Higher pension: ‘సుప్రీం’ సూచించినా కదలికేది!
ఉద్యోగుల పింఛను పథకం(ఈపీఎస్-95) కింద అధిక పింఛనుకు ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు రూ.15 వేలకు మించిన వేతనంపై 1.16% అదనంగా చెల్లించాలన్న నిబంధనపై ఈపీఎఫ్వో ఎలాంటి ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకోలేదు.
ఉద్యోగి వేతనం నుంచి 1.16% అదనపు చెల్లింపు తగదన్న న్యాయస్థానం
ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలని ప్రతిపాదన
ఇప్పటివరకు నిర్ణయం వెల్లడించని ఈపీఎఫ్వో
అధిక పింఛను చందాదారుల్లో ఆందోళన
ఈనాడు, హైదరాబాద్: ఉద్యోగుల పింఛను పథకం(ఈపీఎస్-95) కింద అధిక పింఛనుకు ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు రూ.15 వేలకు మించిన వేతనంపై 1.16% అదనంగా చెల్లించాలన్న నిబంధనపై ఈపీఎఫ్వో ఎలాంటి ప్రత్యామ్నాయ నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగుల వేతనం నుంచి అదనంగా తీసుకోవడం సామాజిక భద్రత నిబంధనలకు విరుద్ధమని, పింఛను నిధికి అదనపు చెల్లింపుల నిర్ణయాన్ని ఆరు నెలలపాటు నిలిపివేస్తున్నట్లు సుప్రీంకోర్టు నవంబరులో తెలిపింది. ఆలోగా చట్టసవరణ/ ఇతర మార్గాల ద్వారా ఆ మేరకు నిధులను సమీకరించే ప్రయత్నాలను పరిశీలించాలని సూచించింది. న్యాయస్థానం ఇచ్చిన గడువులో ఇప్పటికే నాలుగు నెలలు పూర్తయినప్పటికీ ఈపీఎఫ్వో దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం వెలువరించకపోవడం గమనార్హం.
ఎందుకీ 1.16 శాతం...?
పింఛను నిధి పథకానికి ఈపీఎఫ్వో 2014 సెప్టెంబరు 1న సవరణలు చేసింది. అంతకు ముందు అధిక వేతనంపై అధిక పింఛను కోసం యజమానితో కలిసి పేరా 11(3)కింద ఉమ్మడి ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులంతా.. సవరణ తర్వాత పేరా 11(4) కింద ఆరునెలల్లోగా మరోసారి ఆప్షన్ ఇవ్వాలని సూచించింది. ఆప్షన్ ఇవ్వకుంటే ఉద్యోగి అధిక పింఛను ఆప్షన్ను వదులుకున్నట్లుగా భావిస్తామని తెలిపింది. అప్పటివరకు పింఛను నిధి(ఈపీఎస్)లో గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేలకు లోబడి 8.33% ప్రకారం రూ.1250కి మించి ఎంత ఎక్కువగా యజమాని వాటాగా జమ అయిందో ఆ మొత్తాన్ని తిరిగి ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాకు వడ్డీతో సహా మళ్లిస్తామంది. సాధారణంగా రూ.15 వేల వేతన పరిమితి వరకు ఉద్యోగుల వాటా కింద కేంద్ర ప్రభుత్వం 1.16% మొత్తాన్ని జమచేస్తోంది. 11(4) కింద ఆరునెలల్లోగా అధిక పింఛను కోసం ఆప్షన్ ఇచ్చిన ఉద్యోగులు రూ.15 వేలకు మించి అదనపు వేతనంపై 1.16% చొప్పున తనవంతు వాటాగా ఇవ్వాలని ఈపీఎఫ్వో షరతు పెట్టింది. ఇది సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
ఆదాయ మార్గాలపై కసరత్తు
అధిక పింఛను అర్హత కలిగిన ఉద్యోగుల నుంచి 1.16% వసూలు చేయకూడదని చెప్పిన సుప్రీంకోర్టు ఆ మేరకు అదనపు ఆదాయమార్గాలపై కసరత్తు చేయాలని తెలిపింది. దాంతో యజమాని నుంచి ఈ మొత్తం వసూలు చేసేలా 8.33% వాటా పెంచడమా? చట్ట సవరణతో యజమాని వాటా 10 లేదా 12 శాతం పూర్తిగా ఈపీఎస్కు మళ్లించడమా అనే విషయాలను ఈపీఎఫ్వో ప్రాథమికంగా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. వీటిపై ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు పింఛను లెక్కింపు విధానంలో మార్పులు జరిగే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. కనీస పింఛను రూ.2వేలు లేదా రూ.3వేలు చేసేందుకు నియమించిన ఈపీఎఫ్ పింఛను నిపుణుల కమిటీ పలు సంస్కరణలు సూచించింది. కనీస వేతన పరిమితి పెంచడంతోపాటు పింఛను పొందేందుకు ప్రస్తుతమున్న కనీస సర్వీసు పదేళ్ల నుంచి 15 ఏళ్లకు పెంచాలని తెలిపింది. ఈపీఎస్ నుంచి ముందస్తు ఉపసంహరణలు పూర్తిగా నిలిపివేయాలని ప్రతిపాదించింది.
ఏదీ సందేహాల నివృత్తి?
అధిక పింఛను కోసం ఆన్లైన్ దరఖాస్తును ఇప్పటికే ఈపీఎఫ్వో అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే... ఉద్యోగుల సందేహాలను నివృత్తి చేసే వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. పేరా 26(6) కింద ఇచ్చిన ఉమ్మడి ఆప్షన్ ఆధారం దొరకనప్పుడు ఏమి చేయాలి? తర్వాత ఇచ్చేందుకు అవకాశముందా? మూతపడిన సంస్థల్లో పనిచేసిన ఉద్యోగులకు ప్రత్యామ్నాయం ఏమిటనే సందేహాలతో పలువురు చందాదారులు ఈపీఎఫ్వో కార్యాలయాల్లో సంప్రదిస్తున్నా అధికారులు సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు. కేంద్ర కార్యాలయం నుంచి ఏమైనా వివరాలు వస్తే వెల్లడిస్తాం. అప్పటివరకు ఏమీ చెప్పలేమని చెబుతుండటంతో చందాదారులు గందరగోళానికి గురవుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం