TSRTC: ‘మహాలక్ష్మి’తో ప్రయాణం మారిపోయింది
మహాలక్ష్మి పథకంతో టీఎస్ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల బస్సులపై ఈ ప్రభావం కనిపిస్తోంది. తెలంగాణకు వచ్చివెళ్లే ఆయా రాష్ట్రాల బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తి (ఓఆర్)లో తగ్గుదల కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.
రాష్ట్ర సరిహద్దుల వరకు పొరుగు రాష్ట్రాల బస్సులు ఖాళీ
అక్కడి వరకు టీఎస్ఆర్టీసీలో ఉచితంగా
ఆ తర్వాత టికెట్ తీసుకొని గమ్యస్థానాలకు..
పలు ఏపీ సర్వీసుల్లో సంక్రాంతికీ ఖాళీ సీట్లు
ఈనాడు, హైదరాబాద్: మహాలక్ష్మి పథకంతో టీఎస్ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల బస్సులపై ఈ ప్రభావం కనిపిస్తోంది. తెలంగాణకు వచ్చివెళ్లే ఆయా రాష్ట్రాల బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తి (ఓఆర్)లో తగ్గుదల కనిపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో రాష్ట్ర పరిధిలో టీఎస్ఆర్టీసీ సూపర్లగ్జరీ బస్సుల్లోనూ ప్రయాణికులు తగ్గుతుండగా.. ఆమేరకు ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో రద్దీ పెరుగుతోంది.
300-320 కి.మీ. మేర ఉచితం
హైదరాబాద్ నుంచి ఏపీలోని విజయవాడ, గుంటూరు, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, ఒంగోలు, తిరుపతి, కర్నూలు వంటి నగరాలకు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఏపీ నుంచి ఉమ్మడి ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్ జిల్లాలకు బస్సులు వచ్చి వెళుతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, బీదర్, రాయచూరు వంటి ప్రాంతాల నుంచి హైదరాబాద్కు రెండు రాష్ట్రాల బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. రాష్ట్ర చిరునామాతో గుర్తింపు కార్డులు ఉన్న మహిళలకు తెలంగాణ సరిహద్దుల వరకు టీఎస్ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఉంది. దీంతో పొరుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే మహిళా ప్రయాణికులు వీలైనంతమేర ప్రయాణ ఖర్చులు తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ‘‘హైదరాబాద్ నుంచి విజయవాడ మార్గంలో కోదాడ వరకు (180 కి.మీ.) ఉచితంగా, ఆ తర్వాత టికెట్ కొనుక్కుని ప్రయాణిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. పగటి సర్వీసుల్లో ఈ పరిస్థితి ఉంది. కోదాడ వరకు ఉచిత ప్రయాణంతో ఒక్కొక్కరికి రూ.300 ఖర్చు తగ్గుతోంది. హైదరాబాద్ నుంచి భద్రాచలం, అశ్వారావుపేట వరకు దాదాపు 270-320 కి.మీ. వరకు టీఎస్ఆర్టీసీలో ఉచితంగా వెళ్లే వెసులుబాటు ఉంది. అశ్వారావుపేట నుంచి రాజమహేంద్రవరం 100 కి.మీ. దూరమే’’ అని ఏపీఎస్ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. ఏపీ నుంచి తెలంగాణ సరిహద్దు జిల్లాలకు రాకపోకలు సాగించే బస్సులపైనా మహాలక్ష్మి పథకం ప్రభావం అధికంగా ఉంది. ‘రాజమహేంద్రవరం, జంగారెడ్డిగూడెం, విజయవాడ ప్రాంతాల నుంచి మధిర, సత్తుపల్లి, ఖమ్మం రాకపోకలు సాగించే ఏపీ బస్సులో రద్దీ తగ్గుతోంది’ అని ఆ అధికారి వివరించారు. హైదరాబాద్ నుంచి కర్ణాటకలోని బీదర్ 143 కి.మీ. దూరం కాగా.. ఇందులో 110 కి.మీ.కు పైగా తెలంగాణ పరిధే. దీంతో హైదరాబాద్-బీదర్కు రాకపోకల్లో టీఎస్ఆర్టీసీ బస్సుల్లో రద్దీ గణనీయంగా పెరిగింది.మరో పది రోజుల్లో ఎక్కువమంది సంక్రాంతికి సొంతూళ్లకు ప్రయాణం అవుతారు. హైదరాబాద్ నుంచి ఏపీలో దూరప్రాంతాలైన విశాఖపట్నం, కాకినాడ వంటి నగరాలకు బస్సుల్లో సీట్లన్నీ ఇప్పటికే బుక్ అయిపోయాయి. తెలంగాణ సరిహద్దులకు తక్కువ దూరం ఉండే విజయవాడ, గుంటూరు, ఒంగోలు వంటి ప్రాంతాలకు మాత్రం ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో భారీగా సీట్లు ఖాళీ ఉన్నాయి. మహాలక్ష్మి పథకం ప్రభావంతోనే ఈ పరిస్థితి ఉందని అధికారులు చెబుతున్నారు. ఒంగోలుకు వెళ్లే సర్వీసుల్లో ఒక్కో బస్సులో పదేసి సీట్లు.. విజయవాడకు వెళ్లే బస్సుల్లో సగటున 25కి పైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి