Prajadarbar: బాధలు విన్నారు.. భరోసా ఇచ్చారు!
‘చాలా కాలంగా తిరుగుతున్నా భూ సమస్య పరిష్కారం కాలేదు. ప్రభుత్వం నేరుగా దరఖాస్తు తీసుకోవడంతోనైనా న్యాయం జరుగుతుందన్న ఆశ ఏర్పడింది’ అని ఒకరు.. ‘విద్యుదాఘాతంతో చేతులు పోయాయి.
ప్రజాదర్బార్కు శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్రెడ్డి
ప్రజాభవన్లో పౌరుల నుంచి నేరుగా వినతుల స్వీకరణ
మంత్రులు పొంగులేటి, సీతక్కలతో కలిసి సమస్యలు విన్న సీఎం
వెంటనే పరిష్కరించాలని యంత్రాంగానికి ఆదేశం
రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు
అర్జీలలో భూ వివాదాలు, పింఛన్లవే అధికం
ఈనాడు- హైదరాబాద్, న్యూస్టుడే - ఖైరతాబాద్
‘చాలా కాలంగా తిరుగుతున్నా భూ సమస్య పరిష్కారం కాలేదు. ప్రభుత్వం నేరుగా దరఖాస్తు తీసుకోవడంతోనైనా న్యాయం జరుగుతుందన్న ఆశ ఏర్పడింది’ అని ఒకరు.. ‘విద్యుదాఘాతంతో చేతులు పోయాయి. ఆదుకుంటారనే నమ్మకంతో వచ్చాను’ అంటూ మరొకరు.. ‘నా భూమిని ఫోర్జరీ సంతకాలతో ఆక్రమించారు. ఆదుకోండి’ అంటూ ఇంకొకరు.. ఇలా రాష్ట్రం నలుమూలల నుంచి పలు సమస్యలతో పెద్ద సంఖ్యలో జనం ప్రజాదర్బార్కు(Prajadarbar) పోటెత్తారు. బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావ్ ఫులె ప్రజాభవన్లో సీఎం రేవంత్రెడ్డి శుక్రవారం ప్రజాదర్బార్కు శ్రీకారం చుట్టారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కలతో కలిసి ఉదయం 10 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించారు. దివ్యాంగులకు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. వారి సమస్యలను సీఎం స్వయంగా అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు. ఇతర అర్జీదారుల సమస్యలనూ విన్నారు. ఆయా సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. వివిధ జిల్లాల నుంచి బాధితులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ప్రజాభవన్ కిటకిటలాడింది.
రెవెన్యూ, గృహనిర్మాణం, విద్యుత్ శాఖతోపాటు ఆర్టీసీ, జీహెచ్ఎంసీలకు చెందిన సమస్యలపై వినతులు భారీ సంఖ్యలో వచ్చినట్టు, వాటిలో భూ సమస్యలు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకు ప్రజాదర్బార్ కొనసాగింది. ముఖ్యమంత్రి కొంత సమయం తర్వాత అత్యవసర సమావేశం కోసం సచివాలయానికి వెళ్లడంతో మంత్రి సీతక్క దర్బార్ను కొనసాగించారు. దివ్యాంగులు, మహిళలు, వృద్ధుల సమస్యలను ఓపికగా విన్నారు. సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, డీజీపీ రవిగుప్తా, జల మండలి ఎండీ దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ తదితరులు కార్యక్రమాన్ని సమన్వయం చేశారు.
బాధితులకు బాసటగా అధికారులు
వివిధ జిల్లాల నుంచి సమస్యలు విన్నవించుకునేందుకు వచ్చిన బాధితులకు అధికారులు బాసటగా నిలిచారు. వారు చెప్పే అంశాలను ఆలకించడంతోపాటు వారి వద్ద ఉన్న సంబంధిత ఆధారాలను పరిశీలించి స్వయంగా అర్జీలూ రాసిచ్చారు. చదువుకోని వారు, కాగితాలు, పెన్నులు తీసుకురాని వారికి ప్రభుత్వ సిబ్బంది సహాయం చేశారు. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు మొత్తం 15 సహాయ కేంద్రాలు(హెల్ప్ డెస్కులు) ఏర్పాటు చేశారు. ప్రతి అర్జీని ఆన్లైన్లో నమోదుచేసి ప్రత్యేకంగా నంబరు కేటాయించారు. రసీదు ఇవ్వడంతోపాటు సంబంధిత వ్యక్తి ఫోన్కు సంక్షిప్త సందేశం పంపారు. దర్బార్ లోపల 320 కుర్చీలు ఏర్పాటు చేశారు. దరఖాస్తులు ఇచ్చేందుకు వచ్చి వరుసల్లో నిలబడిన వారికి తాగునీరు, దివ్యాంగులకు చక్రాల కుర్చీలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అవసరమైన వారికి వైద్య సేవలు అందించారు.
ధరణిలో నమోదు చేయలేదు.. రైతుబంధు రావడం లేదు
గ్రామంలో నాకు మూడెకరాల భూమి ఉంది. ధరణి పోర్టల్లో నమోదు చేయలేదు. దీంతో రైతు బంధు, బీమా అందడం లేదు. 70 ఏళ్ల వయసులో మండలం నుంచి జిల్లా కేంద్రం వరకు అనేక మంది అధికారుల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. సీఎం ప్రజాదర్బార్ నిర్వహిస్తున్నారని తెలిసి వచ్చా. ముఖ్యమంత్రి నా సమస్య విని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం నుంచి సానుకూల సమాధానం రావడంతో ఆనందంగా ఉంది.
బాలమ్మ, కాశీంనగర్, వనపర్తి జిల్లా
పదేళ్లుగా తిరుగుతున్నా పట్టించుకోలేదు
ఇందిరాగాంధీ హయాంలో మా కుటుంబానికి ఎకరా ఎసైన్డ్ భూమి ఇచ్చారు. నా భర్త చనిపోయిన తరువాత వేరే వాళ్లు భూమిని ఆక్రమించుకున్నారు. తిరిగి ఇప్పించాలని పదేళ్లుగా తహసీల్దారు నుంచి కలెక్టర్ల చుట్టూ తిరుగుతున్నా. ఎవరూ పట్టించుకోలేదు. భూమి సర్వే చేయించి న్యాయం చెయ్యాలి.
కేతావత్ రుక్కీ, గుమ్మడివెల్లి తండా, కందుకూరు మండలం, రంగారెడ్డి జిల్లా
సమస్యను సీఎం విన్నారు..
2012లో పొలంలో పనిచేస్తుండగా విద్యుదాఘాతానికి గురయ్యా. రెండు చేతులు, కాలు కోల్పోయా. నా కుటుంబం అప్పులు చేసి నన్ను బతికించుకుంది. అప్పట్నుంచి తినడం సహా అన్ని అవసరాలు ఇతరుల సాయంతో తీర్చుకుంటూ వస్తున్నా. నేను నిరుపేదను. కృత్రిమ చేతులు ఏర్పాటు చేసుకునే స్థోమత లేదు. ఇన్నేళ్లుగా ఎందరినో కలిశా. న్యాయం జరగలేదు. కొత్త ప్రభుత్వం ఆదుకుంటుందనే ఆశతో వచ్చా. సీఎం రేవంత్రెడ్డి నా సమస్యను విన్నారు.
సీహెచ్.నారాయణరెడ్డి, కోయిలకొండ, మహబూబ్నగర్
ఫోర్జరీతో నా భూమిని కాజేశారు
తాతల కాలం నుంచి వారసత్వంగా వస్తున్న నాలుగున్నర ఎకరాల పట్టా భూమి ఉంది. రైతు బంధు కూడా వస్తోంది. స్థానిక భారాస నాయకులు ఫోర్జరీ సంతకాలతో అందులో 1.20 ఎకరాల విస్తీర్ణాన్ని 2019లో బల్లెద్దుల మషన్న పేరు మీదికి మార్చారు. స్థానిక తహసీల్దారు నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వరకు మొర పెట్టుకున్నా న్యాయం జరగలేదు. స.హ.చట్టం కింద నా భూమి వివరాలు సేకరించి ఫోర్జరీపై ప్రశ్నిస్తే ఎకరం మాత్రం నా పేరుపైకి మార్చారు. ఫోర్జరీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు మిగిలిన 20 గుంటల భూమిని నా పేరుతో నమోదు చేయాలని సీఎంకు విన్నవించా.
జాగల మషన్న, దేవుని తిర్మలాపూర్, పెద్దకొత్తపల్లి మండలం, నాగర్కర్నూల్ జిల్లా
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..