4.72 లక్షల ఎకరాల్లో పంట నష్టం
రాష్ట్రంలో మిగ్జాం తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కురిసిన భారీ వర్షాలతో 4.72 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది.
ఉమ్మడి ఖమ్మంలోనే 82 వేల ఎకరాల్లో..
మిగ్జాం ప్రభావంతో భారీ వర్షాలు
కుండపోత వానతో నేలవాలిన వరి
దెబ్బతిన్న మిర్చి, పత్తి, మొక్కజొన్న
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మిగ్జాం తుపాను ప్రభావంతో మంగళ, బుధవారాల్లో కురిసిన భారీ వర్షాలతో 4.72 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగి అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. వానలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా అతలాకుతలమైంది. ఆ జిల్లాలో సుమారు లక్ష ఎకరాల్లో నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అంచనా వేసింది. బుధవారం కురిసిన వర్షాలకు కూసుమంచి, నేలకొండపల్లి, వైరా, ఏన్కూరు, జూలూరుపాడు, సత్తుపల్లి, పెనుబల్లి, తల్లాడ, వెల్చూరు, అశ్వారావుపేట, దమ్మపేట, ఇల్లెందు, టేకులపల్లి తదితర మండలాల్లో వరి దెబ్బతింది. చింతకాని, ముదిగొండ, వైరా, కొత్తగూడెం, లక్ష్మిదేవిపల్లి, సుజాతనగర్లలో పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. వరంగల్ జిల్లాలో 12 మండలాల్లో, ములుగు జిల్లాలో నాలుగు, భూపాలపల్లిలో మూడు, కుమురం భీం ఆసిఫాబాద్లో నాలుగు, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో ఆరేసి మండలాల్లో వరి పైర్లు నేలవాలగా.. పత్తి, మిర్చి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. చాలా ప్రాంతాల్లో కోసి ఉన్న వరి పైరుతో పాటు కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. కొన్నిచోట్ల వరదనీటిలో ధాన్యం కొట్టుకుపోయింది.
భారీగా నష్టం
పంట నష్టాలను వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. వారి అంచనా ప్రకారం.. ఖమ్మం జిల్లాలో 53,903 మంది రైతులకు చెందిన 82,180 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. 58,397 ఎకరాల్లో వరి, 17,267 ఎకరాల్లో పత్తి, 17,267 ఎకరాల్లో మిర్చి, 5,252 ఎకరాల్లో మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కొత్తగూడెం జిల్లాలో 7,450 మంది రైతులకు చెందిన 13,608 ఎకరాల్లో పంటకు నష్టం కలగగా.. వరి 8,816, మిర్చి 2,475, వేరుసెనగ 1602, మొక్కజొన్న 585, పత్తి 130 ఎకరాల్లో దెబ్బతిన్నాయి. మహబూబాబాద్ జిల్లాలో 23,923, వరంగల్లో 20,391, హనుమకొండలో 19,282, ములుగులో 18,920, భూపాలపల్లిలో 18,321 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండల రాఘవాపురం, వెంకటాపురం గ్రామాల్లో పంట నష్టాలను పరిశీలించేందుకు వెళ్లిన అధికారుల వద్దకు రైతులు వచ్చి నేలవాలిన మిర్చి, తడిసిన పత్తి పంటలను చూపిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. వర్షాలతో నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి.సాగర్ ఓ ప్రకటనలో కోరారు.
నేడూ వర్షాలు
మిగ్జాం తుపాను ప్రభావంతో రాష్ట్రంలో గురువారం ఆదిలాబాద్, కుమురం భీం, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ, నాగర్కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల(గంటకు 30-40 కి.మీ. వేగం)తో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. బుధవారం కుమురం భీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వానలు కురిశాయి. రాష్ట్రవ్యాప్తంగా 22.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో అత్యధికంగా 324.2 మిల్లీమీటర్లు నమోదైంది. కొత్తగూడెం జిల్లాలోని మద్దుకూరులో 307.8 మి.మీ, మల్కారంలో 254, అంకంపాలెంలో 238, నాగుపల్లిలో 227, పెంట్లంలో 225, కొత్తగూడెంలో 210, గరిమెళ్లపాడులో 180, సీతారామపురంలో 179, సీతారామపట్నంలో 179, భద్రాచలం 174, ఖమ్మం జిల్లా గంగారంలో 171, సదాశివపాలెంలో 171, గుబ్బగుర్తిలో 164, రావినూతలలో 159 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. లక్ష్మీదేవిపల్లి, వేంసూరు, జూలూరుపాడు, దుమ్ముగూడెం, సుజాతనగర్లలోనూ 100 మిల్లీమీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైంది.
కష్టమంతా నేలపాలు
పంట కోతల సమయంలో వర్షాల కారణంగా కష్టమంతా నేలపాలైందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 42 శాతం వరి కోతలు పూర్తయ్యాయి. మిగిలిన 58 శాతం ఈ నెల రెండో వారంలోగా పూర్తి కావాల్సి ఉంది. ఈ లోపే వర్షాలు కురవడంతో కోతలు నిలిచిపోయాయి. మిర్చి కాయలు, పత్తి రాలిపోతున్నాయి. మొక్కజొన్న కర్రలు నేలవాలుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అశ్వాపురం మండలం భీమవరంలో చలి కారణంగా 20 గొర్రెలు మృత్యువాతపడ్డాయి. పలు కుంటలు, చెరువులకు గండ్లు పడ్డాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు
-
‘గరీబ్రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
-
కమలా.. మా మద్దతు మీకే