Hyderabad: నేటి నుంచి పలు రైళ్లకు అదనపు హాల్టులు
హైదరాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి బయల్దేరే, రాష్ట్రం మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లకు అదనపు హాల్టులు ఇస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.
ఈనాడు, హైదరాబాద్: హైదరాబాద్, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి బయల్దేరే, రాష్ట్రం మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లకు అదనపు హాల్టులు ఇస్తున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఈ నిర్ణయం 20వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ఇక నుంచి దక్షిణ ఎక్స్ప్రెస్ జమ్మికుంట స్టేషన్లో, హజ్రత్ నిజాముద్దీన్ గరీబ్రథ్ ఎక్స్ప్రెస్ వరంగల్, పెద్దపల్లి స్టేషన్లలో..సికింద్రాబాద్-రాయ్పూర్, సికింద్రాబాద్-రాయ్పూర్ హిస్సార్, హైదరాబాద్-రాక్సల్ ఎక్స్ప్రెస్ రైళ్లు పెద్దపల్లిలో, సికింద్రాబాద్-బీదర్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ మర్పల్లి స్టేషన్లో ఆగనున్నాయి. నారాయణాద్రి విశాఖ ఎక్స్ప్రెస్, చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్ప్రెస్లు మిర్యాలగూడలో; నర్సాపూర్, విశాఖ, చెన్నై సెంట్రల్-హైదరాబాద్ ఎక్స్ప్రెస్లు నల్గొండలో ఆగుతాయి. నాగర్సోల్-నర్సాపూర్ ఎక్స్ప్రెస్ మిర్యాలగూడలో; నర్సాపూర్-నాగర్సోల్ ఎక్స్ప్రెస్ నల్గొండలో; హైదరాబాద్-వాస్కోడగామా ఎక్స్ప్రెస్ గద్వాలలో; అంబేడ్కర్నగర్-యశ్వంత్పూర్, నాగర్సోల్-చెన్సై సెంట్రల్, గోరఖ్పూర్-యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్ మహబూబ్నగర్లో; యశ్వంత్పూర్-కాచిగూడ ఎక్స్ప్రెస్ షాద్నగర్, జడ్చర్ల స్టేషన్లలో ఆగుతాయి. ప్రయోగాత్మకంగా ఆరు నెలల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ద.మ.రైల్వే స్పష్టం చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమెరికా వెళ్లే విద్యార్థులకు త్వరలో వీసా స్లాట్లు
విద్యార్థి వీసా ఇంటర్వ్యూ స్లాట్లు విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. దశలవారీగా విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు స్లాట్లు ఈ నెల రెండోవారం నుంచి ఆగస్టు రెండోవారం వరకు అందుబాటులోకి రానున్నాయి. -
మహోగ్రమే
రాష్ట్రంలో వారం రోజులుగా ఠారెత్తిస్తున్న ఎండలు గురువారం కూడా కొనసాగాయి. ఉదయం ఎనిమిది గంటలకే మొదలైన భానుడి ఉగ్రప్రతాపం.. సాయంత్రం ఐదున్నర వరకూ కొనసాగింది. -
కొరత లేకుండా ఎరువుల సరఫరా
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు అవసరమైన ఎరువుల సరఫరాకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఎక్కడా కొరత ఏర్పడకుండా పంపిణీకి సన్నాహాలు చేస్తున్నట్లు ప్రభుత్వానికి నివేదించింది. -
దండకారణ్యం ‘కోట’కు బీటలు!
మావోయిస్టుల కోట బీటలు వారుతోంది. ఇన్నాళ్లూ వారికి పెట్టనికోటగా ఉన్న ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం.. క్రమంగా భద్రతా బలగాల అధీనంలోకి వస్తోంది. -
పులికి దారి ఇచ్చి.. గిరిజనం ఊరు విడిచి
దశాబ్దాలుగా అడవితల్లితో ఉన్న అనుబంధాన్ని వదులుకుని భారమైన హృదయాలతో బయటకు వచ్చారు ఆదివాసీలు. కవ్వాల్ పెద్దపులుల సంరక్షణ కేంద్రం పరిధిలో పెద్దపులి, ఇతర జంతువులు స్వేచ్ఛగా సంచరించేందుకు వీలుగా అటవీ ప్రాంతాన్ని వదిలి మైదాన ప్రాంతానికి రావాలని అటవీశాఖ పిలుపునిచ్చింది. -
సంక్షిప్త వార్తలు
-
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/05/24)
-
ఫొటోషూట్లో హొయలు.. వావ్ అనిపించేలా జాన్వీ.. కట్టిపడేసిన హెబ్బా
-
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
-
ఆ క్యారెక్టర్ ప్లే చేయాలంటే భయమేసింది: రాశీఖన్నా
-
డిప్లొమాటిక్ పాస్పోర్ట్తో జర్మనీకి ప్రజ్వల్.. విదేశాంగ శాఖ వెల్లడి
-
అభిమాని బర్త్డే సెలబ్రేట్ చేసి.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి.. వీడియో వైరల్