RRR: మూడేళ్లలో ఆర్ఆర్ఆర్ పూర్తి: కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
అవుటర్ రింగ్రోడ్డు అవతల నుంచి నిర్మించే ప్రాంతీయ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను మూడేళ్లలో పూర్తిచేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు.
ఈనాడు, హైదరాబాద్: అవుటర్ రింగ్రోడ్డు అవతల నుంచి నిర్మించే ప్రాంతీయ రింగ్రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను మూడేళ్లలో పూర్తిచేస్తామని రాష్ట్ర రహదారులు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తెలిపారు. హైదరాబాద్ ఆర్ఆర్ఆర్ రాష్ట్రానికి సూపర్ గేమ్ ఛేంజర్ అవుతుందన్నారు. హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బుధవారం ఆయన మాట్లాడారు. ‘‘ఆ రహదారి మంజూరై నాలుగేళ్లయినా గత ప్రభుత్వ అసమర్థత కారణంగా ముందుకు సాగలేదు. పనులు ప్రారంభించిన నాటినుంచి మూడేళ్లలో పూర్తిచేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతాం. భూసేకరణ ముమ్మరంగా సాగుతోంది. ఈ ప్రక్రియను వేగంగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. దక్షిణ భాగానికి కూడా త్వరలో జాతీయ రహదారి నంబరు కేటాయించేందుకు కేంద్రం అంగీకరించింది. ఆ తర్వాత నుంచి ఆ మార్గంలోనూ భూసేకరణ చేపడతాం. ఆర్ఆర్ఆర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది. ఆ రహదారి చుట్టూ రింగ్రైలు ప్రాజెక్టుతోపాటు ఫార్మా, ఐటీ క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం.
భాజపా, భారాసల లోపాయికారీ ఒప్పందం..
రానున్న లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కనీసం 12 స్థానాలను గెలుస్తాం. లోక్సభ ఎన్నికల్లో భాజపా, భారాస లోపాయికారీ ఒప్పందం చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదంటూ కేంద్ర మంత్రి కిషన్రెడ్డి మాట్లాడటం సరికాదు. మహారాష్ట్రలో మాదిరిగా పార్టీని చీల్చి ప్రభుత్వాలను కూల్చడం పోరాటాల గడ్డ తెలంగాణలో సాధ్యం కాదు. భారాస అధికారంలో ఉన్నప్పుడు అన్నింటికీ కేటీఆర్ను ముందుపెట్టేవారు.. మేడిగడ్డ కూలిపోగానే హరీశ్రావును ముందుపెట్టారు’’ అని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.
మెజారిటీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటాం: షబ్బీర్ అలీ
హైదరాబాద్, న్యూస్టుడే: వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో మెజారిటీ ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంటుందని ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి షబ్బీర్ అలీ ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన చూసి పార్టీలో చేరడానికి చాలామంది ముందుకొస్తున్నారని తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందిన ముగ్గురు భారాస కార్పొరేటర్లు, పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు బుధవారం గాంధీభవన్లో షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ల సమక్షంలో కాంగ్రెస్లో చేరారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే అభివృద్ధి పనుల కోసం ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్ల చొప్పున ముఖ్యమంత్రి మంజూరు చేశారని చెప్పారు.
భాజపాను ఎన్నికల కమిషన్ కట్టడి చేయాలి: జి.నిరంజన్
ఈనాడు, హైదరాబాద్: ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడకుండా, కాంగ్రెస్ పార్టీని దూషించకుండా భాజపాను కట్టడి చేయాలని ఎన్నికల కమిషన్కు పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో డీజీపీ కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆయన బుధవారం గాంధీభవన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణలో విజయ సంకల్ప యాత్ర చేపట్టిన భాజపా.. ప్రజల్లో విభేదాలు సృష్టించడం, కాంగ్రెస్ను దూషించడమే పనిగా పెట్టుకుందని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాసిరకం విత్తనాలతో జాగ్రత్త!
రాష్ట్రంలో వానాకాలం సీజన్కు మళ్లీ నాసిరకం విత్తనాల బెడద మొదలైంది. తక్కువ ధర, అధిక దిగుబడి, త్వరగా పంట చేతికొస్తుందని నమ్మిస్తూ రైతులను మోసగించి పలువురు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతున్నారు. -
జీవన్రెడ్డి మాల్ స్వాధీనం
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో విష్ణుజిత్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ నిర్మించిన జీవన్రెడ్డి మాల్ను గురువారం ఆర్టీసీ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. -
రూ.10 కోట్లు సమకూరినా.. దక్కని చిన్నారి ప్రాణం
ప్రాణాంతక వ్యాధి బారిన పడిన ఆ చిన్నారి చికిత్స కోసం క్రౌడ్ ఫండింగ్ ద్వారా రూ.10 కోట్లు సమకూరినా.. చివరికి ప్రాణాలు దక్కించుకోలేకపోయిన హృదయ విదారక సంఘటన ఇది. -
నల్లమల అడవికి ఎకో టూరిజం దెబ్బ!
అది నల్లమల కొండల్లోని దట్టమైన అడవి. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు వంటి క్రూరమృగాలు సంచరించే ప్రాంతం. వాటికి ఎంతో సురక్షితమైన ప్రాంతమది. -
పంటల బీమాపై పకడ్బందీ కార్యాచరణ
వచ్చే వానాకాలం నుంచి అమలయ్యే పంటల బీమా పథకానికి పకడ్బందీ కార్యాచరణను రూపొందించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. -
ఈసీ అనుమతితో ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు
కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో రాష్ట్రంలో వెంటనే ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపడతామని, బదిలీ అయిన వారిని రిలీవ్ చేస్తామని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి నేతలకు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం హామీ ఇచ్చారు. -
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
సంతానలేమికి కోడలే కారణమని నిందించే అత్తలు.. ఇప్పటికైనా అలా అనడం మానేయాలంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే లోపం మీ అబ్బాయిలోనూ ఉండొచ్చు.. అందుకు మీరు కూడా ఒక కారణం కావొచ్చని సీసీఎంబీ పరిశోధకులు పేర్కొంటున్నారు. -
విద్యుత్తు ఒప్పందాలపై ఫిర్యాదు చేయండి
యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాలతో పాటు ఛత్తీస్గఢ్ విద్యుత్తు ఒప్పందాలకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై విచారణ కోసం జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ బహిరంగ ప్రకటన జారీ చేసింది. -
కవిత బెయిల్ పిటిషన్పై విచారణ 24కి వాయిదా
దిల్లీ మద్యం కేసులో అరెస్టయి తిహాడ్ జైల్లో ఉన్న భారాస ఎమ్మెల్సీ కవిత.. బెయిల్ కోసం దాఖలుచేసిన పిటిషన్లో దిల్లీ హైకోర్టు సీబీఐకి నోటీసులు జారీచేసింది. -
విద్యుత్ సరఫరాపై అసత్య ప్రచారం తగదు
రాష్ట్రంలో విద్యుత్తు సరఫరాపై ప్రతిపక్ష పార్టీకి చెందిన సోషల్ మీడియా అసత్య ప్రచారాలు చేస్తూ విద్యుత్ అధికారులు, సిబ్బందిని మానసిక క్షోభకు గురిచేస్తోందని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. -
భారత వైమానిక దళానికి దరఖాస్తుల ఆహ్వానం
అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్ వాయు (మ్యుజీషియన్) భర్తీకి భారత వైమానిక దళం అవివాహితులైన పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. -
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
ఊబకాయులకు, జంక్ ఫుడ్ ప్రియులకు మూత్రపిండాల వ్యాధి రావడమే కాదు.. మూత్రపిండాలు పూర్తిగా పాడయ్యే అవకాశాలున్నాయని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని బయోకెమిస్ట్రీ విభాగం సహ ఆచార్యులు పసుపులేటి అనిల్కుమార్, జాతీయ పోషకాహార సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ భానుప్రకాశ్రెడ్డిల పరిశోధనలో వెల్లడైంది. -
‘ఐసెట్’కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు
రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష ‘ఐసెట్-2024’కు ఈసారి రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. -
తూప్రాన్ ఈఎస్ఐ ఆసుపత్రికి 46 రోజులుగా తాళం
మెదక్ జిల్లా తూప్రాన్లోని ఈఎస్ఐ ఆసుపత్రి 46 రోజులుగా మూతపడి ఉంది. 8 నెలలుగా అద్దె చెల్లించడం లేదని భవన యజమాని ఏప్రిల్ 1న ఆసుపత్రికి తాళం వేశారు. -
జూన్ 3న లాసెట్, పీజీఎల్సెట్ పరీక్షలు
తెలంగాణలో లాసెట్, పీజీఎల్సెట్లను జూన్ 3వ తేదీన నిర్వహిస్తున్నట్లు సెట్ కన్వీనర్ విజయలక్ష్మి తెలిపారు. -
‘ఆపరేషన్ కగార్’ నిలిపివేయాలి
కేంద్ర ప్రభుత్వం మధ్య భారత ఆదివాసీలు, మావోయిస్టులపై ‘ఆపరేషన్ కగార్’ పేరుతో అంతిమ యుద్ధం మొదలుపెట్టిందని పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్, ప్రధానకార్యదర్శి నారాయణరావులు విమర్శించారు. -
మేడిగడ్డపై రేపు సీఎం రేవంత్ సమీక్ష
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీపై నేషనల్ డ్యాం సేఫ్టీ అథార్టీ(ఎన్.డి.ఎస్.ఎ.) ఇచ్చిన నివేదికపై శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్షించనున్నారు. -
దత్తపుత్రికను తక్షణం తండ్రికి అప్పగించండి
దత్తత తీసుకున్న బాలికను చట్టవిరుద్ధంగా తీసుకెళ్లడం చెల్లదని.. బాలికను తక్షణం తండ్రికి అప్పగించాలంటూ శిశు సంక్షేమ కమిటీ, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
రూ.30 వేలు ఇస్తేనే మృతదేహం అప్పగిస్తాం!
అతిసారంతో మరణించిన బాలుడి మృతదేహాన్ని అప్పగించేందుకు ప్రైవేటు ఆసుపత్రి అదనంగా రూ.30 వేలు డిమాండ్ చేసింది. -
సంక్షిప్త వార్తలు
తెలంగాణ నుంచి పసుపు, మిర్చి, పండ్లు ఇతర ఉద్యాన పంట ఉత్పత్తుల ఎగుమతిని ప్రోత్సహిస్తామని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు కె.అశోక్రెడ్డి తెలిపారు. -
ఇదీ సంగతి!