నేతన్నలకు ఆరోగ్య కార్డు
జాతీయ చేనేత దినోత్సవాన్ని (ఈనెల 7న) పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగ సమగ్రాభివృద్ధి, నేతన్నల సంక్షేమ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది.
10,652 మగ్గాల నవీకరణ
చేనేత సంఘాలకు డీసీసీబీల నుంచి రుణాలు
ఉప్పల్లో చేనేత మ్యూజియం
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం వరాల జల్లు
ఈనాడు, హైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవాన్ని (ఈనెల 7న) పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగ సమగ్రాభివృద్ధి, నేతన్నల సంక్షేమ కోసం కీలక నిర్ణయాలు తీసుకుంది. మగ్గాల నవీకరణ, నేతన్నలకు ఆరోగ్యకార్డు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల ద్వారా ఏటా రూ.95 కోట్ల రుణం, చేనేత మ్యూజియం, కన్వెన్షన్ సెంటర్ వంటివి ఇందులో ఉన్నాయి. చేనేత, జౌళిశాఖల మంత్రి కేటీఆర్ ఈ నెల 7న వీటిని అధికారికంగా ప్రకటించనున్నారు. రాష్ట్రంలో చేనేత సమస్యలపై అధ్యయనం అనంతరం అధికారులతో కేటీఆర్ సమావేశమై తొమ్మిది అంశాలపై ప్రతిపాదనలు రూపొందించారు. వాటికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు.
వివరాలు ఇలా...
- చేనేత కార్మికులకు, చేనేత వృత్తి పనిచేస్తున్నవారికి నేత్ర, ఎముకలు, మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటికి ఆరోగ్యకార్డు ద్వారా చికిత్స అందిస్తారు. ప్రతి కుటుంబానికి ఏటా రూ.25 వేల పరిమితి మేరకు వైద్యసేవలు అందుతాయి.
- చేనేత కార్మికులకు పనిభారం, అనారోగ్య సమస్యలను నివారించేందుకు రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 10,652 గుంట మగ్గాల స్థానంలో నవీకరించిన ఫ్రేమ్ మగ్గాలను స్థాపించనున్నారు. ఒక్కో ఫ్రేమ్ మగ్గం ఏర్పాటుకు రూ.38వేల చొప్పున ఈ పథకానికి రూ.40.50 కోట్లను కేటాయించనుంది.
- రాష్ట్రంలోని చేనేత సహకార సంఘాలు తమ వ్యాపార కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి వీలుగా డీసీసీబీలు క్యాష్ క్రెడిట్ను (నగదు రుణ పరపతిని) అమలు చేయనున్నాయి. దీన్ని వర్కింగ్ క్యాపిటల్గా ఉపయోగించుకొని సంఘాలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తాయి.
- దేశంలో తొలిసారిగా చేనేత మ్యూజియంను ఏర్పాటు చేయనున్నారు. ఉప్పల్లోని శిల్పారామం వద్ద 500 గజాల స్థలాన్ని కేటాయించారు. ఈ నెల 7న కేటీఆర్ దీనికి శంకుస్థాపన చేస్తారు.
- చేనేత వస్త్రాల వ్యాపార నిర్వహణ, క్రయవిక్రయదారుల సమావేశాలు, సదస్సుల నిర్వహణ కోసం చేనేత కన్వెన్షన్ సెంటర్ను నిర్మిస్తారు. ఉప్పల్ భగాయత్లో 2,375 గజాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించింది.
- చేనేత కార్మికులు చనిపోయిన సమయంలో టెస్కో ద్వారా అందించే పరిహారాన్ని రూ.12,500 నుంచి రూ.25 వేలకు పెంపుదల.
- చేనేత మిత్ర పథకం కింద కార్మికులకు నూలు, రంగులు, రసాయనాలకు 40% మేర రాయితీని అందిస్తోంది. దీని కింద నమోదు ఇబ్బందికరంగా ఉందని కార్మికులు మంత్రి కేటీఆర్ దృష్టికి తేవడంతో మార్పులు చేశారు. ఇకపై జియో ట్యాగ్ గల చేనేత మగ్గాలపై పనిచేసే కార్మికులకు నెలకు రూ.3,000(చేనేత కార్మికునికి రూ.2,000, అనుబంధ కార్మికులకు రూ.1,000) చొప్పున వారి ఖాతాల్లో నేరుగా బదిలీ చేయాలని నిర్ణయించారు.
- గత ఆగస్టు నుంచి 59 సంవత్సరాల లోపు వయసున్న వారికి నేతన్న బీమా పథకం అమలవుతుండగా ఇకపై 60 నుంచి 75 సంవత్సరాల వయసు గల వారికీ వర్తింపజేయనున్నారు.
- పోచంపల్లిలో మూతపడిన చేనేత పార్కును బ్యాంకులు వేలం వేయగా టెస్కో ద్వారా ప్రభుత్వం కొన్నది. దీనిని దేశంలోనే అతిపెద్ద చేనేత పార్కుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది.
- చేనేత సంఘాలపై రుణభారం తగ్గించేందుకు పావలా వడ్డీ పథకం కింద 2022-23 సంవత్సరానికి రూ.2.13 కోట్ల విడుదల.
- నేతన్నకు చేయూత పథకం కింద కార్మికులు 8% వేతనాలను జమ చేస్తే ప్రభుత్వం దానికి 16 శాతాన్ని వారిపేరిట జమ చేస్తోంది. ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
చేనేత వారోత్సవాలు ఘనంగా నిర్వహిద్దాం: కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 7 నుంచి 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా వారోత్సవాలు నిర్వహించాలని మంత్రి కేటీఆర్ ప్రజాప్రతినిధులకు పిలుపునిచ్చారు. మీ పరిధిలో ఉన్న నేతన్నలతో కలిసి సంబరాల్లో పాల్గొని, వారితో ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో కోరారు. ‘‘హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో చేనేత వస్త్ర ఉత్పత్తుల ప్రదర్శన కొనసాగుతుంది. బీఎంఆర్ సార్థ ఫంక్షన్ హాల్ 7,500 మంది నేతన్నలతో రాష్ట్రస్థాయి చేనేతల సంబరాలు నిర్వహిస్తాం’’ అని కేటీఆర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడు పదుల వయసులో.. ‘ఇంటర్’ పరీక్షలు!
చదువుకు వయసుతో పని లేదని నిరూపిస్తున్నారు నిజామాబాద్కు చెందిన గుండెల్లి ఎల్లాగౌడ్. 78 ఏళ్ల వయసులో ఈయన ఇప్పుడు ఓపెన్ స్కూల్ ఇంటర్ పరీక్షలు రాస్తున్నారు. -
14 కిలోమీటర్లు.. 13 స్టేషన్లు
శంషాబాద్ విమానాశ్రయ మెట్రో మార్గంలో నాగోల్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 14 కిలోమీటర్ల మార్గంలో 13 స్టేషన్లు రాబోతున్నాయని హైదరాబాద్ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్రెడ్డి తెలిపారు. -
మునుపటి పోలింగ్ కేంద్రాల్లోనే మీ ఓట్లు
‘లోక్సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. రాష్ట్రంలో 3.32 కోట్ల మంది ఓటు హక్కు వినియోగానికి వీలుగా 35,808 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశాం. -
మిల్లర్లకు 25% జరిమానా
మర ఆడించిన బియ్యాన్ని (సీఎంఆర్- కస్టమ్ మిల్లింగ్ రైస్) నిర్దేశిత గడువులోగా ఇవ్వని మిల్లర్లకు జరిమానా విధించాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. -
భాగ పంపిణీకి ఇక శ్మశానం తప్ప ఏమీలేదు
అర్ధ శతాబ్దానికిపైగా నడిచిన నవాబ్ ఫక్రుల్ ముల్క్ వారసుల భాగ పంపిణీ వివాదానికి తెలంగాణ హైకోర్టు తెర దించింది. 73 ఏళ్లుగా కొనసాగుతున్న కేసును పరిష్కరిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. -
కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)లో కాలం చెల్లిన బస్సులు పెరుగుతున్నాయి. డొక్కువి తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణాలపై ప్రభావం పడుతోంది. -
హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ కన్నుమూత
ప్రముఖ హిందీ పత్రిక.. హిందీ మిలాప్ ఎడిటర్ వినయ్ వీర్ (72) కన్నుమూశారు. అనారోగ్యంతో కొన్నాళ్లుగా మంచానికే పరిమితమైన ఆయన పరిస్థితి విషమించి శనివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. -
గతవైభవ చిహ్నం నేను.. ఇలా మోడునై నిలిచాను!
ఫొటోకు పోజిస్తున్నట్లు ఊడలు, వేర్లతో నిలబడిన ఈ వృక్షాన్ని చూసి ఏదో హారర్ సినిమా సెట్టు అనుకుంటే పొరబడినట్లే.. ఇది నిజంగా మర్రిచెట్టే.. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీసీ సిమెంట్ కర్మాగారం ఆవరణలో క్వార్టర్ల నడుమ చాలా ఏళ్ల క్రితం మొక్కలు నాటారు. -
డిజిటలైజేషన్తో మరింత సమర్థంగా న్యాయవ్యవస్థ
మౌలిక వసతుల ఏర్పాటుతో పాటు డిజిటలైజేషన్తో న్యాయవ్యవస్థ మరింత సమర్థంగా మారిందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే అన్నారు. -
‘మంచి పుస్తకం’.. పాఠకుల నేస్తం
చిన్నారుల్లో పాఠకాసక్తిని పెంపొందించేలా కథలు, విజ్ఞాన గ్రంథాలు, వివిధ భాషల్లోని బాల సాహిత్యాన్ని అనువదించి సుమారు 500 పుస్తకాలు వెలువరించిన ‘మంచి పుస్తకం’ ప్రచురణ సంస్థ 20 వసంతాలు పూర్తిచేసుకుంది. -
గరిష్ఠ ధరలో వర్జీనియా పొగాకు
వర్జీనియా పొగాకు ధర రికార్డులను అధిగమిస్తోంది. కొంతకాలంగా కోకో ధరలు కిలో రూ.వెయ్యికి చేరగా... అదే బాటలో వర్జీనియా పొగాకూ పయనిస్తోంది. -
ప్రమాదంలో రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం
‘భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, గణతంత్రం ప్రమాదంలో ఉన్నాయి. ఈ వ్యవస్థలపై దాడి జరుగుతోంది. వీటిపై మాట్లాడలేని దుస్థితి నెలకొంది. -
నేటితో ముగియనున్న పాలిసెట్ దరఖాస్తు గడువు
రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ప్రవేశపరీక్ష (పాలిసెట్)కు ఈ నెల 28లోగా దరఖాస్తు చేసుకోవాలని మసాబ్ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రాజేశ్వరీదేవి తెలిపారు. -
నేడు డిగ్రీ గురుకుల ప్రవేశ పరీక్ష
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సర ప్రవేశాల కోసం గురుకుల ప్రవేశ పరీక్ష ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి సైదులు తెలిపారు. -
ఏఎస్ఆర్బీ పరీక్షలో నలుగురు వ్యవసాయ విద్యార్థినుల ఎంపిక
జాతీయ వ్యవసాయ శాస్త్రవేత్తల నియామక మండలి (ఏఎస్ఆర్బీ) నిర్వహించిన పరీక్షలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ కమ్యూనిటీ సైన్స్ విభాగం నుంచి బి.నిహారిక, మృణాల్ దీపక్, యశ్విని, రిద్ది వర్మలు సబ్జెక్టు మ్యాటర్ స్పెషలిస్టు (ఎస్ఎంఎస్)లుగా ఎంపికయ్యారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్లో మార్పులు చేస్తూ ఇంటర్ బోర్డు కార్యదర్శి శ్రుతిఓజా శనివారం ప్రకటన విడుదల చేశారు. -
లంచాన్ని రుణమంటే సరిపోదు.. ఆధారాలు చూపాలి: హైకోర్టు
లంచం తీసుకుని దాన్ని రుణంగా తీసుకున్నానంటే సరిపోదని, దానికి తగ్గ ఆధారాలను చూపాల్సిన బాధ్యత నిందితుడిపైనే ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. -
‘ఆరుగురు’ సభ్యుల కమిటీ నివేదిక ఇవ్వండి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై న్యాయ విచారణకు ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ప్రభుత్వానికి శనివారం మూడు కీలక ఆదేశాలు జారీ చేసింది. -
ఈఎస్ఐసీ ‘వార్డ్ఆఫ్ ఇన్స్యూర్డ్ పర్సన్’ సర్టిఫికెట్
ఈఎస్ఐసీ పరిధిలోకి వచ్చే కార్మికుల పిల్లలకు 2024-25 విద్యాసంవత్సరానికి ‘ఇన్స్యూర్డ్ పర్సన్స్’ కోటా కింద వైద్య, దంత వైద్య, నర్సింగ్ కళాశాలలో ప్రవేశాలకు ఈఎస్ఐసీ ప్రకటన జారీ చేసింది. -
4 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైనే..
రాష్ట్రంలో ఎండలు..మండిపోతున్నాయి. శనివారం కూడా నాలుగు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైగానే నమోదయ్యాయి. -
ఆ చిట్టితల్లికి తెలంగాణ ప్రభుత్వం అండ
క్యాన్సర్ బారిన పడి చికిత్స పొందుతున్న చిన్నారి వేదవల్లికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. మెరుగైన వైద్య చికిత్స అందించి అండగా ఉంటామని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
పండుగాడికి పద్దెనిమిదేళ్లు .. ‘పోకిరి’ ఆసక్తికర విశేషాలు..
-
ఇరాక్లో దారుణం.. సోషల్ మీడియా స్టార్ హత్య
-
లఖ్నవూపై సూపర్ ఇన్నింగ్స్.. పొట్టి కప్ రేసులోకి సంజూ!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
పదేళ్ల పాలనలో మీరు ఎన్ని హామీలు అమలు చేశారు?: బండి సంజయ్కు పొన్నం కౌంటర్
-
వేసవిలో ఫోన్ ఛార్జింగ్ వేగం తగ్గుతుంది..? ఎందుకు?