Revanth Reddy: విద్యుత్‌పైనే తొలి గురి!.. ఆ శాఖ కార్యదర్శిపై సీఎం ఆగ్రహం

మంత్రివర్గ తొలి సమావేశం సందర్భంగా.. రాష్ట్రంలో విద్యుత్‌ వ్యవస్థ పనితీరుపై వాడి వేడిగా చర్చ సాగింది. విద్యుత్‌ రంగంలో ఏం జరిగిందో తెలుపుతూ సమగ్రంగా శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది.

Updated : 08 Dec 2023 08:17 IST

మంత్రిమండలి భేటీలో చర్చ
ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ రాజీనామాను ఆమోదించవద్దని ఆదేశం
నేడు సమీక్ష.. ఆయననూ పిలవాలన్న రేవంత్‌

మంత్రివర్గ తొలి సమావేశం సందర్భంగా.. రాష్ట్రంలో విద్యుత్‌ వ్యవస్థ పనితీరుపై వాడి వేడిగా చర్చ సాగింది. విద్యుత్‌ రంగంలో ఏం జరిగిందో తెలుపుతూ సమగ్రంగా శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఆ శాఖలో వాస్తవాలను వెల్లడించకుండా చాలాకాలంగా దాచిపెట్టడాన్ని తప్పుపడుతూ.. ఆ శాఖ ఉన్నతాధికారిపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. విద్యుత్‌ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని రేవంత్‌ అభిప్రాయపడినట్లు సమాచారం. విద్యుత్‌ సంస్థలకు ఇప్పటివరకు రూ.85 వేల కోట్ల అప్పులున్నట్లు సీఎంకు అధికారులు చెప్పారని తెలుస్తోంది. శుక్రవారం దీనిపై సమీక్ష చేద్దామని అంటూ.. ఆ శాఖకు సంబంధించిన పూర్తి వివరాలతో సిద్ధం కావాలని రేవంత్‌ ఆదేశించినట్లు సమాచారం. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకరరావు ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేశారు. దాన్ని ఆమోదించవద్దని.. శుక్రవారం నాటి సమీక్ష సమావేశానికి ఆయనను కూడా పిలవాలని సీఎం ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు