Revanth Reddy: ఇటు ఎమ్మెల్యేలు.. అటు అధిష్ఠానం అండ!
ఇటు మెజార్టీ ఎమ్మెల్యేలు.. అటు కాంగ్రెస్ అధిష్ఠానం అండగా నిలవడంతో ముఖ్యమంత్రి పదవి విషయంలో రేవంత్రెడ్డికి పెద్దగా అవరోధాలు ఎదురుకాలేదు.
సీఎం రేసులో ముందు నిలిచిన రేవంత్
ఆయన పేరునే సూచించిన రాహుల్ గాంధీ
పెద్దగా అవరోధాలు లేకుండానే ఖరారు
పోటీ పడిన భట్టి, ఉత్తమ్లను సముదాయించిన అగ్రనేతలు
ప్రభుత్వంలో ప్రాధాన్యమిస్తామని భరోసా
ఈనాడు, హైదరాబాద్: ఇటు మెజార్టీ ఎమ్మెల్యేలు.. అటు కాంగ్రెస్ అధిష్ఠానం అండగా నిలవడంతో ముఖ్యమంత్రి పదవి విషయంలో రేవంత్రెడ్డికి పెద్దగా అవరోధాలు ఎదురుకాలేదు. సీఎల్పీ మాజీ నేత మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డిలు పోటీ పడినా.. ఎన్నికల్లో రేవంత్రెడ్డి కృషి, రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటించి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయడం, పీసీసీ అధ్యక్షుడిగా స్టార్ క్యాంపెయినర్గా ముమ్మరంగా పర్యటించడం, భారాసను దీటుగా ఎదుర్కోవడం లాంటి అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని ఈయన వైపే మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది.
👉 Follow EENADU WhatsApp Channel
పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ స్వయంగా రేవంత్ పేరును సూచించగా.. ఇతరులూ ఆమోదించినట్లు తెలుస్తోంది. ఆది నుంచీ పోటీలో మిగిలిన వారికంటే రేవంత్రెడ్డి ముందున్నారు. అభ్యర్థుల ఎంపికలో తన ముద్ర ఉండేలా చూసుకోవడం, ఇతర పార్టీల్లోని ముఖ్యులను కాంగ్రెస్లోకి వచ్చేలా చేయడంతోపాటు వారికి టికెట్లు ఇప్పించడం.. ఇలా అన్ని విషయాల్లో దూకుడుగా వ్యవహరించారు.
సీనియర్ల అభ్యంతరాలు
ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ అధిష్ఠానం డి.కె.శివకుమార్ నేతృత్వంలో నియమించిన పరిశీలకుల బృందం హైదరాబాద్లో సోమవారం సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకోవడం, ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం అంతా సజావుగా సాగుతుందనుకొన్న సమయంలో.. ఆ సమావేశానికి ముందుగానే కొందరు సీనియర్ నాయకులు విడిగా డీకేను కలిశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్లోనే పనిచేస్తూ విజయానికి కష్టపడిన తమ అభ్యర్థిత్వాలను కూడా సీఎం పదవికి పరిశీలించాలని కోరారు. దీంతో పాటు రేవంత్రెడ్డితో సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. రేవంత్ పీసీసీ అధ్యక్షుడయ్యాక.. ముందు నుంచీ ఉన్న సీనియర్ నాయకులు చాలా విషయాల్లో ఆయనను వ్యతిరేకిస్తూ వచ్చారు. తమను సంప్రదించకుండానే, పరిగణనలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నారని పలు సందర్భాల్లో ఫిర్యాదులు చేశారు కూడా. డీకేతో భేటీ అయిన నాయకులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించినట్లు తెలిసింది. భట్టి, ఉత్తమ్కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి రేసులో నిలవగా, వీరితోపాటు డీకేను కలిసిన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్బాబు తమకున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. తర్వాత జరిగిన సీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేకు అప్పగిస్తూ తీర్మానం చేయడంతోపాటు ఎమ్మెల్యేలందరి అభిప్రాయాలు తీసుకున్నారు. 30 మందికి పైగా ఎమ్మెల్యేలు నేరుగా రేవంత్రెడ్డి పేరు చెప్పగా, మిగిలిన వారిలో ఎక్కువ మంది ఏఐసీసీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని పేర్కొన్నట్లు తెలిసింది. భట్టి, ఉత్తమ్ పేర్లను కొద్ది మంది మాత్రమే చెప్పినట్లు సమాచారం.
దిల్లీలోనూ ప్రయత్నాలు
సీఎల్పీ సమావేశానికి ముందు నాయకులతో చర్చించిన అంశాలు, సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు వేర్వేరుగా వ్యక్తం చేసిన అభిప్రాయాలతో కూడిన నివేదికను పరిశీలకులు అధిష్ఠానానికి అందజేశారు. దీనిపై అధిష్ఠానం నిర్ణయం వెంటనే చెప్పకుండా.. పరిశీలకులను దిల్లీకి పిలిపించింది. సోమవారం రాత్రి చర్చించిన తర్వాత కూడా ఓ నిర్ణయానికి రాకపోవడంతో మంగళవారం మళ్లీ సమావేశమయ్యారు. ఇదే సమయంలో భట్టి, ఉత్తమ్లు దిల్లీ వెళ్లి ఏఐసీసీ నాయకులను కలిసి తమ అభ్యర్థిత్వాలను పరిశీలించాలని కోరినట్లు తెలిసింది. రేవంత్రెడ్డి మాత్రం హైదరాబాద్లో ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్లోనే ఉండిపోయారు. మంగళవారం మల్లికార్జున ఖర్గే, రాహుల్గాంధీ, కేసీ వేణుగోపాల్, పరిశీలకులు డీకే, ఠాక్రేలు సమావేశమయ్యారు. రేవంత్రెడ్డి పేరునే ఖరారు చేయాలని రాహుల్గాంధీ సూచించగా.. మిగిలిన వారు కూడా రేవంత్వైపే మొగ్గు చూపినట్లు సమాచారం. తర్వాత కేసీ వేణుగోపాల్, డీకే, ఠాక్రేలు భట్టి విక్రమార్క, ఉత్తమ్లతో చర్చించారు. అధిష్ఠానం నిర్ణయాన్ని వారికి తెలిపారు. ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం ఉంటుందని చెప్పినట్లు తెలిసింది. అనంతరం ఉత్తమ్, భట్టిల సమక్షంలోనే రేవంత్రెడ్డిని సీఎల్పీ నేతగా నిర్ణయించినట్లు.. 7న ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
-
వారికి క్షమాపణలు చెప్పా: ‘యానిమల్’ విమర్శలపై తొలిసారి స్పందించిన రణ్బీర్
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి