కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో కనులపండువగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు.
కనులపండువగా కాంగ్రెస్ సర్కారు ప్రమాణ స్వీకారం
సీఎంగా రేవంత్రెడ్డి, డిప్యూటీగా భట్టి, మంత్రులుగా మరో 10 మంది ప్రమాణం
సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే హాజరు
కర్ణాటక, హిమాచల్ప్రదేశ్ సీఎంల రాక
పెద్దఎత్తున తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో కనులపండువగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్రెడ్డితో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు. మల్లు భట్టివిక్రమార్క ఉప ముఖ్యమంత్రిగా.. మరో 10మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. పార్టీ అగ్రనేతలు, ఆ పార్టీ పాలిత రాష్ట్రాల సీఎంలు, ఉప ముఖ్యమంత్రులు, అధికార, అనధికార ప్రముఖులు, పెద్దసంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు, అభిమానులు హాజరయ్యారు. సభికుల కేరింతలు, నినాదాల నడుమ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ప్రమాణ స్వీకారాన్ని తిలకించేందుకు వీలుగా ఎల్బీ స్టేడియం లోపల, వెలుపల ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు.
కార్యకర్తల హర్షధ్వానాల మధ్య రేవంత్ ప్రమాణం
తొలుత రేవంత్రెడ్డి ప్రమాణ స్వీకారం మొదలుపెట్టగానే కార్యకర్తలు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. ప్రమాణం అనంతరం వేదికపై ఉన్న అగ్రనేత సోనియా గాంధీ వద్దకు ఆయన వెళ్లి పాదాభివందనం చేశారు. రేవంత్ను ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య తదితరులు అభినందించారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రిగా భట్టివిక్రమార్క, మంత్రులుగా ఉత్తమ్కుమార్రెడ్డి, దామోదర రాజనరసింహా, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు. వీరిలో దామోదర రాజనరసింహా ఆంగ్లంలో ప్రమాణం చేశారు. సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఆత్మసాక్షిగా, మిగిలిన వారంతా దైవసాక్షిగా ప్రమాణం చేశారు. సీతక్క ప్రమాణ స్వీకారం చేయడానికి వచ్చినప్పుడు.. కార్యకర్తలు, అభిమానుల నుంచి పెద్దఎత్తున హర్షధ్వానాలు వినిపించాయి. సీతక్క.. సీతక్క.. అన్న నినాదాలతో సభ దద్దరిల్లింది. ప్రమాణం చేయడానికి ఆమె కొద్దిసేపు ఆగాల్సి వచ్చింది. ప్రమాణ స్వీకారం అనంతరం మంత్రులు గవర్నర్, సీఎం, సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేల దగ్గరకు వెళ్లి నమస్కరించారు. సీతక్క, కొండా సురేఖలను సోనియా ఆలింగనం చేసుకోవడంతో వారు భావోద్వేగానికి గురయ్యారు. భట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డిలు.. రేవంత్ను ఆలింగనం చేసుకున్నారు. అందరూ చేతులు కలిపి సభికులకు అభివాదం చేశారు. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం మధ్యాహ్నం 1.04 గంటలకు నిర్ణయించగా.. 1.20 గంటలకు సీఎంగా రేవంత్ ప్రమాణంతో మొదలైంది. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణం చేయడంతో 1.47 గంటలకు ముగిసింది.
జై రేవంతన్న నినాదాలు..
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. ఉదయం 10 గంటల నుంచే ఎల్బీ స్టేడియం పరిసర ప్రాంతాలు కార్యకర్తలు, అభిమానులతో కిక్కిరిశాయి. ‘జై రేవంతన్న’, ‘జై కాంగ్రెస్’ నినాదాలతో స్టేడియం మారుమోగింది. అంతకుముందు ఉదయం సోనియా, రాహుల్, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తదితరులకు శంషాబాద్ విమానాశ్రయంలో రేవంత్రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్రావ్ ఠాక్రే తదితరులు ఘనస్వాగతం పలికారు. అక్కడి నుంచి వారు నేరుగా హోటల్ తాజ్కృష్ణకు చేరుకున్నారు. ఆ తర్వాత సోనియా, రేవంత్రెడ్డిలు ఓపెన్ టాప్ వాహనంలో పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలకు అభివాదం చేస్తూ ఎల్బీ స్టేడియానికి చేరుకున్నారు. స్టేడియంలో సభికులు పెద్దఎత్తున హర్షధ్వానాలు చేశారు. రాహుల్ అభివాదం చేయగా.. ‘పీఎం.. పీఎం’ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రేవంత్రెడ్డి సతీమణి గీత, కుమార్తె నైమిషారెడ్డి, అల్లుడు, మనవడు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం.. రేవంత్రెడ్డి తన కుటుంబ సభ్యులను సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గేలకు పరిచయం చేశారు. కొత్త సీఎం, మంత్రులతో గవర్నర్, సీఎస్ గ్రూప్ ఫొటో దిగారు. సభ నుంచి గవర్నర్ వెళ్లిపోయిన అనంతరం వేదిక పైనుంచి సోనియా, రాహుల్, ప్రియాంక, ఖర్గే తదితర కాంగ్రెస్ అగ్రనేతలతో కలిసి రేవంత్, మంత్రులు ప్రజలకు అభివాదం చేశారు. పార్టీ అగ్రనేతలు వెళ్లిపోయిన తర్వాత.. కృతజ్ఞత సభలో రేవంత్ ప్రసంగించారు. ఆయన ప్రసంగానికి జనం నుంచి స్పందన కనిపించింది. అనంతరం సీఎం దంపతులకు హిందూ, ముస్లిం, క్రైస్తవ మత పెద్దలు ఆశీర్వచనాలు అందించారు.
వేదికపై ఆసీనులైన ప్రముఖులు
వేదికపై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఒకవైపు ఆసీనులు కాగా.. మరోవైపు కర్ణాటక, హిమాచల్ప్రదేశ్ ముఖ్యమంత్రులు సిద్ధరామయ్య, సుఖ్వీందర్ సింగ్ సుక్కు, పలువురు కర్ణాటక మంత్రులు, తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్, కాంగ్రెస్ సీనియర్ నేతలు జానారెడ్డి, వి.హనుమంతరావు, అంజన్కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి, షబ్బీర్అలీ, మధుయాస్కీ గౌడ్, బలరాం నాయక్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్రెడ్డి, తెజస అధ్యక్షుడు కోదండరాం, ప్రజా కళాకారుడు అందెశ్రీ, ప్రజాసంఘాల నాయకులు, తెలంగాణ అమరుల కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ మాజీ మంత్రులు, నాయకులు కూర్చున్నారు. వేదిక మధ్యలో గవర్నర్, ముఖ్యమంత్రి కోసం ప్రత్యేక కుర్చీలు ఏర్పాటు చేయగా.. వారి సమీపంలో ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక ఆసీనులయ్యారు. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సమన్వయం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ