కృత్రిమ మేధతో సమస్యలకు చెక్!
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు కృత్రిమ మేధ శ్రేష్ఠతర కేంద్రాల(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్)ను నెలకొల్పేందుకు సమాయత్తమైంది.
దేశంలో మూడు కేంద్రాల ఏర్పాటుకు సన్నాహాలు
వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిర నగరాలపై అధ్యయనం
అయిదేళ్లలో రూ.990 కోట్ల వ్యయం
సెంటర్ కోసం పోటీలో ఐఐటీ హైదరాబాద్
ఈనాడు, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు కృత్రిమ మేధ శ్రేష్ఠతర కేంద్రాల(సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్)ను నెలకొల్పేందుకు సమాయత్తమైంది. కృత్రిమ మేధ (ఏఐ)ను వినియోగించుకొని వ్యవసాయం, ఆరోగ్యం, సుస్థిర నగరాలపై అధ్యయనం చేసి ఆ రంగాల్లో అభివృద్ధి సాధించాలని నిర్ణయించిన కేంద్రం అందుకు 2027-28 ఆర్థిక సంవత్సరం నాటికి రూ.990 కోట్లు కేటాయించనుంది. ఆయా ప్రముఖ విద్యాసంస్థలు కన్సార్షియంగా ఏర్పడి కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గత కేంద్ర బడ్జెట్లో ఏఐ శ్రేష్ఠతర కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రకటించగా.. తాజాగా విధివిధానాలను రూపొందించి ఛాలెంజ్ ఆధారిత విధానంలో ఆయా సంస్థలను ఎంపిక చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. దేశంలో తొలిసారిగా బీటెక్ ఏఐ కోర్సును ప్రారంభించిన విద్యాసంస్థగా ఘనత పొందిన ఐఐటీ హైదరాబాద్ సైతం శ్రేష్ఠతర కేంద్రాన్ని పొందేందుకు కసరత్తు చేస్తోంది. హెచ్సీయూ, ఓయూ సైతం పోటీపడతాయని తెలుస్తోంది.
మూడు రంగాల్లో అంతిమ లక్ష్యం ఇదీ
వ్యవసాయం: కృత్రిమ మేధ విధానాలను ఉపయోగించి వాతావరణ మార్పులు, వర్షాలు, తుపాన్లకు సంబంధించి ముందుగా కచ్చితమైన సమాచారం అందించడం, ముందుగానే ఆయా పంటలకు వచ్చే తెగుళ్లు, సాగులో ఉన్న పంటల స్థితిగతులను అంచనా వేయాలన్నది లక్ష్యం. అయిదేళ్ల ప్రాజెక్టు ఫలితంగా తృణధాన్యాల దిగుబడిని 10 శాతం పెంచడం, తెగుళ్ల నివారణతో పంట ఉత్పత్తిలో 12 శాతం నష్టాన్ని తగ్గించడం, 15 శాతం నీటి వినియోగాన్ని తగ్గించడం, సరఫరా గొలుసు (సప్లై చెయిన్) సమర్థ నిర్వహణ ద్వారా నిల్వ, రవాణాలో 5 శాతం వృద్ధి సాధించడం అంతిమ లక్ష్యంగా నిర్ణయించారు.
ఆరోగ్యం: గ్రామీణ ప్రాంత మహిళల్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్ లోపాన్ని గుర్తించడం ద్వారా ఆరోగ్యకరమైన బిడ్డల జననాలను 10 శాతం పెంచాలి. గ్రామీణ ప్రాంత చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని 12 శాతం తగ్గించాలి. మామోగ్రామ్, ఇతరత్రా పరీక్షల ద్వారా రొమ్ము క్యాన్సర్ను ముందుగా గుర్తించడం ఆరోగ్య రంగంలో సాధించాల్సిన లక్ష్యాలు.
సుస్థిర నగరాలు: కొన్ని రంగాల్లో 15 శాతం విద్యుత్తు వినియోగాన్ని తగ్గించడం, నగరాల్లో గాలి, నీటి కాలుష్యాన్ని 10 శాతం మేర తగ్గించడం, మురుగునీరు, చెత్త కలవడం వల్ల సముద్రాలు, నదుల్లో కాలుష్య స్థాయి పెరుగుతున్నందున వ్యర్థాల తరలింపులో 25 శాతం వృద్ధిని సాధించడం, రవాణా సౌకర్యాలు పెంచడం ద్వారా ప్రయాణికుల సమయాన్ని 20 శాతం తగ్గించడం లక్ష్యాలుగా కేంద్రం నిర్ణయించింది.
ఆ కేంద్రం కోసం కృషి చేస్తున్నాం
మూడు శ్రేష్ఠతర కేంద్రాల్లో ఏదో ఒకదాన్ని ఐఐటీ హైదరాబాద్లో ఏర్పాటు చేసేలా మా బృందం కసరత్తు చేస్తోంది. ఇందుకు ఒక సమన్వయకర్తను నియమించాం. వారు ఏ రంగంలో పోటీ పడాలన్న దానిపై ఆచార్యులతో చర్చలు జరుపుతున్నారు. హైదరాబాద్లో వ్యవసాయం, వైద్యంతో పాటు సుస్థిర నగరాలకు సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థలున్నందున మనకు ఇదో పెద్ద అవకాశం. కృత్రిమ మేధలో బీటెక్ కోర్సును ప్రవేశపెట్టిన తొలి ఐఐటీ మనదే. ఆ రంగంలో 30 మంది నిపుణులు ఇక్కడ ఉన్నారు. అందుకే కేంద్రాన్ని సాధించాలన్న లక్ష్యంతో ఉన్నాం.
ఆచార్య బీఎస్ మూర్తి, డైరెక్టర్, ఐఐటీ హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?