Telangana Tourism: పర్యాటకానికి కొత్త జోష్!
రాష్ట్రంలో పర్యాటకానికి సరికొత్త జోష్ వస్తోంది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, అద్భుతంగా నిర్మాణమైన సచివాలయ సౌధం ఇప్పటికే రాజధానికి అదనపు ఆకర్షణలుగా మారాయి.
రాష్ట్రవ్యాప్తంగా బడ్జెట్ హోటళ్లు
మన్యంకొండ గుడికి వెళ్లేందుకు రోప్వే
ఐటీ ఉద్యోగుల్ని ఆకర్షించేలా రంగనాయకసాగర్
రూ.వందల కోట్ల వ్యయంతో నూతన ప్రాజెక్టులు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో పర్యాటకానికి సరికొత్త జోష్ వస్తోంది. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం, అద్భుతంగా నిర్మాణమైన సచివాలయ సౌధం ఇప్పటికే రాజధానికి అదనపు ఆకర్షణలుగా మారాయి. తాజాగా బుధవారం నెక్లెస్రోడ్లో నీరాకేఫ్ ప్రారంభమైంది. సమీపంలోనే అమరువీరుల స్మారకకేంద్రం త్వరలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అనేక కొత్త ప్రాజెక్టులకు పర్యాటక శాఖ రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా ప్రకృతి, ఆధ్యాత్మిక పర్యాటక ప్రదేశాల్లో సరికొత్త సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్ని విహారం, వినోదాలకు కేంద్రాలుగా తీర్చిదిద్దే కార్యాచరణ కార్యరూపంలోకి వస్తోంది. సందర్శకుల వసతికి కొత్తగా అయిదు బడ్జెట్ హోటళ్లను పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్మించనుంది. ఒక్కో హోటల్లో సగటున 20 గదులు ఉంటాయి. నిర్మాణం తుది దశలో ఉన్న ఓ బడ్జెట్ హోటల్, రిసార్టు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. సిద్దిపేట, మహబూబ్నగర్లో శిల్పారామాలు ఏర్పాటుకానున్నాయి.
విదేశీ పర్యాటకులు లక్ష్యంగా!
సిద్దిపేటకు 10 కిమీ దూరంలో రూ.110 కోట్ల వ్యయంతో రంగనాయకసాగర్ను అభివృద్ధి చేయనున్నారు. ఇది కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన జలాశయం. ప్రధానంగా ఐటీ ఉద్యోగుల్ని, అదేవిధంగా విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించడం లక్ష్యం. ‘ఒకేసారి రెండు వేల మందికి సరిపడా కాన్ఫరెన్స్ హాలు, జల వినోదం కోసం వాటర్ రిసార్టులు, వాటర్ ఫ్రంట్ ఫుడ్కోర్టు, జలాశయం అందాల్ని చూసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు, పిల్లలకు పార్కులు వంటి అనేక ఆకర్షణలు ఇక్కడ రాబోతున్నాయి’ అని టూరిజం కార్పొరేషన్ వర్గాలు చెబుతున్నాయి.
సిద్దిపేటలో శిల్పారామం
సిద్దిపేటలో కోమటిచెరువు ఇప్పటికే పర్యాటకుల్ని బాగా ఆకర్షిస్తోంది. ఆ పక్కనే రూ.25 కోట్లతో శిల్పారామం, రూ.12.5 కోట్ల వ్యయంతో డైనోసార్ థీం పార్క్ నిర్మించనున్నారు. పాలకుర్తి సోమశ్వర ఆలయానికి వచ్చే భక్తుల వసతికి బడ్జెట్ హోటల్ నిర్మాణపనులు త్వరలో ప్రారంభం అవుతాయి.
అభయారణ్యంలో అద్దాల ఇల్లు
కొత్తగూడెం జిల్లా కిన్నెరసాని అభయారణ్యంలో రూ.10.77 కోట్లతో ఎకోటూరిజం ప్రాజెక్టు అభివృద్ధి చేశారు. 9 కాటేజీలు (జీ ప్లస్ 1), అద్దాల ఇల్లు (జీ ప్లస్ 2), ఫుడ్కోర్టు, నీళ్లపై నడుచుకుంటూ వెళ్లేందుకు జెట్టీ ఇక్కడ ప్రత్యేకతలు. త్వరలోనే పర్యాటకులకు అందుబాటులోకి వస్తుంది. మహబూబ్నగర్ శిల్పారామం, కొత్తగూడెంలో బడ్జెట్ హోటల్ కూడా త్వరలో అందుబాటులోకి వస్తాయి.
650 మీటర్ల రోప్పే.. రాష్ట్రంలోనే మొదటిసారి
మహబూబ్నగర్కు సమీపంలోని మన్యంకొండ శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి పెద్దసంఖ్యలో భక్తులు వస్తుంటారు. కొండపైకి ఘాట్ రోడ్డు ఉండగా, ఇప్పుడు కిందినుంచి పైకి 650 మీటర్ల దూరం రోప్వే నిర్మించనున్నారు. ఈ తరహా ఏర్పాటు రాష్ట్రంలోనే మొట్టమొదటిదిగా అధికారులు చెబుతున్నారు. రూ.50 కోట్ల వ్యయంతో రోప్వే, అన్నదాన సత్రం నిర్మించనున్నారు. మహబూబ్నగర్లో పెద్దచెరువు సుందరీకరణ, నెక్లెస్రోడ్డు నిర్మాణానికి రూ.14.50 కోట్లు ఖర్చుచేయనున్నారు.
తాజాగా ప్రారంభమైనవి
* 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం
* రాష్ట్ర సచివాలయ భవనం
* హైదరాబాద్ నెక్లెస్రోడ్డులో నీరా కేఫ్
ప్రారంభానికి సిద్ధంగా ఉన్నవి
* బొగత, మల్లూర్ స్ప్రింగ్ వాటర్ఫాల్స్ దగ్గర వసతి
* కిన్నెరసానిలో ఎకో టూరిజం రిసార్టు
* మహబూబ్నగర్లో శిల్పారామం
* కొత్తగూడెంలో బడ్జెట్ హోటల్
బడ్జెట్లో ఇక అధిక నిధులు
సింగపూర్, మలేసియాలకు మించిన పర్యాటక ఆకర్షణ ప్రాంతాలు ఇక్కడే అనేకం ఉన్నాయి. ఇక్కడి జలపాతాలు, రిజర్వాయర్లు సహా ప్రకృతి పర్యాటక ప్రదేశాల్ని అభివృద్ధి చేసి తెలంగాణను పెద్ద టూరిస్ట్ స్పాట్గా చేయాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనల్ని ముందుకు తీసుకెళుతున్నాం. రానున్న బడ్జెట్లలో పర్యాటకానికి నిధులు భారీగా పెరుగుతాయి. మానేరు రివర్ ఫ్రంట్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ జలశయాలకు పర్యాటక అభివృద్ధిలో ప్రాధాన్యం ఉంది. మహబూబ్నగర్లో 26వేల ఎకరాల్లో నైట్ సఫారీ ఏర్పాటుచేయబోతున్నాం. హిమాయత్సాగర్, గండిపేటలనూ పర్యాటకంగా అభివృద్ధి చేసే ప్రణాళికలున్నాయి.
శ్రీనివాస్గౌడ్, పర్యాటక శాఖ మంత్రి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం