మహిళలకు ‘మహా’వరం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది.
శనివారం మధ్యాహ్నం 1.30 తర్వాత రాష్ట్రమంతా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
బాలికలు, ట్రాన్స్జెండర్లకు కూడా..
పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్లలో అనుమతి
హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్లలోనూ వర్తింపు
తెలంగాణ చిరునామాతో ఉండే ఆధార్, ఓటరు కార్డు డ్రైవింగ్ లైసెన్సులాంటి గుర్తింపు కార్డు చూపిస్తే చాలు
ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు పథకానికీ నేడు సీఎం రేవంత్ శ్రీకారం
ఈనాడు, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది. గురువారం ప్రమాణ స్వీకారం అనంతరం వాటికి సంబంధించి తొలి సంతకం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. శనివారం నుంచి అందులో రెండు పథకాలను అమల్లోకి తీసుకురానున్నారు. రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి నిర్దేశించిన మహాలక్ష్మి పథకాన్ని, ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచే మరో పథకాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అయ్యాక అసెంబ్లీ ప్రాంగణంలో మధ్యాహ్నం 1.30 గంటలకు సీఎం రేవంత్ మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించిన అనంతరం రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందుబాటులోకి రానుంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో ‘మహాలక్ష్మి’ స్మార్ట్కార్డ్ను తెచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తోంది. ఈ పథకం రాష్ట్రం మహిళలతో పాటు బాలికలు, ట్రాన్స్జెండర్లకు కూడా వర్తిస్తుందని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ వెల్లడించారు. శుక్రవారం ఆయన ఇక్కడ బస్భవన్లో విలేకరుల సమావేశంలో ఈ పథకం అమలు గురించి వివరించారు. ‘‘పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, హైదరాబాద్ సహా ఇతర నగరాల్లో నడిచే సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో బస్సుల్లో వారు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. అంతర్ రాష్ట్ర ఎక్స్ప్రెస్ బస్సుల్లో రాష్ట్ర సరిహద్దు వరకు ఈ సదుపాయాన్ని పొందవచ్చు. రాష్ట్రంలోని 7,292 సర్వీసుల్లో ప్రభుత్వం ఈ సేవలను అందిస్తుంది. రోజూ సుమారు 40 లక్షల మంది ఆర్టీసీలో ప్రయాణిస్తున్నారు. వారిలో దాదాపు 30 శాతం మంది మహిళలు. వారి సంఖ్య 12 లక్షల నుంచి 14 లక్షల దాకా ఉంటోంది. తాజాగా అమల్లోకి రానున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకంతో లబ్ధిపొందే మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లను కలుపుకొంటే ఆ సంఖ్య 55 శాతానికి పెరుగుతుందని అంచనా. రోజు వారీగా ఆర్టీసీకి రూ.14 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. ఈ పథకం అమలుతో సుమారు సగం ఆదాయం తగ్గుతుంది. ఏడాదికి రూ.3 వేల కోట్ల వరకు ఆర్టీసీపై భారం పడుతుంది. ఆ మొత్తాన్ని చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది’’ అని సజ్జనార్ వివరించారు. లీజుకు ఇచ్చిన ఆర్టీసీ ఆస్తులకు సంబంధించి రావాల్సిన ఆదాయం విషయంలో ఇబ్బందుల్లేవని సజ్జనార్ తెలిపారు. ఆర్మూర్ ఆస్తి విషయంలో పెద్ద మొత్తంలో బకాయిలు ఉన్నాయని చెప్పారు. ‘కరోనా సమయం నుంచి ఉన్నాయి. తాజాగా కొంత మొత్తాన్ని చెల్లించారు. మిగిలిన ఆస్తుల విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు’ అని వివరించారు.
జీరో టికెట్ జారీ
‘‘మహాలక్ష్మి పథకం కింద బస్సుల్లో ప్రయాణించే వారికి జీరో టికెట్ జారీ చేస్తాం. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఏయే మార్గాల్లో, ఏయే సమయాల్లో రద్దీ ఉంటుందనే విషయమై కొద్ది రోజుల తర్వాత అధ్యయనం చేస్తాం. అందుకు తగినట్లు సర్వీసులను, బస్సుల సంఖ్యను పెంచుతాం. ఈ పథకం కింద ప్రయాణించాలనుకునే వారు రాష్ట్రంలో నివసిస్తున్నట్టుగా చిరునామాను పేర్కొంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే వివిధ గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది. ఆధార్, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు ఇలా ఏదో ఒకటి చూపించాలి. ప్రభుత్వం తీసుకున్న ఈ చరిత్రాత్మక నిర్ణయం అమలుకు సిబ్బందిని కూడా సమాయత్తం చేస్తున్నాం. శుక్రవారం రెండు షిఫ్టులలో సుమారు 40 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లకు ఈ పథకంపై జూమ్ ద్వారా అవగాహన కల్పించాం. ప్రయాణికులతో సౌమ్యంగా, మర్యాదగా వ్యవహరించాలని సూచించాం. రద్దీ స్టేషన్లలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తాం. ఇటీవల కొత్తగా 776 బస్సులు వచ్చాయి. మరో 1,050 రానున్నాయి. అద్దె ప్రాతిపదికన మరో వెయ్యి విద్యుత్తు బస్సులు కూడా వస్తాయి. బస్సులకు ఇబ్బంది లేదు. గ్రామీణ ప్రాంతాలకు విద్యుత్తు బస్సులను కూడా నడపనున్నాం’’.
సజ్జనార్, ఆర్టీసీ ఎండీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘భారతితో వివేకా హత్యకేసు నిందితుడి సెల్ఫీ’.. దానికేం సమాధానం చెబుతారు జగన్?
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట