Free Bus Travel: రేపటి నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ఈ నెల 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రెండు గ్యారంటీలను అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.
అందరికీ రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ భద్రత
కొత్త ప్రభుత్వం అమలు చేసే తొలి రెండు గ్యారంటీలివే..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వ విభాగాల వారీగా శ్వేతపత్రాల విడుదలకు ఆదేశాలు
ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఈ నెల 9న
తొలి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయాలు
వెల్లడించిన మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ఈ నెల 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రెండు గ్యారంటీలను అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. తొలి గ్యారంటీ కింద రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రెండో గ్యారంటీగా రూ.10 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయనుంది. వంద రోజుల్లోగా ఆరు గ్యారంటీ హామీలు అమలు చేస్తామని స్పష్టం చేసింది. గురువారం సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం.. సచివాలయంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తొలి మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశ వివరాల్ని మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ‘ప్రజలు, పారిశ్రామిక సంస్థలు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారంటీ అని మంత్రిమండలి స్పష్టం చేసింది. 2014 నుంచి 2023 డిసెంబరు 7వ తేదీ వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వ విభాగాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించాం. గ్రూప్-1, 2 పరీక్షలపై చర్చించాం. వీటిపై ఒక నివేదిక తెప్పించుకుని ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ నెల 9న కొత్త శాసనసభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం ఉంటాయి.
గుర్తింపుకార్డు చూపించి ఉచిత ప్రయాణం..
తొలి మంత్రిమండలి సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ఈ సందర్భంగా.. తెలంగాణ ప్రజలందరికీ సీఎం, మంత్రుల తరఫున కృతజ్ఞతలు తెలిపాం. రాబోయే సంవత్సరాల్లో ప్రజా జీవితాల్లో మార్పు తెచ్చేలా హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై సుదీర్ఘంగా చర్చించాం. అవి సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు. తొలుత రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించాం. మొదటి గ్యారంటీ కింద రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రెండో గ్యారంటీగా రూ.10 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తాం. వీటికి సంబంధించి శుక్రవారం ఆయా విభాగాలతో చర్చించి శనివారం (ఈ నెల 9వ తేదీ) నుంచే అమలులోకి తెస్తాం. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీని(Free Bus Travel To Women) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభిస్తారు. మహిళలు ఈ నెల 9 నుంచి తమ గుర్తింపు కార్డు (ఆధార్ లేదా ఇతర) చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ కార్యక్రమం అమల్లో భాగంగా ఎదురయ్యే సాధకబాధకాలను పరిశీలించి మరిన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆరు గ్యారంటీల అమలు ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం. మిగతా గ్యారంటీల అమలుకు సంబంధించి విభాగాల నుంచి సమాచారం తీసుకోవాల్సి ఉంది.
పదేళ్లుగా ప్రణాళిక లేని విద్యుత్తు వ్యవస్థ
మంత్రిమండలి సమావేశంలో రెండో అంశంగా 2014 నుంచి 2023 డిసెంబరు 7 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించాం. ప్రభుత్వ విభాగాలకు సంబంధించి ఎంత సొమ్ము దేనికి ఖర్చు పెట్టారు? వాటి ప్రయోజనాలు ప్రజలకు ఎంతవరకు చేరాయి? అనే వివరాలతో కూడిన శ్వేతపత్రాలు వీలైనంత త్వరగా విడుదల చేయాలని అధికారులకు సూచించాం. గృహావసరాలు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఇచ్చిన మాట మేరకు 24 గంటల విద్యుత్తు హామీ కార్యాచరణలో పెట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. 2014 నుంచి ఇప్పటి వరకు విద్యుత్తు విషయంలో దొర్లిన తప్పులు, ఆ శాఖ ప్రణాళిక లేకుండా సాగడంపై మంత్రి మండలి సుదీర్ఘంగా చర్చించింది. దీనిపై శుక్రవారం విద్యుత్తుశాఖ ముఖ్యకార్యదర్శి, ఇతర అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. విద్యుత్తుకు సంబంధించిన అనేక అంశాలతో పాటు గత పదేళ్లుగా జరిగిన లోటుపాట్లపై సమీక్షిస్తారు. అంతరాయం లేకుండా రాబోయే అయిదేళ్ల పాటు వ్యవసాయదారులకు 24 గంటల ఉచిత విద్యుత్తుతో పాటు ప్రభుత్వ గ్యారంటీల్లో భాగమైన గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుపై నిర్ణయాలు తీసుకుంటారు.
పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు
ఇటీవల వర్షాల వల్ల పంటలకు వాటిల్లిన నష్టంపై చర్చించాం. వీటిపై అధికారులు ఇప్పటికే ప్రాథమిక అంచనాలు వేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా పెట్టుబడి సహాయం కోసం ఆర్థికశాఖ నుంచి పూర్తిస్థాయి సమాచారం అడిగాం. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. అయిదేళ్లలో ఆరు గ్యారంటీలను అమలు చేయాల్సిన అవసరముంది. ఆర్థిక పరిస్థితి వివరాలు శ్వేతపత్రం రూపంలో ప్రజలకు అందించాలి. గత ఏడాది రుణమాఫీ బకాయిలు, రైతుల పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి? అన్న విషయాలతో పాటు మేం ఇచ్చిన హామీల అమలుకు వనరులు ఏ విధంగా సేకరించాలి? తదితర విషయాలు దృష్టిలో పెట్టుకుని సమగ్రంగా నిర్ణయం తీసుకుంటాం. మంత్రివర్గ కూర్పుపై సీఎం, ఏఐసీసీ నాయకులు చర్చించి నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీనియర్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్గా ఉంటారు. ప్రమాణ స్వీకారం తరువాత స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం ఉంటాయి. అనంతరం స్పీకర్తో కూర్చుని ఎజెండా నిర్ణయించి వివరాలు వెల్లడిస్తాం. హౌసింగ్ బోర్డులో తొలగించిన వారి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో తరువాత నిర్ణయిస్తాం’ అని శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ వివరించారు.
మంత్రులకు శాఖల కేటాయింపులో జాప్యం
కొత్త ప్రభుత్వంలో మంత్రులకు ఇంకా శాఖలు కేటాయించలేదు. ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా.. వారికి ఫలానా శాఖలు కేటాయించారంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు చక్కర్లు కొట్టాయి. కొన్ని ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం నిజం కాదని.. మంత్రులకు శాఖలు కేటాయించలేదని ప్రభుత్వం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు కూడా మంత్రులకు శాఖల కేటాయింపుపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
బ్యాంకు ఖాతాలే లేవు.. నగదు జమ చేశారట
జగన్ ఇబ్బంది పెట్టింది పాడేరులోని ఈ ఒక్క వృద్ధుడినే కాదు. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల మందిది ఇదే పరిస్థితి. అసలు కొంతమంది పింఛనుదారులకు బ్యాంకు ఖాతాలు లేకపోయినా...ఉన్నాయని, వాటిలోనే జమ చేసినట్టు చూపించారు. -
రికార్డుల ఫోర్జరీపై చర్యలకు ఆదేశించండి
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం మాచన్పల్లి సర్వే నం.442లోని 31 ఎకరాల భూమికి సంబంధించి ఫోర్జరీ ద్వారా ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసిన వారిపై చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ షాబాద్ మండలానికి చెందిన ఇ.మహేందర్ అలియాస్ బొప్పి మహేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల్లో 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు
జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు దాఖలైన 2013 తర్వాత 95 మంది నిందితులు/ కంపెనీలు డిశ్చార్జి పిటిషన్లు, 39 మంది నిందితులు క్వాష్ పిటిషన్లు దాఖలు చేసినట్లు సీబీఐ.. సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. -
వేడుకగా ‘ది లాస్ట్ మహారాజా ఆఫ్ విజయనగరం’ పుస్తకావిష్కరణ
విజయనగరం జిల్లా కేంద్రంలోని పూసపాటి రాజుల కోటలో మాన్సాస్ ట్రస్టు వ్యవస్థాపకుడు డా.పి.వి.జి.రాజు శత జయంతి ఉత్సవాలు సందడిగా సాగుతున్నాయి. -
కడప కోర్టు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాల విచారణ వాయిదా
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైకాపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలపై ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయవద్దని, న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న ఏ కేసుల గురించీ మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు (పీడీజే) గత నెల 16న ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. -
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
‘బాహుబలి’ యానిమేటెడ్ సిరీస్ ట్రైలర్ చూశారా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
-
సూరి హత్య కేసు నిందితుడికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురు
-
స్వల్ప లాభాలతో ముగిసిన సూచీలు
-
దుబాయ్లో మళ్లీ వర్షాలు.. ట్రావెల్ అడ్వైజరీ ఇచ్చిన భారత ఎయిర్లైన్స్
-
50MP సెల్ఫీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్
-
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్