Hyderabad - AI Jobs: కొత్తగా 1.5 లక్షల ఏఐ ఆధారిత ఉద్యోగాలు
రాష్ట్రంలో 2025 నాటికి కొత్తగా 1.5 లక్షల కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఉద్యోగాలు వచ్చే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
2025 నాటికి తెలంగాణలో వచ్చే అవకాశాలు
ఏఐ మిషన్, నాస్కామ్ ‘కృత్రిమ మేధలో తెలంగాణ’ నివేదికలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 2025 నాటికి కొత్తగా 1.5 లక్షల కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఉద్యోగాలు వచ్చే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భవిష్యత్తు టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశముందని, ఆ మేరకు మానవ వనరుల్ని సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. విద్యార్థులకు ఏఐ, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్(ఎంఎల్) తదితర రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టామని, లక్ష మంది విద్యార్థులకు ఏఐ నైపుణ్యాలను ఇచ్చే లక్ష్యం పెట్టుకున్నట్లు పేర్కొంది. కార్పొరేట్ సంస్థలు వివిధ మార్గాల ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు భవిష్యత్తుకు అవసరమైన నిపుణులను సిద్ధం చేయాలని తెలిపింది. తెలంగాణ ఏఐ మిషన్ ద్వారా 142 ఏఐ స్టార్టప్లకు సహాయం అందిస్తున్నట్లు వివరించింది. తెలంగాణ ఏఐ మిషన్, నాస్కామ్ సంయుక్తంగా ‘కృత్రిమ మేధలో తెలంగాణ’ నివేదికను విడుదల చేసింది. ఇప్పటివరకు తెలంగాణలోని స్టార్టప్లు 54 ఒప్పందాల ద్వారా రూ.4,300 కోట్ల నిధులు సమీకరించాయని పేర్కొంది.
నివేదికలోని ముఖ్యాంశాలు
- భవిష్యత్తు టెక్నాలజీ, ఏఐలో తెలంగాణ అంతర్జాతీయ కేంద్రంగా మారుతోంది. ఏఐ ఆధారిత టెక్నాలజీల్లో నాణ్యమైన పరిశోధనలు కంప్యూటర్ విజన్, ఎంఎల్, రోబోటిక్స్ రంగాల్లో రాష్ట్రానికి బలమైన పునాదులుగా మారుతున్నాయి. ఇప్పటికే పలు విద్యాలయాలు సంబంధిత డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టాయి.
- దేశంలో 89 శాతం ఏఐ పరిశోధనలు యూనివర్సిటీల్లో జరుగుతున్నాయి. తెలంగాణలోని ఆరు విశ్వవిద్యాలయాలు పరిశోధనల పరంగా ప్రపంచవ్యాప్తంగా వెయ్యిలోపు ర్యాంకులు సాధించాయి. ఇందులో ఐఐఐటీ, ఐఐటీ హైదరాబాద్, ఎన్ఐటీ వరంగల్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఓయూ, జేఎన్టీయూ ఉన్నాయి.
- 2011 నుంచి 2022 వరకు ఏఐలో 1,774 పరిశోధన పత్రాలు వెలువడితే ఐఐఐటీ హైదరాబాద్ నుంచి 177, ఐఐటీ హైదరాబాద్ నుంచి 65 పత్రాలు ఉన్నాయి. ఏఐ ఆధారిత పరిశోధన పత్రాల్లో తెలంగాణ విశ్వవిద్యాలయాల వార్షిక వృద్ధిరేటు 31 శాతంగా ఉంది.
- ఐఐఐటీ హైదరాబాద్ కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్(ఎన్ఎల్పీ) రంగాల్లో, ఐఐటీ హైదరాబాద్ ఎంఎల్, డేటా మైనింగ్ రంగాల్లో ఎక్కువ పరిశోధనలు చేస్తోంది. వీటితో పాటు వెబ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, రోబోటిక్స్ రంగాల్లోనూ పరిశోధనలు జరుగుతున్నాయి.
- కృత్రిమ మేధ ఆధారిత పరిశోధనల్లో ఐఐఐటీ హైదరాబాద్ దేశంలో నంబరు 1గా నిలుస్తోంది. మేధో సంపత్తి హక్కుల కోసం 532 పేటెంట్లు తెలంగాణ నుంచి నమోదయ్యాయి.
మరింత వృద్ధికి మార్గాలివీ..
- ఐటీ సంస్థల్లోని సీనియర్ కార్పొరేట్ నాయకులు ఒకే వేదిక కిందకు వచ్చి సమాఖ్య ఏర్పాటు చేయాలి. స్టార్టప్లకు సలహాలు, వ్యాపార విషయాల్లో సూచనలతో పాటు ఉత్పాదకత, మార్కెటింగ్, బ్రాండింగ్, సేల్స్, నియామకాలు, పన్నులు, నిధుల సమీకరణ, కొత్త వ్యాపారాలు, కొనుగోలు అంశాలపై అవగాహన కల్పించాలి.
- విద్యా పరిశోధన సంస్థలు, స్టార్టప్లతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలి. పరిశ్రమలు, పెట్టుబడిదారుల భాగస్వామ్యంతో కలిపి ఏఐ ఆధారిత స్టార్టప్ ప్రాజెక్టులు వచ్చేలా వాతావరణం కల్పించాలి.
- సంబంధిత ప్రభుత్వ విభాగాల సమన్వయంతో నిర్వహించిన గ్రాండ్ ఛాలెంజ్ పోటీలు, ఆలోచనలు పూర్తిస్థాయి ప్రాజెక్టులుగా మారేలా చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శంషాబాద్లో ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానాలు!
ఓ ఎయిర్లైన్స్ సంస్థ సర్వర్ డౌన్ కావడంతో ప్రయాణికులను ఎక్కించుకోకుండానే ఆ సంస్థకు చెందిన విమానాలు వెళ్లిపోయాయి. -
తొడలోకి చొచ్చుకెళ్లిన చెట్టుకొమ్మ!
వేగంగా వెళుతున్న ఇసుక ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో డ్రైవర్ తొడలోకి చెట్టుకొమ్మ బలంగా దూసుకెళ్లింది. ఒక వైపు నుంచి మరోవైపునకు చొచ్చుకెళ్లి ఉండిపోవడంతో అతను బాధతో విలవిలలాడాడు. -
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్ర‘మే’
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానమైన స్కేల్ ఇవ్వాలి
విస్తృతమైన బాధ్యతలు, విధులు నిర్వర్తిస్తున్న డిప్యూటీ కలెక్టర్లకు ప్రభుత్వ సహాయ కార్యదర్శులతో సమానంగా సవరించిన వేతన స్కేల్ అందజేయాలని తెలంగాణ రాష్ట్ర సివిల్ సర్వీసెస్ (ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్) డిప్యూటీ కలెక్టర్ల సంఘం పీఆర్సీ కమిటీని కోరింది. -
ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి
పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు 40 శాతం ఫిట్మెంట్ వర్తింపజేయాలని వేతన సవరణ కమిటీని(పీఆర్సీ) తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం కోరింది. -
పర్యావరణహిత ప్రజారవాణా మేలు
కాలుష్య ఉద్గారాలు లేని ప్రజారవాణా పర్యావరణానికి మేలు కలిగిస్తుందని బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్ పేర్కొన్నారు. జీరో ఎమిషన్ వెహికిల్ (జెడ్ఈవీ) పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఆయన గురువారం హైదరాబాద్కు వచ్చారు. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ కొట్టివేత
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్ను నాంపల్లి కోర్టు గురువారం కొట్టివేసింది. -
జూన్ 3 నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు
రాష్ట్రంలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూలును విద్యాశాఖ గురువారం విడుదల చేసింది. వచ్చే నెల 3 నుంచి 13 వరకు పరీక్షలు జరుగుతాయి. -
భవన నిర్మాణ అనుమతుల వెనక ఆంతర్యం ఏమిటి?
రాష్ట్రంలో మూడున్నర నెలల తర్వాత భవన నిర్మాణ అనుమతులు ఇవ్వడం వెనక ఉన్న ఆంతర్యం ఏమిటని భాజపా శాసనసభాపక్షనేత ఎ.మహేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. -
కవిత బెయిల్పై తీర్పు 6కి వాయిదా
దిల్లీ మద్యం వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసుకున్న పిటిషన్పై గురువారం వెలువరించాల్సిన తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 6వ తేదీకి వాయిదా వేసింది. -
తెలంగాణకు ఐదు టీఎంసీలు ఇవ్వండి
రాష్ట్రంలో తాగునీటి అవసరాలకు నారాయణపూర్ ప్రాజెక్టు నుంచి 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను తెలంగాణ కోరింది. -
ఉద్యోగులకు వేతనాలివ్వలేని స్థితిలో కృష్ణా బోర్డు
సరిపడా నిధులు లేక బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఉందని, తెలంగాణ చెల్లించాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ నీటిపారుదల కార్యదర్శికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) తాజాగా లేఖ రాసింది. -
ఈ పాపం జగన్దే
జగన్ అనుకున్నంత పనీ చేశారు. పింఛనుదారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా నడిపారు. వారి చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పుతిప్పలు పెట్టారు. ఇంటింటికీ పింఛను పంపిణీ చేసే సులువైన అవకాశమున్నా...వారు సుదూరంలో ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూలైన్లలో పడిగాపులు కాసేలా చేశారు. -
పిల్లలూ.. ఆకాశవాణిలో కథలు వింటారా?
అన్ని వర్గాలు, వయసుల వారిని అలరిస్తున్న ఆకాశవాణి ఈ వేసవిలో పిల్లల కోసం ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తోంది. ఇంట్లో రేడియో లేదు.. ఎలా వినాలన్న సందేహం అక్కర్లేదు. -
విధుల్లో పారదర్శకంగా వ్యవహరించాలి
ఎన్నికల విధులు నిర్వహిస్త్తున్న అధికారులు రాజకీయ పార్టీలు, అభ్యర్థుల విషయంలో పారదర్శకంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అది క్షమార్హం కాదని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ స్పష్టం చేశారు. -
అడవుల్లోని ఖనిజ సంపదంతా దేశ ప్రజలదే
అటవీ ప్రాంతాల్లోని ఖనిజ వనరులు దేశ ప్రజలకు చెందినవని.. వాటి పరిరక్షణకు హక్కుల కార్యకర్తలు పోరాడుతుంటే ప్రభుత్వాలు సాయుధ బలగాలతో దాడులు చేయించి అక్రమ కేసులు బనాయిస్తున్నాయని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ పేర్కొన్నారు. -
అమూల్యమైంది ఓటు.. మరచిపోతే చేటు
ఓటుహక్కు ప్రాధాన్యంపై వరంగల్ జిల్లా ఖిలావరంగల్ మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కూలి కొమ్ము అబ్రహం వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నారు. -
పచ్చని పుడమి కోసం ‘వృక్ష వేద్ అరణ్య’
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం అస్సాంలోనూ మొదలైంది. అస్సాంకు చెందిన ప్రముఖ ప్రకృతి ప్రేమికుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత జాదవ్ పాయెంగ్తో కలిసి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ ‘వృక్ష వేద్ అరణ్య’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్
-
భారత కంపెనీపై దిల్లీ హైకోర్టుకు టెస్లా.. కారణం ఇదే..
-
నా స్థాయికి తగ్గ బౌలింగ్ చేయలేకపోయా: ముంబయి స్టార్ ఆల్రౌండర్
-
బజాజ్ కొత్త పల్సర్ NS400Z.. టాప్ స్పీడ్ 154kph
-
‘రాహుల్ గాంధీ పేరుందని పోటీ వద్దంటే ఎలా?: సుప్రీంకోర్టు
-
రివ్యూ: ఆ ఒక్కటీ అడక్కు.. అల్లరి నరేష్ ఖాతాలో హిట్ పడిందా?