యాదాద్రి క్షేత్రాన్ని సందర్శించిన సీఎం రేవంత్‌రెడ్డి సతీమణి

యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సతీమణి గీత కుటుంబసభ్యులతో కలిసి గురువారం రాత్రి సందర్శించారు.

Published : 23 Feb 2024 03:42 IST

యాదగిరిగుట్ట, న్యూస్‌టుడే: యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సతీమణి గీత కుటుంబసభ్యులతో కలిసి గురువారం రాత్రి సందర్శించారు. కుమార్తె, అల్లుడు, మనవడితో వచ్చిన ఆమెకు ఆలయ పూజారులు, అధికారులు స్వాగతం పలికారు. ప్రధానాలయంలోని పంచనారసింహులను దర్శించుకున్నారు. దైవారాధనల్లో పాల్గొన్న వారికి పూజారులు, పండితులు వేదాశీర్వచనం చేశారు. మొక్కులో భాగంగా మనవడి తలనీలాలు అయిదు కత్తెర్లు సమర్పించారు. అనంతరం దైవ దర్శనం చేసుకున్నారు. ఆలయ ఈవో రామకృష్ణారావు ప్రసాదం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని