Artificial intelligence: కృత్రిమ మేధతో కొలువులకు కొత్తరూపు
‘‘కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో అన్ని రంగాల్లో కొలువులు తగ్గుతాయనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇది వాస్తవం కాదు. ఉదాహరణకు హాలండ్లోని ఒక హోటల్లో గతంలో సర్వర్లు ఉండేవారు.
భవిష్యత్తులో అన్ని కంపెనీలూ ఏఐ నిపుణుల్ని పెట్టుకుంటాయి
‘ఐరావత్’తో అద్భుతాలు సాధిస్తాం
‘ఈనాడు’తో ఆచార్య దీపక్ గార్గ్
ఈనాడు, వరంగల్: ‘‘కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)తో అన్ని రంగాల్లో కొలువులు తగ్గుతాయనే ఆందోళనలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఇది వాస్తవం కాదు. ఉదాహరణకు హాలండ్లోని ఒక హోటల్లో గతంలో సర్వర్లు ఉండేవారు. వారి స్థానంలో ఇప్పుడు రోబోలను ప్రవేశపెట్టారు. విచిత్రమైన విషయం ఏమిటంటే రోబోల నిర్వహణ కోసం గతంలో కన్నా ఎక్కువ మానవ వనరులను అక్కడ వినియోగిస్తున్నారు. అంటే ఆ రంగంలో కొలువులు పోలేదు. వాటి రూపం మారిందంతే’’ అని ఏఐ నిపుణులు ఆచార్య దీపక్ గార్గ్ వెల్లడించారు. ‘ఐరావత్’ సూపర్ కంప్యూటర్’ ప్రాజెక్టులో పనిచేస్తున్న ఏడుగురు ఏఐ నిపుణుల్లో ఈయన ఒకరు. ఇటీవల వరంగల్ ఎస్సార్ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా బాధ్యతలు తీసుకున్న ఆయన గతంలో ఏఐసీటీఈ, న్యాక్, యూజీసీలలో సభ్యుడిగా పనిచేశారు. ‘లీడింగ్ ఇండియా.ఏఐ’ అనే ప్రాజెక్టు ద్వారా దేశవ్యాప్తంగా అధిక సంఖ్యలో విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇచ్చారు. భవిష్యత్తును శాసించనున్న ఏఐ ఎలా కీలకం కానుంది? విద్యార్థులు ఈ నైపుణ్యాన్ని ఎలా అందిపుచ్చుకోవాలి? తదితర అంశాలను ఆయన ‘ఈనాడు’తో వివరించారు. విశేషాలు ఆయన మాటల్లోనే..
భవిష్యత్తుకు కీలకం
ఏఐ.. భవిష్యత్తులో ఎంతో కీలకం కానుంది. ఇది ఏదో ఒక రంగానికే పరిమితం కాదు. వ్యవసాయం నుంచి రక్షణ రంగం వరకు అన్నింటిలోకీ చొచ్చుకెళుతోంది. ఉదాహరణకు సాగుతో అనుసంధానిస్తే వాతావరణం, ఉష్ణోగ్రతలు వంటివాటిని విశ్లేషిస్తుంది. పంటలకు ఏ మేర మందులు చల్లాలన్న విషయాన్ని చెబుతుంది. రక్షణ రంగంలోనే ఏఐ ఆధారంగా నేనో ప్రాజెక్టు చేశాను. సరిహద్దుల వద్ద నిఘా వ్యవస్థను దీంతో అనుసంధానించే వ్యవస్థను విజయవంతంగా పూర్తి చేశాం.
అన్నివిభాగాలకూ అవసరమే..
ఏఐ అంటే ఒక్క కంప్యూటర్ సైన్స్లో విద్యార్థులే నేర్చుకోవాలనుకుంటే పొరపాటు. మెకానికల్, సివిల్ తదితర విభాగాల వాళ్లు సైతం దీనిపై పట్టు సాధించాలి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ లాంటి సాంకేతికత డేటాను లోతుగా తీసుకొన్నా మళ్లీ మనకు అర్థమయ్యే విధంగా విశ్లేషించి అందించేది కృత్రిమ మేధే. భవనాల నిర్మాణంలోనూ ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. భవిష్యత్తులో ప్రతి కంపెనీ ప్రత్యేకంగా ఏఐ నిపుణుల్ని నియమిస్తుంది.
‘సూపర్’ ముందడుగు
చైనా ఇప్పుడు ఏఐలో ఎంతో ముందుంది. మనం ప్రపంచంలోనే మేటిగా నిలవాలనే లక్ష్యంతో దీనిపై విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. ‘ఐరావత్’ సూపర్ కంప్యూటర్ ఆవిష్కరణ మనం ఈ రంగంలో వేసిన గొప్ప ముందడుగు. భవిష్యత్తులో విద్య, పరిశోధన, అంకుర సంస్థలు, పారిశ్రామిక వర్గాల్లో భారత్ మేటిగా నిలవడంలో ఇదెంతో ఉపకరిస్తుంది.
దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన ‘ఐరావత్’ సూపర్ కంప్యూటర్ ఇటీవల జర్మనీలో నిర్వహించిన అంతర్జాతీయ సూపర్ కంప్యూటింగ్ సదస్సు (ఐఎస్సీ 2023)లో ప్రపంచ సూపర్ కంప్యూటర్లలో 75వ ర్యాంకు సాధించింది. కృత్రిమ మేధ (ఏఐ) ఆధారంగా నడిచే వాటిలో దేశంలోనే అతి పెద్ద, అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్గా ఇది ఘనత సాధించింది. పుణేలోని ‘సీ-డాక్’లో ఏర్పాటుచేసిన ఈ అద్భుత కంప్యూటర్ 13,170 టెరాఫ్లాప్స్ వేగంతో, 81,344 కోర్ ప్రాసెసర్తో నడుస్తుంది. భారత్ భవిష్యత్తులో 5 ట్రిలియన్ డాలర్ల వాణిజ్యాన్ని ఒడిసిపట్టాలని పెట్టుకున్న లక్ష్యంలో ఈ సూపర్ కంప్యూటర్ బ్రహ్మాస్త్రం లాంటిదిగా చెబుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం