ఖైదీలపై ఏడాదికి రూ.2,528 కోట్ల ఖర్చు

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఖైదీలపై 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,528 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్ర తెలిపారు.

Published : 07 Dec 2023 04:52 IST

ఏపీలో రూ.194 కోట్లు, తెలంగాణలో రూ.21 కోట్ల వ్యయం
రాజ్యసభలో కేంద్ర మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్ర వెల్లడి

 ఈనాడు, దిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కలిపి ఖైదీలపై 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,528 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్‌ మిశ్ర తెలిపారు. బుధవారం రాజ్యసభలో వైకాపా సభ్యుడు ఎస్‌.నిరంజన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అత్యధికంగా హరియాణలో రూ.406 కోట్లు, తరువాత ఉత్తర్‌ప్రదేశ్‌లో రూ.403 కోట్లు ఖర్చయినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో రూ.194 కోట్లు ఖర్చు చేస్తే, తెలంగాణలో కేవలం రూ.21 కోట్లే వ్యయమైనట్లు చెప్పారు. 2018లో జైళ్ల సంఖ్య 1,341 ఉండగా, 2022 నాటికి అది 1,330కి తగ్గినట్టు వెల్లడించారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో జైళ్ల సంఖ్య 105 నుంచి 106కి పెరిగినట్లు తెలిపారు. తెలంగాణలో మాత్రం 49 నుంచి 37కి తగ్గినట్లు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని