4 ఏళ్లనుకుంటే 20 ఏళ్లయ్యింది..!
రెండు దశాబ్దాలుగా నిర్మాణంలోనే ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) పనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. దెబ్బతిన్న టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం), నీటిని తీసుకునే వైపు భారీగా సీపేజీ లాంటి సమస్యలతో ఏడాదిగా పనులు ఆగిపోయాయి.
ఇంకా కొలిక్కిరాని ఎస్ఎల్బీసీ
పని పూర్తికి మరో రూ.2,200 కోట్లు అవసరం
దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం
ఈనాడు - హైదరాబాద్
రెండు దశాబ్దాలుగా నిర్మాణంలోనే ఉన్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) పనిపై ప్రభుత్వం దృష్టి సారించింది. దెబ్బతిన్న టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం), నీటిని తీసుకునే వైపు భారీగా సీపేజీ లాంటి సమస్యలతో ఏడాదిగా పనులు ఆగిపోయాయి. ఇంకా రూ.2,000 కోట్లకు పైగా నిధులు వెచ్చించాల్సి ఉంది. ఎస్ఎల్బీసీని పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇస్తామంటున్న ప్రస్తుత ప్రభుత్వం గురువారం దీనిపై సమీక్షించనుంది. నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, అధికారులు, గుత్తేదారు సంస్థ ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు.
ఎన్నో ఏళ్లనాటి ప్రతిపాదన
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి సొరంగ మార్గం ద్వారా నీటిని మళ్లించి మూడు లక్షల ఎకరాలకు అందించేందుకు ఎడమ గట్టు కాలువ పనిని ఉమ్మడి రాష్ట్రంలోని అప్పటి ప్రభుత్వం జలయజ్ఞం పథకం కింద చేపట్టింది. అంతకుముందు చాలా ఏళ్ల నుంచే ఈ ప్రతిపాదన ఉన్నా.. అభయారణ్యం కావడంతో సొరంగ మార్గం తవ్వడానికి అనుమతి లభించలేదు. దీంతో ఆనాటి ప్రభుత్వాలు నాగార్జునసాగర్ నుంచి నీటిని మళ్లించేలా ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మించాయి. కానీ ఎత్తిపోతల ద్వారా కాకుండా గ్రావిటీతో శ్రీశైలం నుంచి నీటిని మళ్లించేందుకు సొరంగం తవ్వేలా ఎస్ఎల్బీసీ పనిని 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. రూ.1,925 కోట్లకు జయప్రకాశ్ అసోసియేట్స్ సంస్థ ఈ కాంట్రాక్టు పొందింది. నాలుగేళ్లలో పూర్తి చేయాలనుకుంటే.. దాదాపు 20 ఏళ్లవుతున్నా ఇంకా కొలిక్కి రాలేదు. శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే వైపు (ఇన్లెట్) నుంచి 13.9 కి.మీ. మేర సొరంగం తవ్వకం పూర్తి కాగా.. నీళ్లు బయటకు వచ్చే వైపు (ఔట్లెట్) నుంచి 20.4 కి.మీ. దూరం తవ్వారు.మధ్యలో ఇంకా 9.6 కి.మీ. తవ్వాల్సి ఉంది. నిర్మాణ వ్యయం తాజాగా రూ.4,600 కోట్లకు పెరిగింది. ఇప్పటివరకు రూ.2,700 కోట్లు ఖర్చు చేయగా, సొరంగమార్గంతో పాటు అనుబంధ పనుల పూర్తికి ఇంకా రూ.2,200 కోట్లు అవసరమని సంబంధిత వర్గాలు తెలిపాయి. గుత్తేదారుకు రూ.50 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉండగా, విద్యుత్తు బిల్లు రూ.59 కోట్లు చెల్లించాల్సి ఉంది.
సాంకేతిక సమస్యలే శాపాలు
ఔట్లెట్వైపు నాలుగేళ్ల కిందట బోరింగ్ మిషన్ దెబ్బతినడంతో దాన్ని మార్చడానికి మూడేళ్లకు పైగా పట్టింది. కొత్తది అమర్చి ఒకటిన్నర కి.మీ. మేర సొరంగం తొలిచిన తర్వాత మళ్లీ చెడిపోయింది. దాని కోసం మళ్లీ ఆర్డర్ ఇచ్చినా.. ఇప్పటివరకు రాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రీశైలం నుంచి నీటిని తీసుకునే వైపు 2019 నుంచి భారీగా నీటి ఊట (సీపేజీ) వస్తోంది. దీంతోపాటు మట్టి, రాళ్లు పడుతుండటంతో పని ముందుకు సాగడం లేదు. నీటిని తోడి, మట్టిని తొలగించి మళ్లీ పని ప్రారంభించినా సమస్యలు వెంటాడుతున్నాయి. మధ్యలో కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. దీంతో గత ప్రభుత్వం నిరంతరం విద్యుత్తు సరఫరా చేస్తూ.. దాని బిల్లును కాంట్రాక్టర్కు చెల్లించే మొత్తం నుంచి ముందుగానే రికవరీ చేసి విద్యుత్తు సంస్థకు చెల్లించేలా నిర్ణయం తీసుకుంది. భారీ సీపేజీ కారణంగా టన్నెల్ బోరింగ్ మిషన్ మూడేళ్లుగా నీళ్లలోనే ఉండిపోయింది. నీటిని తొలగించాక.. మిషన్ పరికరాలన్నీ వేరు చేసి ఆరబెట్టి మళ్లీ పని చేయించడానికి ఆరు నెలలుగా ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నీటి ఒత్తిడిని తగ్గించడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైళ్ల రీ షెడ్యూల్.. గమ్యాల కుదింపు
-
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
-
ఆటల్లో మనమెక్కడ?ఐదేళ్ల వైకాపా పాలనలో క్రీడలపై తీవ్ర నిర్లక్ష్యం
-
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
-
గుడిమెట్ల కొండల్లో వజ్రాల వేట
-
ప్రాణాలతో స్వదేశానికి వస్తానని అనుకోలేదు: గల్ఫ్ బాధితుడు వీరేంద్రకుమార్