siddipet: స్థానికులు వారిస్తున్నా వినని డ్రైవర్‌.. సిద్దిపేట జిల్లాలో వాగులో కారు గల్లంతు

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి శివారులోని వాగులో శుక్రవారం రాత్రి ఓ కారు కొట్టుకుపోయింది.

Updated : 29 Jul 2023 07:56 IST

నంగునూరు, న్యూస్‌టుడే: సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కెనపల్లి శివారులోని వాగులో శుక్రవారం రాత్రి ఓ కారు కొట్టుకుపోయింది. అక్కెనపల్లి-బస్వాపూర్‌ మార్గంలో పెద్దవాగుపై కాజ్‌వే ఉంది. ఇటీవలి భారీ వర్షాలతో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దాంతో రెండు రోజులుగా రాకపోకలు నిలిచాయి. అధికారులు, స్థానికులు కంపను అడ్డుగా పెట్టారు. శుక్రవారం రాత్రి ఓ కారు పోరెడ్డిపల్లి నుంచి అప్పిసకాలనీ మీదుగా అక్కెనపల్లి మార్గంలో ప్రయాణించింది. అందులో డ్రైవర్‌ ఒక్కడే ఉన్నారు. ప్రవాహం అధికంగా ఉందని, కాజ్‌వేపై వెళ్లొద్దని స్థానికులు వారిస్తున్నా ఆయన వినకుండా ముందుకెళ్లారు. అయితే... కారు వాగును దాటలేదు. చీకట్లో ఎంతగా పరికించినా కారు ఆచూకీ లభించలేదు. స్థానికులు వెంటనే విషయాన్ని రాజగోపాలపేట ఎస్‌ఐ రాజుగౌడ్‌కు తెలిపారు. ఆయన సిబ్బందితో కాజ్‌వే వద్దకు వచ్చి ఆరా తీశారు. కారు కోసం గాలించినా ఫలితం కనిపించలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని