సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏప్రిల్లో ప్రారంభం
సైబర్ భద్రతే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్ సీఎస్బీ)ను ఏప్రిల్లో ప్రారంభించేందుకు పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోంది.
కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని రెండు అంతస్తుల్లో ఏర్పాటు
ఈనాడు, హైదరాబాద్: సైబర్ భద్రతే లక్ష్యంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో(టీఎస్ సీఎస్బీ)ను ఏప్రిల్లో ప్రారంభించేందుకు పోలీసు శాఖ సన్నాహాలు చేస్తోంది. తెలంగాణ కమాండ్ కంట్రోల్ కేంద్రంలోని రెండు అంతస్తుల్లో ఈ విభాగం కొలువుదీరనుంది. ఈ కేంద్రాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, పోలీస్ కమిషనరేట్లతో అనుసంధానం చేస్తున్నారు. డీజీపీ అంజనీకుమార్, సైబరాబాద్ కమిషనర్, టీఎస్ సీఎస్బీ డైరెక్టర్ స్టీఫెన్ రవీంద్ర, హైదరాబాద్ సంయుక్త కమిషనర్లు పరిమళ హన నూతన్, గజరావ్భూపాల్, టీఎస్ సీఎస్బీ అడ్మిన్, ఆపరేషన్స్ ఎస్పీలు కేసీఎస్ రఘువీర్, విశ్వజిత్ కంపాటి, ఇంటెలిజెన్స్ ఎస్పీ ఎస్ఎం.విజయ్కుమార్ తదితరులు సోమవారం కమాండ్ కంట్రోల్ కేంద్రంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. విశ్వజిత్ కంపాటి, కేసీఎస్ రఘువీర్ను డీజీపీ ప్రత్యేకంగా అభినందించారు.
* సీఎస్బీలో హెల్ప్లైన్, సైబర్ కంట్రోల్ రూమ్, కేంద్ర పర్యవేక్షణ విభాగం, డేటా ఎనాలసిస్, థ్రెట్ ఇంటెలిజెన్స్, ఫోరెన్సిక్ సపోర్ట్ యూనిట్లు ఉంటాయి. దీనికి ప్రభుత్వం 500 పోస్టులను కేటాయించింది.
* దర్యాప్తు, న్యాయ విచారణకు ఇన్వెస్టిగేషన్ప్రాసిక్యూషన్ సపోర్ట్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నారు. సైబర్ ల్యాబ్, అకాడమీలు రానున్నాయి.
* డిసెంబరులోగా బ్యూరోలో పూర్తిస్థాయి కార్యకలాపాలు కొనసాగిస్తుంది. అనంతరం సీఐడీ దగ్గరున్న సైబర్ నేరాల కేసులు దీనికి బదిలీ అవుతాయి. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఉన్న సైబర్ నేరాల కేంద్రాలు కూడా బ్యూరోకు అనుసంధానమవుతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విదేశాల్లో ఉన్న ఎస్ఐబీ మాజీ ఓఎస్డీ ప్రభాకర్రావును తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. బెయిల్ పిటిషన్ల కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టైన నిందితుల బెయిల్ పిటిషన్లను నాంపల్లి కోర్టు శుక్రవారం కొట్టివేసింది. -
గుత్తేదారు స్పందించకపోతే అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదు?
మేడిగడ్డ బ్యారేజీలో సీసీ బ్లాకులు కొట్టుకుపోవడం, ఆప్రాన్ దెబ్బతినడంతో సహా పలు నష్టాల గురించి గుత్తేదారుకు లేఖలు రాసినా స్పందించనప్పుడు.. అప్పుడే ఎందుకు చర్యలు తీసుకోలేదని కాళేశ్వరం ఎత్తిపోతలపై న్యాయ విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించినట్లు తెలిసింది. -
30 వరకు బీఎడ్ వెబ్ఆప్షన్
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో బీఎడ్(ఓడీఎల్) వెబ్ ఆప్షన్, పీహెచ్డీ ప్రవేశ పరీక్షకు చివరి తేదీలను శుక్రవారం ప్రకటించారు. -
కార్బైడ్ ఉపయోగిస్తే కఠిన చర్యలు
కార్బైడ్ వంటి నిషేధిత రసాయనాలను ఉపయోగించి కృత్రిమ విధానంతో కాయలను మాగబెట్టి పండ్లుగా మారిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆహార భద్రత కమిషనర్ ఆర్.వి.కర్ణన్ హెచ్చరించారు. -
కార్టూన్
-
ఇదీ సంగతి!
-
సంక్షిప్త వార్తలు
ఈపీఎఫ్వో పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, కార్మికులు, పింఛనుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ నెల 29న ‘‘నిధి ఆప్కే నికత్’’ కార్యక్రమం చేపడుతున్నట్లు హైదరాబాద్ ప్రాంతీయ పీఎఫ్ కమిషనర్ అర్జున్ తుక్రాల్ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్