ఉత్తమ పనితీరు కళాశాలలకు.. బ్రాంచ్ల ఏర్పాటుకు అనుమతి
ఇక ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కళాశాలలు సైతం ఆఫ్ క్యాంపస్ విధానంలో మరికొన్ని కళాశాలలను నడుపుకోవచ్చు.
బీబీఏ, బీబీఎం, బీసీఏ కోర్సులకు ఏఐసీటీఈ సిలబస్
న్యాక్ పరిధిలోకి పాలిటెక్నిక్ కళాశాలలు
అనుమతులపై ఏఐసీటీఈ నిబంధనావళి విడుదల
ఈనాడు, హైదరాబాద్: ఇక ఇంజినీరింగ్, మేనేజ్మెంట్ కళాశాలలు సైతం ఆఫ్ క్యాంపస్ విధానంలో మరికొన్ని కళాశాలలను నడుపుకోవచ్చు. సాధారణ పరిభాషలో చెప్పాలంటే బ్రాంచ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. కాకపోతే ఈ అనుమతిని మంచి పనితీరు కనబరిచే విద్యాసంస్థలకు మాత్రమే అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఇవ్వనుంది. ఈమేరకు 2024-25 నుంచి 2026-27 విద్యా సంవత్సరం వరకు నిబంధనావళిని బుధవారం విడుదల చేసింది. ఇప్పటివరకు డీమ్డ్, ప్రైవేట్ వర్సిటీలకు మాత్రమే ఆఫ్ క్యాంపస్లను ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉండేది. మార్గదర్శకాలకు లోబడి పనిచేసే కళాశాలలకూ ఈ వెసులుబాటు లభిస్తుంది. బ్రాంచ్లను అనుబంధ విశ్వవిద్యాలయం పరిధిలో మాత్రమే నెలకొల్పాలి. ఉదాహరణకు హైదరాబాద్లోని ఓ ప్రముఖ ఇంజినీరింగ్ కళాశాల జేఎన్టీయూ-హెచ్ నుంచి గుర్తింపు పొందితే... రాష్ట్రంలో మరో ఆఫ్ క్యాంపస్ను పెట్టుకోవచ్చు. అదే ఓయూకు అనుబంధ కళాశాలగా ఉంటే హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలో మాత్రమే ప్రారంభించుకోవడానికి వీలవుతుంది. వచ్చే మూడు విద్యా సంవత్సరాలకు సంబంధించి అనుమతుల ప్రక్రియ ఈనెల 23వ తేదీ నుంచి మొదలై వచ్చే ఏప్రిల్కు ముగుస్తుంది.
ఆ కోర్సులకు ఏఐసీటీఈ సిలబస్...
బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ), బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (బీబీఎం) కోర్సులకు వచ్చే విద్యా సంవత్సరం (2024-25) నుంచి ఏఐసీటీఈ అనుమతులు పొందాల్సిందేనని ఇటీవల ముసాయిదా నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా నిబంధనల హ్యాండ్బుక్లో మరింత స్పష్టతనిచ్చింది. ఆ కోర్సులకు ఏఐసీటీఈ కొత్త ఆదర్శ విద్యాప్రణాళికను విడుదల చేయనుంది. ఇప్పటివరకు యూజీసీ మార్గదర్శకాల మేరకు ఆయా వర్సిటీలు రూపొందించిన సిలబస్ను ఆ కోర్సులకు అమలు చేస్తుండగా...ఇకపై ఏఐసీటీఈ సిలబస్ను పాటించడం తప్పనిసరి. స్వయంప్రతిపత్తి హోదా ఉన్న కళాశాలలకు మాత్రం ఆ సిలబస్లో 20 శాతాన్ని తమకు అనుగుణంగా మార్చుకోవచ్చు. ఇకపై ఆ కోర్సులను నడిపే కళాశాలలు ఏఐసీటీఈ అనుమతి తీసుకోవాలి.
మరికొన్ని ముఖ్యాంశాలివీ...
- ఇప్పటివరకు అండర్ గ్రాడ్యుయేట్, ఆపై కోర్సులు నడిపే కళాశాలలే న్యాక్ పరిధిలో ఉండేవి. ఇకపై పాలిటెక్నిక్ డిప్లొమా కళాశాలలు కూడా న్యాక్ గుర్తింపునకు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే న్యాక్ గుర్తింపు తర్వాత స్వయంప్రతిపత్తి (అటానమస్) హోదా పొందొచ్చు.
- ఉత్తమ పనితీరు కనబరుస్తున్న కళాశాలలకు కోర్సులు, సీట్ల పరిమితి విషయంలో మినహాయింపునిస్తారు. అందుకు ఆయా కళాశాలలకు అవసరమైన నాణ్యమైన మౌలిక వసతులు, అర్హులైన అధ్యాపకులు ఉండాలి. అటువంటి కళాశాలలకు మూడేళ్లపాటు అనుమతులు ఇస్తారు. అందుకు న్యాక్ ‘ఏ’ గ్రేడ్ లేదా 30 శాతం కోర్సులకు నేషనల్ బోర్డు ఆఫ్ అక్రిడిటేషన్(ఎన్బీఏ) గుర్తింపు లాంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు.
- ఇప్పటికే ఉద్యోగాలు చేస్తూ విద్యార్హతను పెంచుకోవాలనుకునే వారికోసం సాయంత్రం కోర్సులకు అనుమతినిస్తారు. ఆఫ్లైన్, ఆన్లైన్ విధానంలో వారు హాజరుకావచ్చు.
- ఏఐసీటీఈ అనుమతి తీసుకునే అన్ని కళాశాలలు ఒకేషనల్ కోర్సులను ప్రారంభించుకోవచ్చు. వాటికి ప్రత్యేకంగా అనుమతులు అవసరం లేదు.
- ఇన్నోవేషన్పై పూర్తి దృష్టి పెడతారు. అందుకే ప్రతి కళాశాలలో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇన్నోవేషన్ సెల్ (ఐఐసీ) ఏర్పాటు చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల