భూగర్భజలాలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. బోర్లు, బావులు, వాగుల్లో నీరు కరవైంది. -
శ్రీవారి సేవలో తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్
తెలంగాణ ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బుధవారం శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న గవర్నర్కు తితిదే అధికారులు శ్రీవారి మూలమూర్తి దర్శనం చేయించారు. -
భారత్, ఫ్రాన్స్ మధ్య దృఢమైన దౌత్య సంబంధాలు
రాయదుర్గం టీ హబ్లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ శాఖ(బ్యూరో డీ ఫ్రాన్స్) కార్యాలయాన్ని ఆ దేశ రాయబారి థియరీ మాథావు బుధవారం ప్రారంభించారు. -
చెంగిచర్ల పార్థీబస్తీలో బాధితులకు బండి పరామర్శ
హోలీ రోజు హైదరాబాద్ చెంగిచర్ల పార్థీబస్తీలో ఇరువర్గాల ఘర్షణలో గాయాలపాలైన వారిని పరామర్శించేందుకు బుధవారం వచ్చిన భాజపా జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ను పోలీసులు అడ్డుకున్నారు. -
రాష్ట్రంలో తగ్గిన శతాధిక వృద్ధ ఓటర్లు
రాష్ట్రంలో శతాధిక వృద్ధ ఓటర్ల సంఖ్య తగ్గింది. ఏటా నిర్వహించే ఓటర్ల జాబితా సవరణ తరవాత ఈ ఏడాది ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో వీరి సంఖ్య 6,292కు చేరింది. -
రెండు రోజుల్లో జస్టిస్ ఘోష్కు ‘ఉత్తర్వుల’ ప్రతి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు కమిషన్ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల కాపీని.. కమిషన్కు నేతృత్వం వహించనున్న సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్కు నీటిపారుదల శాఖ అందించనుంది. -
ఫోన్ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, సస్పెండైన డీఎస్పీ ప్రణీత్రావుల పోలీస్ కస్టడీ వ్యవహారంలో నాంపల్లి న్యాయస్థానం బుధవారం తీర్పును రిజర్వ్ చేసింది. -
టెట్ రాసేందుకు టీచర్లకు అనుమతి అవసరం లేదు
తెలంగాణలో టెట్-2024 రాసేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు విద్యాశాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన బుధవారం తెలిపారు. -
నెట్ స్కోర్తో పీహెచ్డీ ప్రవేశాలు
విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థల్లో నెట్ స్కోరుతో పీహెచ్డీలో ప్రవేశాలు కల్పించాలని యూజీసీ సూచించింది. -
సంక్షిప్త వార్తలు (3)
ఆర్టీసీ కార్మికులకు 2013 వేతన సవరణకు సంబంధించిన బకాయిలు ఇవ్వడంలో విపరీత జాప్యం జరుగుతోందని ఇకనైనా వెంటనే చెల్లింపులు జరిగేలా చూడాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఐఎన్టీయూసీ అనుబంధ ఎస్డబ్ల్యూయూ విజ్ఞప్తి చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
-
ఫోన్ ట్యాపింగ్ కేసు.. పోలీసుల అదుపులో మరో ఇద్దరు
-
మ్యూచువల్ ఫండ్స్లో మదుపు చేస్తున్నారా? రీకేవైసీకి మార్చి 31 డెడ్లైన్!
-
వివేకా హత్యకేసు.. సీబీఐ కోర్టుకు ఎంపీ అవినాష్రెడ్డి
-
‘హార్దిక్ కెప్టెన్సీ దారుణం’.. సోషల్ మీడియా యూజర్ వ్యాఖ్యలకు భారత మాజీ క్రికెటర్ కౌంటర్
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?