నయన మనోహరం.. జగదభిరాముని కల్యాణం
దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం దివ్యక్షేత్రంలో జగదేకవీరుడు శ్రీరాముడు, జగన్మాత సీతమ్మల కల్యాణ వేడుక గురువారం ఆద్యంతం కనులపండువగా సాగింది.
శ్రీరామనామస్మరణతో మార్మోగిన భద్రాచలం
ఈటీవీ - ఖమ్మం, న్యూస్టుడే - భద్రాచలం: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం దివ్యక్షేత్రంలో జగదేకవీరుడు శ్రీరాముడు, జగన్మాత సీతమ్మల కల్యాణ వేడుక గురువారం ఆద్యంతం కనులపండువగా సాగింది. శ్రీరామ నామస్మరణతో భద్రగిరి మార్మోగింది. మూడుముళ్ల బంధంతో సీతారాములు ఒక్కటైన మధురక్షణాలను భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. మిథిలా మండపంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు కల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అర్చకులు తొలుత తిరు కల్యాణానికి సంకల్పం పలికి స్వర విజ్ఞానశాంతికి విష్వక్సేనులను ఆరాధించారు. పుణ్యహవాచనం నిర్వహించి కల్యాణ సామగ్రిని సంప్రోక్షణ చేశారు. దర్భలతో ప్రత్యేకంగా అల్లిన తాడును సీతమ్మ వారి నడుముకు బిగించి యోక్త్రధారణ జరిపించారు. సీతారాముల వారికి రక్షాసూత్రాలు కట్టి గృహస్థాశ్రమ సిద్ధి కోసం రామయ్యకు యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. వేదమంత్రాలు మార్మోగుతుండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర- బెల్లాన్ని సీతారాముల శిరస్సులపై ఉంచారు. మాంగల్యధారణ అట్టహాసంగా సాగింది. ఎక్కడైనా రెండు సూత్రాలుంటాయి. ఇక్కడ మాత్రం పుట్టింటి వారి తరఫున ఒకటి, మెట్టింటి వారి తరఫున ఒకటి.. భక్తరామదాసు తరఫున మరో సూత్రం కలిపి మూడు సూత్రాలతో మాంగల్యధారణ నిర్వహించటం విశేషమని స్థానాచార్యులు స్థలసాయి, వేద పండితుడు మురళీకృష్ణమాచార్యులు, ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులు ప్రవచించారు.
పట్టువస్త్రాలు సమర్పించిన దేవాదాయశాఖ మంత్రి
శ్రీరామనవమికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి తీసుకురావడం సంప్రదాయంగా వస్తున్నా సీఎం కేసీఆర్ ఈసారి రాలేకపోయారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, కమిషనర్ అనిల్కుమార్ ప్రభుత్వం తరఫున సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. తితిదే, శృంగేరీ పీఠం ప్రతినిధులు, భక్తరామదాసు పదోతరం వారసుడు కంచర్ల శ్రీనివాస్ దంపతులు, త్రిదండి చినజీయర్ స్వామి కూడా సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు.
సీతమ్మ అవతరించింది శోభకృత్లోనే
కల్యాణమంటే ప్రతి ఒక్కరికీ భద్రాచలంలో నిర్వహించే వేడుకే గుర్తొస్తుందని త్రిదండి చినజీయర్ స్వామి ప్రవచించారు. శ్రీరాములు అవతరించిన శ్రీరామనవమి రోజే కల్యాణం నిర్వహించే సంప్రదాయాన్ని భక్తరామదాసు ప్రవేశపెట్టగా.. తూము లక్ష్మీనరసింహదాసు కొనసాగించారని పేర్కొన్నారు. ఇది శోభకృత్ నామ సంవత్సరమని.. సీతమ్మ వారు అవతరించింది ఈ ఏడాదేనని, ఇలాంటి సంవత్సరంలో వీక్షించే కల్యాణం ఎంతో గొప్పదని విశ్లేషించారు. శ్రీ భద్రాచల రామదాసు పీఠం తరఫున రూపొందించిన సంక్షేప రామాయణం సీడీని మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలిసి జీయర్స్వామి ఆవిష్కరించారు.
నీ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ ప్రణాళికతో ఏర్పాట్లు చేశామని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. 70 కౌంటర్లలో 200 క్వింటాళ్ల తలంబ్రాలు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. 19 కౌంటర్లలో ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉంచామని చెప్పారు.
ఈ వేడుకల్లో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నవీన్రావు, జస్టిస్ భీమపాక నగేశ్, జస్టిస్ శ్రీదేవి, జస్టిస్ అభిషేక్రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, తితిదే మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ తదితరులు హాజరయ్యారు.
నేడు పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్
ఈనాడు, హైదరాబాద్: భద్రాచలంలో శుక్రవారం నిర్వహించనున్న శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హాజరుకానున్నారు. ఆమె రైలులో కొత్తగూడెం వెళ్లి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలానికి చేరుకుంటారని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం