TS Cabinet: కొత్త.. పాత కలయికగా మంత్రివర్గం
కాంగ్రెస్ ప్రభుత్వంలో కొలువుదీరనున్న మంత్రివర్గం కొత్త..పాత కలయికగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సహా 12 మంది ప్రమాణ స్వీకారం చేశారు.
నేరుగా ముఖ్యమంత్రి పదవి చేపట్టిన రేవంత్రెడ్డి
ఆరుగురు కొత్తవారికి అవకాశం
సీనియర్ మంత్రులుగా తుమ్మల, జూపల్లి
ఈనాడు, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వంలో కొలువుదీరనున్న మంత్రివర్గం కొత్త..పాత కలయికగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో సహా 12 మంది ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ను పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 13 మందిలో ఏడుగురు గతంలో వివిధ ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేసిన వారున్నారు. మిగిలిన ఆరుగురికి ఇదే మొదటి అవకాశం. రేవంత్రెడ్డి మంత్రిగా చేయకుండా నేరుగా ముఖ్యమంత్రి అయిన వారి జాబితాలో చేరారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా చీఫ్ విప్గా ఉన్నారు తప్ప ఎప్పుడూ మంత్రిగా చేయలేదు. దామోదర రాజనర్సింహా గతంలో ఉపముఖ్యమంత్రిగా, ఉన్నత విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. శ్రీధర్బాబు, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు కూడా గతంలో మంత్రులుగా పనిచేశారు. వీరిలో ఎక్కువ మందికి ఇద్దరు ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర పని చేసిన అనుభవం ఉంది. తుమ్మల ఎన్టీఆర్ మొదలుకొని కేసీఆర్ వరకు వివిధ ప్రభుత్వాల్లో 17 ఏళ్లు మంత్రిగా ఉన్నారు. జూపల్లి కృష్ణారావు నాలుగోసారి మంత్రి అయ్యారు. కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, వైఎస్, రోశయ్య, కిరణ్కుమార్రెడ్డిల ప్రభుత్వాల్లో పనిచేశారు. కొండా సురేఖ వైఎస్ మంత్రివర్గంలో ఉన్నారు. గతంలో ఎంపీలుగా ఉన్న పొంగులేటి, పొన్నం ప్రభాకర్లు మొదటిసారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రి పదవులు పొందారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతక్క తొలిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో మైనార్టీ వర్గం నుంచి ఎమ్మెల్యేలెవరూ లేకపోవడంతో ఆ వర్గానికి ప్రాతినిధ్యం దక్కలేదు.
నాలుగు ఉమ్మడి జిల్లాలకు దక్కని ప్రాతినిధ్యం
గురువారం ప్రమాణ స్వీకారం చేసిన మొదటి మంత్రివర్గంలో రాష్ట్రంలోని నాలుగు ఉమ్మడి జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు. కాంగ్రెస్కు ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో మంత్రులుగా జి.వివేక్, ప్రేమ్సాగర్రావుల పేర్లు ప్రచారంలోకి వచ్చినా ఇద్దరికీ అవకాశం రాలేదు. నిజామాబాద్ నుంచి సుదర్శన్రెడ్డికి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరిగినా ఆయనకూ దక్కలేదు. సామాజిక సమీకరణాల్లో భాగంగానే ఇవ్వలేదని పార్టీ వర్గాలు చెబున్నాయి. ఇదే జిల్లా నుంచి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావుకు ఐటీ శాఖ కేటాయిస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో జోరుగా చర్చలు నడిచాయి. హైదరాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులెవరూ ఎమ్మెల్యేలుగా గెలవలేదు. రంగారెడ్డి నుంచి ఇద్దరు ముగ్గురి పేర్లు వినిపించినా ఎవరికీ పిలుపురాలేదు. అయితే వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్కుమార్కు స్పీకర్గా అవకాశం కల్పించారు. అయితే మంత్రివర్గంలోకి మరో ఆరుగురిని తీసుకోవడానికి వీలుంది. అందులో ఈ జిల్లాల నాయకులకు అవకాశం లభించవచ్చు. ప్రస్తుత మంత్రివర్గంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు అత్యధిక ప్రాధాన్యం లభించింది. ఉపముఖ్యమంత్రితో సహా ఇద్దరికి పదవులు దక్కాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్
-
పేదలకు ఇళ్లు కట్టిస్తానని టోకరా.. ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించిన నిందితుడి అరెస్టు