Hyderabad: పురుషులకు ప్రత్యేక బస్సు మూడురోజుల ముచ్చటే
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తర్వాత పురుషులకు సీట్లు దొరకడం కష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో మహిళలు, పురుషులకు ప్రత్యేక బస్సులపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆలోచన చేశారు.
ఈనాడు, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం తర్వాత పురుషులకు సీట్లు దొరకడం కష్టం అవుతోంది. ఈ నేపథ్యంలో మహిళలు, పురుషులకు ప్రత్యేక బస్సులపై ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆలోచన చేశారు. ఈ క్రమంలో ఇబ్రహీంపట్నం బస్డిపో ఇబ్రహీంపట్నం-ఎల్బీనగర్ మధ్య 277 ఎల్ ‘పురుషులకు ప్రత్యేకం’ బస్సును ప్రవేశపెట్టింది. సోమవారం నుంచి బుధవారం వరకు మూడంటే మూడే రోజులు నడిపించారు. గురువారం నుంచి దీన్ని రద్దు చేసినట్లు డిపో మేనేజర్ ‘ఈనాడు’కు తెలిపారు. ఈ రూట్లో ప్రతి రెండు నిమిషాలకు ఓ బస్సుందని, ప్రత్యేక బస్సు వచ్చేంతవరకు నిరీక్షించకుండా పురుషులు ఏదో ఒక బస్సెక్కి వెళ్తుండడం, ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు ఇబ్రహీంపట్నం దాటి వెళ్లాల్సి ఉండటం.. మధ్యలో బస్సు మారాల్సిన పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యేక సర్వీసును రద్దు చేసినట్లు తెలిపారు. ‘పురుషులకు మాత్రమే’ బస్సు ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
ఆర్టీసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు
బస్సుల్లో తీవ్ర రద్దీ ఉండటం, పురుషులు ప్రయాణించలేని పరిస్థితులు, విద్యార్థులు ఫుట్బోర్డుపై వెళ్లాల్సి వస్తోందంటూ ఆర్టీసీ యాజమాన్యానికి ‘ఎక్స్’, సామాజిక మాధ్యమాల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వీటిపై బస్భవన్లోని ఉన్నతాధికారులు దృష్టిసారించారు. హైదరాబాద్తోపాటు దూరప్రాంత సర్వీసులు, పల్లెవెలుగుల్లోనూ మహిళలు, పురుషులకు ప్రత్యేక బస్సుల ప్రవేశపెట్టే ప్రణాళికలు ఉన్నాయని ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’తో చెప్పారు. ప్రస్తుతం రద్దీకి తగ్గట్లు బస్సుల కొరత ఉందని.. కొత్తవి వచ్చాక ప్రత్యేక సర్వీసులు ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని పేర్కొన్నారు.
జనవరిలో 13.96 కోట్ల మంది ప్రయాణం
మహాలక్ష్మితో 23 శాతం పెరిగిన ఆర్టీసీ ఓఆర్
ఈనాడు, హైదరాబాద్: ‘మహాలక్ష్మి’ పథకంతో ఆర్టీసీ బస్సుల్లో సీట్ల భర్తీ నిష్పత్తి(ఓఆర్) భారీగా పెరుగుతోంది. జనవరిలో 89.25 శాతం ఓఆర్ నమోదైంది. గతేడాది ఇదే నెలలో 66.36 శాతం. అంటే దాదాపు 23శాతం ఓఆర్ పెరిగింది. జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో మొత్తం 13.96 కోట్ల మంది ప్రయాణించారు. 2023 జనవరిలో ఆ సంఖ్య 8.13 కోట్లు మాత్రమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?