TSRTC: ‘మహాలక్ష్మి’తో ప్రయాణం మారిపోయింది
మహాలక్ష్మి పథకంతో టీఎస్ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల బస్సులపై ఈ ప్రభావం కనిపిస్తోంది. తెలంగాణకు వచ్చివెళ్లే ఆయా రాష్ట్రాల బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తి (ఓఆర్)లో తగ్గుదల కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర సరిహద్దుల వరకు పొరుగు రాష్ట్రాల బస్సులు ఖాళీ
అక్కడి వరకు టీఎస్ఆర్టీసీలో ఉచితంగా
ఆ తర్వాత టికెట్ తీసుకొని గమ్యస్థానాలకు..
పలు ఏపీ సర్వీసుల్లో సంక్రాంతికీ ఖాళీ సీట్లు
ఈనాడు, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంతో టీఎస్ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల బస్సులపై ఈ ప్రభావం కనిపిస్తోంది. తెలంగాణకు వచ్చివెళ్లే ఆయా రాష్ట్రాల బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తి (ఓఆర్)లో తగ్గుదల కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర పరిధిలో టీఎస్ఆర్టీసీ సూపర్లగ్జరీ బస్సుల్లోనూ ప్రయాణికులు తగ్గుతుండగా.. ఆమేరకు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో రద్దీ పెరుగుతోంది.
300-320 కి.మీ. మేర ఉచితం
హైదరాబాద్ నుంచి ఏపీలోని విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, కర్నూలు వంటి నగరాలకు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఏపీ నుంచి ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలకు బస్సులు వచ్చి వెళుతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, బీదర్, రాయచూరు వంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్కు రెండు రాష్ట్రాల బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. రాష్ట్ర చిరునామాతో గుర్తింపు కార్డులు ఉన్న మహిళలకు తెలంగాణ సరిహద్దుల వరకు టీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఉంది. దీంతో పొరుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే మహిళా ప్రయాణికులు వీలైనంతమేర ప్రయాణ ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘‘హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో కోదాడ వరకు (180 కి.మీ.) ఉచితంగా, ఆ తర్వాత టికెట్ కొనుక్కుని ప్రయాణిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. పగటి సర్వీసుల్లో ఈ పరిస్థితి ఉంది. కోదాడ వరకు ఉచిత ప్రయాణంతో ఒక్కొక్కరికి రూ.300 ఖర్చు తగ్గుతోంది. హైదరాబాద్ నుంచి భద్రాచలం, అశ్వారావుపేట వరకు దాదాపు 270-320 కి.మీ. వరకు టీఎస్ఆర్టీసీలో ఉచితంగా వెళ్లే వెసులుబాటు ఉంది. అశ్వారావుపేట నుంచి రాజమహేంద్రవరం 100 కి.మీ. దూరమే’’ అని ఏపీఎస్ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. ఏపీ నుంచి తెలంగాణ సరిహద్దు జిల్లాలకు రాకపోకలు సాగించే బస్సులపైనా మహాలక్ష్మి పథకం ప్రభావం అధికంగా ఉంది. ‘రాజమహేంద్రవరం, జంగారెడ్డిగూడెం, విజయవాడ ప్రాంతాల నుంచి మధిర, సత్తుపల్లి, ఖమ్మం రాకపోకలు సాగించే ఏపీ బస్సులో రద్దీ తగ్గుతోంది’ అని ఆ అధికారి వివరించారు. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బీదర్ 143 కి.మీ. దూరం కాగా.. ఇందులో 110 కి.మీ.కు పైగా తెలంగాణ పరిధే. దీంతో హైదరాబాద్-బీదర్కు రాకపోకల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగింది.మరో పది రోజుల్లో ఎక్కువమంది సంక్రాంతికి సొంతూళ్లకు ప్రయాణం అవుతారు. హైదరాబాద్ నుంచి ఏపీలో దూరప్రాంతాలైన విశాఖపట్నం, కాకినాడ వంటి నగరాలకు బస్సుల్లో సీట్లన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. తెలంగాణ సరిహద్దులకు తక్కువ దూరం ఉండే విజయవాడ, గుంటూరు, ఒంగోలు వంటి ప్రాంతాలకు మాత్రం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో భారీగా సీట్లు ఖాళీ ఉన్నాయి. మహాలక్ష్మి పథకం ప్రభావంతోనే ఈ పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. ఒంగోలుకు వెళ్లే సర్వీసుల్లో ఒక్కో బస్సులో పదేసి సీట్లు.. విజయవాడకు వెళ్లే బస్సుల్లో సగటున 25కి పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..