హైదరాబాద్లో డీసీపీ, ఏసీపీ సస్పెన్షన్
ఎన్నికల్లో డబ్బు తరలింపు విషయంలో ప్రభుత్వ అధికారుల ప్రమేయం రచ్చకెక్కింది. ఈ వ్యవహారంలో నలుగురు సస్పెన్షన్కు గురి కాగా.. మరొకరిని సర్వీసు నుంచి తొలగించారు.
మరో ఇన్స్పెక్టర్, వరంగల్ ఆబ్కారీ ఇన్స్పెక్టర్పైనా..
సర్వీస్ నుంచి జైలర్ తొలగింపు
ఎన్నికల సొమ్ము తరలింపు ఆరోపణలతో..
ఈనాడు, హైదరాబాద్: ఎన్నికల్లో డబ్బు తరలింపు విషయంలో ప్రభుత్వ అధికారుల ప్రమేయం రచ్చకెక్కింది. ఈ వ్యవహారంలో నలుగురు సస్పెన్షన్కు గురి కాగా.. మరొకరిని సర్వీసు నుంచి తొలగించారు. డీసీపీ స్థాయి అధికారిపై వేటుపడడం సంచలనం సృష్టించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు నాడి అంతు చిక్కకపోవడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు నరాలు తెగే ఉత్కంఠతో ఉన్నారు. ఎన్నికల కమిషన్ బృందాల పటిష్ఠ నిఘా నేపథ్యంలో వీలైన అన్ని దారుల్లో నగదు తెప్పించుకునే ప్రయత్నాల్లో తలమునకలయ్యారు. ఈ పరిస్థితుల్లో అభ్యర్థుల తరఫున కొందరు అధికారులే నేరుగా రంగంలోకి దిగడం.. మరికొందరు అధికారులు పరోక్షంగా సహకరించడం వంటివి విస్మయం కలిగిస్తున్నాయి.
- హైదరాబాద్ చిక్కడపల్లిలోని సంతోష్ ఎలైట్ అపార్ట్మెంట్ ప్రాంతంలో మంగళవారం రాత్రి ఓటర్లకు డబ్బు పంచుతున్నారంటూ ఎన్నికల కమిషన్కు సమాచారం అందింది. తనిఖీ బృందం అక్కడికి వెళ్లడంతో కారులో రూ.18 లక్షల నగదు లభ్యమైంది. నగదుతో పాటు సెల్ఫోన్, చెక్బుక్కులు, కారు (ఏపీ28సీహెచ్ 6759)ను ముషీరాబాద్ నియోజకవర్గంలో విధులు నిర్వహిస్తున్న ఎన్నికల అధికారి రవి ఇస్లావత్.. పోలీసులకు అప్పగించారు. వాహన యజమాని నగదుకు సంబంధించిన సమగ్ర వివరాలను వెల్లడించారు. అయితే పోలీసు అధికారులు అవన్నీ గుర్తు తెలియని వ్యక్తికి చెందినవిగా కేసు నమోదుచేశారు. నిందితుడిని ఉద్దేశపూర్వకంగానే తప్పించే పన్నాగానికి తెరలేపారు. విషయం గ్రహించిన ఎన్నికల తనిఖీ బృందం విషయాన్ని తీవ్రంగా తీసుకొని నివేదిక సమర్పించింది. కమిషన్ ఆదేశాల మేరకు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సందీప్శాండిల్య విచారణ జరిపించడంతో సెంట్రల్జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు, చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్ ఇన్స్పెక్టర్ జహంగీర్ యాదవ్ల నిర్వాకం బహిర్గతమైంది. నగదు ముషీరాబాద్ అభ్యర్థికి చెందినదిగా తేలినా.. సదరు అభ్యర్థి కుటుంబసభ్యుడు ఘటనాస్థలిలో దొరికినా వారిని తప్పించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. నివేదిక ఆధారంగా ముగ్గురు అధికారులను సస్పెండ్ చేయాలంటూ ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో ఈమేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
- ఈ నెల 18న ఓఆర్ఆర్ అప్పా కూడలి వద్ద కారులో తరలిస్తున్న రూ.7.40 కోట్ల నగదును సైబరాబాద్ పోలీసులు జప్తుచేశారు. మొయినాబాద్ నుంచి ఖమ్మంలో ఓ అభ్యర్థికి చేరవేసేందుకు ఆ సొమ్ము తీసుకెళుతున్నారనే ఆరోపణలతో పది మందిపై కేసు నమోదైంది. నిందితుల్లో ఓ జైలర్ ఉన్నారు. ఆయన గురించి ఆరా తీస్తే రెండేళ్లుగా విధులకు దూరంగా ఉన్నట్లు తేలింది. వరంగల్ కేంద్ర కారాగారాన్ని తరలించిన సమయంలో ఆయనను అక్కడి నుంచి హైదరాబాద్లోని శిక్షణ సంస్థకు బదిలీచేశారు. అప్పటినుంచి అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడంతో విచారణ నిర్వహించారు. వ్యాపారం చేసే ఉద్దేశంతోనే విధులకు దూరంగా ఉంటున్నట్లు గుర్తించారు. దీనిపై నివేదిక ఎప్పుడో సిద్ధమైనా ఉన్నతాధికారులు చర్య తీసుకోలేదు. ఎన్నికల డబ్బు తరలింపు వ్యవహారం తరువాత పాత నివేదిక దుమ్ము దులిపారు. ఆయనను సర్వీస్ నుంచి తొలగించారు.
- ఈ నెల 27న వరంగల్ అర్బన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అజిత్రావు సుమారు రూ.6 లక్షల డబ్బుతో కారులో ప్రయాణిస్తుండగా హైదరాబాద్ మేడిపల్లి ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఓ హోటల్ నుంచి వచ్చిన అజిత్రావు ఎన్నికల సొమ్ము తరలిస్తున్నారంటూ దాడి చేసి పోలీసులకు అప్పగించారు. అజిత్రావు మాత్రం ఓ ఫంక్షన్ కోసం హోటల్ బుక్ చేసేందుకు వచ్చానని చెప్పారు. ఈక్రమంలో మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేయకుండా డబ్బును ఐటీశాఖకు అప్పగించారు. ఈ వ్యవహారంపై ఎక్సైజ్శాఖ వరంగల్ డిప్యూటీ కమిషనర్ విచారణ జరిపారు. అజిత్రావు ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా హైదరాబాద్ వచ్చినట్లు తేలడంతో బుధవారం సస్పెన్షన్ వేటువేశారు. సస్పెన్షన్ కాలంలో వరంగల్ హెడ్క్వార్టర్ను వదిలి వెళ్లరాదని ఆదేశించారు.
మధ్యమండలం డీసీపీగా శ్రీనివాస్
ఈనాడు, హైదరాబాద్: ఎన్నికల విధుల్లో అలక్ష్యం వహించినందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వేటు పడిన ముగ్గురు పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారిని నియమించారు. ఈమేరకు హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ట్రాఫిక్ డీసీపీ డి.శ్రీనివాస్ను మధ్యమండలం డీసీపీగా, సీసీఎస్ ఏసీపీ మధుమోహన్రెడ్డిని చిక్కడపల్లి ఏసీపీగా, ముషీరాబాద్ డీఐ డి.వెంకట్రెడ్డిని అక్కడే ఇన్స్పెక్టర్గా నియమించారు. వీరు బుధవారం రాత్రి బాధ్యతలు చేపట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే
-
‘రెడ్బుక్ తెరవక ముందే జగన్ గగ్గోలు’
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి