Free Bus Travel: రేపటి నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ఈ నెల 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రెండు గ్యారంటీలను అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.
అందరికీ రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ భద్రత
కొత్త ప్రభుత్వం అమలు చేసే తొలి రెండు గ్యారంటీలివే..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వ విభాగాల వారీగా శ్వేతపత్రాల విడుదలకు ఆదేశాలు
ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఈ నెల 9న
తొలి క్యాబినెట్ సమావేశంలో నిర్ణయాలు
వెల్లడించిన మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా ఈ నెల 9న సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా రెండు గ్యారంటీలను అమలు చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. తొలి గ్యారంటీ కింద రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రెండో గ్యారంటీగా రూ.10 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేయనుంది. వంద రోజుల్లోగా ఆరు గ్యారంటీ హామీలు అమలు చేస్తామని స్పష్టం చేసింది. గురువారం సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల ప్రమాణ స్వీకారం అనంతరం.. సచివాలయంలో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో తొలి మంత్రిమండలి సమావేశం జరిగింది. ఈ సమావేశ వివరాల్ని మంత్రులు శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ విలేకరులకు వెల్లడించారు. ఆ వివరాలు వారి మాటల్లోనే.. ‘ప్రజలు, పారిశ్రామిక సంస్థలు, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తు ఇవ్వడం కాంగ్రెస్ ప్రభుత్వ గ్యారంటీ అని మంత్రిమండలి స్పష్టం చేసింది. 2014 నుంచి 2023 డిసెంబరు 7వ తేదీ వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వ విభాగాల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేయాలని అధికారులను ఆదేశించాం. గ్రూప్-1, 2 పరీక్షలపై చర్చించాం. వీటిపై ఒక నివేదిక తెప్పించుకుని ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయమై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఈ నెల 9న కొత్త శాసనసభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం ఉంటాయి.
గుర్తింపుకార్డు చూపించి ఉచిత ప్రయాణం..
తొలి మంత్రిమండలి సమావేశం సుదీర్ఘంగా జరిగింది. ఈ సందర్భంగా.. తెలంగాణ ప్రజలందరికీ సీఎం, మంత్రుల తరఫున కృతజ్ఞతలు తెలిపాం. రాబోయే సంవత్సరాల్లో ప్రజా జీవితాల్లో మార్పు తెచ్చేలా హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీలపై సుదీర్ఘంగా చర్చించాం. అవి సోనియాగాంధీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలు. తొలుత రెండు గ్యారంటీలను అమలు చేయాలని నిర్ణయించాం. మొదటి గ్యారంటీ కింద రాష్ట్రంలోని మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, రెండో గ్యారంటీగా రూ.10 లక్షల విలువైన ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తాం. వీటికి సంబంధించి శుక్రవారం ఆయా విభాగాలతో చర్చించి శనివారం (ఈ నెల 9వ తేదీ) నుంచే అమలులోకి తెస్తాం. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ హామీని(Free Bus Travel To Women) ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రారంభిస్తారు. మహిళలు ఈ నెల 9 నుంచి తమ గుర్తింపు కార్డు (ఆధార్ లేదా ఇతర) చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఈ కార్యక్రమం అమల్లో భాగంగా ఎదురయ్యే సాధకబాధకాలను పరిశీలించి మరిన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఆరు గ్యారంటీల అమలు ప్రణాళికాబద్ధమైన కార్యక్రమం. మిగతా గ్యారంటీల అమలుకు సంబంధించి విభాగాల నుంచి సమాచారం తీసుకోవాల్సి ఉంది.
పదేళ్లుగా ప్రణాళిక లేని విద్యుత్తు వ్యవస్థ
మంత్రిమండలి సమావేశంలో రెండో అంశంగా 2014 నుంచి 2023 డిసెంబరు 7 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించాం. ప్రభుత్వ విభాగాలకు సంబంధించి ఎంత సొమ్ము దేనికి ఖర్చు పెట్టారు? వాటి ప్రయోజనాలు ప్రజలకు ఎంతవరకు చేరాయి? అనే వివరాలతో కూడిన శ్వేతపత్రాలు వీలైనంత త్వరగా విడుదల చేయాలని అధికారులకు సూచించాం. గృహావసరాలు, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఇచ్చిన మాట మేరకు 24 గంటల విద్యుత్తు హామీ కార్యాచరణలో పెట్టాలని అధికారులకు ఆదేశాలిచ్చాం. 2014 నుంచి ఇప్పటి వరకు విద్యుత్తు విషయంలో దొర్లిన తప్పులు, ఆ శాఖ ప్రణాళిక లేకుండా సాగడంపై మంత్రి మండలి సుదీర్ఘంగా చర్చించింది. దీనిపై శుక్రవారం విద్యుత్తుశాఖ ముఖ్యకార్యదర్శి, ఇతర అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. విద్యుత్తుకు సంబంధించిన అనేక అంశాలతో పాటు గత పదేళ్లుగా జరిగిన లోటుపాట్లపై సమీక్షిస్తారు. అంతరాయం లేకుండా రాబోయే అయిదేళ్ల పాటు వ్యవసాయదారులకు 24 గంటల ఉచిత విద్యుత్తుతో పాటు ప్రభుత్వ గ్యారంటీల్లో భాగమైన గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుపై నిర్ణయాలు తీసుకుంటారు.
పంట నష్టంపై ప్రాథమిక అంచనాలు
ఇటీవల వర్షాల వల్ల పంటలకు వాటిల్లిన నష్టంపై చర్చించాం. వీటిపై అధికారులు ఇప్పటికే ప్రాథమిక అంచనాలు వేశారు. రైతులకు ఇబ్బంది లేకుండా పెట్టుబడి సహాయం కోసం ఆర్థికశాఖ నుంచి పూర్తిస్థాయి సమాచారం అడిగాం. త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం. అయిదేళ్లలో ఆరు గ్యారంటీలను అమలు చేయాల్సిన అవసరముంది. ఆర్థిక పరిస్థితి వివరాలు శ్వేతపత్రం రూపంలో ప్రజలకు అందించాలి. గత ఏడాది రుణమాఫీ బకాయిలు, రైతుల పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటి? అన్న విషయాలతో పాటు మేం ఇచ్చిన హామీల అమలుకు వనరులు ఏ విధంగా సేకరించాలి? తదితర విషయాలు దృష్టిలో పెట్టుకుని సమగ్రంగా నిర్ణయం తీసుకుంటాం. మంత్రివర్గ కూర్పుపై సీఎం, ఏఐసీసీ నాయకులు చర్చించి నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీనియర్ ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్గా ఉంటారు. ప్రమాణ స్వీకారం తరువాత స్పీకర్ ఎన్నిక, గవర్నర్ ప్రసంగం ఉంటాయి. అనంతరం స్పీకర్తో కూర్చుని ఎజెండా నిర్ణయించి వివరాలు వెల్లడిస్తాం. హౌసింగ్ బోర్డులో తొలగించిన వారి సమస్యను ఏ విధంగా పరిష్కరించాలో తరువాత నిర్ణయిస్తాం’ అని శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్ వివరించారు.
మంత్రులకు శాఖల కేటాయింపులో జాప్యం
కొత్త ప్రభుత్వంలో మంత్రులకు ఇంకా శాఖలు కేటాయించలేదు. ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయగా.. వారికి ఫలానా శాఖలు కేటాయించారంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు చక్కర్లు కొట్టాయి. కొన్ని ప్రసార మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం నిజం కాదని.. మంత్రులకు శాఖలు కేటాయించలేదని ప్రభుత్వం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. గురువారం రాత్రి పొద్దుపోయే వరకు కూడా మంత్రులకు శాఖల కేటాయింపుపై ఎలాంటి ఉత్తర్వులు వెలువడలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల