లోపాలున్నా.. లేనట్టు తనిఖీలతో కనికట్టు
ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందేందుకు అవసరమైన కనీస ప్రమాణాలు ఉన్నాయో?లేవో? పరిశీలించేందుకు జేఎన్టీయూహెచ్ నిర్వహిస్తున్న తనిఖీలు కొందరు ఆచార్యులకు కాసులు కురిపిస్తున్నాయి.
ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల పరిశీలన పేరిట కాసుల వేట
కనీస ప్రమాణాలు లేకున్నా ఉన్నట్లు నివేదికల సమర్పణ
మళ్లీ తనిఖీలు చేయించే ఆలోచనలో జేఎన్టీయూహెచ్
ఈనాడు, హైదరాబాద్: ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందేందుకు అవసరమైన కనీస ప్రమాణాలు ఉన్నాయో?లేవో? పరిశీలించేందుకు జేఎన్టీయూహెచ్ నిర్వహిస్తున్న తనిఖీలు కొందరు ఆచార్యులకు కాసులు కురిపిస్తున్నాయి. ఎన్నో లోపాలు ఉన్నా...కనీస ప్రమాణాలు లేకున్నా కొన్ని తనిఖీ బృందాలు ఆయా యాజమాన్యాల నుంచి లంచాలు తీసుకొని అన్నీ సవ్యంగా ఉన్నాయని జేఎన్టీయూహెచ్కు నివేదికలు సమర్పించినట్లు తెలిసింది. ఈ అక్రమాలు వర్సిటీ ఉన్నతాధికారుల దృష్టికి కూడా రావడంతో ఆ కళాశాలలను మళ్లీ తనిఖీ చేయించాలని భావిస్తున్నారు.ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు తన పరిధిలోని కళాశాలలను నిజ నిర్ధారణ బృందాల ద్వారా జేఎన్టీయూహెచ్ తనిఖీ చేయిస్తుంది. తగినంత మంది బోధన సిబ్బంది, ల్యాబ్లు, వాటిలో పరికరాలు, ఇతర కనీస వసతులు ఉన్నాయో లేవో తనిఖీ చేయించేందుకు ఒక సీనియర్ ఆచార్యుడు ఛైర్మన్గా, మరొకరు లేదా ఇద్దరు సభ్యులుగా కమిటీలను నియమిస్తుంది. వచ్చే విద్యా సంవత్సరానికి (2023-24) సంబంధించి గత ఏప్రిల్లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 223 ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్ కళాశాలలను తనిఖీ చేయించిన సంగతి తెలిసిందే. ఆ కమిటీలు నివేదికలను వర్సిటీకి సమర్పించాయి. వాటిని ఉన్నతాధికారులు పరిశీలించారు. ఒక్కో రోజు 15-21 కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులను పిలిచి ఈనెల 16వ తేదీ నుంచి 23వ తేదీ వరకు ఉపకులపతి ఆచార్య కట్టా నర్సింహారెడ్డి సమక్షంలో ఆయా లోపాలను వారి ముందు ఉంచి విచారణ జరిపారు. ఈ సందర్భంగా వరంగల్ ప్రాంతంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాల ప్రతినిధులపై వీసీ ఆగ్రహం వ్యక్తంచేసినట్లు తెలిసింది. డబ్బులిచ్చి అన్నీ సవ్యంగా ఉన్నట్లు రాయించుకుందామంటే తెలియదని అనుకున్నారా? మళ్లీ తనిఖీలు చేయిస్తామని స్పష్టం చేసినట్లు సమాచారం. ఇంకా మరో 15-20 కళాశాలలు మామూళ్లు ముట్టజెప్పి ఒకటీ అర తప్ప ప్రధాన లోపాలు ఏమీ లేవని రాయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ కళాశాలల్లోనూ మరోసారి తనిఖీలు చేయించాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఒక్కో కళాశాల నుంచి రూ.2.50 లక్షలు
ఏ కళాశాల వారు ఎంత మొత్తాన్ని ముట్టజెప్పారన్న సమాచారాన్ని వర్సిటీ ఉన్నతాధికారులు సేకరించినట్లు తెలిసింది. వరంగల్లోని ఇంజినీరింగ్ కళాశాల రూ.2.50 లక్షలు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి. ఆ కళాశాలకు వెళ్లిన కమిటీ ఛైర్మన్పై గతంలోనూ ఆరోపణలు వచ్చాయి. మరికొన్ని కళాశాలలు రూ.2 లక్షలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వాటిల్లో మూడు గ్రామీణ జిల్లాల్లో ఉండగా...మిగతావి హైదరాబాద్ చుట్టుపక్కలవని సమాచారం. అందులో రెండు ప్రముఖ గ్రూపు విద్యాసంస్థలు కూడా ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా తగినంత బోధన సిబ్బంది లేకపోవడం, ప్రయోగశాలల్లో నాసిరకం, ప్రమాణాలు లేని పరికరాలు ఉండటం లాంటి ప్రధాన లోపాలను కప్పిపుచ్చేందుకు కమిటీలకు ఆ కళాశాలలు లంచాలు ఇచ్చినట్లు భావిస్తున్నారు. ఆ కళాశాలల తనిఖీకి వెళ్లిన కమిటీ ఛైర్మన్లను కూడా పిలిచి ఉన్నతాధికారి ఒకరు మందలించినట్లు సమాచారం. కళాశాలలు పెద్దమొత్తంలో ఇస్తాయనే ఉద్దేశంతో కొందరు బతిమాలి మరీ తనిఖీలకు వెళ్తుంటారన్న ప్రచారం వర్సిటీలో ఎప్పటి నుంచో ఉంది. ‘లోపాలు ఉన్నా...లేకున్నా ఒక్కొక్కరికి రూ.50 వేలు ఇస్తాం. డబ్బులు తీసుకున్నా లేనిది ఉన్నట్లు రాయరు. కాకపోతే చిన్న లోపాలను పెద్దగా చూపుతారనే భయంతో ఇస్తాం’ అని ఒక కళాశాలలో డైరెక్టర్గా పనిచేసిన ఒకరు చెప్పారు.
ఆకస్మిక తనిఖీలు చేస్తాం
తనిఖీలకు వెళ్లిన కమిటీ సభ్యులను కొన్ని కళాశాలల యాజమాన్యాలు ప్రలోభపెట్టినట్లు నా దృష్టికి వచ్చింది. అందుకే ఆ కళాశాలల ప్రతినిధులను హెచ్చరించాను. వారు మాత్రం అలాంటిది తాము చేయలేదని చెబుతున్నారు. చర్యలు తీసుకుందామంటే పక్కా ఆధారాలు మాత్రం లభించలేదు. అయితే ఆ కళాశాలలపై నిఘా ఉంచాం. ఇప్పుడు మరోసారి తనిఖీలకు సమయం దొరకకున్నా...విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఆకస్మిక తనిఖీలు చేస్తాం. అప్పుడు గుర్తించిన లోపాలను బట్టి చర్యలు తీసుకుంటాం.
ఆచార్య కట్టా నర్సింహారెడ్డి, ఉపకులపతి, జేఎన్టీయూహెచ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.