JEE Main Result 2023: ‘మనోళ్లకే జై’ఈఈ
జేఈఈ మెయిన్ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మరోసారి విజయభేరి మోగించారు. 1, 2 ర్యాంకులతోపాటు 6, 10 ర్యాంకులను కైవసం చేసుకున్నారు.
1, 2, 6, 10 ర్యాంకులు తెలుగు రాష్ట్రాల విద్యార్థులకే
వెంకట్ కౌండిన్యకు 1.. లోహిత్ ఆదిత్యకు రెండో ర్యాంకు
ఈనాడు- హైదరాబాద్, అమరావతి: జేఈఈ మెయిన్ ర్యాంకుల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు మరోసారి విజయభేరి మోగించారు. 1, 2 ర్యాంకులతోపాటు 6, 7, 10 ర్యాంకులను కైవసం చేసుకున్నారు. అంటే తొలి పది ర్యాంకుల్లో ఐదింటిని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులే దక్కించుకున్నారు. దేశవ్యాప్తంగా జనవరి, ఏప్రిల్లలో జరిగిన జేఈఈ మెయిన్ మొదటి, చివరి విడతలో వచ్చిన ఉత్తమ స్కోర్ను పరిగణనలోకి తీసుకొని శనివారం తెల్లవారుజామున జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) ర్యాంకుల్ని ప్రకటించింది. హైదరాబాద్కు చెందిన సింగరాజు వెంకట్కౌండిన్య 300కు 300 మార్కులు సాధించి జాతీయస్థాయిలో ఒకటో ర్యాంకు సొంతం చేసుకున్నాడు. నెల్లూరుకు చెందిన పునుమల్లి లోహిత్ ఆదిత్యసాయి సైతం 300 మార్కులు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. హైదరాబాద్లో చదివిన పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం కోనంకికి చెందిన సాయిదుర్గారెడ్డి 6వ ర్యాంకు, ఇ.మోహన్ శ్రీధర్ (హైదరాబాద్)కు 7వ ర్యాంకు, హైదరాబాద్లో ఇంటర్ పూర్తిచేసిన అమలాపురానికి చెందిన కల్లకూరి సాయినాథ్ శ్రీమంత్ 10వ ర్యాంకు సాధించారు. అలానే వావిలాల చిద్విలాస్రెడ్డి 15, బిక్కిన అభినవ్చౌదరి 16, అభినీత్ మాజేటి (హైదరాబాద్) 18వ ర్యాంకు సాధించారు. హైదరాబాద్కు చెందిన పొంగూరు భాను దివ్యాంగుల విభాగంలో 8వ ర్యాంకు సాధించాడు.
100 లోపు ర్యాంకుల్లో 30కిపైగా..
100లోపు ర్యాంకుల్లో 30కిపైగా తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సాధించినట్లు అంచనా వేస్తున్నారు. మెయిన్లో 100లోపు అఖిల భారత ర్యాంకు సాధించినవారు జేఈఈ అడ్వాన్స్డ్లోనూ వెయ్యిలోపు ర్యాంకులు సాధిస్తారని, వారిలో దాదాపు అందరూ ఐఐటీల్లో.. బీటెక్ కంప్యూటర్ సైన్స్లోనే ప్రవేశాలు పొందుతారని శ్రీచైతన్య విద్యాసంస్థల ఐఐటీ జాతీయ డీన్ ఎం.ఉమాశంకర్ తెలిపారు. ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి వెయ్యిలోపు ర్యాంకుల్లో 30 మంది బాలికలు ఉన్నారని తెలిపారు.
16 మందికి 100 పర్సంటైల్
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ రెండు విడతల్లో మొత్తం 43 మంది 100 పర్సంటైల్ సాధించగా... వారిలో ఏపీ, తెలంగాణ నుంచి 16 మంది ఉన్నారు. వీరిలో తెలంగాణ నుంచి 11 మంది ఉండడం విశేషం. రెండు విడతల పరీక్షలకు దేశవ్యాప్తంగా 11,62,398 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 11,13,325 మంది పరీక్షలు రాశారు. వారిలో అమ్మాయిలు 3,38,963 మంది ఉన్నారు.
100 పర్సంటైల్ సాధించిన తెలంగాణ విద్యార్థులు
వెంకట్ కౌండిన్య, అల్లం సుజయ్, చిద్విలాస్రెడ్డి, అభినవ్చౌదరి, అభినిత్ మాజేటి, గుత్తికొండ అభిరామ్, మాధవ్ భరద్వాజ్, జ్ఞానకౌషిక్రెడ్డి, రమేష్ సూర్యతేజ, సాయిదుర్గారెడ్డి, ఈవూరి మోహనశ్రీధరరెడ్డి
ఏపీ విద్యార్థులు: సాయినాథ్ శ్రీమంత్, లోహిత్ ఆదిత్యసాయి, సి.మిఖిల్, ధర్మతేజరెడ్డి, వెంకటయోగేష్
* అమ్మాయిల్లో తెలంగాణ నుంచి కె.ఆశ్రితరెడ్డి 99.9986 పర్సంటైల్ సాధించి టాపర్గా నిలిచారు. ఏపీ నుంచి ప్రణతిశ్రీజ, రామిరెడ్డి మేఘన, పైదల వింధ్య, సువ్వాడ మౌనిషానాయుడు, వాకా శ్రీవర్షితలు పర్సంటైల్లో రాష్ట్ర టాపర్లుగా నిలిచారు.
ఈ-పుస్తకాలే ప్రపంచం
-పొంగూరు భాను, 8 ర్యాంక్ (దివ్యాంగుల విభాగం)
పుట్టుకతోనే అంధత్వం ఉన్నా.. అమ్మానాన్నలు సాధారణ పిల్లాడిలానే పెంచారు. మాది హైదరాబాద్లోని బాచుపల్లి. పదో తరగతి వరకు అంధుల పాఠశాలలో చదివా. ఇంటర్లో చేరాక కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపించింది. మా అమ్మ చైతన్య కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తుండడం నాకు కలిసొచ్చింది. పుస్తకాలు, మెటీరియల్ను ఈ-బుక్స్ రూపంలో సమకూర్చింది. కళాశాల పూర్తయ్యాక నాకు ఈ-పుస్తకాలే ప్రపంచంగా మారాయి. క్లిష్టంగా ఉన్న వాటిని అమ్మ, అధ్యాపకులను అడిగి తెలుసుకున్నా. మెయిన్స్ రాశాక.. నాకన్నా ముందే అమ్మా, నాన్నలు ర్యాంక్ వస్తుందని చెప్పారు.
బాంబే ఐఐటీ లక్ష్యం..
- వెంకట్ కౌండిన్య, ప్రథమ ర్యాంక్
ఇంటర్లో చేరినప్పుడే ఐఐటీ బాంబేలో చదవాలని నిర్ణయించుకుని జేఈఈపై దృష్టిపెట్టా. ప్రశ్నపత్రం ఎలా వచ్చినా.. కచ్చితమైన సమాధానం రాయాలని నిర్ణయించుకున్నా. కొన్ని నెలల నుంచి ప్రతి సబ్జెక్టులో ముఖ్యాంశాలను రాసుకొని.. వాటిని పదే పదే చదువుకున్నా. ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాశా. అమ్మానాన్నలు సింగరాజు శ్రీఫణి, రాజరాజేశ్వరి నేర్పిన క్రమశిక్షణ, పట్టుదలతోనే ఈ విజయం సాధ్యమైంది.
ఒత్తిడికి గురికావొద్దు
- లోహిత్ ఆదిత్యసాయి, రెండో ర్యాంక్
కళాశాలలో తరచూ పరీక్షలు నిర్వహించడంతోపాటు సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ.. అధ్యాపకులు అన్ని విధాలా సహకరించారు. టైమ్ మేనేజ్మెంట్తో పాటు షార్ట్ నోట్స్ రాసుకోవడం ఎంతో ముఖ్యం. ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. ఐఐటీ బాంబేలో సీఎస్ఈ చేయాలనుకుంటున్నా. నాన్న శ్రీనివాస్రావు సివిల్ ఇంజినీరు, అమ్మ వరలక్ష్మి గృహిణి.
సాఫ్ట్వేర్ ఇంజినీరు అవుతా
- సాయిదుర్గారెడ్డి, ఆరో ర్యాంక్
మొదటి నుంచి ప్రణాళిక ప్రకారం సిలబస్ను పూర్తి చేయడంతో పాటు రివిజన్, వారాంతపు పరీక్షలతో సబ్జెక్ట్పై పట్టు సాధించా. అధ్యాపకులు ఎంతో సహకరించారు. ఐఐటీ బొంబేలో సీఎస్ఈ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజినీరుగా రాణించాలనేది నా లక్ష్యం. మాది పిడుగురాళ్ల సమీపంలోని కోనంకి గ్రామం. నాన్న నారపరెడ్డి రైతు. అమ్మ దుర్గమ్మ గృహిణి.
ఇంటర్ ప్రారంభంలోనే అవగాహన
- సాయినాథ్ శ్రీమంత్, పదో ర్యాంక్
ఇంటర్ మొదటి సంవత్సరంలోనే జేఈఈ మెయిన్, అడ్వాన్డ్స్ పరీక్షలపై అవగాహన పెంచుకున్నా. సంబంధిత పుస్తకాలు, గత ప్రశ్నపత్రాలతో సాధన చేశా. మాది డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పట్టణం దుడ్డివారిఅగ్రహారం. నాన్న చినసుబ్బారావు ఎలక్ట్రికల్ దుకాణం నిర్వహిస్తుండగా.. తల్లి సత్యకుమారి గృహిణి.
2.50 లక్షల మంది పాస్
మెయిన్లో కటాఫ్ స్కోర్ సాధించిన 2.50 లక్షల మంది జేఈఈ అడ్వాన్స్డ్కు హాజరయ్యేందుకు అర్హత సాధించారు. వీరిలో జనరల్ కేటగిరీ నుంచి 98,612 మంది, ఈడబ్ల్యూఎస్ నుంచి 25,057, ఓబీసీ 67,613, ఎస్సీ 37,536, ఎస్టీ 18,752, దివ్యాంగుల (జనరల్) నుంచి 2,685 మంది ఉన్నారు. అడ్వాన్స్డ్కు వీరు ఆదివారం ఉదయం 10 నుంచి మే 7వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. జూన్ 4న పరీక్ష జరగనుంది.
పెరిగిన కటాఫ్ స్కోర్
జేఈఈ మెయిన్లో అర్హత సాధించేందుకు, అడ్వాన్స్డ్ రాసేందుకు ఈసారి కటాఫ్ స్కోర్ పెరిగింది. అతి తక్కువగా జనరల్ కేటగిరీలో, ఎక్కువగా ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో కటాఫ్ పెరిగినట్లు స్పష్టమవుతోంది. ప్రశ్నపత్రాలు కొంత సులభంగా ఉండడం, ప్రత్యక్ష తరగతులు జరగడంతో విద్యార్థుల మధ్య పోటీపెరిగి కటాఫ్ పెరిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
తీరు మారని ఎన్టీఏ
జేఈఈ ఫలితాల వెల్లడి విషయంలో విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఏటా ముప్పతిప్పలు పెడుతున్న ఎన్టీఏ తీరు ఈసారీ మారలేదు. ఈ నెల 24న పరీక్షల తుది కీని వెల్లడించిన ఆ సంస్థ గత 4 రోజులుగా స్కోర్ కార్డులు, ర్యాంకుల్ని ప్రకటించకుండా లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులను ఉత్కంఠకు గురిచేసింది. కనీసం ఎప్పుడు విడుదల చేస్తున్నది కూడా ప్రకటించని ఎన్టీఏ.. ఎట్టకేలకు శనివారం తెల్లవారుజామున ఫలితాలను విడుదల చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!