వారం రోజుల్లో రూ.500కే సిలిండర్
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు రూ.500కు గ్యాస్ సిలిండర్ను వారం రోజుల్లో అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. తెల్ల రేషన్కార్డు ఉన్న పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
తెల్ల రేషన్కార్డు ఉన్నవారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు
వచ్చేనెల 15 నాటికి రైతు భరోసా డబ్బుల జమ
మోదీ, కేసీఆర్లతో తెలంగాణకు తీరని అన్యాయం
కోస్గి సభలో సీఎం రేవంత్రెడ్డి
రూ.4,369 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కోస్గి, కొడంగల్ - న్యూస్టుడే
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు రూ.500కు గ్యాస్ సిలిండర్ను వారం రోజుల్లో అందించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. తెల్ల రేషన్కార్డు ఉన్న పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. వచ్చేనెల 15 నాటికి రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో డబ్బులు జమవుతాయన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేసే బాధ్యత తమదేనని పేర్కొన్నారు. బుధవారం నారాయణపేట జిల్లా కోస్గిలో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం సహా రూ.4,369 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు మంత్రులతో కలసి సీఎం శంకుస్థాపన చేశారు. 3,083 మహిళా సంఘాలకు రూ.177 కోట్ల విలువైన చెక్కును అందజేశారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ ఉత్పత్తుల స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘‘ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటివరకు రెండు పథకాలు అమలు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో 18 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు.వారంతా పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు. వేలమంది సమ్మక్క-సారక్కలను దర్శించుకుంటున్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని రూ.10 లక్షలకు పెంచాం.
కేసీఆర్ సీఎం అయ్యాకే ఎక్కువ నీటి దోపిడీ
ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కన్నా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మోదీ, కేసీఆర్ల పాలనలోనే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగింది. ఆనాడు జరిగిన నీటి దోపిడీ కన్నా కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక జరిగిందే ఎక్కువ. కమీషన్ల కోసమే ప్రాజెక్టులు చేపట్టారు. భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్బీ, దేవాదుల, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులను డబ్బులు దండుకొని అసంపూర్తిగా వదిలేశారు. రూ.2 లక్షల కోట్లు ఖర్చు చేసినా పూర్తి కాలేదు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పేరుతో రూ.27 వేల కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకూ నీరు పారలేదు. కరీంనగర్లో ఓడిపోతానన్న భయంతో పాలమూరుకు వలస వచ్చారు. ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి ఆయన ఏం చేశారు? ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి రోజుకు 12 టీఎంసీల నీరు తరలించుకుపోతున్నా చూస్తూండిపోయారు. పాలమూరులో ఎందుకు ప్రాజెక్టులు పూర్తి చేయలేదు? ఈ ప్రాంతాన్ని ఎడారి చేసి.. వలసలను నిరోధించని కేసీఆర్ ఈ ప్రాంత ప్రజలకు క్షమాపణ చెప్పాకే లోక్సభ ఎన్నికల్లో ఓట్లడగాలి. కాంగ్రెస్ నాయకుడు చిన్నారెడ్డి ప్రారంభించిన తెలంగాణ ఉద్యమాన్ని ఆయన తనకు అనుకూలంగా మార్చుకున్నారు. ప్రజలు ఎన్నికల్లో ఓడించి ఇంట్లో కూర్చోబెట్టినా.. అల్లుడు నల్గొండ నుంచి, కుమారుడు పాలమూరు నుంచి పాదయాత్ర చేయడానికి సిద్ధమయ్యారు.
ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయడమే లక్ష్యం
ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. మహిళా సంఘాలకు పాఠశాలలు, గురుకులాలు, వసతిగృహాల విద్యార్థులకు సంబంధించిన ఏకరూప దుస్తులు కుట్టే అవకాశం కల్పిస్తాం. కుట్టుమిషన్లు అందిస్తాం. ఐకేపీ ద్వారా రుణాలు అందించి సంఘాలను బలోపేతం చేస్తాం. త్వరలోనే పంటలు కొనుగోలు చేస్తాం.
మళ్లీ రూ.5వేల కోట్లు తీసుకొస్తా..
మంత్రులను ఒప్పించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాను. కొడంగల్కు ఎవరూ ఊహించని విధంగా సుమారు రూ.5 వేల కోట్లు తెచ్చాను. వీటితో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం, మెడికల్, ఇంజినీరింగ్, ప్రభుత్వ జూనియర్, మహిళా డిగ్రీ కళాశాల, గురుకుల పాఠశాలలకు శిలాఫలకాలు వేశాం. మళ్లీ వచ్చేటప్పుడు మరో రూ.5 వేల కోట్లు తీసుకొస్తాను. 2014లోనే నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల కోసం 69 జీవో తెచ్చాను. 7.10 టీఎంసీలతో లక్ష ఎకరాలకు సాగునీరు అందేలా మంజూరు చేయించాను. అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి అడిగి పునాది వేశారు. ఈ పథకాన్ని పదేళ్లు పక్కనపెట్టారు. భాజపా, భారాసలు చీకటి ఒప్పందం కుదుర్చుకొని ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాయి. ప్రధాని మోదీ మహబూబ్నగర్ పర్యటనలో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ హోదా కల్పిస్తానని హామీ ఇచ్చినా, నేటికీ అమలు కాలేదు. కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నా.. కేంద్ర మంత్రిగా కిషన్రెడ్డి అయిదేళ్లు పనిచేసినా, నలుగురు ఎంపీలున్నా తెలంగాణకు ఎలాంటి నిధులు మంజూరు చేయించుకోలేదు. కృష్ణా-వికారాబాద్ రైల్వే లైను, జాతీయ రహదారులు, మూసీ ప్రక్షాళనను పట్టించుకోలేదు. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 స్థానాల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుంది’’ అని రేవంత్రెడ్డి అన్నారు. మహబూబ్నగర్ లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డిని ప్రకటించారు. ఆయనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
కొడంగల్ ఎత్తిపోతల ఆయకట్టు పెంపు
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మాట్లాడుతూ.. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ద్వారా లక్ష నుంచి 1.30 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెంచామన్నారు. రాజీవ్ భీమా పథకం ద్వారా ఏడు టీఎంసీల మిగులు జలాలతో సాగు, తాగునీరు అందిస్తామన్నారు. ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కేవలం గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట మాత్రమే అభివృద్ధి చెందాయని.. మహబూబ్నగర్, నల్గొండ వంటి వెనుకబడిన జిల్లాలను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్లో రింగు రోడ్డు ఏర్పాటు చేసి దేశానికి తలమానికంగా నిలుపుతామన్నారు. ఆబ్కారీశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ పాలమూరు జిల్లాను రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో సస్యశ్యామలం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ ప్రసాద్కుమార్, మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్యేలు రామ్మోహన్రెడ్డి, పర్నికారెడ్డి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, వాకిటి శ్రీహరి, వంశీకృష్ణ, శంకర్, మందుల శామ్యూల్, కూచికుళ్ల రాజేశ్రెడ్డి, కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జి తిరుపతిరెడ్డి, దిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లు రవి, సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి, నాయకులు సునీతా మహేందర్రెడ్డి, రాజేశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్లోకి తాండూరు మున్సిపల్ ఛైర్పర్సన్
తాండూరు, తాండూరు టౌన్, న్యూస్టుడే: వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ ఛైర్పర్సన్ తాటికొండ స్వప్న బుధవారం భారాసకు రాజీనామా చేసి కోస్గిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. డీసీసీ అధ్యక్షుడు రామ్మోహన్రెడ్డి, జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ స్వప్న, తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి ఆమె మెడలో కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కౌన్సిలర్ రామకృష్ణ కూడా భారాసకు రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైదరాబాద్-బెంగళూరు కొత్త హైస్పీడ్ హైవే!
తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. -
90 రోజుల్లో 30 వేల కొలువుల భర్తీ
రాబోయే 90 రోజుల్లో మరో 30వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. డీఎస్సీ ద్వారా 11వేల ఉపాధ్యాయ పోస్టులు, గ్రూప్-1, 2, 3 ఖాళీలతోపాటు ఇతర శాఖల్లో వీటిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. -
‘స్థానిక’ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయండి
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. కొత్త ఓటర్ల జాబితాను ఆగస్టు మొదటి వారానికి పూర్తిచేయాలని స్పష్టం చేశారు. -
కొత్త బీటెక్ సీట్లు 10,034
మరో విడత అదనంగా ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తొలివిడతలో 2,640 అదనపు బీటెక్ సీట్లకు చివరి నిమిషంలో పచ్చజెండా ఊపిన విద్యాశాఖ.. తాజాగా మరో 10,034 సీట్లకు అనుమతి తెలిపింది. -
గుండె ధమనుల్లో పూడికలతో జాగ్రత్త
గుండె ధమనుల్లో పూడికల పట్ల అప్రమత్తంగా ఉండాలని హృద్రోగ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే పూడికలు ఏర్పడి చివరికి గుండె సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. -
కొత్త వైద్య కళాశాలలకు మార్గం సుగమం
రాష్ట్రంలో కొత్త వైద్య కళాశాలల ప్రారంభానికి మార్గం సుగమం అవుతోంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది, మౌలిక వసతులపై రెండు రోజుల కిందట జాతీయ వైద్యమండలి(ఎన్ఎంసీ) ఆన్లైన్లో తనిఖీలను నిర్వహించింది. -
పశువుల పాకే తరగతి గది
మంచిర్యాల జిల్లా భీమారం మండలం దాంపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని రెడ్డిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి.. మూడేళ్ల క్రితం కూలిపోయింది. -
రాష్ట్రంలో అర్హత కోల్పోయిన 15 మంది
నీట్-యూజీ ప్రవేశపరీక్ష సవరించిన ఫలితాల్లో.. రాష్ట్రానికి చెందిన 15 మంది విద్యార్థులు అర్హత కోల్పోయారు. -
పెచ్చుమీరిన ఖర్చులు
దేశంలో ప్రజల జీవనశైలి మార్పుతో నెలవారీ కుటుంబ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలో గ్రామాలతో పోల్చితే పట్టణ వ్యయం దాదాపు 90 శాతం ఎక్కువగా ఉండేది. -
గోల్కొండ కోటలో పంద్రాగస్టు వేడుకలు
గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి తెలిపారు. -
విద్యా సామర్థాల పెంపునకు కసరత్తు
కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నేషనల్ అఛీవ్మెంట్ సర్వే (న్యాస్)లో రాష్ట్ర విద్యార్థులు గత కొన్నేళ్లుగా వెనుకంజలో నిలుస్తున్నారు. న్యాస్-2021లో రాష్ట్రం.. అన్ని తరగతుల్లో, అన్ని సబ్జెక్టుల్లో జాతీయ సగటు కంటే దిగువనే నిలిచింది. -
రాష్ట్రపతి భవన్ కానుకల వేలం
భారత రాష్ట్రపతితోపాటు మాజీ రాష్ట్రపతులకు గతంలో వివిధ సందర్భాల్లో అందిన కానుకల నుంచి ఎంపిక చేసినవాటిని ఆన్లైన్ పోర్టల్ ‘ఈ - ఉపహార్’ ద్వారా వేలం వేయనున్నట్లు శుక్రవారం రాష్ట్రపతి భవన్ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు. -
317 జీఓ దరఖాస్తుల్లో 40% పునరావృతం
జీఓ 317తో నష్టపోయామని, న్యాయం చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులకు వచ్చిన దరఖాస్తుల్లో 30 నుంచి 40 శాతం పునరావృతమయ్యాయని మంత్రివర్గ ఉపసంఘం గుర్తించింది. -
మానసిక ఆరోగ్య సంరక్షణకు కమిటీలు ఏర్పాటు చేశారా?
మానసిక ఆరోగ్య పరిరక్షణకు రాష్ట్ర మండలి, జిల్లా కమిటీల ఏర్పాటుపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి తాజాగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
డయల్ 100, 112లను బలోపేతం చేయాలి: డీజీపీ
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో డయల్ 100, 112 కీలకపాత్ర పోషిస్తున్నాయని డీజీపీ జితేందర్ పేర్కొన్నారు. -
మంత్రి కొండా సురేఖను కలిసిన నటి రేణుదేశాయ్
ప్రముఖ నటి, భగవద్గీత ఫౌండేషన్ ఫర్ వేదిక్ స్టడీస్ చీఫ్ అడ్వైజర్ రేణుదేశాయ్ శుక్రవారం జూబ్లీహిల్స్లో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను ఆమె నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. -
సెప్టెంబరు 5 నాటికి కొత్త టీచర్ల నియామకం
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న డీఎస్సీ పరీక్షల ఫలితాలు త్వరగా విడుదల చేసి ఉపాధ్యాయ దినోత్సవమైన సెప్టెంబరు 5 నాటికి నియామకాలు పూర్తి చేస్తామని సీఎం సలహాదారు వేం నరేందర్రెడ్డి హామీ ఇచ్చారు. -
సమీకృత జౌళి పార్కులకు రూ.46 కోట్లు
సమీకృత టెక్స్టైల్ పార్క్ పథకం కింద తెలంగాణలో ఏర్పాటుచేసిన రెండు జౌళి పార్కులకు కేంద్ర ప్రభుత్వం రూ.46.08 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర జౌళి శాఖ సహాయమంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. -
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు
‘రాష్ట్రంలో పెండింగులో ఉన్న లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్(ఎల్ఆర్ఎస్) దరఖాస్తులను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలి’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. -
పురపాలకశాఖలో జేడీలు, డీడీల బదిలీలు
రాష్ట్ర పురపాలకశాఖ పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలో 12 మంది సంయుక్త, ఉప సంచాలకులను బదిలీ చేస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. -
వైద్య కళాశాలల్లో బోగస్ హాజరుపై కఠిన చర్యలు: ఎన్ఎంసీ
ప్రైవేటు వైద్య కళాశాలల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు కొందరు విధులకు రాకుండానే నకిలీ వేలిముద్రలతో బోగస్ హాజరు నమోదు చేస్తున్నట్లు జాతీయ వైద్య మండలి (ఎన్ఎంసీ) దేశవ్యాప్త పరిశీలనలో తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్