లీకేజీ వెనక ఎవరున్నా వదలం
తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో ప్రశ్నపత్రాల లీకేజీల వెనుక ఎవరున్నా వదలబోమని, రద్దయిన పరీక్షలను వీలైనంత త్వరగా పకడ్బందీగా నిర్వహిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు స్పష్టంచేశారు.
వీలైనంత త్వరగా గ్రూప్-1తో పాటు రద్దయిన పరీక్షలు నిర్వహిస్తాం
గతంలో పరీక్ష రాసిన వారికి ఫీజు మినహాయింపు
ఆన్లైన్లో ఉచితంగా స్టడీ మెటీరియల్
పేపర్ల లీకేజీ వెనక రాజకీయ కుట్ర
భాజపాపై అనుమానంతో డీజీపీకి ఫిర్యాదు చేశాం
నిందితుడు రాజశేఖర్రెడ్డి ఆ పార్టీ క్రియాశీల కార్యకర్త
ఉద్యోగార్థులు అపోహలు నమ్మొద్దు
మంత్రి కేటీ రామారావు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీఎస్పీఎస్సీ)లో ప్రశ్నపత్రాల లీకేజీల వెనుక ఎవరున్నా వదలబోమని, రద్దయిన పరీక్షలను వీలైనంత త్వరగా పకడ్బందీగా నిర్వహిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు స్పష్టంచేశారు. గతంలో దరఖాస్తు చేసుకొని, ఈ పరీక్షలను రాసిన వారంతా మళ్లీ పరీక్షలకు అర్హులేనని, మరోసారి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఈ పరీక్షలకు సంబంధించిన స్టడీ మెటీరియల్ను ఆన్లైన్లో ఉచితంగా అందుబాటులో పెడతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టడీ సర్కిళ్లను బలోపేతం చేస్తామని, వాటితోపాటు జిల్లాల్లో రీడింగు రూమ్లు 24 గంటలు తెరిచే ఉంటాయని, వాటిల్లోనూ ఉచిత స్టడీ మెటీరియల్తోపాటు భోజన వసతి కల్పిస్తామని చెప్పారు. శనివారం బీఆర్కే భవన్లో ఆయన మంత్రులు శ్రీనివాస్గౌడ్, సబితారెడ్డి, గంగుల కమలాకర్, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిలతో కలిసి కేటీఆర్ విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్లో ప్రశ్నపత్రాల లీకేజీ వెనక రాజకీయ కుట్ర ఉందని ఈ సందర్భంగా కేటీఆర్ ఆరోపించారు. లీకేజీకి బాధ్యునిగా తేలిన వ్యక్తుల్లో ఒకరైన రాజశేఖర్రెడ్డి భాజపా క్రియాశీల కార్యకర్త అని తెలిపారు. దేశంలోనే అత్యంత సమర్థంగా పనిచేస్తున్న సంస్థగా పేరొందిన టీఎస్పీఎస్సీలో పనిచేసే రాజశేఖర్రెడ్డి, ప్రవీణ్లు చేసిన తప్పు వ్యవస్థకే చెడ్డ పేరు తెచ్చిందని తెలిపారు. వీరిద్దరే కాదు ఇంకా ఎవరున్నా వదలిపెట్టబోమని, చట్టపరంగా కఠినంగా శిక్షిస్తామన్నారు. సంస్థలో మరోసారి తప్పిదాలు జరగకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకునే బాధ్యత తమపై ఉందన్నారు.
దేశంలోనే అత్యుత్తమ సంస్థ టీఎస్పీఎస్సీ
‘టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ దురదృష్టకరం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 155 నోటిఫికేషన్లు విడుదలవగా... 99 పరీక్షలను నిర్వహించాం. 37 వేల ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీచేశాం. ఒక్క ఆరోపణా రాలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏపీపీఎస్సీపై ఎన్నో ఆరోపణలు వచ్చాయి. తెలంగాణలో పక్షపాత ధోరణి కారణంగా ఎవ్వరూ నష్టపోవద్దని ఇంటర్వ్యూలను రద్దు చేశాం. రాతపరీక్ష, మెరిట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు జరుపుతున్నాం. ఒకేసారి 10 లక్షల మందికి పరీక్ష నిర్వహించి భారతదేశంలోనే అత్యుత్తమ పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో ఒకటిగా టీఎస్పీఎస్సీ గుర్తింపు పొందింది. కాలానుగుణంగా సాంకేతికంగా ముందుకెళ్తోంది. అందులో భాగంగానే ఓటీఆర్ (వన్ టైం రిజిస్ట్రేషన్) విధానం, డిజిటల్ చెల్లింపులు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించిన ఘనతనూ సాధించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులు రెండుసార్లు తెలంగాణకు వచ్చి టీఎస్పీఎస్సీపై అధ్యయనం చేశారు. దేశంలోని 13 రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సభ్యులు వచ్చి... ఇక్కడి విధివిధానాలపై అధ్యయనం చేసి ఆయా రాష్ట్రాల్లోనూ అమలు చేశారు. గత తొమ్మిదేళ్లుగా దేశంలోనే అత్యధిక ఉద్యోగాలను భర్తీ చేసిన సంస్థగా గుర్తింపు పొందింది. 28 రాష్ట్రాల్లో ఎక్కడా జరగని విధంగా ఏడు (తెలుగు, హిందీ, ఉర్దూ, ఆంగ్లం, బెంగాలీ, కన్నడ, మరాఠీ) భాషల్లో ఒకేసారి పరీక్షలు నిర్వహించింది. మేము 1లక్ష ఉద్యోగాలని చెప్పి... 2లక్షల నియామకాలను వేగంగా భర్తీ చేస్తున్నాం. టీఎస్పీఎస్సీలో రానున్న రోజుల్లో చాలా మార్పులు వస్తాయి. దీనిపై నిపుణులతో చర్చలు జరుపుతున్నాం.
పిల్లల జీవితాలతో ఆడుకోవద్దు
ప్రశ్నపత్రాల లీకేజీ ఇద్దరు వ్యక్తులు చేసిన తప్పు మాత్రమే. పరీక్షలను రద్దు చేయడంతో లక్షల మంది పిల్లలకు ఇబ్బంది కలుగుతోంది. మేం కూడా బాధపడుతున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు అనే పునాది మీదనే తెలంగాణ ఉద్యమం నడిచింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ భారతదేశంలో ఏ ప్రభుత్వం చేయని గొప్ప పనిచేశారు. స్థానికులకు 95% రిజర్వేషన్లు కల్పించారు. యువతను రెచ్చగొట్టేలా, ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేలా కొందరు మాట్లాడుతున్నారు. రాజకీయ నిరుద్యోగుల వ్యాఖ్యలను పట్టించుకోవద్దు. అపోహలు, అనుమానాలను యువత నమ్మొద్దు. లీకేజీలో నిందితుడైన రాజశేఖర్రెడ్డి భాజపా క్రియాశీల కార్యకర్త. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. సామాజిక మాధ్యమాల్లోనూ యాక్టివ్గా ఉన్నారు. ఆ పార్టీకి ఓటు వేయాలంటూ ప్రచారం చేస్తున్న ఫొటోలు కూడా బయటికి వచ్చాయి. అలాంటి వ్యక్తి దీని వెనకాల ఉన్నాడంటే మాకు అనుమానం ఉంది. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇస్తుంటే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీన్ని కుట్ర అన్నారు. నోటిఫికేషన్లపై కుట్ర చేశారనే అనుమానం మాకుంది. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయాలనే కుట్ర ఏమైనా ఉందా అనే అనుమానాలు ఉన్నాయి. దీనిపై లోతైన విచారణ జరపాలని డీజీపీకి భారాస తరఫున ఫిర్యాదు చేశాం. కొందరు ఇష్టారాజ్యంగా నాపై ఆరోపణలు చేస్తున్నారు. టీఎస్పీఎస్సీ రాజ్యాంగబద్ధమైన స్వయంప్రతిపత్తి ఉన్న సంస్థ. అందులో మేం జోక్యం చేసుకోం. నాకు లీకేజీతో సంబంధం ఏమిటి? ఐటీ మంత్రిని అయితే రాష్ట్రంలో ఉన్న ప్రతీ కంప్యూటర్కు నేనే బాధ్యుడినా? పేపర్ లీకైతే నేనెందుకు రాజీనామా చేయాలి? అస్సాం, యూపీ, గుజరాత్లలోనూ పేపర్ లీకేజీలు జరిగాయి. అక్కడ మంత్రులు రాజీనామాలు చేశారా? కానీ... ఆరోపణలను నివృత్తి చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చిన వాళ్లకు బాధ ఉంటుంది. జరిగిన తప్పుల కారణంగా... అర్హత పొందిన వారు ఇబ్బంది పడకూడదు. సిట్ విచారణ పూర్తి కాకుండానే దానిపై నమ్మకం లేదనడం సరైంది కాదు. రాష్ట్రంలో ఎన్నికలు కొద్దిరోజుల్లోనే ఉన్నాయి. ప్రజలకు ఎవరు ఏంటో తెలుసు. కేంద్రంలో 16 లక్షల ఖాళీలు ఎందుకు భర్తీ చేయడంలేదు? కేంద్ర ప్రభుత్వం... ప్రభుత్వరంగ సంస్థలను మూసివేసి నిరుద్యోగాన్ని పెంచుతోంది’ అని కేటీఆర్ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం