హైదరాబాద్ నుంచి కొత్తగూడెంకు కొత్త మార్గం
రాజధాని నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలానికి ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రానుంది. ఈ మార్గం హైదరాబాద్లోని గౌరెల్లి (అవుటర్ రింగు రోడ్డు) నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా.
భద్రాచలానికి 35 కి.మీ. తగ్గనున్న ప్రయాణ దూరం
230 కి.మీ. మేర విస్తరణ
ఇందులో 125 కి.మీ. కొత్త రహదారి
ఈనాడు, హైదరాబాద్: రాజధాని నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలానికి ప్రత్యామ్నాయ మార్గం అందుబాటులోకి రానుంది. ఈ మార్గం హైదరాబాద్లోని గౌరెల్లి (అవుటర్ రింగు రోడ్డు) నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ, వరంగల్ జిల్లా తొర్రూరు, నెహ్రూనగర్ (నర్సంపేట) మీదుగా కొత్తగూడెం వరకు 230 కి.మీ. ఉంటుంది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి భద్రాచలం వెళ్లాలంటే సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం మీదుగా వెళ్లాలి. గౌరెల్లి, వలిగొండ, నర్సంపేట మీదుగా వెళ్లే కొత్త మార్గం అందుబాటులోకి వస్తే హైదరాబాద్ నుంచి భద్రాచలానికి 35 కిలోమీటర్ల వరకు దూరం తగ్గుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన మేరకు ఈ మార్గాన్ని జాతీయ రహదారిగా విస్తరించడానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. ఈ మార్గంలో 42.5 కిలోమీటర్ల మేర నాలుగు వరుసలుగా నిర్మిస్తారు. మిగిలిన మార్గాన్ని ఎన్హెచ్ ప్రమాణాలతో రెండు వరుసలుగా విస్తరిస్తారు. సుమారు రూ.2,740 కోట్ల వ్యయంతో పనులు చేపట్టనున్నారు. కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు 40 కిలోమీటర్ల వరకు మార్గాన్ని గతంలోనే 4 వరుసలుగా విస్తరించారు.
సుమారు 230 కిలోమీటర్ల ఈ మార్గంలో 125 కిలోమీటర్లకుపైగా కొత్త రహదారి నిర్మిస్తారు. వరంగల్ జిల్లాలో తొర్రూరు - నెహ్రూనగర్ మార్గంలో 25 శాతం, నెహ్రూనగర్ నుంచి కొత్తగూడెం మార్గంలో 75 శాతం నూతన రహదారిని నిర్మించనున్నారు. మొత్తం మార్గాన్ని నాలుగు ప్యాకేజీలుగా విభజించి పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. గౌరెల్లి నుంచి వలిగొండ వరకు ఒక ప్యాకేజీగా విస్తరించేందుకు కేంద్రం రూ.690 కోట్లు కేటాయించింది. ఈ ప్యాకేజీకి గుత్తేదారును సైతం ఎంపిక చేశారు. వలిగొండ నుంచి తొర్రూరు మార్గానికి రూ.549 కోట్లు, తొర్రూరు నుంచి వరంగల్ జిల్లా నెహ్రూనగర్ వరకు రూ.675 కోట్లు, నెహ్రూనగర్ నుంచి కొత్తగూడెం వరకు రూ.826 కోట్ల వ్యయంతో రహదారిని విస్తరించనున్నారు. ఈ మూడు ప్యాకేజీలకు త్వరలో టెండర్లు ఆహ్వానించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మార్గాన్ని రెండున్నర నుంచి మూడు సంవత్సరాల్లో అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు.
మెరుగుపడనున్న అనుసంధానం
ఈ రహదారి మావోయిస్టు ప్రభావిత, వెనుకబడిన మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 126 కిమీ మేర వెళుతుందని కేంద్రం పేర్కొంది. ఈ జిల్లాల్లో మెరుగైన రహదారి అనుసంధానం కారణంగా మావోయిస్టు కార్యకలాపాలను మెరుగ్గా నిరోధించడానికి వీలవుతుందని తెలిపింది. అలానే బొగ్గు గనులు, ధర్మల్ విద్యుత్ కేంద్రాలు, పేపర్ మిల్లులు, ఆయిల్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు రాజధానితో అనుసంధానం పెరుగుతుందని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే