కళాశాలల్లో స్వల్పకాల నైపుణ్యాభివృద్ధి కోర్సులు
డిగ్రీ విద్యార్థుల్లో ప్రస్తుతం అవసరమైన నైపుణ్యాలను పెంచే దిశగా యూజీసీ ముందుకెళ్తోంది. అన్ని కళాశాలలు లేదా విశ్వవిద్యాలయాలు స్వల్పకాల నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రారంభించుకునేందుకు పచ్చజెండా ఊపింది.
27 కోర్సులను గుర్తించిన యూజీసీ
మార్గదర్శకాల జారీ
ఈనాడు, హైదరాబాద్: డిగ్రీ విద్యార్థుల్లో ప్రస్తుతం అవసరమైన నైపుణ్యాలను పెంచే దిశగా యూజీసీ ముందుకెళ్తోంది. అన్ని కళాశాలలు లేదా విశ్వవిద్యాలయాలు స్వల్పకాల నైపుణ్యాభివృద్ధి కోర్సులను ప్రారంభించుకునేందుకు పచ్చజెండా ఊపింది. గురువారం మార్గదర్శకాలను జారీ చేసింది. ఉద్యోగార్థుల్లో కొలువులకు అవసరమైన నైపుణ్యాలు ఉండటం లేదని పరిశ్రమల వర్గాలు గత కొన్నేళ్లుగా మొరపెట్టుకుంటున్న నేపథ్యంలో.. ఒకేషనల్ విద్యను జనరల్ విద్యతో మిళితం చేయాలని జాతీయ నూతన విద్యా విధానంలోనే నిర్ణయించారు. ఈ క్రమంలో యూజీసీ శరవేగంగా అమలుకు శ్రీకారం చుట్టింది. ఇంటర్ పాసై డిగ్రీ, బీటెక్ తదితర అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరిన వారు ఈ కోర్సులకు అర్హులు. తొలుత యూజీసీ 3-6 నెలల కాలవ్యవధి ఉన్న 27 రకాల నైపుణ్య కోర్సులను కూడా గుర్తించింది. వాటితోపాటు సీఐఐ, ఎఫ్ఐఐ, నాస్కామ్, పరిశ్రమవర్గాలు, సెక్టార్ స్కిల్ కౌన్సిళ్లు తదితర కోర్సులను కూడా ప్రారంభించుకోవచ్చు. ఇందుకు యూజీసీ అనుమతి అవసరం లేదు. కాకపోతే ఆ కోర్సుల్లో నైపుణ్యమున్న సంస్థలు, పరిశ్రమలతో ఎంవోయూ కుదుర్చుకోవాలి. స్వల్పకాల కోర్సులకు కూడా క్రెడిట్లు ఇస్తారు. 12-30 క్రెడిట్ల వరకు ఉంటాయి. ఒక కోర్సుకు సంబంధించిన సెక్షన్లో 60 మందికి మించి ఉండరాదు. ప్రతి 30 మందికి ఒక టీచర్ ఉండాలి. ఈ కోర్సులను నడిపేందుకు సెంటర్ ఫర్ స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ పేరిట ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి దానికి అధిపతిగా ఒక సీనియర్ అధ్యాపకుడిని నియమించుకోవాలి.
గుర్తించినవి ఇవే...
1. ఏఐ అండ్ ఎంఎల్ 2. ఏఐ అండ్ రోబోటిక్స్ 3. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ( ఐఓటీ)/ ఇండస్ట్రియల్ ఐఓటీ/స్మార్ట్ సిటీస్ 4. డేటా సైన్స్ అండ్ అనలిటిక్స్ 5. క్లౌడ్ కంప్యూటింగ్ 6. వర్చువల్ రియాలిటీ, అగ్మెంటెడ్ రియాలిటీ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీ 7. సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ 8. 5జీ కనెక్టివిటీ 9. డిజిటల్ ఫ్లూయెన్సీ/డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ 10. ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్ 11. ఎలక్ట్రానిక్స్ సిస్టమ్ డిజైన్స్/ వీఎల్ఎస్ఐ డిజైన్స్ 12. ఎలక్ట్రానిక్స్ మ్యాన్ఫ్యాక్చరింగ్ 13.బేసిక్ కోడింగ్ ఇన్ కంప్యూటింగ్ లాంగ్వేజెస్ 14. కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్(క్యాడ్) 15. మెకానికల్ టూలింగ్ అండ్ ప్రాసెసెస్/మెకట్రానిక్స్ 16. ఆర్కిటెక్చురల్ డ్రాఫ్టింగ్, బేసిక్ 3డీ డిజైన్ 17.బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ 18. 3డీ ప్రింటింగ్ 19. ఎలక్ట్రీషియన్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 20.మొబైల్ కమ్యూనికేషన్, మొబైల్ రిపేరింగ్ అండ్ బేసిక్స్ ఆఫ్ డీటీహెచ్ ఇన్స్టాలేషన్ 21.డిజిటల్ మార్కెటింగ్ 22. హెల్త్ అండ్ వెల్నెస్ 23. ఫైనాన్షియల్ టెక్నాలజీ(ఫిన్టెక్) 24.ఫ్యాషన్ టెక్నాలజీ, ఫ్యాషన్ డిజైన్ తదితరాలు 25. యోగిక్ సైన్సెస్ 26. సాఫ్ట్ స్కిల్స్ 27. బేసిక్స్ ఆఫ్ స్టార్టప్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్