Hyderabad - AI Jobs: కొత్తగా 1.5 లక్షల ఏఐ ఆధారిత ఉద్యోగాలు
రాష్ట్రంలో 2025 నాటికి కొత్తగా 1.5 లక్షల కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఉద్యోగాలు వచ్చే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
2025 నాటికి తెలంగాణలో వచ్చే అవకాశాలు
ఏఐ మిషన్, నాస్కామ్ ‘కృత్రిమ మేధలో తెలంగాణ’ నివేదికలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో 2025 నాటికి కొత్తగా 1.5 లక్షల కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత ఉద్యోగాలు వచ్చే అవకాశముందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. భవిష్యత్తు టెక్నాలజీ ఆధారిత ఉద్యోగాల సంఖ్య పెరిగే అవకాశముందని, ఆ మేరకు మానవ వనరుల్ని సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించింది. విద్యార్థులకు ఏఐ, డీప్ లెర్నింగ్, మెషిన్ లెర్నింగ్(ఎంఎల్) తదితర రంగాల్లో శిక్షణ కార్యక్రమాలు చేపట్టామని, లక్ష మంది విద్యార్థులకు ఏఐ నైపుణ్యాలను ఇచ్చే లక్ష్యం పెట్టుకున్నట్లు పేర్కొంది. కార్పొరేట్ సంస్థలు వివిధ మార్గాల ద్వారా నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో పాటు భవిష్యత్తుకు అవసరమైన నిపుణులను సిద్ధం చేయాలని తెలిపింది. తెలంగాణ ఏఐ మిషన్ ద్వారా 142 ఏఐ స్టార్టప్లకు సహాయం అందిస్తున్నట్లు వివరించింది. తెలంగాణ ఏఐ మిషన్, నాస్కామ్ సంయుక్తంగా ‘కృత్రిమ మేధలో తెలంగాణ’ నివేదికను విడుదల చేసింది. ఇప్పటివరకు తెలంగాణలోని స్టార్టప్లు 54 ఒప్పందాల ద్వారా రూ.4,300 కోట్ల నిధులు సమీకరించాయని పేర్కొంది.
నివేదికలోని ముఖ్యాంశాలు
- భవిష్యత్తు టెక్నాలజీ, ఏఐలో తెలంగాణ అంతర్జాతీయ కేంద్రంగా మారుతోంది. ఏఐ ఆధారిత టెక్నాలజీల్లో నాణ్యమైన పరిశోధనలు కంప్యూటర్ విజన్, ఎంఎల్, రోబోటిక్స్ రంగాల్లో రాష్ట్రానికి బలమైన పునాదులుగా మారుతున్నాయి. ఇప్పటికే పలు విద్యాలయాలు సంబంధిత డిగ్రీ కోర్సులు ప్రవేశపెట్టాయి.
- దేశంలో 89 శాతం ఏఐ పరిశోధనలు యూనివర్సిటీల్లో జరుగుతున్నాయి. తెలంగాణలోని ఆరు విశ్వవిద్యాలయాలు పరిశోధనల పరంగా ప్రపంచవ్యాప్తంగా వెయ్యిలోపు ర్యాంకులు సాధించాయి. ఇందులో ఐఐఐటీ, ఐఐటీ హైదరాబాద్, ఎన్ఐటీ వరంగల్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఓయూ, జేఎన్టీయూ ఉన్నాయి.
- 2011 నుంచి 2022 వరకు ఏఐలో 1,774 పరిశోధన పత్రాలు వెలువడితే ఐఐఐటీ హైదరాబాద్ నుంచి 177, ఐఐటీ హైదరాబాద్ నుంచి 65 పత్రాలు ఉన్నాయి. ఏఐ ఆధారిత పరిశోధన పత్రాల్లో తెలంగాణ విశ్వవిద్యాలయాల వార్షిక వృద్ధిరేటు 31 శాతంగా ఉంది.
- ఐఐఐటీ హైదరాబాద్ కంప్యూటర్ విజన్, నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్(ఎన్ఎల్పీ) రంగాల్లో, ఐఐటీ హైదరాబాద్ ఎంఎల్, డేటా మైనింగ్ రంగాల్లో ఎక్కువ పరిశోధనలు చేస్తోంది. వీటితో పాటు వెబ్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్, రోబోటిక్స్ రంగాల్లోనూ పరిశోధనలు జరుగుతున్నాయి.
- కృత్రిమ మేధ ఆధారిత పరిశోధనల్లో ఐఐఐటీ హైదరాబాద్ దేశంలో నంబరు 1గా నిలుస్తోంది. మేధో సంపత్తి హక్కుల కోసం 532 పేటెంట్లు తెలంగాణ నుంచి నమోదయ్యాయి.
మరింత వృద్ధికి మార్గాలివీ..
- ఐటీ సంస్థల్లోని సీనియర్ కార్పొరేట్ నాయకులు ఒకే వేదిక కిందకు వచ్చి సమాఖ్య ఏర్పాటు చేయాలి. స్టార్టప్లకు సలహాలు, వ్యాపార విషయాల్లో సూచనలతో పాటు ఉత్పాదకత, మార్కెటింగ్, బ్రాండింగ్, సేల్స్, నియామకాలు, పన్నులు, నిధుల సమీకరణ, కొత్త వ్యాపారాలు, కొనుగోలు అంశాలపై అవగాహన కల్పించాలి.
- విద్యా పరిశోధన సంస్థలు, స్టార్టప్లతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలి. పరిశ్రమలు, పెట్టుబడిదారుల భాగస్వామ్యంతో కలిపి ఏఐ ఆధారిత స్టార్టప్ ప్రాజెక్టులు వచ్చేలా వాతావరణం కల్పించాలి.
- సంబంధిత ప్రభుత్వ విభాగాల సమన్వయంతో నిర్వహించిన గ్రాండ్ ఛాలెంజ్ పోటీలు, ఆలోచనలు పూర్తిస్థాయి ప్రాజెక్టులుగా మారేలా చూడాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ