JEE Main Result 2023: ‘మనోళ్లకే జై’ఈఈ
జేఈఈ మెయిన్ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మరోసారి విజయభేరి మోగించారు. 1, 2 ర్యాంకులతోపాటు 6, 10 ర్యాంకులను కైవసం చేసుకున్నారు.
1, 2, 6, 10 ర్యాంకులు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకే
వెంకట్ కౌండిన్యకు 1.. లోహిత్ ఆదిత్యకు రెండో ర్యాంకు
ఈనాడు- హైదరాబాద్, అమరావతి: జేఈఈ మెయిన్ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మరోసారి విజయభేరి మోగించారు. 1, 2 ర్యాంకులతోపాటు 6, 7, 10 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. అంటే తొలి పది ర్యాంకుల్లో ఐదింటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులే దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా జనవరి, ఏప్రిల్లలో జరిగిన జేఈఈ మెయిన్ మొదటి, చివరి విడతలో వచ్చిన ఉత్తమ స్కోర్ను పరిగణనలోకి తీసుకొని శనివారం తెల్లవారుజామున జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ర్యాంకుల్ని ప్రకటించింది. హైదరాబాద్కు చెందిన సింగరాజు వెంకట్కౌండిన్య 300కు 300 మార్కులు సాధించి జాతీయస్థాయిలో ఒకటో ర్యాంకు సొంతం చేసుకున్నాడు. నెల్లూరుకు చెందిన పునుమల్లి లోహిత్ ఆదిత్యసాయి సైతం 300 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. హైదరాబాద్లో చదివిన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకికి చెందిన సాయిదుర్గారెడ్డి 6వ ర్యాంకు, ఇ.మోహన్ శ్రీధర్ (హైదరాబాద్)కు 7వ ర్యాంకు, హైదరాబాద్లో ఇంటర్ పూర్తిచేసిన అమలాపురానికి చెందిన కల్లకూరి సాయినాథ్ శ్రీమంత్ 10వ ర్యాంకు సాధించారు. అలానే వావిలాల చిద్విలాస్రెడ్డి 15, బిక్కిన అభినవ్చౌదరి 16, అభినీత్ మాజేటి (హైదరాబాద్) 18వ ర్యాంకు సాధించారు. హైదరాబాద్కు చెందిన పొంగూరు భాను దివ్యాంగుల విభాగంలో 8వ ర్యాంకు సాధించాడు.
100 లోపు ర్యాంకుల్లో 30కిపైగా..
100లోపు ర్యాంకుల్లో 30కిపైగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సాధించినట్లు అంచనా వేస్తున్నారు. మెయిన్లో 100లోపు అఖిల భారత ర్యాంకు సాధించినవారు జేఈఈ అడ్వాన్స్డ్లోనూ వెయ్యిలోపు ర్యాంకులు సాధిస్తారని, వారిలో దాదాపు అందరూ ఐఐటీల్లో.. బీటెక్ కంప్యూటర్ సైన్స్లోనే ప్రవేశాలు పొందుతారని శ్రీచైతన్య విద్యాసంస్థల ఐఐటీ జాతీయ డీన్ ఎం.ఉమాశంకర్ తెలిపారు. ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి వెయ్యిలోపు ర్యాంకుల్లో 30 మంది బాలికలు ఉన్నారని తెలిపారు.
16 మందికి 100 పర్సంటైల్
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ రెండు విడతల్లో మొత్తం 43 మంది 100 పర్సంటైల్ సాధించగా... వారిలో ఏపీ, తెలంగాణ నుంచి 16 మంది ఉన్నారు. వీరిలో తెలంగాణ నుంచి 11 మంది ఉండడం విశేషం. రెండు విడతల పరీక్షలకు దేశవ్యాప్తంగా 11,62,398 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 11,13,325 మంది పరీక్షలు రాశారు. వారిలో అమ్మాయిలు 3,38,963 మంది ఉన్నారు.
100 పర్సంటైల్ సాధించిన తెలంగాణ విద్యార్థులు
వెంకట్ కౌండిన్య, అల్లం సుజయ్, చిద్విలాస్రెడ్డి, అభినవ్చౌదరి, అభినిత్ మాజేటి, గుత్తికొండ అభిరామ్, మాధవ్ భరద్వాజ్, జ్ఞానకౌషిక్రెడ్డి, రమేష్ సూర్యతేజ, సాయిదుర్గారెడ్డి, ఈవూరి మోహనశ్రీధరరెడ్డి
ఏపీ విద్యార్థులు: సాయినాథ్ శ్రీమంత్, లోహిత్ ఆదిత్యసాయి, సి.మిఖిల్, ధర్మతేజరెడ్డి, వెంకటయోగేష్
* అమ్మాయిల్లో తెలంగాణ నుంచి కె.ఆశ్రితరెడ్డి 99.9986 పర్సంటైల్ సాధించి టాపర్గా నిలిచారు. ఏపీ నుంచి ప్రణతిశ్రీజ, రామిరెడ్డి మేఘన, పైదల వింధ్య, సువ్వాడ మౌనిషానాయుడు, వాకా శ్రీవర్షితలు పర్సంటైల్లో రాష్ట్ర టాపర్లుగా నిలిచారు.
ఈ-పుస్తకాలే ప్రపంచం
-పొంగూరు భాను, 8 ర్యాంక్ (దివ్యాంగుల విభాగం)
పుట్టుకతోనే అంధత్వం ఉన్నా.. అమ్మానాన్నలు సాధారణ పిల్లాడిలానే పెంచారు. మాది హైదరాబాద్లోని బాచుపల్లి. పదో తరగతి వరకు అంధుల పాఠశాలలో చదివా. ఇంటర్లో చేరాక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది. మా అమ్మ చైతన్య కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తుండడం నాకు కలిసొచ్చింది. పుస్తకాలు, మెటీరియల్ను ఈ-బుక్స్ రూపంలో సమకూర్చింది. కళాశాల పూర్తయ్యాక నాకు ఈ-పుస్తకాలే ప్రపంచంగా మారాయి. క్లిష్టంగా ఉన్న వాటిని అమ్మ, అధ్యాపకులను అడిగి తెలుసుకున్నా. మెయిన్స్ రాశాక.. నాకన్నా ముందే అమ్మా, నాన్నలు ర్యాంక్ వస్తుందని చెప్పారు.
బాంబే ఐఐటీ లక్ష్యం..
- వెంకట్ కౌండిన్య, ప్రథమ ర్యాంక్
ఇంటర్లో చేరినప్పుడే ఐఐటీ బాంబేలో చదవాలని నిర్ణయించుకుని జేఈఈపై దృష్టిపెట్టా. ప్రశ్నపత్రం ఎలా వచ్చినా.. కచ్చితమైన సమాధానం రాయాలని నిర్ణయించుకున్నా. కొన్ని నెలల నుంచి ప్రతి సబ్జెక్టులో ముఖ్యాంశాలను రాసుకొని.. వాటిని పదే పదే చదువుకున్నా. ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాశా. అమ్మానాన్నలు సింగరాజు శ్రీఫణి, రాజరాజేశ్వరి నేర్పిన క్రమశిక్షణ, పట్టుదలతోనే ఈ విజయం సాధ్యమైంది.
ఒత్తిడికి గురికావొద్దు
- లోహిత్ ఆదిత్యసాయి, రెండో ర్యాంక్
కళాశాలలో తరచూ పరీక్షలు నిర్వహించడంతోపాటు సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ.. అధ్యాపకులు అన్ని విధాలా సహకరించారు. టైమ్ మేనేజ్మెంట్తో పాటు షార్ట్ నోట్స్ రాసుకోవడం ఎంతో ముఖ్యం. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేయాలనుకుంటున్నా. నాన్న శ్రీనివాస్రావు సివిల్ ఇంజినీరు, అమ్మ వరలక్ష్మి గృహిణి.
సాఫ్ట్వేర్ ఇంజినీరు అవుతా
- సాయిదుర్గారెడ్డి, ఆరో ర్యాంక్
మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం సిలబస్ను పూర్తి చేయడంతో పాటు రివిజన్, వారాంతపు పరీక్షలతో సబ్జెక్ట్పై పట్టు సాధించా. అధ్యాపకులు ఎంతో సహకరించారు. ఐఐటీ బొంబేలో సీఎస్ఈ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజినీరుగా రాణించాలనేది నా లక్ష్యం. మాది పిడుగురాళ్ల సమీపంలోని కోనంకి గ్రామం. నాన్న నారపరెడ్డి రైతు. అమ్మ దుర్గమ్మ గృహిణి.
ఇంటర్ ప్రారంభంలోనే అవగాహన
- సాయినాథ్ శ్రీమంత్, పదో ర్యాంక్
ఇంటర్ మొదటి సంవత్సరంలోనే జేఈఈ మెయిన్, అడ్వాన్డ్స్ పరీక్షలపై అవగాహన పెంచుకున్నా. సంబంధిత పుస్తకాలు, గత ప్రశ్నపత్రాలతో సాధన చేశా. మాది డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం దుడ్డివారిఅగ్రహారం. నాన్న చినసుబ్బారావు ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తుండగా.. తల్లి సత్యకుమారి గృహిణి.
2.50 లక్షల మంది పాస్
మెయిన్లో కటాఫ్ స్కోర్ సాధించిన 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్కు హాజరయ్యేందుకు అర్హత సాధించారు. వీరిలో జనరల్ కేటగిరీ నుంచి 98,612 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 25,057, ఓబీసీ 67,613, ఎస్సీ 37,536, ఎస్టీ 18,752, దివ్యాంగుల (జనరల్) నుంచి 2,685 మంది ఉన్నారు. అడ్వాన్స్డ్కు వీరు ఆదివారం ఉదయం 10 నుంచి మే 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూన్ 4న పరీక్ష జరగనుంది.
పెరిగిన కటాఫ్ స్కోర్
జేఈఈ మెయిన్లో అర్హత సాధించేందుకు, అడ్వాన్స్డ్ రాసేందుకు ఈసారి కటాఫ్ స్కోర్ పెరిగింది. అతి తక్కువగా జనరల్ కేటగిరీలో, ఎక్కువగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కటాఫ్ పెరిగినట్లు స్పష్టమవుతోంది. ప్రశ్నపత్రాలు కొంత సులభంగా ఉండడం, ప్రత్యక్ష తరగతులు జరగడంతో విద్యార్థుల మధ్య పోటీపెరిగి కటాఫ్ పెరిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
తీరు మారని ఎన్టీఏ
జేఈఈ ఫలితాల వెల్లడి విషయంలో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఏటా ముప్పతిప్పలు పెడుతున్న ఎన్టీఏ తీరు ఈసారీ మారలేదు. ఈ నెల 24న పరీక్షల తుది కీని వెల్లడించిన ఆ సంస్థ గత 4 రోజులుగా స్కోర్ కార్డులు, ర్యాంకుల్ని ప్రకటించకుండా లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులను ఉత్కంఠకు గురిచేసింది. కనీసం ఎప్పుడు విడుదల చేస్తున్నది కూడా ప్రకటించని ఎన్టీఏ.. ఎట్టకేలకు శనివారం తెల్లవారుజామున ఫలితాలను విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆగస్టు 5 నుంచి 10 వరకు గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్ల రద్దు
గోల్కొండ, శాతవాహన ఎక్స్ప్రెస్లతో పాటు సికింద్రాబాద్-పుణె మధ్య తిరిగే శతాబ్ది సహా పలు రైళ్లను నిర్మాణ, నిర్వహణ పనుల కారణంగా కొద్ది రోజులపాటు రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. -
తెలంగాణలో కొత్తగా మరో 9 వేల బీటెక్ సీట్లు..!
రాష్ట్రంలో కొత్తగా మరో 9 వేల వరకు బీటెక్ సీట్లు అందుబాటులోకి రానున్నాయి. ఈ నెల 26 నుంచి రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ మొదలవుతుంది. -
అనాథలా తల్లి శవం.. ఆస్తుల కోసం కుమార్తెల పంతం
ఆస్తుల కోసం తల్లి మృతదేహాన్ని అనాథగా వదిలేసి కుమార్తెలు వాగ్వాదానికి దిగిన ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. -
కోకాపేట వరకు మెట్రోరైలు.. రెండోదశ ప్రతిపాదనలు సవరించిన తెలంగాణ ప్రభుత్వం
రాజధానిలోని మెట్రోరైలు రెండోదశలో దూరం, అంచనా వ్యయాలు పెరిగాయి. 5 కారిడార్లలో 70 కి.మీ. దూరం గతంలో ప్రతిపాదించగా ఇప్పుడు అది 8.4 కి.మీ. పెరిగి 78.4 కి.మీ. అయింది. -
సేద్యానికి పండగ.. సంక్షేమం నిండుగా..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరవాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో పేదల సంక్షేమం, సేద్యానికి అగ్రతాంబూలం ఇచ్చింది. -
సైబరాసురులకు చుక్కలే!
రాష్ట్రంలో సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల వినియోగం ఆందోళనకరంగా పెరుగుతున్న నేపథ్యంలో వాటి కట్టడికి ఈ రెండు విభాగాలకు బడ్జెట్లో నిధులను పెంచారు.మొత్తమ్మీద హోం శాఖకు గతేడాది సవరించిన అంచనాల కంటే ఈసారి కాస్త తక్కువగా నిర్వహణ పద్దును కేటాయించారు. -
అప్పులపై ఆందోళన!
పెరిగిన రుణభారంపై సామాజిక, ఆర్థిక నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఆదాయానికి తగ్గట్లుగా ఖర్చును సమతుల్యం చేయాల్సి ఉందని.. అప్పులపై ఆధారపడటాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
తితిదే అదనపు ఈఓగా వెంకయ్యచౌదరి
తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈఓగా సీహెచ్ వెంకయ్యచౌదరిని నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
పుణ్యజలం.. ఇలా కలుషితం..
‘అన్నిటినీ కలుపుకొని.. మౌనంగా నీలోనే దాచుకొని.. గంభీరంగా కడలి వైపు కదిలావే గోదావరి.. బతుకుదారి తెలిపావే గోదావరి’ అనే పాట గుర్తుకు తెస్తోంది గోదావరిలో టన్నులకొద్దీ చేరే చెత్తాచెదారం. -
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలి
నీట్ నుంచి తెలంగాణ ప్రభుత్వం వైదొలగాలని, తాము వైదొలుగుతున్నట్లు సీఎం రేవంత్రెడ్డి శాసనసభలో తీర్మానం చేయాలని భారాస సీనియర్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ కోరారు. -
సంక్షేమం.. సంపన్నం!
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపీట వేసింది. సంక్షేమశాఖల వారీగా అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇచ్చింది. -
పల్లెకు పెన్నిధి
ఆసరా పథకాన్ని ‘చేయూత’ పేరుతో అమలుచేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రస్తుతం రూ.12,000 కోట్లను ఏటా వెచ్చిస్తోంది. -
పెరిగిన ద్రవ్యలోటు
రాష్ట్ర ఆర్థిక ద్రవ్యలోటు ఏటా పెరుగుతోంది. వ్యయానికి తగ్గ ఆదాయం లేకపోతే ఏర్పడే అంతరాన్ని ‘ఆర్థిక ద్రవ్యలోటు’గా పిలుస్తారు. దీన్ని పూడ్చుకోవడానికి ప్రభుత్వం రుణాలు సేకరిస్తుంది. -
గ్యాస్ రాయితీకి నిధుల ‘గ్యారంటీ’
కాంగ్రెస్ పార్టీ ‘ఆరు గ్యారంటీ హామీ’ల్లో ఒకటైన ‘రూ.500కు గ్యాస్ సిలిండర్ పథకా’నికి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో రూ.723 కోట్ల నిధుల్ని ప్రతిపాదించింది. -
విశ్వవిద్యాలయాలకు రూ.500 కోట్లే!
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు లేవు. హాస్టళ్లు తగినన్ని లేవు. పాతబడిన భవనాలు ఎప్పుడు కూలిపోతాయో అన్న ఆందోళన విద్యార్థులను వెంటాడుతోంది. ప్రభుత్వాలు మాత్రం అభివృద్ధి పనులకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులిపేసుకుంటున్నాయి -
ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు
బడ్జెట్లో ప్రాధాన్య ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. నీటి పారుదల రంగానికి రూ.22,301 కోట్ల కేటాయింపులు చేయగా రుణాలకు వడ్డీలు, జీతభత్యాలు పోను నిర్మాణాలకు రూ.10,828.84 కోట్లు కేటాయించారు. -
విద్యాశాఖకు కాస్త పెంచినా..
రాష్ట్రంలో విద్యాశాఖకు బడ్జెట్లో ఈసారి రూ.21,292 కోట్లు ప్రతిపాదించారు. గత ఏడాది రూ.19,093 కోట్లు కాగా.. ఈసారి రూ.2199 కోట్లు పెంచారు. 2021-22 తర్వాత ఇదే అధికం. -
విద్యుత్కు నిధుల వెలుగులు
నిరంతర విద్యుత్ సరఫరా అందించడమే లక్ష్యంగా రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. గతేడాది(2023-24) బడ్జెట్లో తొలుత రూ.12,727 కోట్లే కేటాయించింది. -
మహానగరికి నిధుల భాగ్యం
హైదరాబాద్ మహానగరం అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్ర బడ్జెట్లో నగరాభివృద్ధికి భారీగా నిధులు కేటాయించింది. -
సొంత రాబడులపై భారీ అంచనాలు
సొంత పన్నుల రాబడిలో గణనీయమైన వృద్ధి రేటును ఆశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భారీ పద్దును ప్రతిపాదించింది. పన్నేతర ఆదాయంపైనా కొండంత నమ్మకంతో పథకాలకు నిధులు కేటాయించింది. -
బడ్జెట్పై మంత్రుల స్పందనలు ఇవీ..
రాష్ట్ర బడ్జెట్ను పౌరసరఫరాలు, నీటిపారుదలశాఖల మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్వాగతించారు. హైదరాబాద్ అభివృద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించడం ద్వారా ప్రపంచస్థాయి నగరంగా మార్చేందుకు బడ్జెట్లో స్పష్టమైన విజన్ ఉందని ప్రశంసించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
జాస్పర్ నగరం సగం భస్మీపటలం..!
-
నిరుద్యోగులూ నిరసనలు వద్దు.. మీ అన్నగా అండగా ఉంటా: సీఎం రేవంత్రెడ్డి
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్