ఈడీ సమన్లపై సుప్రీంకు కవిత
దిల్లీ మద్యం కేసులో తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కె.కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోంది.. నన్నూ హింసించే ప్రమాదం ఉంది
పిటిషన్లో పేర్కొన్న ఎమ్మెల్సీ
16న హాజరు కావాలన్న ఉత్తర్వుల రద్దుకు వినతి
అత్యవసర విచారణకు సీజేఐ నిరాకరణ
ఈ నెల 24న చేపడతామని వెల్లడి
నేడు మరోసారి ఈడీ ముందుకు కవిత
ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం కేసులో తనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీ చేసిన సమన్లను సవాల్ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కె.కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 11న ఒకసారి విచారించిన ఈడీ.. 16వ తేదీన మరోసారి హాజరు కావాలని ఆదేశించిన నేపథ్యంలో ఆమె సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును బుధవారం ఆమె తరఫు న్యాయవాదులు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు ప్రస్తావించి.. అత్యవసర విచారణ చేపట్టాలని కోరారు. కానీ సీజేఐ వెంటనే విచారణ చేపట్టడానికి నిరాకరిస్తూ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. మహిళలను వారు నివసించే చోటే విచారించాలన్న సీఆర్పీసీ సెక్షన్ 160 నిబంధనలకు విరుద్ధంగా.. తనను వ్యక్తిగతంగా హాజరు కావాలని ఈడీ ఇచ్చిన సమన్లను రద్దు చేయాలని కవిత ఆ పిటిషన్లో కోరారు. నిందితులపై ఈడీ థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తోందని, తనను కూడా హింసించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై ఈడీ కఠినచర్యలు తీసుకోకుండా ఆదేశించాలని, ఈ నెల 11న తాను స్వచ్ఛందంగా ఫోన్ను అప్పగించినట్లు ఈడీ స్వాధీన ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసులో సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో తన పేరు లేకపోయినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన కొందరి ప్రోద్బలం వల్లే ఈడీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టిందని కవిత తన పిటిషన్లో పేర్కొన్నారు.
పిటిషన్లో పేర్కొన్న ఇతర అంశాలు
* ‘మహిళా రిజర్వేషన్ల కోసం దిల్లీలోని జంతర్మంతర్లో ధర్నా చేయబోతున్నట్లు నేను ఈ నెల 2న ప్రకటన చేయగా, ఈడీ 7వ తేదీన నగదు అక్రమ చలామణి నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) సెక్షన్ 50(2) (3) కింద నోటీసులు జారీచేసి 9వ తేదీన సాక్షిగా హాజరుకావాలని ఆదేశించింది. నాకున్న హక్కు ప్రకారం ఇంట్లో కానీ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గానీ విచారించాలని చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 11న విచారణకు హాజరయ్యాను.
* విచారణ సమయంలో.. నిబంధనలకు విరుద్ధంగా నా సెల్ఫోన్ను స్వాధీనం చేసుకున్న ఈడీ అందుకు కారణాలను మాత్రం చెప్పలేదు. స్వాధీన ఉత్తర్వుల్లో నేనే వారికి ఫోన్ను స్వచ్ఛందంగా అప్పగించినట్లు అధికారులు పేర్కొన్నారు. అది అవాస్తవం. అరెస్టయిన నిందితులతో కలిపి నన్ను విచారించాల్సి ఉందని ఈడీ చెప్పినా.. ఆ రోజు నిందితులెవరినీ నా ముందుకు తీసుకురాలేదు. సూర్యాస్తమయం అయ్యాక కూడా రాత్రి 8.30 గంటల వరకు విచారణ కొనసాగించారు.
* నాపై ఎలాంటి కేసూ లేదు. కొందరు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగానే నన్ను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారు. కస్టడీలో ఉన్న వారిని భయపెట్టి, బలవంతంగా వాంగ్మూలాలు తీసుకున్నారు. తన వాంగ్మూలాన్ని ఉపసంహరించుకోవడానికి అవకాశమివ్వాలంటూ ఈ నెల 10వ తేదీన అరుణ్ రామచంద్రపిళ్లై కోర్టును ఆశ్రయించడమే ఇందుకు ఉదాహరణ.
* దర్యాప్తు సమయంలో ఈడీ తీవ్రమైన చర్యలకు పాల్పడుతోంది. థర్డ్డిగ్రీకీ దిగుతోంది. ఇ.చందన్రెడ్డి అనే వ్యక్తిని ఈడీ అధికారులు తీవ్రంగా కొట్టడం వల్ల ఆయన వినికిడి శక్తిని కోల్పోయారు.
* ఇతర నిందితులు, సాక్షులకు ఎదురైన అనుభవాలను బట్టి చూస్తే ఈడీ నన్ను భౌతికంగా, మానసికంగా హింసించే ప్రమాదం ఉన్నట్లు అనుమానం కలుగుతోంది. అందువల్ల మళ్లీ ఈడీ ముందు హాజరైతే నాకు తీవ్ర హాని కలిగే ప్రమాదం ఉంది. విచారణ కోసం పిలిచిన వ్యక్తుల వాంగ్మూలాలను ఆడియో, వీడియో రికార్డింగ్ చేయడంతోపాటు సమీపంలో న్యాయవాది ఉండేలా అనుమతివ్వాలి. విచారణ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
నేడు మరోసారి ఈడీ ముందుకు
ఎమ్మెల్సీ కవిత గురువారం మరోసారి దిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. ఆమెను ఈ నెల 11వ తేదీన సుమారు 8 గంటలపాటు ఈడీ అధికారులు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. ఈ నెల 16వ తేదీన మరోసారి రావాలని అదేరోజు ఈడీ సమన్లు జారీచేసింది. ఆ సమన్లను రద్దు చేయాలని ఆమె బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. విచారణ 24వ తేదీకి వాయిదా వేసిన నేపథ్యంలో ఆమె హాజరు అనివార్యమైంది.
దిల్లీలో పాత మద్యం విధానానికి మరో 6 నెలల పొడిగింపు
దిల్లీ: దిల్లీలో పాత మద్యం విధానాన్ని మరో 6 నెలలపాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ కార్పొరేషన్లే మరో 6 నెలలపాటు మద్యాన్ని విక్రయిస్తాయి. పొడిగింపుతో మార్చి 31న ముగియనున్న పాత విధానం సెప్టెంబరు 30 వరకూ కొనసాగనుంది. కొత్త మద్యం విధానం వివాదాస్పదమై సీబీఐ, ఈడీ కేసులకు దారితీసిన నేపథ్యంలో పాత విధానానికి కొనసాగింపు ఇవ్వడం గమనార్హం. అయితే కొత్త విధానాన్ని వచ్చే మూడు నెలల్లో సిద్ధం చేయాలని అధికారులను దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల