నయన మనోహరం.. జగదభిరాముని కల్యాణం
దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం దివ్యక్షేత్రంలో జగదేకవీరుడు శ్రీరాముడు, జగన్మాత సీతమ్మల కల్యాణ వేడుక గురువారం ఆద్యంతం కనులపండువగా సాగింది.
శ్రీరామనామస్మరణతో మార్మోగిన భద్రాచలం
ఈటీవీ - ఖమ్మం, న్యూస్టుడే - భద్రాచలం: దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం దివ్యక్షేత్రంలో జగదేకవీరుడు శ్రీరాముడు, జగన్మాత సీతమ్మల కల్యాణ వేడుక గురువారం ఆద్యంతం కనులపండువగా సాగింది. శ్రీరామ నామస్మరణతో భద్రగిరి మార్మోగింది. మూడుముళ్ల బంధంతో సీతారాములు ఒక్కటైన మధురక్షణాలను భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. మిథిలా మండపంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు కల్యాణ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా జరిగింది. అర్చకులు తొలుత తిరు కల్యాణానికి సంకల్పం పలికి స్వర విజ్ఞానశాంతికి విష్వక్సేనులను ఆరాధించారు. పుణ్యహవాచనం నిర్వహించి కల్యాణ సామగ్రిని సంప్రోక్షణ చేశారు. దర్భలతో ప్రత్యేకంగా అల్లిన తాడును సీతమ్మ వారి నడుముకు బిగించి యోక్త్రధారణ జరిపించారు. సీతారాముల వారికి రక్షాసూత్రాలు కట్టి గృహస్థాశ్రమ సిద్ధి కోసం రామయ్యకు యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు. వేదమంత్రాలు మార్మోగుతుండగా అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర- బెల్లాన్ని సీతారాముల శిరస్సులపై ఉంచారు. మాంగల్యధారణ అట్టహాసంగా సాగింది. ఎక్కడైనా రెండు సూత్రాలుంటాయి. ఇక్కడ మాత్రం పుట్టింటి వారి తరఫున ఒకటి, మెట్టింటి వారి తరఫున ఒకటి.. భక్తరామదాసు తరఫున మరో సూత్రం కలిపి మూడు సూత్రాలతో మాంగల్యధారణ నిర్వహించటం విశేషమని స్థానాచార్యులు స్థలసాయి, వేద పండితుడు మురళీకృష్ణమాచార్యులు, ప్రధానార్చకుడు సీతారామానుజాచార్యులు ప్రవచించారు.
పట్టువస్త్రాలు సమర్పించిన దేవాదాయశాఖ మంత్రి
శ్రీరామనవమికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలను ముఖ్యమంత్రి తీసుకురావడం సంప్రదాయంగా వస్తున్నా సీఎం కేసీఆర్ ఈసారి రాలేకపోయారు. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, కమిషనర్ అనిల్కుమార్ ప్రభుత్వం తరఫున సీతారాములకు పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. తితిదే, శృంగేరీ పీఠం ప్రతినిధులు, భక్తరామదాసు పదోతరం వారసుడు కంచర్ల శ్రీనివాస్ దంపతులు, త్రిదండి చినజీయర్ స్వామి కూడా సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించారు.
సీతమ్మ అవతరించింది శోభకృత్లోనే
కల్యాణమంటే ప్రతి ఒక్కరికీ భద్రాచలంలో నిర్వహించే వేడుకే గుర్తొస్తుందని త్రిదండి చినజీయర్ స్వామి ప్రవచించారు. శ్రీరాములు అవతరించిన శ్రీరామనవమి రోజే కల్యాణం నిర్వహించే సంప్రదాయాన్ని భక్తరామదాసు ప్రవేశపెట్టగా.. తూము లక్ష్మీనరసింహదాసు కొనసాగించారని పేర్కొన్నారు. ఇది శోభకృత్ నామ సంవత్సరమని.. సీతమ్మ వారు అవతరించింది ఈ ఏడాదేనని, ఇలాంటి సంవత్సరంలో వీక్షించే కల్యాణం ఎంతో గొప్పదని విశ్లేషించారు. శ్రీ భద్రాచల రామదాసు పీఠం తరఫున రూపొందించిన సంక్షేప రామాయణం సీడీని మంత్రి ఇంద్రకరణ్రెడ్డితో కలిసి జీయర్స్వామి ఆవిష్కరించారు.
నీ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ ప్రణాళికతో ఏర్పాట్లు చేశామని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి తెలిపారు. 70 కౌంటర్లలో 200 క్వింటాళ్ల తలంబ్రాలు ఉచితంగా పంపిణీ చేశామన్నారు. 19 కౌంటర్లలో ప్రసాదాలను భక్తులకు అందుబాటులో ఉంచామని చెప్పారు.
ఈ వేడుకల్లో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నవీన్రావు, జస్టిస్ భీమపాక నగేశ్, జస్టిస్ శ్రీదేవి, జస్టిస్ అభిషేక్రెడ్డి, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఎమ్మెల్యేలు పొదెం వీరయ్య, కందాళ ఉపేందర్రెడ్డి, తితిదే మాజీ ఛైర్మన్ కనుమూరి బాపిరాజు, కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్ తదితరులు హాజరయ్యారు.
నేడు పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్
ఈనాడు, హైదరాబాద్: భద్రాచలంలో శుక్రవారం నిర్వహించనున్న శ్రీరామ పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హాజరుకానున్నారు. ఆమె రైలులో కొత్తగూడెం వెళ్లి.. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలానికి చేరుకుంటారని రాజ్భవన్ వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘విక్రమార్కుడు’, ‘బజరంగీ భాయిజాన్’ సీక్వెల్స్ అప్డేట్.. ఎంతవరకు వచ్చాయంటే!
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి